CoronaVirus in Telangana: 2892 New Cases and 10 Deaths Registered in Last 24hrs | తెలంగాణలో ఒక్కరోజే 2892 కేసులు, 10 మరణాలు - Sakshi
Sakshi News home page

తెలంగాణలో ఒక్కరోజే 2892 కేసులు, 10 మరణాలు

Published Wed, Sep 2 2020 10:00 AM | Last Updated on Wed, Sep 2 2020 11:55 AM

2892 New Coronavirus Positive Cases Reported In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 2892 పాజిటివ్‌ కేసులు నమోదవండంతో మొత్తం కేసుల సంఖ్య 1,30,589 కు చేరింది. వైరస్‌ బాధితుల్లో కొత్తగా 10 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 846 కు చేరింది. మంగళవారం ఒక్కరోజే 2240 మంది కోవిడ్‌ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 97,402.

రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 32,341. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 77.02 శాతంగా ఉండగా.. రాష్ట్రంలో 74.5 శాతంగా ఉంది. భారత్‌లో మరణాల రేటు 1.76 శాతంగా ఉండగా.. తెలంగాణలో 0.64 శాతంగా ఉంది. గత 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 59,491 పరీక్షలు నిర్వహించామని మొత్తం పరీక్షల 14,83,267 కు చేరిందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
(చదవండి: మీకు అర్థమవుతోందా..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement