ప్రగతి లక్ష్యంగా ట్రావెల్‌ ఫెయిర్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రగతి లక్ష్యంగా ట్రావెల్‌ ఫెయిర్‌

Published Sat, Mar 22 2025 12:31 AM | Last Updated on Sat, Mar 22 2025 12:30 AM

ప్రగతి లక్ష్యంగా ట్రావెల్‌ ఫెయిర్‌

ప్రగతి లక్ష్యంగా ట్రావెల్‌ ఫెయిర్‌

సాక్షి,చైన్నె: తమిళనాడులో పర్యాటక శాఖ తొలిసారిగా పర్యాటక ప్రగతిని కాంక్షిస్తూ తమిళనాడు ట్రావెల్‌ ఫెయిర్‌ను చైన్నెలో ఏర్పాటు చేసింది. నందంబాక్కం వర్తక కేంద్రంలో ఈ ఫెయిర్‌ను పర్యాటక మంత్రి ఆర్‌. రాజేంద్రన్‌ శుక్రవారం ప్రారంభించారు. మూడు రోజులపాటు ఈ వేడుక జరగనుంది. 22వ తేదీ మధ్యాహ్నం నుంచి ప్రజలు ఫెయిర్‌ సందర్శనకు అనుమతించనున్నారు. రాష్ట్రంలోని గొప్ప, విభిన్నమైన పర్యాటక అవకాశాలను ప్రదర్శించడానికి , పరిశ్రమ సహకారాన్ని పెంపొందించడానికి, పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఒక ప్రధాన వేదికగా దీనిని తీర్చిదిద్దారు. తమిళనాడు ట్రావెల్‌ ఫెయిర్‌ వేదిక, ట్రావెల్‌ ఫెయిర్‌ను ట్రావెల్‌ అండ్‌ టూరిజం ఫెయిర్‌ సంస్థ ద్వారా నిర్వహించారు. తెలంగాణ, ఉత్తరాఖండ్‌ , తమిళనాడు, నేపాల్‌, ఆంధ్రప్రదేశ్‌, ఢిల్లీ, జార్ఖండ్‌, కేరళ, పంజాబ్‌ టూరిజం వంటి రాష్ట్రాల ప్రభుత్వ పర్యాటక విభాగాలు కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యాయి. తమిళనాడు ప్రభుత్వం స్థిరమైన, బాధ్యతాయుతమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి, ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి, రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడానికి ఈ వేదిక ద్వారా గణనీయమైన చర్యలు తీసుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం పర్యాటక శాఖ కార్యదర్శి డాక్టర్‌ కె.మణివాసన్‌, కమిషనర్‌ శిల్పా ప్రభాకర్‌ సతీష్‌, పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రాంతీయ డైరెక్టర్‌ (దక్షిణ) డి.వెంకటేశన్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement