Telangana State
-
తెలంగాణకు 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు, 49 వేల ఉద్యోగాలు
-
తెలంగాణలో అమెజాన్ పెట్టుబడి 60 వేల కోట్ల రూపాయలు.. డేటా సెంటర్ల ఏర్పాటు కోసం కీలక ఒప్పందం
-
ఎం.ఎం.ఎం మర్డర్స్.. మగ్గు.. మరణశిక్ష!
నేరాల నిరోధం (ప్రివెన్షన్), కేసులు కొలిక్కి తీసుకురావడం (డిటెక్షన్), నిందితుల్ని దోషులుగా నిరూపించడం (కన్విక్షన్).. ఇవి పోలీసుల ప్రాథమిక విధులు. మొదటి రెండింటి మాట అటుంచితే అనివార్య కారణాల నేపథ్యంలో మూడోది మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. కోర్టులో నేర నిరూపణే కష్టసాధ్యంగా మారిన తరుణంలో ఇక నిందితుడికి ఉరి శిక్ష అనేది దుర్లభమే. గత ఏడాది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం మూడు కేసుల్లోనే ఈ శిక్షపడగా.. వాటిలో ఒకటి హైదరాబాద్లోని నారాయణగూడ పరిధిలో జరిగిన ఓ కుటుంబ హత్యకు సంబంధించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడికి ఉరి శిక్ష పడటంతో ఓ హోటల్ మగ్గు కీలకమైన భౌతిక సాక్ష్యంగా నిలిచింది.హైదరాబాద్, అంబర్పేటలోని గోల్నాకకు చెందిన రావుల సాయి అలియాస్ నాగుల సాయి.. శుభకార్యాలకు బ్యాండ్ వాయించే పని చేస్తుండేవాడు. ఆ పనిలేనప్పుడు చిత్తుకాగితాలు ఏరుకుని బతుకీడ్చేవాడు. అతనికి స్నేహితుడి ద్వారా హైదరాబాద్లోని చిక్కడపల్లి వాసి ఆర్తితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 2014లో ఇరువురూ ఒక్కటి కాగా.. ఏడాదికి కూతురు పుట్టింది. ఆ ఇద్దరి మధ్యా ఉన్న చిన్న చిన్న స్పర్థలు చినికి చినికి గాలివానగా మారడంతో ఆర్తి 2021లో భర్తను వదిలేసింది. కూతురిని తీసుకుని చిక్కడపల్లిలోని పుట్టింటికి వెళ్లిపోయి తల్లి లక్ష్మీబాయి, సోదరుడు జితేందర్లతో కలిసి ఉండసాగింది. సాయి తరచు ఆర్తి పుట్టింటికి వెళ్తూ ఆమె కుటుంబీకులతో ఘర్షణ పడేవాడు. ఓ సందర్భంలో జితేందర్పై దాడి చేసి, మరోసారి కోర్టు ధిక్కరణ నేరంపై జైలుకూ వెళ్లాడు. ఆర్తికి మగతోడు అవసరమని తలచిన జితేందర్ భార్య అనువైన సంబంధం కోసం వెదకసాగింది. ఆమె ద్వారా పరిచయమైన నాగరాజు మీద ఆర్తి కుటుంబానికి సదభిప్రాయం కలగడంతో 2021లో వీరిద్దరికీ వివాహం చేశారు. తన భార్యను వివాహం చేసుకుని తనకు పూర్తిగా దూరం చేశాడనే ఉద్దేశంతో నాగరాజుపై ద్వేషం పెంచుకున్నాడు సాయి. హైదరాబాద్, నారాయణగూడ ఫ్లైఓవర్ కింద ఉన్న మార్కెట్లో నాగరాజు పూల వ్యాపారం చేసేవాడు. అతనికి ఆర్తి చేదోడువాదోడుగా ఉండేది. తరచు తమ దుకాణం వద్దకు వచ్చి ఘర్షణ పడుతున్న, తన భార్యతో వాగ్వాదానికి దిగుతున్న సాయిని నాగరాజు అనేకసార్లు మందలించాడు. వీరికి కొడుకు (విష్ణు) పుట్టడంతో సాయిలో ద్వేషంతో పాటు ఈర్ష్య కూడా పెరిగింది. దాంతో అతని ప్రవర్తన విపరీతంగా మారడమే కాదు ఆర్తి కుటుంబాన్ని నాశనం చేస్తానంటూ పలుమార్లు బహిరంగంగానే బెదిరించాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన నాగరాజు.. తన భార్యను వేధిస్తున్న సాయిని బెదిరించాలని భావించాడు. 2022 నవంబర్ 7న నారాయణ గూడ మెట్రో స్టేషన్ వద్ద నాగరాజుకు సాయి కనిపించాడు. అతడిని అడ్డగించి.. మరోసారి ఆర్తితో మాట్లాడినా, ఫోన్ చేసి బెదిరించినా ఊరుకునేది లేదంటూ బెదిరించిన నాగరాజు.. ఇకపై ఆమెను సోదరిగా భావిస్తూ చెల్లి అని పిలవాలంటూ హెచ్చరించాడు. ఈ పరిణామంతో విచక్షణ కోల్పోయిన సాయి.. చిక్కడపల్లికే చెందిన తన స్నేహితుడు రాహుల్తో కలిసి నాగరాజు, ఆర్తిల హత్యకు కుట్రపన్నాడు. అదేరోజు రాత్రి హైదరాబాద్, నల్లకుంటలోని పెట్రోల్ బంక్ నుంచి ఖాళీ వాటర్ బాటిల్లో పెట్రోల్ తీసుకు వచ్చాడు. ఆర్తి, నాగరాజు తమ దుకాణంలో ఉన్నారని గుర్తించిన అతగాడు.. ఇద్దరిపైనా పెట్రోల్ చల్లడం ఇబ్బందికరమని భావించాడు. తన స్నేహితుడు రాహుల్తో కలిసి నారాయణ గూడ ఫ్లైఓవర్ సమీపంలో ఉన్న లక్కీ కేఫ్లోకి వెళ్లాడు. అక్కడ మంచి నీళ్లు తాగుతూ అదును చూసుకుని ఓ మగ్గు తస్కరించాడు. నాగరాజు దుకాణానికి సమీపంలో ఆగి బాటిల్లోని పెట్రోల్ను మగ్గులో పోసుకున్నాడు. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఓ చేతిలో అగ్గిపెట్టెను సిద్ధంగా ఉంచుకుని నాగరాజు దుకాణం వద్దకు వెళ్లాడు. ఆర్తి, నాగరాజు తేరుకునేలోపే వారిపై మగ్గులోని పెట్రోల్ చల్లి నిప్పంటించాడు. ఆ దాడిలో వీరిద్దరితో పాటు ఆర్తి ఒడిలో ఉన్న ఎనిమిది నెలల విష్ణు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడ నుంచి రాహుల్తో కలిసి బర్కత్పుర వైపు పారిపోయిన సాయి నల్లగొండకు చేరి తలదాచుకున్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆర్తి, విష్ణు, నాగరాజు చనిపోయారు. పోస్టుమార్టంలో ఆర్తి గర్భవతని తేలింది. దీంతో సాయి చేతిలో చనిపోయింది నలుగురుగా తేల్చారు. నారాయణగూడ పోలీసులు సాయి, రాహుల్ను అదే నెల 16న అరెస్టు చేశారు. ఈ కేసులో దర్యాప్తు చేసిన అధికారులు ఘటనాస్థలి నుంచి కాలిన స్థితిలో ఉన్న మగ్గును స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఇన్వెస్టిగేషన్ అనంతరం 48 మందిని సాక్షులుగా చేరుస్తూ కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారు. కోర్టు విచారణ సందర్భంగా కొందరు సాక్షులు విముఖత చూపినా.. పెట్రోల్ చల్లేందుకు వాడిన, సగం కాలిన మగ్గు కీలకమైన భౌతిక సాక్ష్యంగా మారింది. దీన్ని తస్కరించినట్లు సాయి అంగీకరించగా.. అది తమ మగ్గే అంటూ లక్కీ కేఫ్ యజమాని సాక్ష్యం చెప్పాడు. దీన్ని సైతం ఓ కీలక ఆధారంగా పరిగణించిన న్యాయస్థానం సాయి, రాహుల్ను దోషులుగా తేల్చింది. గత నెల 20న (20.12.2024) సాయికి ఉరి శిక్ష, రాహుల్కు జీవితఖైదు విధించింది. ఈ కేసు విచారణలో నారాయణగూడ ఇన్స్పెక్టర్ యు.చంద్రశేఖర్ కీలక పాత్ర పోషించారు. -
తెలంగాణకు వానగండం
-
ఇదేం కమిషన్?
సాక్షి, హైదరాబాద్: విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ తొలిదశలోనే వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేయాల్సిన కమిషన్ను ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంటోందన్న విమర్శలు వస్తున్నాయి. విద్యా కమిషన్ కోసం ఏర్పాటు చేసిన సలహా మండలి సభ్యులు ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎలాంటి హేతుబద్ధత లేకుండా, తమను సంప్రదించకుండానే సభ్యులుగా చేర్చారని కొందరు సభ్యులు మండిపడుతున్నారు.సలహా మండలిలో చేరేదే లేదని ఇప్పటికే ఇద్దరు సీనియర్ ప్రొఫెసర్లు ప్రభుత్వానికి స్పష్టం చేశారని.. మరో ఇద్దరు ఇదే బాటలో ఉన్నారని తెలిసింది. మరోవైపు కమిషన్ చైర్మన్ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. కమిటీ ఏర్పాటు చేసినా.. ఎలాంటి మౌలిక సదుపాయాలు ఇవ్వకపోవడం, సలహాదారుల ఎంపికలో తనకు ప్రమేయమే లేకపోవడాన్ని ఆయన జీర్ణించుకోవడం లేదని తెలిసింది. విద్యాశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి అన్నీ తానే అయి నడిపిస్తుండటమే దీనికి కారణమని విద్యాశాఖ వర్గాలు చెప్తుండటం గమనార్హం. ఇవేం నియామకాలు? విద్యా కమిషన్ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. చైర్మన్గా ఆకునూరి మురళిని నియమించింది. చాలా రోజుల తర్వాత కమిషన్కు ముగ్గురు సభ్యులను నియమించింది. వాస్తవానికి విద్యా రంగంలోని వివిధ విభాగాల నుంచి సభ్యుల నియామకం జరగాలని కొన్ని నెలల క్రితం జరిగిన మేధావుల సమావేశంలో సీఎంకు పలువురు సూచించారు. కానీ ఒక కార్పొరేటర్, అధికార పారీ్టకి చెందిన ఓ స్కాలర్ సహా మరో వ్యక్తిని సభ్యులుగా నియమించడంపై విమర్శలు వచ్చాయి. దీనివల్ల సభ్యులు రాజకీయ కోణంలో ఆలోచించే అవకాశం ఉంటుందని.. విద్యా రంగంలో పారదర్శకంగా సంస్కరణలు చేపట్టలేమనే అభిప్రాయాలు వచ్చాయి.ఈ నేపథ్యంలోనే విద్యా కమిషన్కు సలహా కమిటీ సభ్యులుగా ప్రొఫెసర్ హరగోపాల్ సహా పలువురు ప్రొఫెసర్లను నియమించారు. అయితే ఈ నియామకాలు విద్యా కమిషన్ పరిధిలో జరిగి ఉంటే బాగుండేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కేవలం కొందరి సూచనల మేరకు సలహా కమిటీని సీఎం వేశారని అంటున్నారు. సలహా కమిటీ కేవలం ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందని.. అలాంటప్పుడు విద్యా కమిషన్కు స్వతంత్ర ప్రతిపత్తి ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. సంస్కరణలు సాధ్యమేనా? విద్యా కమిషన్పై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని.. విద్యా రంగంలో సంస్కరణల దిశగా అడుగులు వేయడం లేదని సలహా కమిటీలో నియమితులైన సభ్యుడొకరు మండిపడ్డారు. కర్నాటకలోనూ విద్యా కమిషన్ ఏర్పాటు చేశారని, ఆ కమిషన్ మొత్తం 14 సబ్ కమిటీలను వేసుకుందని.. వాటి ద్వారా మార్పులకు శ్రీకారం చుడుతోందని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ రాజకీయ, సామాజిక కోణంలోని వారినే ఈ కమిషన్ పరిధిలోకి తెచ్చారని.. సాంకేతిక విద్య, అంగన్వాడీ, ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యలో నిపుణులను భాగస్వామ్యం చేసే పరిస్థితి కనిపించడం లేదన్నారు. అంతేగాకుండా అసలు విధులేమిటో చెప్పలేదని, ఏం సలహాలివ్వాలి, ఎవరికి ఇవ్వాలనే స్పష్టతా లేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో విద్యా కమిషన్కు ఆదిలోనే తలపోట్లు తప్పేలా లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు..
-
తెలంగాణ బీజేపీ అధ్యక్ష నియామకంపై సస్పెన్స్
-
మహా ప్రగతి
నింగినంటే ఆకాశ హర్మ్యాలు.. వేగం పెంచిన రహదారులు.. ఫ్లైఓవర్లు.. ప్రపంచ నగరాల చెంతన నిలిపిన అంతర్జాతీయ హంగులతో మహానగరం గ్లోబల్ సిటీగా అవతరించింది. దేశవిదేశాలకు చెందిన కార్పొరేట్ దిగ్గిజాలకు కేరాఫ్గా నిలిచింది. ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ సదస్సులు, ఉత్కంఠభరితమైన పోటీలు జరిగాయి. గత పదేళ్లలో నగరంలో అనేక మార్పులు వచ్చాయి. దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి, శ్వేతసౌధాన్ని తలపించే సచివాలయం, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల భారీ విగ్రహం, ఆ చెంతనే కొలువుదీరిన మాజీ ప్రధాని పీవీ విగ్రహం.. లుంబినిని ఆనుకొని నిర్మించిన అమరుల స్మారకం, ట్యాంక్బండ్, నెక్లెస్రోడ్డు మార్గంలో పర్యాటకులను ఆకట్టుకొనే డబుల్ డెక్కర్ బస్సులు, లక్షలాదిమంది ప్రయాణికులకు చేరువైన మెట్రో రైలు. సుమారు రూ.వంద కోట్లతో నిర్మించిన సైకిల్ట్రాక్, ప్రపంచదేశాలను ఆకట్టుకున్న ఫార్ములా–ఈ వంటి పోటీలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం పదేళ్లలో మహా నగరం రూపురేఖల్లో అనూహ్యమైన మార్పులొచ్చాయి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన నగరాలతో పోటీ అన్నట్లుగా విశ్వనగరం దిశగా అడుగులు వేస్తోంది.నూతన రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన భాగ్యనగరం ప్రగతి పథంలోనూ తనదే పైచేయి అంటూ సగర్వంగా నినదిస్తోంది. తెలంగాణ రాష్ట్రం అవతరించి పదేళ్లవుతున్న సందర్భంగా ‘సాక్షి’ బిగ్ స్టోరీ. – సాక్షి, హైదరాబాసిటీబ్యూరో బృందం రూ.8 వేల కోట్లతో ఎస్సార్డీపీ.. నగరంలో ఎస్సార్డీపీ (వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం) కింద దాదాపు రూ.8 వేల కోట్ల పనులు జరిగాయి. వీటిలో ఎలివేటెడ్ కారిడార్లు, ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు, ఆర్ఓబీలు, ఆర్యూబీలు, తదితరమైనవి ఉన్నాయి. మొదటి దశ కింద చేపట్టిన ఈ పనుల్లో 36 పూర్తిచేశారు. మరో ఆరు పురోగతిలో ఉన్నాయి. పూర్తయిన పనుల వల్ల రద్దీ మార్గాల్లో వాహన వేగం 15 కేఎంపీహెచ్ నుంచి 35 కేఎంపీహెచ్కు పెరిగింది. దాదాపు రూ.450 కోట్లతో స్లిప్రోడ్లు, లింక్రోడ్లు నిర్మించారు.రూ.530 కోట్లతో ఎస్ఎన్డీపీ.. ఎస్ఎన్డీపీ (వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం) కింద రూ. 530 కోట్ల పనులు చేశారు. లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లకుగాను దాదాపు 70 వేల గృహాలను లబ్ధిదారులకు అందజేశారు. థీమ్పార్కులు, కాలనీపార్కుల వంటివి వందలాదిగా అభివృద్ధి చేశారు. సమగ్ర రోడ్డు నిర్వహణ పథకం (సీఆర్ఎంపీ) పథకం ద్వారా ఎంపిక చేసిన ప్రధాన రహదారుల నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలకివ్వడంతో రోడ్ల సమస్యలు తగ్గాయి. 38 మోడల్ మార్కెట్లు, 12 మల్టీ పర్పస్ ఫంక్షన్ హాళ్లు, 30కి పైగా శ్మశాన వాటికల నిర్మాణం/ఆధునికీకరణ పనులు చేశారు. బస్తీ దవాఖానాలు.. అన్నపూర్ణ భోజనం పేదలకు రూ. 5లకే అన్నపూర్ణ భోజనం, బస్తీ దవాఖానాలు అందుబాటులోకి వచ్చాయి. చెత్త తరలింపునకు స్వచ్ఛ ఆటోలు, రెఫ్యూజ్ కాంపాక్ట్ వాహనాలు వినియోగంలోకి తెచ్చారు. 5 ప్రధాన కారిడార్ల ద్వారా నిత్యం 15 లక్షల వాహనాలు (పీసీయూ) ప్రయాణిస్తున్నాయి. దశాబ్ద కాలంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అనేక సంస్కరణలు చేపట్టింది. అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడంతో పాటు అండర్ గ్రౌండ్ లైన్ల సంఖ్యను పెంచింది. సామర్థ్యానికి మించి నమోదవుతున్న డిమాండ్ను తట్టుకుని నిలిచేలా సరఫరా వ్యవస్థను మెరుగుపర్చింది. రయ్మన్న ఫార్ములా– ఈ హుస్సేన్సాగర్ తీరంలో గతేడాది ఫిబ్రవరి 11న అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఫార్ములా–ఈ పోటీలు ప్రపంచం దృష్టినిఆకర్షించాయి. ఈ పోటీల కోసం నెక్లెస్రోడ్డులో 2.8 కిలోమీటర్ల స్ట్రీట్ సర్క్యూట్ను ఏర్పాటు చేశారు. పర్యావరణహిత ఎలక్ట్రిక్ వాహనాల ప్రాధాన్యతను ప్రపంచానికి చాటి చెప్పడమే లక్ష్యంగా దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్లో జరిగిన ఫార్ములా– ఈ ప్రిక్స్ పోటీల్లో 11 జట్లకు చెందిన 22 మంది రేసర్లు అద్భుతమైన ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. పాదచారుల భద్రతకు ఉప్పల్ స్కైవాక్ ప్రతిరోజు వేలాది మంది బాటసారులు నలువైపులా నడిచే ఉప్పల్ రింగ్రోడ్డు వద్ద హెచ్ఎండీఏ నిర్మించిన స్కైవాక్తో పాదచారుల భద్రతకు భరోసా ఏర్పడింది. సుమారు రూ.25 కోట్లతో ఈ స్కైవాక్ను నిర్మించారు. దీని నిర్మాణంలో 8 లిఫ్టులు, 6 మెట్ల మార్గాలు, మరో 4 ఎస్కలేటర్లను ఏర్పాటు చేశారు. సైకిల్ ట్రాక్.. అదరహో.. ఔటర్రింగ్ రోడ్డు మార్గంలో అంతర్జాతీయ ప్రమాణాలతో 23 కిలోమీటర్ల మేర సైకిల్ ట్రాక్ను నిర్మించారు. దీనికి సోలార్ రూఫ్ను కూడా ఏర్పాటు చేశారు. దేశంలోనే ఇది తొట్టతొలి అధునాతన సైక్లింగ్ ట్రాక్. నానక్రామ్గూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు 8.5 కి.మీ, కొల్లూరు నుంచి నార్సింగి వరకు మరో 14.5 కి.మీ మేర దీన్ని ఏర్పాటు చేశారు. 5.3 మీటర్ల వెడల్పుతో, మూడు లైన్లతో ట్రాక్ను నిర్మించారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం.. నెక్లెస్ రోడ్డులో సుమారు 11.4 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో ఆహ్లాదకరమైన పచ్చదనం వాతావరణం మధ్య భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని నెలకొల్పారు. ఎలాంటి ప్రతికూల వాతావరణాన్నైనా తట్టుకొనేవిధంగా ఈ మహామూర్తిని ఏర్పాటు చేశారు. పార్లమెంట్ భవనం ఆకృతిలో ఏర్పాటు చేసిన బేస్మెంట్ మరో ప్రత్యేకమైన ఆకర్షణ. ఇది 50 అడుగుల ఎత్తు ఉంటుంది. బేస్మెంట్లోని హాళ్లలో అంబేడ్కర్ జీవితంపై విస్తారమైన సమాచారంతో కూడిన గ్రంథాలయం, ఆయన జీవిత విశేషాలను, రాజ్యాంగ రచనా కాలం నాటి ఫొటోలను, చిత్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. నలువైపులా మెట్రో సేవలు... నగరంలో 2017 నవంబర్లో మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మెట్రో ప్రయాణికుల సంఖ్య 54 కోట్లు దాటింది. నగరంలోని మూడు కారిడార్లలో మెట్రో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. మెట్రో రెండో దశలో భాగంగా ప్రస్తుత ప్రభుత్వం ఎల్బీనగర్, పాతబస్తీ రూట్ల నుంచి ఎయిర్పోర్టు వరకు మెట్రో నిర్మించనున్నారు.అలాగే నగరం నలువైపులా మెట్రో రైళ్లను విస్తరించేందుకు ప్రణాళికలను రూపొందించారు. భేషుగ్గా నీటి నిర్వహణ కోటిన్నరకు పైగా జనాభా కలిగిన మహా నగరానికి తాగునీటి సరఫరాతో పాటు మురుగు నీటి నిర్వహణను జలమండలి సమర్థంగా నిర్వహిస్తోంది. నగర నలుమూలల తాగునీటి రిజర్వాయర్లతో పాటు మంచినీటి శుద్ధి కేంద్రాలను నిర్మించి తాగునీరు సరఫరా చేస్తోంది. భవిష్యత్ తాగునీటి సరఫరాకు భరోసా కల్పిస్తూ సుంకిశాల ప్రాజెక్టు నిర్మిస్తోంది. మరోవైపు వంద శాతం మురుగు శుద్ధి కోసం మూడు ప్యాకేజీల్లో అధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో కొత్తగా 31 మురుగు నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణ పనులు చేపట్టగా అందులో ఇప్పటికే సగానికి పైగా పూర్తయ్యాయి. నగర వాసులకు నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచిత తాగునీటి సరఫరా పథకం అమల్లోకి వచి్చంది. పారిశుద్ధ్య విధానం పూర్తిగా మ్యానువల్ నుంచి యాంత్రికానికి మారింది. ప్రస్తుతం సివర్ జెట్టింగ్ యంత్రాలను వినియోగిస్తోంది. మ్యాన్ హోళ్లలో మానవ సహిత పారిశుద్ధ్య పనులు నిషేధించింది. హుస్సేన్ సాగర్ పరిరక్షణ చర్యల్లో భాగంగా కూకట్పల్లి నుంచి వచ్చే మురుగు నీటిని సాగర్లో కలవకుండా వేరే ప్రాంతానికి మళ్లించింది. దశాబ్ది ధగధగలు అవతరణ ఉత్సవాలకు ముస్తాబైన గ్రేటర్ సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు నగరం ముస్తాబైంది. ఆదివారం జరగనున్న వేడుకల కోసం ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. సెక్రటేరియట్, అంబేడ్కర్ విగ్రహం, అమరుల స్మారకం, నెక్లెస్రోడ్డు, తెలుగుతల్లి ఫ్లైఓవర్, ట్యాంక్బండ్ తదితర ప్రాంతాలు వెలుగులు విరజిమ్మేలా ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం సికింద్రాబాద్లోని పరేడ్గ్రౌండ్స్లో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమకారులతో పాటు, అమరుల కుటుంబాలను సమున్నతంగా గౌరవించనుంది. సాయంత్రం 6 గంటలకు ట్యాంక్బండ్ వద్ద సుమారు 700 మందికి పైగా కళాకారులు, వివిధ సాంస్కృతిక బృందాలు భారీ కవాతును నిర్వహించనున్నాయి. బతుకమ్మ, బోనాలు, డప్పు వాద్యాలు, ఒగ్గుడోలు తదితర కళాకారుల బృందాలు వేడుకల్లో పాల్గొంటాయి. తెలంగాణ రుచులను పరిచయం చేసే వివిధ రకాల వంటలతో స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. లేజర్ షోలతో ఆకాశం సరికొత్త అందాలను సంతరించుకోనుంది. రాత్రి 8.50 గంటలకు బాణాసంచా వెలుగుల్లో వేడుకలను ముగించనున్నారు.నేడు ట్రాఫిక్ ఆంక్షలుమధ్యాహ్నం 2 నుంచి రాత్రి 12 గంటల వరకు ఖైరతాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 12 గంటల వరకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలతో పాటు మళ్లింపులు ఉంటాయని పోలీసులు తెలిపారు. » లుంబినీ పార్క్, ఎన్టీఆర్ ఘాట్, ఎన్టీఆర్ గార్డెన్, ఐమాక్స్, పీపుల్స్ ప్లాజా ఎగ్జిబిషన్లు ఆదివారం మూసివేసి ఉంటాయి. సాధారణ ప్రజలు, పర్యాటకులు ఆయా ప్రాంతాలకు రాకూడదు. » ట్యాంక్బండ్పై జరిగే ఉత్సవాలకు పాసులు ఉన్నవారికే అనుమతి ఉంటుంది. » మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఎఎస్, ఐపిఎస్ అధికారులతో పాటు పోలీసులు, అధికారులు వారి వారి వాహనాల పార్కింగ్ కోసం బోట్స్ క్లబ్, చి్రల్డన్స్ పార్క్, హోటల్ అమోఘం, సచివాలయం నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ రోడ్డు, నెక్లెస్ రోడ్డు సంజీవయ్య పార్క్ రోడ్డు, జీహెచ్ఎంసీ లేన్లతో పాటు ఎనీ్టఆర్ స్టేడియంను పార్కింగ్ కోసం కేటాయించారు. » రాణిగంజ్ రైల్వే ట్రాక్ నుంచి నెక్లెస్ రోడ్డు వైపు వచ్చే వాహనాలకు అనుమతి లేదు. ఆ వాహనాలు మినిస్టర్ రోడ్డు వైపు మళ్లిస్తారు. సైఫాబాద్ ఓల్డ్ పీఎస్ నుంచి వచ్చే వాహనాలు రవీంద్రభారతి వైపు డైవర్షన్ తీసుకోవాలి. » తెలుగుతల్లి ఫ్లైఓవర్ పై నుంచి స్టీల్ బ్రిడ్జి వైపు వెళ్లే వాహనాలను అనుమతిస్తారు. తెలుగుతల్లి చౌరస్తా, ట్యాంక్బండ్ వైపు అనుమతి లేదు. » కూకట్పల్లి నుంచి పంజాగుట్ట, సికింద్రాబాద్ వైపు, పంజాగుట్ట వైపు వాహనాలకు అనుమతి ఉంటుంది. ఖైరతాబాద్ చౌరస్తా వైపు అనుమతించరు. » మెహిదీపట్నం నుంచి లక్డీకాపూల్ వైపు వచ్చే వాహనాలను మాసబ్ ట్యాంక్ నుంచి సికింద్రాబాద్ వైపు అనుమతిస్తారు. » లిబర్టీ, హిమాయత్నగర్ నుంచి ట్యాంక్బండ్, అంబేద్కర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలకు అనుమతి లేదు. ఖైరతాబాద్ ఫ్రైలఓవర్ మీదుగా నెక్లెస్ రోడ్డు, ఐమాక్స్ వైపు వెళ్లే వాహనాలను అనుమతించరు. నేరాల నియంత్రణకు ఐసీసీసీపదేళ్ల కాలంలో ‘గ్రేటర్’లో పోలీసు విభాగాలకు సంబంధించి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెం.12లో అందుబాటులోకి వచ్చిన హైదరాబాద్ పోలీసు కమిషనరేట్– తెలంగాణ స్టేట్ పోలీసు ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీఎస్పీఐసీసీసీ) తలమానికంగా నిలిచింది. దీన్ని 6.427 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ భవనంలో హైదరాబాద్ కమిషనర్ ఇతర ఉన్నతాధికారులతో పాటు సైబర్ సేఫ్టీ బ్యూరో, నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, డయల్–100, వ్యవస్థీకృత నేరాల నిరోధక విభాగం, ప్రాసిక్యూషన్ సపోర్ట్ సెంటర్, సిటిజన్ ఫీడ్బ్యాక్ సపోర్ట్ సెంటర్ తదితరాలు ఉన్నాయి. ఇది మొత్తం ఏడు ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులోని ‘ఏ’ టవర్ 1,69,000, ‘బీ’ టవర్ 1,25,000, ‘సీ’ టవర్ 34,414, ‘డీ’ టవర్ 27,166, ‘ఈ’ టవర్ 45,000, బేస్మెంట్ 2,16,365 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. 60 మీటర్ల ఎత్తులో 14,15 అంతస్తుల మధ్య ఉన్న స్కై బ్రిడ్జ్ 20,750 అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ విభాగాల సీసీ కెమెరాలన్నీ ఇక్కడి కంట్రోల్ రూమ్కు అనుసంధానించి ఉంటాయి. గ్రేటర్లోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో సుమారు పది లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల విషయంలో దేశంలోనే ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. సైబరాబాద్లోని తూర్పు భాగంతో ప్రత్యేకంగా రాచకొండ పోలీసు కమిషనరేట్ ఏర్పాటైంది. ప్రతి కమిషనరేట్లోనూ జోన్లు, డివిజన్లు, పోలీసుస్టేషన్లు పునర్ వ్యవస్థీకరణ జరిగింది. -
చిహ్నం విషయంలో చర్చ జరగాలి!
ఐదు దశాబ్దాల పైగా అస్తిత్వం కోసం పోరాడిన తెలంగాణకు జనగీతం ఏది? పదేళ్ల క్రితం ‘మా రాష్ట్రం’ అని చెప్పుకునే అవకాశం తెలంగాణ ప్రజలకు దక్కింది. ఒక రాష్ట్రంగా చిహ్నం, విగ్రహం రూపుదిద్దుకున్నాయి. తెలంగాణ అవతరణ పదేళ్ల తరువాత, కాంగ్రెస్ పార్టీవారి ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని ‘తెలంగాణ రాష్ట్ర గీతం’గా ప్రకటించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాన్ని కూడా మార్చి కొత్త చిహ్నాన్ని రూపొందిస్తోంది. ఈ సందర్భంగా రకరకాల చర్చలు మొదలయ్యాయి.దేశానికి ఒక జాతీయ గీతం ఉన్నట్లే రాష్ట్రానికి ఓ రాష్ట్ర గీతం ఉండాలని కోరుకోవడం సహజమే. రాష్ట్రం ఏర్పడ్డ పదేళ్ల తరువాత ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే... దానిపై వాడి వేడి చర్చలు జరుగుతున్నాయి.జాతీయ గీతంలాగే రాష్ట్ర గీతం...జాతీయ గీతం ‘జన గణ మన’, జాతీయ గేయం ‘వందేమాతరం’... రెండింటినీ సమానంగా గౌరవించాలని మన రాజ్యాంగ సభ అధ్యక్షులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాజ్యంగ సభలో ప్రకటించారు. అప్పటి నుంచి భారతీయులు ఆ యా గీతాలను అత్యంత గౌరవంతో ఆలాపిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి జాతీయ పర్వదినాలను నిర్వహించే సమయంలో చిన్నా పెద్ద, అధికారి, అనధికారి అనే భేదం లేకుండా అందరూ గౌరవంగా నిలబడాలనేది ఒక నియమం. కనీసం జాతీయ గీతాలాపన సమయంలో మౌనంగా ఉండి తమ గౌరవాన్ని వ్యక్తం చేయాలి. అయితే అలా గౌరవించనివారూ ఉంటారు. అందుకు శిక్షలు ఉండవు. కాని, అవమానిస్తే మాత్రం నేరమే. రెండు జాతీయ గీతాలకూ, జాతీయ చిహ్నానికీ, జాతీయ పతాకానికీ సంబంధించి ఒక చట్టం కూడా చేసుకున్నాం.దేశ సౌభాగ్యాన్నీ, సంస్కృతీ వారసత్వాలూ, గొప్పదనాన్నీ ప్రతిబింబించే మన జాతీయ గీతాలను గర్వంగా భారతీయులమంతా ఎలా ఆలపిస్తున్నామో... అంతే గర్వంగా రాష్ట్రాల ప్రజలు తమ తమ రాష్ట్ర గీతాలను ఆలపించడం సహజం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పదేళ్లయినా ఇంతవరకూ రాష్ట్ర గీతం అంటూ ఏదీ లేకపోవడాన్ని కొందరు చర్చిస్తూ వచ్చారు. చరిత్ర, సంస్కృతి, వారసత్వాల పేర సాగిన ఉద్యమ ఫలితంగా ఏర్పడిన రాష్ట్రం కావడంతో ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం అందెశ్రీ రాసిన గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించడంతో చాలామంది స్వాగతించారు. ఎందుకంటే ఈ గీతం తెలంగాణలో ఉన్న పాత జిల్లాల అన్నింటి ప్రత్యేకతలనూ, వైశిష్ట్యాన్నీ అద్భుతంగా ఆవిష్కరించింది కనుక. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలందరినీ ఒక ఊపు ఊపింది కనుక. అలాగే దీని రచయిత అందెశ్రీ తెలంగాణ మట్టిమనిషి, ఉద్యమకారుడు. తన కలం, గళం ద్వారా ప్రజాబాహుళ్యంలోకి చొచ్చుకుపోయినవారు. అందుకే చాలామంది రాష్ట్ర గీత ప్రకటనను స్వాగతిస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వ కొత్త చిహ్నం..గత తెలంగాణ ప్రభుత్వం ఆమోదించి అమలులో పెట్టిన ప్రభుత్వ చిహ్నాన్ని పక్కన పెట్టి, ప్రస్తుత ప్రభుత్వం మరో నమూనాను రూపొందిస్తున్నది. ఇప్పటికే దానిపై సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి వంటి రాజకీయ పార్టీల నేతలతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. ఈ నమూనా చాలా బాగుందని కొందరూ, బాగులేదనీ మరికొందరూ అంటున్నారు.అసలు ఇప్పుడు రాష్ట్ర చిహ్నాన్ని మార్చడం, రాష్ట్ర గీతం అంటూ ఒక గీతాన్ని ప్రకటించడం అవసరమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. పోనీ వాటిని నిర్ణయించేటప్పుడు ప్రధాన ప్రతిపక్షాన్ని సంప్రదించాలి కదా? దాన్నీ ఈ ప్రక్రియలో భాగం చేయలేదనేది ప్రధానమైన విమర్శ. ఇది సమస్యల నుంచి ప్రజలను పక్కదారి పట్టించి ఏమార్చడానికే అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.విధానం, సంవిధానం? దేశానికి కానీ, రాష్ట్ర స్థాయిలో ప్రతి రాష్ట్రానికి కానీ ఒక ప్రత్యేక నిర్ణయ విధానం (పాలసీ) అంటూ ఒకటి ఉండాలి. ప్రజలందరికీ సంబంధించిన కొన్ని అంశాలపై నిర్ణయాలను కేవలం ‘మంత్రివర్గం’ తీసుకుంటే సరిపోదు. విస్తృతంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించాల్సి ఉంటుంది. సభలు, సదస్సులు, జిల్లా స్థాయి చర్చలు, సంప్రదింపులు జరపాలి. సోషల్ మీడియా, ఇంటర్నెట్ ద్వారా వివిధ వర్గాలవారి అభిప్రాయాలను సేకరించిన తర్వాతే కొన్ని నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవాలి. మంత్రివర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలూ, అసెంబ్లీ సమావేశాల్లో చేసిన చర్చలూ, నిర్ణయాలను అందరికీ అందుబాటులో ఉండేలా వైబ్సైట్లో పెట్టాలి. మొత్తంమీద రాష్ట్ర గీత ప్రకటన, ప్రభుత్వ చిహ్నం మార్పు వంటి అంశాల్లో అధికార పక్షం ఏకపక్షంగా వ్యవహరించడం అన్యాయం. – వ్యాసకర్త డీన్, స్కూల్ ఆఫ్ లా, మహీంద్రా యూనివర్సిటీఅభిప్రాయం: మాడభూషి శ్రీధర్ -
తెలంగాణ రాష్ట్ర గేయం.. ఇప్పుడే ఎందుకు వివాదమైంది?
తెలంగాణ రాష్ట్ర గేయంపై కొత్తగా వివాదం ఎందుకు వచ్చింది? గతంలో లేని వివాదం ఇప్పుడే ఎందుకు వివాదమైంది? రాష్ట్ర గేయం రూపకల్పనలో గులాబీ పార్టీకి ఉన్న అభ్యంతరం ఏంటి? ఇందులో కాంగ్రెస్ సర్కార్ పాత్ర ఎంతవరకు ఉంది? పాటకు సంగీతం సమకూరుస్తున్న వ్యక్తే వివాదానికి కేంద్ర బిందువుగా మారారా? దీనిపై బీఆర్ఎస్ ఏమంటోంది? ముఖ్యమంత్రి రేవంత్ సమాధానం ఏంటి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతోంది. దశాబ్ది ఉత్సవాలు చేసుకుకోవాల్సిన సమయంలో కొత్త వివాదాలు ముందుకు వస్తున్నాయి. రాష్ట్ర చిహ్నంలో మార్పులు, రాష్ట్ర గేయం రూపకల్పనపైన ప్రధాన విపక్షం నుంచి తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. కారు, హస్తం పార్టీల మధ్య తెలంగాణ గేయం ఇరుక్కుంది. రాష్ట్ర గేయం అంశం పదేళ్లలో ఎన్నడూ చర్చనీయాంశం కాలేదు. కానీ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర గేయం అంశాన్ని మళ్ళీ తెరమీదకు తీసుకుని వచ్చింది. అందులో మార్పులు చేసి గేయాన్ని సరికొత్తగా ఆవిష్కరించాలని నిర్ణయించింది. రేవంత్రెడ్డి ప్రభుత్వం ఆలోచన బాగానే ఉన్నా.. పాట రచయిత అందే శ్రీ తో ప్రభుత్వంతో ఎలాంటి ఇబ్బంది లేదు కానీ, పాటకు సంగీతం సమకూర్చే పనిని కీరవాణికి అప్పగించటంపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.తెలంగాణ ఆత్మ గౌరవ అంశాన్ని తెలంగాణేతరులకు అప్పగించటం పట్ల గులాబీ పార్టీ నేతలు మండి పడుతున్నారు. సంగీత దర్శకులు, గాయకుల్లో తెలంగాణ బిడ్డలు చాలామంది ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలనే కొత్త వివాదాలు సృష్టిస్తున్నారని బీ ఆర్ ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా గేయానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకునే పెట్టేందుకే గులాబీ పార్టీ నాయకత్వం నిర్ణయించుకుంది.ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని కూడా చూస్తోంది. రాష్ట్ర కోసం, తెలంగాణ ఆత్మ గౌరవం కోసం ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవద్దనిబీఆర్ఎస్ అనుకుంటోంది. ఇది చిలికి చిలికి గాలి వానలా మారుతుండటంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఓ ప్రకటనతో చల్లగా వివాదం నుంచి తప్పుకున్నారు. తెలంగాణ గేయ రచన, సంగీతం సమకూర్చే పనిని కీరవాణికి అప్పగించే విషయంలో తన ప్రమేయం ఏమీ లేదని ఇదంతా అందే శ్రీ చూస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్రెడ్డి అనుమతి లేకుండానే అందెశ్రీ నిర్ణయాలు తీసుకుంటారా అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. అదేవిధంగా తెలంగాణ రాజముద్రలో కాకతీయ తోరణం, చార్మినార్లను తొలగించాలన్ని నిర్ణయాన్ని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్రంగా తప్పుపడుతున్నారు. తెలంగాణ వారసత్వానికి, పోరాటాలకు చిహ్నాలుగా ఉన్నవాటిని ఎలా తొలగిస్తారని నిలదీశారు. తెలంగాణ రాష్ట్ర గేయానికి సంగీతం సమకూర్చే బాధ్యతను తెలంగాణేతరులకు ఇవ్వడానికి వీల్లేదని గులాబీ పార్టీ గట్టిగా పట్టుపడుతోంది. మరి ప్రభుత్వం ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. -
రాజముద్రపై రాజకీయ రగడ
-
తెలంగాణ రాష్ట్ర గేయం ఇదే
జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లీ నీరాజనం!! పలు జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణా!! పోతనది పురిటిగడ్డ, రుద్రమది వీరగడ్డ గండరగండడు కొమురం భీముడే నీ బిడ్డ!! కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్!! జై తెలంగాణ జై జై తెలంగాణా!! జానపద జనజీవన జావలీలు జాలువారు కవిగాయక వైతాళిక కళల మంజీరాలు!! జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర అనునిత్యం నీగానం అమ్మ నీవే మా ప్రాణం!! జై తెలంగాణ జై జై తెలంగాణా!! సిరివెలుగులు విరజిమ్మె సింగరేణి బంగారం అణువణువున ఖనిజాలు నీ తనువుకు సింగారం!! సహజమైన వన సంపద చక్కనైన పువ్వుల పొద సిరులు పండే సారమున్న మాగాణియే కద నీ ఎద!! జై తెలంగాణ జై జై తెలంగాణా!! గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్లాలి పచ్చని మాగాణుల్లో పసిడి సిరులు పండాలి!! సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణ యుగం కావాలి!! జై తెలంగాణ జై జై తెలంగాణా!! అందెశ్రీ నేపథ్యం.. తెలంగాణ రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణ జననీ జయకేతనం అనే పాటను వరంగల్ జిల్లాకు చెందిన తెలుగు కవి, సినీగేయ రచయిత అందెశ్రీ రాశారు. ప్రజాకవి, ప్రకృతి కవిగా సుప్రసిద్ధుడైన అందెశ్రీ వరంగల్ జిల్లా జనగామ వద్ద ఉన్న రేబర్తి అనే గ్రామంలో జూలై 18, 1961లో జన్మించారు. ఈయన అసలు పేరు అందె ఎల్లయ్య. గొర్రెల కాపరిగా పనిచేసిన ఈయన్ను శృంగేరి మఠానికి సంబంధించిన స్వామీ శంకర్ మహారాజ్ అందెశ్రీ పాడుతుండగా విని చేరదీశాడు. రాష్ట్రవ్యాప్తంగా అందెశ్రీ పాటలు ప్రసిద్ధం. నారాయణ మూర్తి నటించిన విప్లవాత్మక సినిమాల విజయం వెనక అందెశ్రీ పాటలున్నాయి. 2006లో గంగ సినిమాకు గాను నంది పురస్కారాన్ని అందుకున్నారు. బతుకమ్మ సినిమా కోసం ఈయన సంభాషణలు రాశారు. కాకతీయ విశ్వవిద్యాలయం అందెశ్రీని గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. అందెశ్రీ సినీ పాటల జాబితా జయజయహే తెలంగాణ జననీ జయకేతనం పల్లెనీకు వందనాలమ్మో మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు గలగల గజ్జెలబండి కొమ్మ చెక్కితే బొమ్మరా.. కొలిచి మొక్కితే అమ్మరా జన జాతరలో మన గీతం ఎల్లిపోతున్నావా తల్లి చూడాచక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి -
నకిలీ డాక్టర్లకు చెక్..
సాక్షి, హైదరాబాద్: అర్హత లేకున్నా వైద్యులుగా ప్రాక్టీస్ చేస్తున్న వారిపై, అక్రమంగా ఆసుపత్రులు నడుపుతున్నవారిపైనా తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి (టీఎస్ఎంసీ) ఉక్కుపాదం మోపుతోంది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, ఖైరతాబాద్లో అర్హత లేకున్నా ప్రాక్టీస్ చేస్తున్న రెండు ఆసుపత్రు లకు ఇటీవలే ఎన్నికైన కొత్త మండలి నోటీసులు జారీ చేసింది. సదరు ఆసుపత్రుల్లో యాంటీబయా టిక్స్, స్టెరాయిడ్స్ వంటి షెడ్యూల్డ్ డ్రగ్స్ను గుర్తించి ఈ మేరకు వాటిపై కేసులు నమోదు చేసింది. ఇంకా అనేక చోట్ల నకిలీ వైద్యుల దందాపై దాడులకు శ్రీకారం చుట్టింది. డాక్టర్లుగా చెప్పుకునే ఆర్ఎంపీలపై క్రిమినల్ కేసులు పెడతామని మండలి హెచ్చరించింది. పేరుకు ముందు ‘డాక్టర్’ హోదా పెట్టుకున్నా, ఆసుపత్రి అని రాసి ఉన్న బోర్డులు ప్రదర్శించినా, రోగులకు ప్రిస్క్రిప్షన్ రాసినా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. ఆర్ఎంపీల ముసుగులో రాష్ట్రంలో ఆర్ఎంపీ, పీఎంపీలు 30 వేల మంది వర కు ఉన్నారని ఓ అంచనా. ప్రతీ గ్రామంలో వారు ప్రాక్టీస్ చేస్తుంటారు. అయితే కొంతమంది నకిలీ సర్టిఫికెట్లతో ఆర్ఎంపీలు, పీఎంపీల ముసుగులో డాక్టర్లుగా చెలామణీ అవుతూ.. ఇష్టారాజ్యంగా అబార్షన్లు చేయడం, అత్యధిక మోతాదులో ఉన్న యాంటీబయాటిక్స్ ఇవ్వడం, చిన్న రోగాలకు కూడా అధికంగా మందులు రాస్తున్నారని మండలి గుర్తించింది. ఇటీవల నగరంలోని మలక్పేట్ ప్రాంతంలో నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్ను కలిగి ఉన్న ఒక అర్హతలేని ప్రాక్టీషనర్ ప్రిస్క్రిప్షన్ను పరిశీలిస్తే, శిశువుకు యాంటీబయాటిక్ ఇంజెక్షన్ మెరోపెనెమ్ రాయడం చూసి అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. సహజంగా శిశువులకు ఉపయోగించే యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు పెద్దలకు ఉప యోగించేవి కాకుండా ప్రత్యేకంగా ఉంటాయి. పెద్ద లకు వాడే ఇంజెక్షన్లు శిశువుకు ప్రాణాంతకంగా మారతాయి. మలక్పేటలోని ఆ నకిలీ డాక్టర్ మాది రిగానే చాలామంది నకిలీ డాక్టర్లు మానసిక ఔష ధాల ప్రిస్క్రిప్షన్లోనూ ఇష్టారాజ్యంగా మందులు రాస్తున్నారని తేలింది. ఈ నేపథ్యంలో నకిలీ డిగ్రీని ప్రదర్శించడం, అర్హత లేకున్నా ప్రిస్క్రిప్షన్లు రాయ డం వంటి దృష్టాంతాలను మండలి తీవ్రంగా తీసు కుంది. మరోవైపు అడ్డగోలుగా అల్లోపతి మందు లను సూచిస్తున్న ఇద్దరు నకిలీ ఆయుష్ వైద్యులను గుర్తించి వారిపై ఆయుష్ శాఖకు లేఖ రాసింది. ఇక నకిలీ వైద్యుల ఆగడాలకు అడ్డుకట్ట వేసే క్రమంలో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) సాయాన్ని కూడా తీసుకోవాలని మండలి నిర్ణయించింది. నకిలీ ప్రైవేట్ ప్రాక్టీషనర్ల ద్వారా రోగులకు మందులు అందకుండా చేయాలని నిర్ణయించింది. -
నిరుద్యోగ యువత ఆకాంక్ష నెరవేరేనా!
తెలంగాణ ఉద్యమం ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ ప్రధాన అంశాలుగా ప్రారంభమైంది. విద్యార్థులు ఈ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. సుమారు 1,200 మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం కోసం తమ జీవితాలను అర్పించారు. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమీప భవిష్యత్తులో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉండదనీ, నూతన రాష్ట్రంలో తమ కలలు సాకారం అవుతాయనీ భావించిన నిరుద్యోగులు ఆశించారు. కానీ వారి ఆశలు ఆడియాసలయ్యాయి. మొదటి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా ఉద్యోగ నియామకాల ఊసు లేకపోవడంతో 2015లో నిరుద్యోగ జేఏసీని ఏర్పాటు చేసి ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకటీ అరా ఉద్యోగ ప్రకటనలు వచ్చినా అనేక మంది ఉద్యమకారులకు పరీక్షలకు హాజరవ్వడానికి వయసు మీరిపోయింది. అర్హత ఉన్న చాలా మంది సీనియర్లకు నవ యువకులతో పోటీపడే శక్తి లేకుండా పోయింది. అదే సమయంలో ఉద్యోగ నియామకా లపై కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఇంతలో కొత్త ప్రభుత్వం మొదటి టెర్మ్ ముగిసిపోయింది. 2018లో మళ్లీ ఎన్నికలు వచ్చాయి. అంతకు ముందు అధికారంలో ఉన్న పార్టీయే మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఈసారన్నా తమకు ఉద్యోగాలొస్తాయని నిరుద్యోగులు భావించారు. ఇంతలో కరోనా విజృంభించింది. దాని కోరల నుంచి బయటపడి గ్రూప్ వన్ పరీక్షకు ప్రిపేర్ అయిన నిరుద్యోగులను పేపర్ లీకేజ్ వ్యవహారం కుంగదీసింది. అప్పటినుంచి నిరు ద్యోగులు చదవడం మానేసి తమకు జరిగిన అన్యా యాన్ని గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలు పెట్టారు. ప్రభుత్వం నిరుద్యోగులకు భరోసా కల్పించడంలో విఫలమైంది. అదే సమయంలో ఉద్యోగం రాలేదని బాధతో ప్రాణ త్యాగం చేసినటువంటి ఒక విద్యార్థిని కూడా అవహేళన చేసే విధంగా మాట్లాడారు అధికారంలో ఉన్నవారు. అటువంటి అహంకార ధోరణిని నిరుద్యోగులు జీర్ణించుకోలేక పోయారు. అప్పటివరకు రాజకీయ ప్రక్రియలో చురుకుగా పాల్గొనని నిరుద్యోగ యువతీ యువకులు ఒక్కసారిగా రాజకీయాలను మార్పు చేయాలనీ, తమ తలరాతను తామే మార్చుకోవాలనీ భావించి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సాధారణ ఎన్ని కల్లో ప్రభావాన్ని చూపించారు. 2023 జూన్ కంటే ముందు తెలంగాణలో వేరే పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితే లేదు. ఎందుకంటే బలమైన ప్రతిపక్షం లేదు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే నాయకులను మనం వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. అటువంటి పరిస్థితులలో గ్రూప్ వన్ పేపర్ లీకేజీ అంశం ప్రతిపక్ష పార్టీలకు ప్రధానఅస్త్రంగా మారింది. అప్పటినుంచి రాష్ట్రంలో రాజ కీయ సమీకరణలు మారినాయి. అన్ని పార్టీలు నిరు ద్యోగ సమస్యని తమ ప్రధాన ఎజెండాగా కార్యా చరణ రూపొందించడం ప్రారంభించాయి. ఈ నిరు ద్యోగ ఉద్యోగ సమస్యలు ఈనాడు కాంగ్రెస్ ప్రభు త్వాన్ని అధికారంలోకి తీసుకొని వచ్చాయి అనడంలో అతిశయోక్తి కాదు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమ యంలో అధికార పార్టీ చాలా అంశాలను ప్రస్తావించింది కాని, నిరుద్యోగులకూ, ఉద్యోగులకూ భరోసా కల్పించే విధంగా ఏ వాగ్దానాలు చేయలేదు. అందు వలన ఎక్కడెక్కడో చదువుకొనే చాలామంది నిరు ద్యోగులూ, చిరుద్యోగులూ తమ తమ గ్రామాలకు వెళ్లి ఆ గ్రామాలలో ఉన్నటువంటి మిగతా వర్గాల వారికీ, ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వారికీ... తమ వాదాన్నీ, బాధనూ అర్థమయ్యేలా చెప్పు కున్నారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేయమని అర్థించారు. నిరుద్యోగుల సమస్యలను ప్రజానీకానికి తెలి యచేయడానికి శిరీష అలియాస్ బర్రెలక్క ఎన్నికల్లో పోటీ చేయడం తెలిసిందే. ఒక సాధారణ వెనుక బడిన తరగతికి చెందిన యువతికి సపోర్ట్ చేయడా నికి విదేశాల నుంచి కూడా కొందరు రావడం, మన రాష్ట్రంలోని చాలామంది ప్రముఖులు ఆమెకు మద్దతు ప్రకటించడం మనం గమనించాం. నిరు ద్యోగ సమస్య ఎజెండాగా తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి హేమాహేమీ నాయకులకు చెమటలు పట్టించిందామె. కాబట్టి పార్టీలు ఈ అంశాన్ని ఒక గుణపాఠంగా భావించవలసిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇవ్వడం, జాబ్ క్యాలెండర్లు ప్రకటిస్తామని భరోసా కల్పించడంతో నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి కాంగ్రెస్ పార్టీని సంపూర్ణ మెజారిటీతో గెలిపించారు. పార్టీలో గెలిచినటువంటి 64 మంది అభ్యర్థుల మెజారిటీని మనం గమనిస్తే ఎక్కువమంది సుమారు 20 వేల నుంచి 65 వేల మధ్య మెజారిటీ సాధించినవారే కనిపిస్తారు. ఇందుకు కారణం నిరుద్యోగ యువతే అని చెప్పవచ్చు. నూతన ప్రభుత్వమైనా విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలను పరిష్కరించి వారి బంగారు భవిష్యత్తుకు బాట వేస్తుందని ఆశిద్దాం. -వ్యాసకర్త రాజనీతి శాస్త్ర ఉపన్యాసకుడు మొబైల్: 99514 50009 - డా‘‘ ఎ. శంకర్ -
తెలంగాణలో మరోసారి తెరపైకి నియోజకవర్గాల పునర్విభజన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జిల్లాలను పునర్విభజన చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల ప్రకటించడంతో పాటు ఆ దిశగా కసరత్తు కూడా ప్రారంభమైన నేపథ్యంలో జీహెచ్ఎంసీ జోన్లు, సర్కిళ్లలోనూ మార్పు చేర్పులు ఉంటాయా? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జీహెచ్ఎంసీలో గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఐదు జోన్లు (ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్) ఉండేవి. వాటిలో 18 సర్కిళ్లు ఉండేవి. 18 సర్కిళ్లను తొలుత 24 సర్కిళ్లుగా మార్చారు. తర్వాత వాటిని 30 సర్కిళ్లుగా చేశారు. ఐదు జోన్లను ఆరు జోన్లుగా మార్చారు. ఆరు జోన్లకు చార్మినార్, ఎల్బీనగర్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, సికింద్రాబాద్ జోన్లుగా పేర్లు పెట్టారు. 12 జోన్లు.. 48 సర్కిళ్లు.. పరిపాలన సౌలభ్యం కోసమంటూ గత ప్రభుత్వం జిల్లాల సంఖ్యను పెంచినట్లే జీహెచ్ఎంసీ జోన్లను సైతం 12 జోన్లుగా చేయాలని.. ఒక్కో జోన్లో నాలుగు సర్కిళ్ల వంతున 48 సర్కిళ్లను ఏర్పాటు చేయాలని భావించింది. ఆమేరకు జీఓ కూడా వెలువడింది. కానీ.. ఎందుకనో అది కార్యరూపం దాల్చలేదు. జోన్లను పదికి, సర్కిళ్లను యాభైకి పెంచాలని 2018లో స్టాండింగ్ కమిటీ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించగా, 12 జోన్లు.. 48 సర్కిళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం జీఓ వెలువరించింది. కానీ అంతకుముందే ఏర్పాటైన ఆరు జోన్లే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం జిల్లాల పునరి్వభజన తెరపైకి రావడంతో జీహెచ్ఎంసీలోనూ జోన్లు, సర్కిళ్లు మారతాయా అనేది జీహెచ్ఎంసీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికీ ప్రస్తుతమున్న సర్కిళ్లు, జోన్లలో సమస్యలున్నాయి. ఖైరతాబాద్ జోన్ షేక్పేట దాకా విస్తరించి ఉంది. శేరిలింగంపల్లి ఒకే జిల్లా పరిధిలో లేదు. ఇలా వివిధ అంశాల్లో వ్యత్యాసాలున్నాయి. గతంలో ఇలా.. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా వాటిని 12 జోన్ల పరిధిలోకి తేవాలని భావించారు. ఒక్కో జోన్లో రెండు నియోజకవర్గాలు, నాలుగు సర్కిళ్లు ఉండేలా పునర్వ్యవస్థీకరించాల్సిందిగా జీవో జారీ చేశారు. ఆమేరకు కమిషనర్ను ఆదేశించారు. కానీ ఏర్పాటు కాలేదు. ప్రస్తుతం జీహెచ్ఎంసీలోనూ మార్పుచేర్పులు జరగవచ్చననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్ బాధ్యతలు కమిషనర్కు.. జీహెచ్ఎంసీ పరిధిలో నాలుగు జిల్లాలున్నాయి. అన్ని జిల్లాల్లో ఎన్నికల నిర్వహణ కలెక్టర్లది కాగా హైదరాబాద్ జిల్లాది మాత్రం కమిషనర్కు అప్పగించారు. దీంతో ఎన్నికలొచ్చినా ప్రతిసారీ జీహెచ్ఎంసీలో పనులు నిలిచిపోతున్నాయి. కోటిమందికి పైగా సేవలందించే జీహెచ్ఎంసీ కమిషనర్కు జిల్లా ఎన్నికల అధికారి బాధ్యతలున్నాయి. గ్రేటర్ పరిధిలోనే ఉన్న ఒక జిల్లాలో ఐదు నియోజకవర్గాలుంటే, ఒక జిల్లాలో 15 నియోజకవర్గాలున్నాయి. ఒక ఎమ్మెల్యే పరిధిలో తక్కువ వార్డులుంటే.. మరో ఎమ్మెల్యే పరిధిలో ఎక్కువ వార్డులున్నాయి. ఇలా వివిధ అంశాల్లో వ్యత్యాసాలున్నాయి. దీంతో నియోజకవర్గాలతో పాటే జీహెచ్ఎంసీ జోన్లు, సర్కిళ్లు, వార్డుల్లోనూ మార్పుచేర్పులుంటాయా ? అనేది చర్చనీయాంశంగా మారింది. -
18న ములుగులో సభ.. 19న భూపాలపల్లిలో పాదయాత్ర
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ తెలంగాణలో మూడు రోజుల పర్యటన ఖరారైంది. ఈనెల 18న కాంగ్రెస్ బస్సుయాత్రను ప్రారంభించేందుకు రానున్న ఆయన మూడు రోజులపాటు ఇక్కడే ఉండనున్నారు. ముందుగా కొండగట్టు నుంచి బస్సుయాత్రను ప్రారంభించాలని భావించినా, రాహుల్ షెడ్యూల్లో కొంత మార్పు జరిగింది. దీని ప్రకారం రామప్ప ఆలయం వద్ద రాహుల్ కాంగ్రెస్ బస్సుయాత్రను ప్రారంభిస్తారు. ఏఐసీసీ వర్గాలు వెల్లడించిన ఈ షెడ్యూల్ ప్రకారం 18, 19, 20 తేదీల్లో ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో రాహుల్ బస్సుయాత్రలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పాదయాత్రలు చేయనున్న ఆయన పలువురు కారి్మకులు, ఇతర వర్గాలతో సమావేశం కానున్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని సందర్శించనున్నారు. ములుగు, పెద్దపల్లి, ఆర్మూర్ బహిరంగ సభల్లో పాల్గొంటారు. మూడు దశల్లో బస్సు యాత్ర ప్రతి రోజు మూడు నియోజకవర్గాల చొప్పున 12 రోజులపాటు రాష్ట్రంలోని 36 నియోజకవర్గాల్లో బస్సుయాత్ర నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా తొలి విడతలో రాహుల్ మూడు రోజులపాటు 8 నియోజకవర్గాల్లో యాత్ర నిర్వహించనున్నారు. మూడు రోజుల పర్యటనతో తొలి విడత యాత్ర ముగియనుండగా, దసరా తర్వాత రెండో విడత ప్రారంభించనున్నారు. ఆ సమయంలో ప్రియాంకా గాంధీ హాజరయ్యే అవకాశముంది. ఇక, నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిశాక మూడో విడత నిర్వహించాలని, ఈ యాత్రకు సోనియాతో సహా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యేలా టీపీసీసీ ప్రణాళిక రూపొందిస్తోంది. -
మూడోసారి.. మూడో తేదీ... ముక్కోణం!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత మూడోసారి జరుగుతున్న ఎన్నికల ఫలితాలు మూడో తేదీనే రావడం.. అందునా ఈసారి ముక్కోణపు పోరు జరుగుతుండటం ‘ప్రత్యేకత’ను సంతరించుకుంటోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పటి నుంచి చూసినా ముక్కోణ పోటీలు మనకు తక్కువే. 1978, 2009లలో మినహా మూడు పార్టీల మధ్య ఎన్నికల పోరాటం జరగలేదు. కాంగ్రెస్–జనతా పార్టీ, కాంగ్రెస్–కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్–తెలుగుదేశం పార్టీల మధ్యనే ఎన్నికల్లో పోటీ ఉండేది. అప్పుడో పార్టీ, ఇప్పుడో పార్టీ పోటీలోకి వచ్చినా ద్విముఖ పోటీలో చొరబడేంత స్థాయిలో ప్రభావం చూపకపోయేది. 1978లో మాత్రం ఇందిరా కాంగ్రెస్, రెడ్డి కాంగ్రెస్, జనతా పార్టీల మధ్య హోరాహోరీగా ముక్కోణపు పోటీ జరిగింది. నిరుపేద వర్గాలు అండగా నిలవడంతో ఆ ఎన్నికల్లో ఇందిరమ్మ పార్టీ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇక 2009లో ప్రజారాజ్యం పార్టీ మూడో పక్షంగా నిలబడి 18 శాతం ఓట్లను తెచ్చుకున్నది. తెలంగాణ ప్రాంతంలో అయితే అంతకంటే తక్కువే వచ్చాయి. సరిగ్గా అలాంటి ముక్కోణం పోటీ మళ్లీ ఇప్పుడు జరగబోతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ప్రజల ‘మూడ్’ ఏమిటో? ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల నడుమ ఆసక్తికర పోటీ జరగనుంది. గత రెండు ఎన్నికల్లోనూ గట్టిగానే తలపడిన బీఆర్ఎస్, కాంగ్రెస్లకు తోడు ఈసారి బీజేపీ వచ్చిచేరింది. ఇప్పటికే పదేళ్లు అధికారంలో ఉన్నందున బీఆర్ఎస్పై ప్రజావ్యతిరేకత ఉందనేది ఒక అభిప్రాయం. అయితే ప్రభుత్వాన్ని ఓడించి తీరాలన్నంత వ్యతిరేకత మాత్రం కనిపించడం లేదన్నది క్షేత్రస్థాయి అంచనా. ఐదేళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, కేసీఆర్ నాయకత్వం, రేసు గుర్రాల్లాంటి కేటీఆర్, హరీశ్రావుల ప్రచార తోడ్పాటు వెరసి ముచ్చటగా మూడోసారీ తామే అధికారంలోకి వస్తామని గులాబీ దళం గట్టిగా నమ్ముతోంది. ఇక కాంగ్రెస్ బలం పుంజుకుంటున్నట్లు కొందరు పరిశీలకులు అంచనా వేస్తుండగా ఆ పార్టీలోని వర్గ విభేదాలు, ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన చరిత్ర, కేసీఆర్కు దీటైన నేత లేకపోవడం బలహీనతలుగా కనిపిస్తున్నాయి. కానీ బీఆర్ఎస్పై వ్యతిరేకత ఉపయోగçపడుతుందని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా తమకు ఈసారి ప్రజలు పట్టం కడతారనే విశ్వాసంతో ముందుకెళుతున్నారు. ‘మూడో’పార్టీనే కీలకమా? కొంతకాలం కింద బలపడినట్లు కనిపించిన బీజేపీ ఇప్పుడు బలహీనపడిందని, ప్రధాన పోటీదారు కాకపోవచ్చని సర్వే రాయుళ్లు చెబుతున్నారు. కానీ సంచలనాలకు మారుపేరైన బీజేపీ... తెలంగాణలో ఒక ‘ప్రత్యేక’వ్యూహంతో 35 స్థానాలపై బలంగా గురిపెట్టబోతున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక పోషించే లక్ష్యంతో ఆ పార్టీ పావులు కదుపుతోంది. కమలనాథుల ప్రయత్నాలు సఫలమైతే కచ్చితంగా త్రిశంకు సభ (హంగ్) ఏర్పడుతుంది. అప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వరుసగా మూడు స్థానాల్లో ఉండవచ్చు. ఈ పరిస్థితి తెలంగాణలో ఆసక్తికర రాజకీయాలకు తెరతీయవచ్చు. కానీ చారిత్రకంగా స్పష్టమైన తీర్పులనే ఇచ్చే సంప్రదాయం తెలుగు ప్రజలకున్నది. ఈ నేపథ్యంలో ఈ మూడు పార్టీల్లో ప్రజలు ఎవరివైపు మొగ్గు చూపుతున్నారది ఇప్పుడు మిలియన్ డాలర్ల క్వశ్చన్. ఈ మూడు పార్టీలు పోను ఉభయ కమ్యూనిస్టులు, టీజేఎస్, వైఎస్సార్టీపీ, బీఎస్పీ లాంటి పార్టీలు తెచ్చుకొనే ఓట్లు చాలా తక్కువ చోట్ల అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయొచ్చని అంచనా. నంబర్ గేమ్ను కొంచెం అటుఇటుగా మార్చవచ్చనే అంచనాలున్నా ఫైనల్గా బీజేపీ సాధించే ఓట్లు, సీట్లు ఎన్నికల తుది ఫలితాలను శాసించవచ్చన్నది రాజకీయ వర్గాల అభిప్రాయంగా కనిపిస్తోంది. ఇందిరా.. ఎన్టీఆర్.. మీటింగ్ల మిద్దె.. ఈ ఇంటిని చూశారా! సూర్యాపేట జిల్లా కోదాడ నయానగర్లోని వెంకట్రామయ్య నివాసం ఇది. పాతతరం నాయకులందరికీ సుపరిచితమైన ఇల్లు. పట్టణ నడి»ొడ్డున ఉన్న ఈ ఇంటి పరిసరాలన్నీ ఆ సమయంలో వ్యవసాయ భూములుగా ఉండేవి. 1980 ప్రాంతంలో కోదాడలో ఏ పార్టీ మీటింగ్ జరిగినా సభావేదికగా ఈ ఇంటినే ఎంచుకునేవారు. ఎన్టీ రామారావు 1982లో తొలిసారి కోదాడకు వచ్చినప్పుడు ఈ ఇంటి మీద నుంచే ప్రసంగించారు. ఆ తర్వాత నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన చింతా చంద్రారెడ్డి.. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాందీతో మీటింగ్ ఏర్పాటు చేయగా ఆమె కూడా ఇక్కడి నుంచే మాట్లాడారు. మాజీ ఉపప్రధాని దేవీలాల్ ఈ ఇంటినే వేదికగా చేసుకుని మీటింగ్లలో పాల్గొన్నారు. – కోదాడ గాసిప్టైమ్ తండ్రి కోసం కొడుకు త్యాగం కొడుకు భవిష్యత్తు కోసం తండ్రి త్యాగం చేయడం కామన్... కానీ ఈసారి రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో తండ్రి కోసం కొడుకు త్యాగం చేయాల్సి వస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా రాజకీయాలు చేసే ఓ మాజీ ఎంపీ ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలనుకున్నారు. రాజధాని నడి»ొడ్డున ఉండే ఓ నియోజకవర్గాన్ని కూడా ఎంచుకున్నారు. అయితే, అక్కడ గత ఎన్నికల్లో ఆ మాజీ ఎంపీ కుమారుడు పోటీ చేశారు. ఇప్పుడు ఆ టికెట్ కోసమే తండ్రి, కొడుకులు దరఖాస్తు చేసుకున్నారు కూడా. అయితే, ఇద్దరిలో ఎవరికి అన్నప్పుడు పాపం కొడుకే తండ్రి కోసం త్యాగం చేసేందుకు సిద్ధమయ్యాడట. నువ్వు పోటీ చేస్తే నేనొద్దంటానా? అని తాను పోటీ నుంచి తప్పుకున్నాడంట. తండ్రి కోసం కొడుకు త్యాగం వృ««థా కాబోదనే అంచనాతోనే ఆయన పోటీ నుంచి విరమించుకున్నాడనే చర్చ జరుగుతోంది. తండ్రి గెలిచి పుసుక్కున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బలహీన వర్గాల కోటాలో తండ్రి మంత్రి అవుతాడనే నమ్మకంతోనే ఆయన విరమించుకున్నాడని, భవిష్యత్తు మీద గట్టి అంచనాతోనే స్వామికార్యం స్వకార్యం నెరవేర్చుకుంటున్నాడని గాం«దీభవన్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. బంగారు కడియాలు తెచ్చా.. సార్ అసెంబ్లీ టికెట్ అంటే ఈ సీజన్లో మామూలు ముచ్చట కాదు. టికెట్ వస్తే చాలు... అది కూడా ప్రధాన పార్టీ టికెట్ అంటే హాట్ కేకే. టికెట్ వచ్చిందంటేనే సగం ఎమ్మెల్యే అయినంత హ్యాపీ. మరి ఆ టికెట్ ఇచ్చేవాళ్లను ఏదో రకంగా ప్రసన్నం చేసుకోవాలనుకునే వారు లేకుండా ఉంటారా? అలాంటి వారుంటేనే కదా టికెట్ల కేటాయింపు సీజన్లో మాల్మసాలా వార్తలు బయటకు వచ్చేది. ఏం జరిగినా జరగకపోయినా రాజకీయ నాయకులు తమ మీద పడిన బురద కడుక్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ప్రసన్నం చేసుకునే పాట్లలోనే ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మహిళా కాంగ్రెస్ ఆశావహురాలు కంగు తిన్నారట. తనకు టికెట్ కచ్చితంగా వస్తుందన్న అంచనాతోనే విదేశాల నుంచి తెచ్చిన రెండు బంగారు కడియాలను ఢిల్లీలోని ఓ పెద్ద నాయకుడికి ఇవ్వబోయారట. ఇదేంటమ్మా.. అంటే ‘ఏదో నా తృప్తి సార్.. ఫలానా ఆయనకు ఇచ్చా.. ఇంకో ఆయనకు కూడా ఇచ్చాను’అంటూ ఇద్దరి ముగ్గురి పేర్లు చెప్పిందంట. అంతా విన్న ఆ ఢిల్లీ పెద్ద నాయకుడు ‘ఇలాంటివి పెట్టుకోకమ్మా... నీ ‘బంగారు’భవిష్యత్తుకు దెబ్బ పడుతుంది’అని చెప్పి పంపించేశాడట. మూడు సీట్ల ‘మహరాజ్’! వామపక్షాలతో పొత్తు ఓ నాయకుడికి అరుదైన ఖ్యాతిని తెచ్చిపెట్టబోతోందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. వామపక్షాలు, కాంగ్రెస్ పొత్తు ఖరారైతే రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఓ నియోజకవర్గాన్ని పెద్ద కమ్యూనిస్టు పార్టీకి ఇవ్వాల్సి వస్తుందని, అప్పుడు అక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేను పక్కనే ఉన్న మరో చోటకు పంపిస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అలా పంపిస్తే మాత్రం ఆయన ‘మూడు సీట్ల మహరాజ్’అనే కీర్తిని మూటగట్టుకోబోతున్నారనే టాక్ కూడా నడుస్తోంది. గతంలోనే పొరుగు జిల్లా నుంచి ప్రస్తుతమున్న సీట్లోకి వచ్చిన ఆయన ఇప్పుడు పొత్తు ముచ్చటలో మళ్లీ పక్కకు జరుగుతారని, అలా జరిగితే మాత్రం రికార్డేనని అంటున్నారు. గతంలో రెండు చోట్ల గెలిచిన ఆయన ఇక్కడ కూడా గెలిస్తే ఒకే పార్టీ తరఫున మూడు చోట్ల చట్టసభలకు ఎన్నికైన నేతగా జాతీయ స్థాయి గుర్తింపు దక్కించుకున్నా ఆశ్చర్యం లేదని గాం«దీభవన్లో టాక్. మరి ఏమవుతుందో... ఆ మూడు సీట్ల మహరాజ్కు విజయమో... ‘వీర’ని్రష్కమణమో... చూద్దాం.! ఈ నెలాఖరు వరకు ఓటరు నమోదుకు అవకాశం ‘‘దేవాన్ష్ కు అక్టోబరు 15వ తేదీతో 18 ఏళ్లు నిండుతాయి. కానీ, ఓటు నమోదు ప్రక్రియ సెపె్టంబరులోనే ముగిసింది. దీంతో అతను ఓటేయాలంటే మరో ఐదేళ్లు ఆగాల్సిందేనా? అంటే అవసరం లేదని అంటోంది ఎన్నికల సంఘం.’’సెపె్టంబరులో ఓటు దరఖాస్తు చేసుకోలేని వారందరికీ ఇంకా నమోదుకు అవకాశం ఉందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో నవంబర్ 30న శాసనసభ ఎన్నికలు జరగనుండగా ఓటరు నమోదుకు అక్టోబరు 31వరకు మరో అవకాశం చేసుకునే వెసులుబాటు కల్పించింది. తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఓటరుగా నమోదు కావాలనుకునేవారు తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫారం–6 తీసుకుని అందులో వివరాలను పొందుపరిచి అక్కడే కార్యాలయంలో సమర్పించాలి. ఆధార్ కార్డు, ఇంటి చిరునామాను సూచించే కరెంట్ బిల్లు, ఇతరత్రా ఏదేనీ ఆధారాన్ని జత చేయాల్సి ఉంటుంది. బీఎల్వోలు క్షేత్రస్థాయిలో విచారించి ఓటరుగా నమోదు చేస్తారు. ఓటరు నమోదుకు వివిధ మార్గాలు క్యాంపెయిన్కు వెళ్లలేనివారు అరచేతిలోనే ఓటరుగా నమోదు కావచ్చు.http:///voters.eci.gov.in (హెచ్టీటీపీ://వీవోటీఈఆర్ఎస్.ఈసీఐ.జీవోవీ.ఐఎన్) వెబ్సైట్లోకి వెళ్లాలి. సర్వీస్ పోర్టల్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. అందులో మొబైల్ నంబర్తో సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం లాగిన్ అవ్వాలి. ఆన్లైన్లో కొత్త ఓటుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. యాప్తో కూడా బీఎల్వో వద్దకు వెళ్లలేని వారు.. వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోలేని పరిస్థితుల్లో మీ వద్ద ఉన్న మొబైల్లో ఓటర్ హెల్ప్లైన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. దానిపై క్లిక్ చేయగానే పోర్టల్ ఓపెన్ అవుతుంది. కొత్తగా ఓటు నమోదు చేసుకోవచ్చు. జాబితాలో పేరుందా.. లేదా చూసుకునే అవకాశం కూడా కల్పించారు. – సాక్షిప్రతినిధి, కరీంనగర్ -
1న మోదీ షెడ్యూల్ ఖరారు
సాక్షి, హైదరాబాద్: వచ్చేనెల 1న (అక్టోబర్) ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆదివారం మధ్యాహ్నం 11.20 గంటలకు ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి ఐఏఎఫ్ ప్రత్యేక విమానంలో బయల్దేరి మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడికి దగ్గరలోనే ఉన్న ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్, రైల్వే, ఇతర శాఖల అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్ట్లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు బేగంపేట నుంచి ఎంఐ–17 ప్రత్యేక హెలీకాప్టర్లో బయల్దేరి మధ్యాహ్నం 3.05 గంటలకు మహబూబ్నగర్కు చేరుకుంటారు. మహబూబ్నగర్ శివార్లలోని భూత్పూర్లో మధ్యాహ్నం 3.15 నుంచి 4.15 గంటల వరకు జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు మహబూబ్నగర్ హెలీపాడ్ నుంచి హెలీకాప్టర్లో 5.05 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి 5.10 గంటలకు ఐఏఎఫ్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు పయనమవుతారు. 3న మరోసారి రాష్ట్రానికి మోదీ అక్టోబర్ 3న ప్రధాని మోదీ మరోసారి రాష్ట్రానికి రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నిజామాబాద్లో రోడ్షో, బహిరంగసభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పసుపుబోర్డుకు సంబంధించిన ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించడంతోపాటు, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. -
రాష్ట్రంలో ‘సింటెక్స్’ పెట్టుబడి రూ.350 కోట్లు
సాక్షి, హైదరాబాద్: వెల్స్పన్ గ్రూపు కంపెనీల్లో భాగస్వామిగా ఉన్న ‘సింటెక్స్’ హైదరాబాద్లో రూ.350 కోట్ల పెట్టుబడితో తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. వాటర్ ట్యాంకులు, ప్లాస్టిక్ పైపులు, ఆటో కాంపొనెంట్స్, ఇతర పరికరాలను తయారుచేసే ఈ యూనిట్ ద్వారా వేయి మందికి ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. వెల్స్పన్ ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న చందన్వెల్లిలోనే సింటెక్స్ తయారీ యూనిట్ ఏర్పాటవుతుంది. ఈ నెల 28న జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్రఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీ రామారావుతో పాటు వెల్స్పన్ కంపెనీ చైర్మన్ బీకే గోయెంకా హాజరవుతారు. కాగా, ఇప్పటికే తెలంగాణలో భారీగా పెట్టుబడులతో కార్యకలాపాలు నిర్వహిసున్న వెల్స్పన్ గ్రూప్ రాష్ట్రంలో మరింత విస్తరించనుండటం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో అందుబాటులోని మౌలిక వసతుల వలన అనేక నూతన పెట్టుబడులు రాష్ట్రానికి తరలివస్తున్నాయని కేటీఆర్ అన్నారు. -
ఆస్పత్రి నుంచి అమ్మ ఒడికి..
సైదాబాద్: కుమార్తె వైద్యానికైన బిల్లు కట్టలేక.. ఆస్పత్రిలో వదిలేసి వచ్చిన తల్లిదండ్రుల చెంతకు ఆ చిన్నారి ఎట్టకేలకు చేరింది. తెలంగాణ స్టేట్ లీగల్ సెల్ అథారిటీ జడ్జి చొరవతో కథ సుఖాంతమైంది. ప్రేమ వివాహం చేసుకుని సింగరేణి కాలనీలో నివసిస్తున్న నితిన్, ప్రవల్లిక దంపతులకు ఈనెల7న పాప పుట్టింది. తీవ్ర అస్వస్థతకు గురైన పాప మెరుగైన వైద్యం కోసం వారు పిసల్బండలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఆరు రోజుల చికిత్సకు రూ.లక్షా16వేల బిల్లు అయింది. వారి వద్ద కేవలం రూ.30 వేలు మాత్రమే ఉండటంతో దిక్కుతోచక పాపను ఆస్పత్రిలో వదిలేసి వచ్చేశారు. వారి నిస్సహాయస్థితిపై సాక్షి దినపత్రికలో బుధవారం ‘బిల్లు కట్టలేక బిడ్డను ఆసుపత్రిలో వదిలేశారు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దాంతో పలువురు దాతలు వారిని సంప్రదించి తోచిన సహాయం చేశారు. సాక్షి కథనంపై స్పందించిన తెలంగాణ స్టేట్ లీగల్ సెల్ అథారిటీ జడ్జి కళార్చన, గోవర్ధన్రెడ్డి గురువారం ఆస్పత్రికి చేరుకున్నారు. యాజమాన్యంతో మాట్లాడి అదే రాత్రి చిన్నారిని డిశ్చార్జి చేయించారు. తమ పరిస్థితిని వెల్లడిస్తూ కథనం ప్రచురించిన సాక్షి దినపత్రికకు, తెలంగాణ లీగల్ సెల్ అథారిటీ అధికారులకు చిన్నారి తల్లిదండ్రులు నితిన్, ప్రవల్లికలు కృతజ్ఞతలు తెలిపారు. -
సినిమాల్లోని సీన్ల పైనా నజర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (టీఎస్–నాబ్) అధికారులు మాదాపూర్లోని విఠల్నగర్లో ఉన్న ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో గత నెల 31న జరిగిన ఓ డ్రగ్ పార్టీపై దాడి చేశారు. ఆ ఫ్లాట్లో కనిపించిన సీన్... ఇటీవల విడుదలైన ‘బేబీ’ సినిమాలోని సీన్లకు మధ్య సారూప్యత ఉందని హైదరాబాద్ పోలీసు కమిషనర్, టీఎస్ నాబ్ డైరెక్టర్ సీవీ ఆనంద్ అన్నారు. మాదకద్రవ్యాల వినియోగాన్ని ప్రేరేపించేలా ఉన్న ఆ సన్నివేశాలకు సంబంధించి చిత్ర యూనిట్కు నోటీసులు ఇచ్చామని, వారు తమ ఎదుట హాజరై వివరణ ఇచ్చారని గురువారం చెప్పారు. అందులో ఉన్న సీన్లపై తాము చెప్పిన తర్వాతే సినిమాలో వార్నింగ్ నోట్ పెట్టారని, అప్పటివరకు అలాంటిది కూడా లేదని అన్నారు. ఇలాంటి అభ్యంతరకరమైన సన్నివేశాలను సినిమాల్లో పెట్టవద్దని ఆనంద్ హితవు పలికారు. వీటి ద్వారా స్ఫూర్తి పొంది అనేక మంది యువకులు మాదకద్రవ్యాలకు బానిసలుగా మారే ప్రమాదం ఉందన్నారు. గతంలోనూ ఇలాంటి సీన్లతో కూడిన సినిమాలు వచ్చాయని, అయితే వాటిని ఎవరూ పట్టించుకోలేదని చెప్పిన ఆనంద్.. ఇకపై ఈ తరహాలో ఉన్న వాటిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘టాలీవుడ్ లింకులు ఉన్న డ్రగ్స్ కేసు’లో పరారీలో ఉన్న సూర్య.. స్నాట్ అనే పేరుతో పబ్ నిర్వహిస్తున్నాడని, కొకైన్ వంటి మాదకద్రవ్యాలను స్నాటింగ్ ప్రక్రియ ద్వారా వినియోగిస్తారని చెప్పారు. దీన్ని బట్టి సూర్య తన వద్ద మాదకద్రవ్యాలు లభిస్తాయని అర్థం వచ్చేలా తన పబ్కు పేరు పెట్టాడని భావించాల్సి వస్తోందని ఆనంద్ వ్యాఖ్యానించారు. బాలీవుడ్ చిత్రాల్లోనూ డ్రగ్స్ను ప్రేరేపించే సీన్లు లేకుండా చూడాలని, ఉన్న వాటిపై చర్యలు తీసుకోవాలని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోను (ఎన్సీబీ) కోరతామన్నారు. ఎన్సీబీ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 14 కోట్ల మంది డ్రగ్స్ వినియోగదారులు ఉన్నారని, దీన్ని సీరియస్గా తీసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని వివరించారు. తాము ఇటీవల కాలంలో 33 మంది నైజీరియన్లను అరెస్టు చేయగా, వారిలో 18 మంది బెంగళూరులో స్థిరపడిన వారిగా తేలిందన్నారు. టీఎస్ నాబ్ సేవల విస్తరణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని హైకోర్టును కోరతామని చెప్పారు. -
రాష్ట్రంలో మరో రెండ్రోజులు మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం వాయవ్య మధ్యప్రదేశ్ నుంచి, ఈశాన్య రాజస్తాన్పై వరకు, దక్షిణ చత్తీస్గఢ్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 4.5కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఈనెల 12వ తేదీన వాయవ్య బంగాళాఖాతం నుంచి పశ్చిమ, మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం రుతుపవనాల కదలికలు చురుగ్గా ఉండడంతో రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు పలుచోట్ల తేలికపాటి వానలు వరుసగా నమోదవుతాయని తెలిపింది. అదేవిధంగా ఉత్తర ప్రాంత జిల్లాల్లో మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు నమోదవుతాయని అంచనా వేసింది. ఆదివారం రాష్ట్రంలో సగటున 6.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 22శాతం అధికవర్షపాతం నమోదు ప్రస్తుత సీజన్లో రాష్ట్రంలో ఇప్పటివరకు 63.15 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... ఆదివారం సాయంత్రానికి 76.82 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 22శాతం అధికవర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో 22 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు కాగా... 11 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఆదివారం రాష్ట్రంలో అత్యధికంగా సంగారెడ్డి జిల్లా కంగ్టిలో 4.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ప్రస్తుతం రాష్ట్రానికి పశ్చిమ, వాయవ్య దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు బలంగా వీస్తున్నట్లు వాతావరణ శాఖ వివరించింది. -
రాష్ట్ర వైద్య మండలి ఎన్నికలు షురూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్యానికి సంబంధించి అనేక కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్న తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి (టీఎస్ఎమ్సీ) ఎన్నికలను 17 ఏళ్ల తర్వాత తొలిసారిగా నిర్వహించనున్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ వేదికగా ఆదివారం ఈ ఎన్నికల మేనిఫెస్టోను హెచ్ఆర్డీఏ విడుదల చేసింది. అర్హత లేకుండా వైద్యం చేస్తున్న వారిని ప్రత్యేక కమిటీలు వేసి అరకడతామని ఈ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. నూతన భవనం నిర్మించి, తెలంగాణ వైద్యులకు గౌరవం లభించేలా చూస్తామని, వైద్య విద్య ఫీజు నియంత్రణ దిశగా ప్రయత్నాలు చేస్తామని ప్రకటించారు. 48,405మంది డాక్టర్లకు ఓట్లు ప్రస్తుతం 48,405 మంది తెలంగాణ డాక్టర్లు ఈ ఎన్నికల్లో ఓటు వేసే అర్హత కలిగి ఉన్నారు. ఈ ఎన్నికల్లో 13 మంది వైద్యులు వైద్య మండలికి ఎన్నిక కానుండగా, ఇందుకోసం వందకు పైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అభ్యర్థులంతా తమ విధివిధానాలతో సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా నిలబడగా, మరికొందరు ప్యానల్గా ఏర్పడి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికలు పోస్టల్ బాలెట్ ద్వారా జరగనున్నాయి. వచ్చే నెల నుంచి బ్యాలెట్ పేపర్ల పంపిణీ జరగనుండగా, వాటి లెక్క డిసెంబర్ 1న మొదలుకానుంది. కాగా మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో డా.మహేష్కుమార్, డా. ప్రతిభాలక్ష్మీ, డా. కుసుమరాజు రవికుమార్, డా.కిరణ్కుమార్ తోటావర్ తదితరులు పాల్గొన్నారు. -
వానలు మిస్సింగ్!
సాక్షి, హైదరాబాద్: నెల కిందట ఇంట్లోంచి కాలు బయటపెట్టకుండా వానలు.. రాత్రయితే చలిపెట్టేలా గాలులు.. వారం పదిరోజులు కొనసాగిన ఆ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నెల రోజులుగా వానల జాడే లేకుండా పోయింది. ఇదేమైనా ఎండా కాలమా అన్నట్టుగా ఉష్ణోగ్రతలూ నమోదవుతున్నాయి. నిజానికి ఏటా నైరుతి రుతుపవనాల సీజన్లో సంతృప్తికరంగా వానలు పడేది ఆగస్టు నెలలోనే. అలాంటిది ఈసారి భిన్నమైన పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో అడపాదడపా చినుకులు, తేలికపాటి జల్లులు కురిసినా.. ఎక్కడా భారీ వర్షాలు పడలేదు. నెలంతా పొడి వాతావరణంతోనే గడిచింది. ఇదే సమయంలో ఈ నెలలో సగటున 29.5 డిగ్రీలకుపైన గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం, గత నాలుగు దశాబ్దాల్లోనే అత్యధిక వేడి ఆగస్టుగా నిలవడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న తీవ్ర మార్పుల కారణంగా.. ఇలా వానలు ఆగిపోవడం, ఒక్కసారిగా భారీగా కురవడం వంటివి జరుగుతున్నాయని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ఆగస్టులో 63.34శాతం లోటు వర్షపాతం రాష్ట్రంలో ఈసారి నైరుతి సీజన్ తీరును పరిశీలిస్తే.. ఇప్పటివరకు గడిచిన మూడు నెలలకుగాను.. రెండు నెలల్లో అత్యంత లోటు వర్షపాతమే నమోదైంది. నైరుతి రుతుపవనాల రాక జాప్యం, వచ్చినా సరిగా వానలు పడక జూన్ నెలలో తక్కువగా వర్షపాతం నమోదైంది. జూలై నెల రెండో వారం నుంచి వానలు ఊపందుకుని, నెలాఖరులో కుండపోత వర్షాలు పడ్డాయి. ఆ నెలలో ఏకంగా రెండింతలు అధికంగా వర్షపాతం నమోదైంది. తర్వాత ఆగస్టు నెలకు వచ్చేసరికి వానలు జాడే లేకుండా పోయాయి. రుతు పవనాల్లో కదలిక మందగించడంతో నెలంతా పొడి వాతావరణమే ఏర్పడింది. సాధారణంగా ఆగస్టులో సగటున 21.74 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవాల్సి ఉండగా.. కేవలం 7.97 సెంటీమీటర్లే పడింది. అంటే ఏకంగా 63.34శాతం లోటు వర్షపాతం కావడం గమనార్హం. 1901 సంవత్సరం తర్వాత మళ్లీ ఈ ఏడాది ఆగస్టులో అత్యంత తక్కువగా వానలు పడినట్టు భారత వాతావరణ శాఖ కూడా ప్రకటించింది. పొడి వాతావరణం కారణంగా ఉష్ణోగ్రతలు కూడా పెరిగాయి. ఈ నెలలో గరిష్టంగా 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని.. రాష్ట్రవ్యాప్తంగా సగటున 30డిగ్రీల సెల్సియస్గా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ప్రణాళిక శాఖ గణాంకాలు చెప్తున్నాయి. సీజన్ సగటు మాత్రం అధికమే.. మొత్తంగా నైరుతి రుతపవనాల సీజన్ పరిస్థితిని పరిశీలిస్తే.. జూన్ ఒకటో తేదీ నుంచి ఆగస్టు 30వరకు సాధారణంగా 56.69 సెంటీమీటర్ల వర్షం కురవాలి. ఈసారి అంతకన్నా 13శాతం ఎక్కువగా 64.22 సెంటీమీటర్లు కురిసింది. ఇందులో జూన్లో తీవ్ర లోటు ఉండగా.. జూలై చివరినాటికి ఏకంగా 57శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఈ నెలలో వానలు కురవకపోవడంతో అధిక వర్షపాతం 13 శాతానికి పడిపోయింది. నైరుతి సీజన్లో కురవాల్సిన, కురిసిన వర్షపాతం తీరు ఇదీ.. (సెం.మీ.లలో) నెల కురవాల్సింది కురిసినది శాతం జూన్ 12.94 7.26 56.15 జూలై 22.91 48.99 213.86 ఆగస్టు 21.74 7.97 36.66 మండలాల వారీగా వర్షపాతం తీరు.. కేటగిరీ మండలాలు అత్యధికం (60% కంటే ఎక్కువ) 26 అధికం (20–59% ఎక్కువ) 236 సాధారణం (–19% నుంచి +19% వరకు) 293 లోటు (–20% నుంచి –59%) 57 జిల్లాల వారీగా వర్షపాతాన్ని పరిశీలిస్తే... ప్రస్తుత సీజన్లో 14 జిల్లాల్లో అధికంగా, 19 జిల్లాల్లో సాధారణ స్థాయిలో వానలు పడినట్టు అధికారులు చెప్తున్నారు. మండలాల వారీగా పరిశీలిస్తే 26 మండలాల్లో అత్యధిక వర్షపాతం, 236 మండలాల్లో అధిక వర్షపాతం, 293 మండలాల్లో సాధారణ వర్షపాతం, 27 మండలాల్లో లోటు వర్షపాతం ఉంది. జూన్ 1వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మూడు వారాలు వానల్లేక రాష్ట్రంలో డ్రైస్పెల్ నమోదైంది. జూలై తొలి రెండు వారాలు కూడా చాలాచోట్ల పొడి వాతావరణమే ఉంది. ఆగస్టు మొదటి వారం నుంచి మూడో వారం వరకు వరుసగా పొడి వాతావరణంతో డ్రైస్పెల్ నమోదైంది. చివరి వారంలో మాత్రం పలుచోట్ల తేలికపాటి వానలు పడ్డాయి. కొన్నిచోట్ల వాతావరణం కాస్త చల్లబడింది. -
రోబోటిక్స్పై ప్రత్యేక దృష్టి
రాయదుర్గం: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నూతన సాంకేతికత, రోబోటిక్స్పై ప్రత్యేక దృష్టి పెట్టిందని ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్రంజన్ పేర్కొన్నారు. నానక్రాంగూడలోని షరటాన్ హోటల్లో శనివారం రోబోటిక్ గైనకలాజికల్ సర్జరీపై రెండు రోజుల జాతీయ సదస్సును ఆయన అపోలో ఆస్పత్రుల గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలో అన్ని రంగాల్లో అత్యాధునిక సాంకేతికత, పరిజ్ఞాన్ని వినియోగిస్తున్నామన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రోబోటిక్స్ పాలసీని ప్రారంభించామన్నారు. దేశంలోనే నిర్దిష్ట రోబోటిక్ పాలసీని కలిగి ఉన్న మొదటి రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఈ పాలసీలో భాగంగా హెల్త్కేర్, అగ్రికల్చర్, ఇండ్రస్టియల్ ఆటోమేషన్, కన్సూ్మర్ రోబోటిక్స్ అనే నాలుగు వర్టికల్స్పై దృష్టి పెట్టాలని నిర్ణయించామన్నారు. రోబోలను తయారు చేసే కొన్ని ప్రీమియర్ కంపెనీలతో ముందస్తుగా చర్చలు జరుపుతున్నామన్నారు. నిమ్స్లో డావిన్సీ ఎక్స్ఐ 4వ వెర్షన్ సిస్టమ్ను పూర్తి స్థాయిలో అమర్చిన రోబోటిక్ సర్జరీ ల్యాబ్ను అందుబాటులోకి తెచ్చామన్నారు. డాక్టర్ సంగీతారెడ్డి మాట్లాడుతూ అపోలో ఆస్పత్రులలో ఇప్పటి వరకు 12 వేల రోబోటిక్ సర్జరీలు చేశామన్నారు. అందులో డాక్టర్ రుమా సిన్వా స్వయంగా 700 రోబోటిక్ సర్జరీలు చేశారన్నారు. అనంతరం సమావేశం బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏజీఆర్ఎస్ అధ్యక్షురాలు ప్రొఫెసర్ రమాజోíÙ, ఆర్నాల్డ్ పి.అడ్విన్కులా, డాక్టర్ టోనిచల్ హౌబ్, డాక్టర్ జోసెఫ్ పాల్గొన్నారు. -
ఇంటింటా ఇన్నోవేటర్
సాక్షి, సిటీబ్యూరో: అధునాతన సాంకేతికత, వినూత్న ఆవిష్కరణలతో దేశంలోనే అత్యున్నత ఇన్నోవేటివ్ హబ్గా తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తోంది. ఈ ఆవిష్కరణల్లో హైదరాబాద్ నగరం వేదికగానే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని ఇన్నోవేటర్స్ తమవంతు కృషిని కొనసాగిస్తున్నారు. ఈ వినూత్న ప్రయాణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రారంభించిన ‘తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్(టీఎస్ఐసీ), ఐటీఈ–సి’ శాఖలు కీలకంగా పని చేస్తున్నాయి. రాష్ట్రంలో నూతన ఆవిష్కరణల సంస్కృతిని ప్రోత్సహించడానికి ఈ వేదికలు కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా 2019లో టీఎస్ఐసీ ఆధ్వర్యంలో ‘ఇంటింటా ఇన్నోవేటర్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాలో ఉన్నటువంటి ఆవిష్కర్తలను వెలికితీయడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. గ్రామీణ ప్రాంతంలో ఉన్న సమస్యలకు వినూత్న పరిష్కారాలు కనుగోవడమే లక్ష్యంగా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు 700 పైగా ఇన్నోవేటర్స్ తమ విభిన్న ఆవిష్కరణలను ప్రదర్శించారు. ఈ ఏడాది కూడా ‘ఇంటింటా ఇన్నోవేటర్’ కార్యక్రమం కోసం ఆవిష్కర్తల దరఖాస్తులను తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆహా్వనిస్తోంది. ఈ నెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని టీఎస్ఐసీ ప్రకటించింది. ఔత్సాహికులు తమ పేరు, ఆవిష్కరణకు సంబంధించిన ఆరు వాక్యాలు, రెండు నిమిషాల నిడివి ఉన్న వీడియో, నాలుగు ఫొటోలను 9100678543 నెంబర్కు వాట్సాప్ చేయాలని సూచించారు. టీఎస్ఐసీ సహకారం 2020 ఇంటింటా ఇన్నోవేటర్ ప్రదర్శలో భాగంగా విత్తనాలు ఉన్న పేపర్ నాప్కిన్స్ను తయారు చేశాను. ప్రతిరోజు ఇంట్లో ఉండే తడి చెత్తను కంపోస్ట్ పిట్లో పెట్టడంతో దుర్వాసన వచ్చేది. ఆ సమయంలో వచ్చిన ఈ ఆలోచనతో దీనిని తయారు చేశాను. ఈ పేపర్ను మొక్కలకు ఎరువుగా ఉపయోగించవచ్చు. ఇందులో విత్తనాలు కూడా ఉండడంతో కొత్త మొక్కలు వచ్చే అవకాశం ఉంటుంది. దీనిని గుర్తించిన టీఎస్ఐసీ అప్పటినుంచి సహకారం అందిస్తున్నారు. –అరుణ్ జ్యోతి, గృహిణి, నల్గొండ జిల్లా అకుంర దశలోనే ప్రోత్సాహం.. 33 జిల్లాలో ఎంతో మంది ఇన్నోవేటర్స్ ఉన్నారు, వారికీ సరైన సహకారం, దిశానిర్దేశం చేయడానికి ఈ వేదిక రూపొందించబడింది. ఏ ఆవిష్కరణకైనా అకుంర దశ నుంచి ప్రోత్సహించాలి. టీఎస్ఐసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ అధికారులు, భాగస్వాముల సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఆవిష్కర్తలను గుర్తిస్తూ వారి జీవితాల్లో మార్పులు తీసుకువస్తున్నాం. ప్రతీ ఒక్కరూ వినూత్నంగా ఆలోచించాలి, వారి ఆవిష్కరణలతో ‘ఇంటింటా ఇన్నోవేటర్’ కార్యక్రమంలో పాల్గొనాలని ఆశిస్తున్నాం. ఎంపికైనవారికి ఆగష్టు 15 స్వత్రంత దినోత్సవ సంబరాలలో తమ ఆవిష్కరణ ప్రదర్శించే అవకాశం లభిస్తుంది. –డా. శాంతా తౌటం, తెలంగాణ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ -
నీతి ఆయోగ్ చెప్పినా పైసా ఇవ్వలేదు.. కేంద్రంపై కేటీఆర్ గరం గరం
సాక్షి, హైదరాబాద్: కేంద్రంపై మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. నీతి ఆయోగ్ చెప్పినా తెలంగాణ రాష్ట్రానికి మోదీ సర్కార్ నయా పైసా ఇవ్వలేదని దుయ్యబట్టారు. విభజన చట్టంలో పొందుపరిచిన ఏ ఒక్క హామీని కేంద్రం నెరవేర్చలేదని చెప్పుకొచ్చారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఎన్నో అంశాల్లో మద్దతు ఇచ్చామని తెలిపారు. కేంద్రానికి మనం రూపాయి ఇస్తే 46 పైసలు మాత్రమే తిరిగి వస్తున్నాయని పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యంగా తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్లో శుక్రవారం ఏర్పాటు చేసిన అభయ్ త్రిపాఠి స్మారక ఉపన్యాసం కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొని కొత్త రాష్ట్రం – సవాళ్లు అనే అంశంపై ప్రసంగించారు. బోర్లు ఎక్కువ, అందుకే 24 గంటలు అవసరం కేటీఆర్ మాట్లాడుతూ.. ‘1950 నుంచి 2014 వరకు దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఏర్పడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎన్నో సవాళ్లు, సందేహాలు ఉండే. తెలంగాణ ఏర్పడితే ఇక్కడ ఇతర ప్రాంతాల వారి భద్రతపై ఎన్నో సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కేసీఆర్ ప్రతి ఇంటికి తాగునీరు అందించారు. అదే స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ భగీరథ పథకం అమలు చేశాం. రాష్ట్రంలో 30 లక్షలకు పైగా వ్యవసాయ బోర్లు ఉన్నాయి. కాబట్టి కరెంట్ ఎక్కుక అవసరం పడుతుంది. వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటల విద్యుత్ను ఉచితంగా అందజేస్తున్నాం. కాళేశ్వరంతో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలమైంది. ప్రపంచంలోనే లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఐటీ సెక్టార్లో ఉద్యోగాల కల్పనలో రెండేళ్లుగా బెంగళూరును హైదరాబాద్ దాటేసింది’ అని కేటీఆర్పేర్కొన్నారు. -
తెలంగాణలో చురుగ్గా నైరుతి రుతు పవనాలు
-
కొన్ని అధ్యాయాలకు ముగింపు లేకున్నా.. బండి మనసులో ఏముంది?
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా తన స్థానంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించడంతో బండి సంజయ్ ఉద్వేగభరితమైన ట్వీట్ చేశారు. ‘మన జీవితాల్లో కొన్ని అధ్యాయాలకు ముగింపు లేకున్నా ముగించాల్సి వస్తుంది’ అంటూ పేర్కొన్నారు. తన పదవీకాలంలో ఒకవేళ ఎవరినైనా అనుకోకుండా బాధపెట్టి ఉన్నప్పటికీ అన్యదా భావించకుండా అందరి ఆశీస్సులను కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. తనది బాధాకర కథ కానందున సంతోషంగా ఉన్నానని.. తనపై దాడులు, అరెస్టుల సమయంలో నేతలంతా అండగా నిలిచి తనకు మధురానుభూతులు మిగిల్చారన్నారు. కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా తాను చేసిన పోరాటంలో అరెస్టులు, దాడులను ఎదుర్కొన్నప్పటికీ ఎదురొడ్డి నిలబడ్డ బీజేపీ కార్యకర్తలందరికీ హ్యాట్సాఫ్ తెలుపుతున్నానన్నారు. సుఖదుఃఖాల్లో కార్యకర్తలంతా తన వెంట నిలిచారని... తాను సైతం ఎల్లప్పుడూ వారిలో ఒకడిగా ఉన్నానని బండి సంజయ్ పేర్కొన్నారు. కిషన్రెడ్డి సారథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో పనిచేసేందుకు ఎదురుచూస్తున్నానన్నారు. (చదవండి: బండి సంజయ్ ను ఎందుకు తప్పించారు?) అవకాశం ఇచ్చిన అగ్రనేతలకు ధన్యవాదాలు... తనలాంటి సాధారణ కార్యకర్తకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసే గొప్ప అవకాశం ఇచి్చనందుకు ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, బీఎల్ సంతోష్, శివప్రకాశ్, తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్, అరవింద్ మీనన్లకు బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు. కాగా, బండి సంజయ్ను పదవి నుంచి తప్పించడాన్ని తట్టుకోలేక బీజేపీ ఖమ్మం టౌన్ ఉపాధ్యక్షుడు గజ్జెల శ్రీనివాస్ మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. Officially signing off as @BJP4Telangana State President 🙏 Thank you to Hon’ble PM Shri @narendramodi ji, Hon’ble HM Shri @AmitShah ji and @BJP4India President Shri @JPNadda ji, Shri @blsanthosh ji, Shri @shivprakashbjp ji, Shri @tarunchughbjp ji, Shri @sunilbansalbjp ji, Shri… — Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) July 4, 2023 బీజేపీ పరిణామాలపై నాయకుల స్పందనలు ఇలా... ► ‘బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమితులైన జి.కిషన్రెడ్డికి అభినందనలు... బండి సంజయ్ నాయకత్వంలో పార్టీ బాగా పనిచేసింది. కిషన్రెడ్డి నేతృత్వంలో అధికారాన్ని సాధిస్తుంది’ – దుబ్బాక ఎమ్మెల్యే, రాష్ట్ర కార్యదర్శి ఎం.రఘునందన్రావు ► బండి సంజయ్ మార్పు బాధాకరమే అయినా, పార్టీ మరింత మంచి బాధ్యతను ఆయనకు అప్పగిస్తుందని భావిస్తున్నా. – బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి ► బండి మార్పుపై కార్యకర్తలు భావోద్వేగాలకు గురికావొద్దు. ఎవరూ ఎలాంటి చర్యలకు దిగొద్దు. సంజయ్కు పార్టీనాయకత్వం సముచిత గౌరవం కల్పిస్తుంది. – బీజేపీ నేత, తమిళనాడు సహ ఇన్చార్జ్ పొంగులేటి సుధాకరరెడ్డి ఢిల్లీ వెళ్లిన కిషన్రెడ్డి... హంపిలో జరగనున్న జీ–20 సమావేశాల్లో పాల్గొనేందుకు మంగళవారం సాయంత్రం బెంగళూరుకు వెళ్లేందుకు ఎయిర్పోర్టుకు చేరుకున్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి చివరకు ఢిల్లీ పయనమయ్యారు. ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో పాటు బుధవారం కేంద్ర కేబినెట్ భేటీ నేపథ్యంలో అక్కడకు వెళ్లినట్టు పార్టీవర్గాల సమాచారం. తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తూ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో...దానిపై ఆయన మీడియాతో ఎలాంటి కామెంట్ చేసేందుకు ఇష్టపడలేదు. రెండు మూడు చోట్ల ఆయన స్పందన తెలుసుకునేందుకు ప్రయత్నించినా మౌనమే సమాధానమైంది. బండి ఛాంబర్ ఖాళీ...ఆఫీస్ కారు అప్పగింత... రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా తనకు అందిన ఫార్చునర్ వాహనాన్ని పార్టీ కార్యాలయా నికి బండి సంజయ్ తిప్పి పంపించారు. అదే విధంగా నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడి చాంబర్ను ఖాళీ చేశారు. బండి అవినీతిపై విచారణ జరపాలి.. పోలీసులకు కరీంనగర్ కార్పొరేటర్ ఫిర్యాదు కరీంనగర్: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు.. ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్పై చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని బీఆర్ఎస్ కార్పొరేటర్ కమల్జిత్ కౌర్ సోహన్సింగ్ కరీంనగర్ వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కమల్జిత్కౌర్ సోహన్సింగ్ మాట్లాడుతూ గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ బండి సంజయ్ పుస్తెలు అమ్మి పోటీ చేశానని చెప్పారని.. ఇప్పుడు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలన్న ఎమ్మెల్యే రఘునందన్రావు ఆరోపణలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ‘బీజేపీకి బీసీలు గుణపాఠం చెబుతారు’ కాచిగూడ (హైదరాబాద్): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బలహీన వర్గాలను బలిచేస్తోందని.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకీ బలహీన వర్గాల ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని తెలంగాణ రాష్ట్ర మున్నూరుకాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర్ రావు హెచ్చరించారు. ఆయా మంగళవారం కాచిగూడలోని మహాసభ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ బలహీన వర్గాలకు చెందిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను పార్టీ అధ్యక్ష స్థానం నుంచి తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు. (చదవండి: కేసీఆర్ బలం, బలహీనతలు తెలుసు: ఈటల) -
ఈ టైంలో అధ్యక్షుడి మార్పే ఓ కన్ఫ్యూజన్.. ఎవరికివ్వాలనేది ఇంకా పెద్ద కన్ఫ్యూజన్ సార్!
ఈ టైంలో అధ్యక్షుడి మార్పే ఓ కన్ఫ్యూజన్.. ఎవరికివ్వాలనేది ఇంకా పెద్ద కన్ఫ్యూజన్ సార్! -
బియ్యం ఇవ్వలేం!
సాక్షి, హైదరాబాద్: దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని ఓవైపు పాలకులు చెబుతుంటే.. మరోవైపు పక్క రాష్ట్రాలు తమ అవసరార్ధం కొనుగోలు చేస్తామన్న బియ్యం కూడా అందించలేక అధికార యంత్రాంగం సతమతమవుతోంది. కర్ణాటకలో ఎన్నికల హామీ అయిన ‘అన్న భాగ్య పథకం’కింద రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి అదనంగా 5 కిలోలు ఇచ్చేందుకు ఆ రాష్ట్రంలో బియ్యం అందుబాటులో లేవు. అలాగే తమిళనాడుకు కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా ఇచ్చేందుకు బియ్యం అవసరమయ్యాయి. దీంతో ఈ రెండు రాష్ట్రాల పౌరసరఫరాల సంస్థలూ తెలంగాణను సంప్రదించాయి. దీంతో పౌరసరఫరాల సంస్థ గోడౌన్లలో మూలుగుతున్న బియ్యం ని ల్వలను, మిల్లులు బకాయి పడిన లక్షల టన్నుల బియ్యా న్ని సేకరించి ఈ రెండు రాష్ట్రాలకు పంపించాలని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ రవీందర్ సింగ్.. సంస్థ ఎండీ, కమిషనర్ అనిల్కుమార్కు సూచించారు. అయితే బియ్యం పంపడం సాధ్యం కాదంటూ కమిషనర్ చేతులెత్తేసినట్లు సమాచారం. ఇటీవల సీఎం కేసీఆర్ నిర్వహించిన పౌరసరఫరాల సంస్థ సమీక్ష సమావేశంలోనూ ఆయ న ఈ విషయం స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో మంత్రులు గంగుల, హరీశ్రావు, సీఎస్ సమావేశమై దీనిపై చర్చించాలని ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిసింది. 33 లక్షల మెట్రిక్ టన్నులు కావాలన్న రెండు రాష్ట్రాలు: కర్ణాటకకు నెలకు 2.18 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీల) బియ్యం అవసరం ఉందంటూ ఆ రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల సంస్థ ఎండీ ఈ నెల 3న అనిల్కుమార్కు లేఖ రాశారు. ఈ లెక్కన సంవత్సరానికి 27 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం. అలాగే తమిళనాడు నుంచి కూడా ఈ నెల 23న ఒక లేఖ అందింది. రాష్ట్ర పీడీఎస్ అవసరాల కోసం 4 ఎల్ఎంటీల బాయిల్డ్ రైస్, 2 ఎల్ఎంటీల ముడి బియ్యం అవసరం అని ఆ రాష్ట్రం కోరింది. రాష్ట్ర మిల్లర్ల నిర్వాకంతోనే వెనకడుగు? తెలంగాణలో ఏటా సగటున కోటిన్నర మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లింగ్కు వస్తోంది. ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే వచ్చే 67 శాతం బియ్యం లెక్కన ఏటా సుమారు కోటి మెట్రిక్ టన్నుల బియ్యం వస్తుంది. ఇందులో ఎఫ్సీఐకి 50 ఎల్ఎంటీ అప్పగించినా, మరో 50 ఎల్ఎంటీ వరకు స్టేట్ పూల్ కింద రాష్ట్రం వద్దనే ఉంటుంది. అయితే మిల్లర్లు నాణ్యమైన ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకోవడం, రోజుకు కనీసం 8 నుంచి 10 వేల మెట్రిక్ టన్నుల మేర కూడా ఎఫ్సీఐకి అప్పగించకపోవడం వంటి కారణాలతో ఒక సీజన్ ధాన్యం సీఎంఆర్గా ఎఫ్సీఐ గోడౌన్లకు చేరుకునేందుకు 18 నెలల వరకు పడుతోంది. ఈ పరిస్థితుల్లో మిల్లర్ల మీద నమ్మకంతో పక్క రాష్ట్రాలకు విక్రయించే ఒప్పందాలు చేసుకుంటే ఇబ్బందులు తప్పవని కమిషనర్ భావిస్తున్నట్లు సమాచారం. మిల్లర్లు 2021–22 వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి 4.5 ఎల్ఎంటీ బియ్యం ఇవ్వాల్సి ఉంది. 2019–20, 21 బాపతు బియ్యం 1.25 ఎల్ఎంటీలు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఈ బియ్యాన్ని 25 శాతం అదనపు జరిమానాతో వసూలు చేసినా, అది పౌరసరఫరాల సంస్థ ద్వారా పీడీఎస్కు తరలుతుంది. ఈ నేపథ్యంలో ఎఫ్సీఐకి ఇచ్చే బియ్యంలో కోత పెట్టడం ద్వారా ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు అవకాశాలున్నాయని కొందరు అధికారులు చెబుతున్నారు. అలాగే మిల్లర్లపై ఒత్తిడి పెంచి ఏ సీజన్ బియ్యం ఆ సీజన్లో మిల్లింగ్ చేయిస్తే పక్క రాష్ట్రాలకు విక్రయించడం కష్టం కాదని ఓ రిటైర్డ్ అధికారి వ్యాఖ్యానించారు. బియ్యానికి బదులు డబ్బులు అన్న భాగ్య పథకంపై కర్ణాటక నిర్ణయం బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చి న హామీల్లో ఒకటైన అన్న భాగ్య పథకం అమలుకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ పథకం ప్రకారం దారిద్య్ర రేఖకి దిగువన ఉన్న కుటుంబాలకు అయిదు కేజీలు అదనంగా బియ్యం ఇవ్వాల్సి ఉంది.జూలై 1 నుంచి ఈ పథకం అమలు చేయాల్సి ఉండగా బియ్యం సేకరణలో ఇబ్బందులు తలెత్తడంతో బియ్యానికి బదులుగా డబ్బులు ఇవ్వాలని నిర్ణయించింది. బుధవారం జరిగిన కర్ణాటక రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కేజీ బియ్యానికి రూ.34 చొప్పున 5 కేజీలకయ్యే ధర మొత్తం వారి ఖాతాల్లో వేయనున్నారు. ఈ విషయాన్ని కర్ణాటక ఆహార, పౌర సరఫరా శాఖ మంత్రి కె.హెచ్. మునియప్ప విలేకరులకు వెల్లడించారు.‘‘రాష్ట్ర అవసరాలకు సరిపడా బియ్యాన్ని ఇవ్వడానికి ఏ సంస్థ ముందుకు రాలేదు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం కేజీ బియ్యం ధర రూ.34. అవసరమైన బియ్యం ప్రభుత్వం సేకరించే వరకు అర్హులైన లబ్దిదారులందరికీ బియ్యానికి బదులుగా డబ్బులు ఇస్తాం’’ అని వివరించారు. ఒక కార్డులో ఒకే వ్యక్తి ఉంటే రూ.170, ఇద్దరు ఉంటే రూ.340, ఒకవేళ అయిదుగురు సభ్యులుంటే వారి ఖాతాలో రూ.850 వేస్తామని మంత్రి వివరించారు. -
కర్ణాటకలో సినిమా అట్టర్ ఫ్లాప్, తెలంగాణలో కాషాయ పార్టీ పరిస్థితేంటి?
కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ మీద ప్రభావం చూపుతాయా? తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి వస్తామన్న కమలనాథుల ఆశలపై కర్ణాటక నీళ్ళు చల్లిందా? కర్ణాటక షాక్ నుంచి తెలంగాణ కాషాయసేన ఇప్పట్లో కోలుకుంటుందా? బీజేపీలోకి వలసలు కొనసాగుతాయా? ఆగుతాయా? అసలు తెలంగాణ కమలనాథుల యాక్షన్ ప్లాన్ ఏంటి? కర్ణాటకలో బీజేపీ సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని.. ఆ తర్వాత గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగరేయడమేనని తెలంగాణ కాషాయ సేన భారీగా ఆశలు పెట్టుకుంది. కానీ, కన్నడ ప్రజలు వారి ఆశలు అడియాశలు చేసేశారు. భారీ అంచనాలతో విడుదలైన సినిమా అట్టర్ ఫ్లాప్ అయినట్లుగా కర్ణాటక బీజేపీ పరిస్థితి తయారైంది. అస్థిర రాజకీయాలకు తెర దించుతూ కాంగ్రెస్ విజయ దుంధుభి మోగించింది. కర్ణాటక ఫలితాలు తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపగా.. బీజేపీ నేతల్లో నిరాశ మిగిల్చింది. ఫలితాలు వెల్లడయ్యాక బీజేపీ ఆఫీస్లో ఒక్కసారిగా సందడి తగ్గిపోయింది. స్తబ్తత ఆవరించింది. (ఓఆర్ఆర్ను కేసీఆర్ పర్యవేక్షణలో తెగనమ్మారు: రేవంత్ రెడ్డి) చేరికలేవీ? మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి తర్వాత బీజేపీ కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మహేశ్వర్ రెడ్డి మినహా.. చెప్పుకోదగ్గ స్థాయిలో చేరికలు జరగలేదు. కన్నడ నాట ఫలితాల ఎఫెక్ట్ తో చేరిన నేతలు కూడా డైలమాలో పడ్డారు. తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసానికి ఈటల రాజేందర్ వెళ్లిన సందర్భంలో పార్టీలో విబేధాలు బయటపడ్డాయి. కర్ణాటక ఫలితాల నేపథ్యంలో ఇప్పట్లో కాషాయ కండువా కప్పుకునేది ఎవరు? కొత్తగా బీజేపీలో చేరే వారికి ఎలాంటి భరోసా కల్పిస్తారు? అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొల్లాపూర్ కు చెందిన జూపల్లి కృష్ణారావు ఇప్పుడు బీజేపీ వైపు చూడటం కష్టమేనని వాళ్ల వర్గీయులు చెబుతున్నారు. వాళ్లు కాంగ్రెస్ వైపు అడుగేస్తారనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. గ్రూపు తగాదాలతో రగిలిపోతున్న తెలంగాణ కమలదళం... కర్ణాటక ఫలితాల ఎఫెక్ట్ తో బలహీనపడుతుందా? నాయకుల మధ్య విభేదాలు రచ్చకెక్కుతాయా? అనే చర్చ జరుగుతోంది. అయితే కర్ణాటకలో ఓడినంత మాత్రాన తెలంగాణలో పార్టీ దూకుడు ఏమాత్రం తగ్గదని.. రెట్టించిన ఉత్సాహంతో కమలదళం కార్యరంగంలోకి దూకుతుందని ఆ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. (బీజేపీ కార్యకర్తల్లో కొత్త కన్ఫ్యూజన్.. రంగంలోకి హైకమాండ్) -
హైదరాబాద్ లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం
-
తెలంగాణలో ప్రధాని మోదీ నేటి పర్యటన అత్యంత కీలకం
-
తెలంగాణలో ఇక 24 గంటలు అన్ని షాపులు ఓపెన్
-
కేసీఆర్ ఒక్కరు పోరాడితేనే తెలంగాణ రాలేదు
హుజూరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరు పోరాడితేనే తెలంగాణ రాష్ట్రం రాలేదని, సకల జనులు కలసికట్టుగా పోరాడితేనే తెలంగాణ స్వప్నం సాకారమైందని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు ఎం.కోదండరాం అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో తెలంగాణ బచావో సభకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. మిలియన్ మార్చ్ స్ఫూర్తితోనే హైదరాబాద్లో æమార్చి 10న తెలంగాణ బచావో సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సభలో వచ్చే సూచనల ఆధారంగా భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న వారు, తెలంగాణ అభివృద్ధిని కోరుకునే వారు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందో ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం తేటతెల్లం చేస్తోందని తెలిపారు. కుంభకోణంలో తమ వాటా కోసం ఓ కుటుంబం ప్రయత్నించిందన్నారు. బీఆర్ఎస్ నాయకులు భూకబ్జాలకు పాల్పడేందుకు ధరణి పోర్టల్ రూపొందించారని విమర్శించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ చెప్పింది ఏంటి? ఇప్పుడు చేసేదేంటి? అని కోదండరాం ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చినప్పుడే ఆ పార్టీ తెలంగాణలో ఉనికి కోల్పోయిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీజేఎస్ రాష్ట్ర కార్యదర్శి ముక్కర రాజు, పెద్దపల్లి జిల్లా కన్వీనర్ నర్సింగ్, ప్రధాన కార్యదర్శి స్రవంతి తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్రప్రదేశ్–తెలంగాణ రాష్ట్రాల మధ్య మరో హైవే.. కేంద్రం గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్–తెలంగాణ రాష్ట్రాలను అనుసంధానిస్తూ మరో జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలోని నాగర్కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి మన రాష్ట్రంలోని వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు వరకు 255 కి.మీ. మేర నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ ఆమోదించింది. రూ.4,706 కోట్ల అంచనా వ్యయంతో ఈ రహదారి నిర్మించనున్నారు. రహదారిలో అంతర్భాగంగా ఇప్పటికే కృష్ణా నదిపై వంతెన నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ టెండర్ల ప్రక్రియ చేపట్టింది. కాగా, రెండు రాష్ట్రాలను అనుసంధానిస్తూ నాలుగు లేన్ల రహదారి నిర్మాణ ప్రక్రియ కూడా తాజాగా చేపట్టింది. రహదారి నిర్మాణం ఇలా... తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే 255 కి.మీ. రహదారి(ఎన్హెచ్167కె)ని ఏడు ప్యాకేజీల కింద నిర్మిస్తారు. అందులో తెలంగాణలో 91 కి.మీ. రహదారిని రూ.2,406 కోట్లతో నిర్మించేందుకు డీపీఆర్ను రూపొందించారు. మొదటి ప్యాకేజీ కింద రూ.886.69 కోట్లు, రెండో ప్యాకేజీ కింద రూ.1,082.40 కోట్లు, మూడో ప్యాకేజీ కింద రూ.436.91కోట్లతో పనులు చేపట్టేందుకు ఎన్హెచ్ఏఐ టెండర్ల ప్రక్రియ చేపట్టనుంది. ఇక ఏపీలో 164 కి.మీ. మేర రూ.2,300 కోట్ల అంచనా వ్యయంతో రహదారి నిర్మాణానికి ప్రణాళికను రూపొందించారు. మొత్తం నాలుగు ప్యాకేజీల కింద నంద్యాల జిల్లా సిద్ధేశ్వరం నుంచి వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు వరకు ఈ రహదారిని నిర్మిస్తారు. అందులో మొదటి ప్యాకేజి కింద 62.57 కి.మీ. మేర రహదారి నిర్మాణానికి రూ.785 కోట్లతో పనులకు డీపీఆర్ను తాజాగా ఖరారు చేశారు. మిగిలిన మూడు ప్యాకేజీల కింద పనులను రూ.1,515 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించేందుకు ఎన్హెచ్ఏఐ డీపీఆర్ను రూపొందిస్తోంది. నాలుగు ప్యాకేజీల డీపీఆర్లు ఖరారు అయ్యాక 2023 ఫిబ్రవరి మొదటి వారంలో టెండర్ల ప్రక్రియ చేపట్టి ఏడాదిన్నరలో నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఎన్హెచ్ఏఐ భావిస్తోంది. -
మహబూబ్నగర్లో హద్దులు దాటని కేసీఆర్.. ఆ వ్యాఖ్యలకు అర్థమేంటి?
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మహబూబ్ నగర్ పర్యటనలో కొన్ని విశేషాలు గమనించవచ్చు. ఆయన ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు కురిపించినా, పెద్ద గా హద్దులు దాటినట్లు అనిపించదు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ప్రధాని స్థాయి లో ఉన్నవారు అనవచ్చా? అని ఆయన ప్రశ్నించారు. అయితే ఈ సందర్భంగా తెలంగాణ ఉదాహరణ కాకుండా పశ్చిమబెంగాల్ ను ఉదహరించారు. బెంగాల్ లో 40 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని గతంలో మోడీ చెప్పడాన్ని ఆయన ఆక్షేపించారు. మోడీ ఆ మాట అన్న విషయం నిజమే. అప్పట్లో దీనిపై కలకలం రేగింది. వివిధ రాజకీయ పక్షాలు మోడీ వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించాయి. తాజాగా కెసిఆర్ ఆ సంగతి ఎందుకు తీసుకు వచ్చారో తెలియదు. అదే సమయంలో తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నించినవారని పట్టుకుని జైలులో వేశామని ఆయన తెలిపారు. నిజమే! ఫిరాయింపులను ఎవరు ప్రోత్సహించినా తప్పే. మధ్య ప్రదేశ్, కర్నాటక మొదలైన రాష్ట్రాలలో బిజెపి వారు గేమ్ ప్లాన్ ఆడి తమ ప్రభుత్వాలను తెచ్చుకున్నారు. కెసిఆర్ ఆ ముచ్చట చెప్పి బిజెపిపై ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేలను కొనడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అలా ప్రయత్నం చేసినవారిని జైలులో పెట్టామని ఆయన వ్యాఖ్యానించారు. విశేషం ఏమిటంటే ఆయనే గత ఎనిమిదేళ్లలో ముప్పైఏడు మంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ లో చేర్చుకున్నారు. మరి దానిని ఏమంటారన్నదానిపై మాట్లాడడం లేదు. కాకపోతే వారంతా తెలంగాణ అభివృద్ది కోసం స్వచ్చందంగా చేరారని చెప్పవచ్చు. ఎర కేసులో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు కాంగ్రెస్ నుంచి వచ్చినవారు కావడం, అసలు పట్టుబడ్డ నిందితులతో ఈ ఎమ్మెల్యేలకు ఉన్న సంబంధాలు ఏమిటో ఇంతవరకు బహిరంగ పరచకపోవడం కూడా ఆసక్తి కలిగిస్తుంది. కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న బిజెపి తెలంగాణలోని కెసిఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టగలదా? ఈ నేపధ్యంలో ఇప్పటికీ ఆ ఎమ్మెల్యేలను కొనడం ఏమిటో, సిట్ ఏమి తేల్చిందో, నిజంగానే బిజెపి ఎమ్మెల్యేలను కొనే యత్నం చేసిందో ఇంతవరకు తేలలేదు. కాని ఈ విషయంలో బిజెపిని ఇరుకున పెట్టడంలో, తెలంగాణ వ్యాప్తంగా ఒక ప్రచారం చేయడంలో కెసిఆర్ కొంతవరకు సఫలం అయ్యారు. ఇదే తరుణంలో తన కుమార్తె, ఎమ్మెల్సీ కవితపైన, మంత్రి మల్లారెడ్డి వంటివారిపైన వచ్చిన ఆరోపణలు టిఆర్ఎస్ కు అప్రతిష్టగానే మారాయి. ఎంత కేంద్రంపైన, కేంద్ర దర్యాప్తు సంస్థలపైన విమర్శలు కురిపించినా, చివరికి అవి నిర్వహించే విచారణలకు హాజరుకాకుండా ఉండలేని పరిస్థితి. టిఆర్ఎస్ నేతలను కేంద్రం టార్గెట్ చేస్తోందని కెసిఆర్ వాపోయినా, సంబంధిత నేతలు తమపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పకపోతే ఆత్మరక్షణలో పడే అవకాశం ఉంటుంది. డిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పేరు ప్రముఖంగా వచ్చిన వైనంపై మహబూబ్ నగర్ సభలో మాట్లాడలేదు. అలాగే మంత్రి మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్ల లో జరిగిన సోదాలు, పట్టుబడిన డబ్బు గురించి ప్రస్తావించలేదు. దీనిని ఏమని అనుకోవాలి. ఈ పాయింట్ నే బిజెపి కాని, ఇతర పార్టీల నేతలు కాని ఫోకస్ చేస్తున్నాయి. మల్లారెడ్డి తన పై ఐటి దాడి జరిగినప్పుడు గంభీరంగా మాట్లాడారు కాని, ఆయన సంతృప్తికరమైన వివరణ ఇచ్చినట్లు కనిపించలేదు. అలాగే కవిత కూడా కావాలంటే జైలులో పెట్టుకోవాలని సవాల్ చేశారు కాని, ఆ స్కామ్ గొడవకు సంబంధించి స్పష్టత ఇచ్చినట్లు అనిపించలేదు. ఈ క్రమంలో ఆమె విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసు ఇచ్చింది. ఎఫ్ఐఆర్ కాపీ, తదితర డాక్యుమెంట్లు అందచేయాలని , ఆ తర్వాత విచారణ చేయాలని ఆమె కోరారు. ఇందుకు సీబీఐ స్పందన ఎలా ఉంటుందన్నది తెలియవలసి ఉంది. అయితే, ఆమెను కేవలం వాంగ్మూలం ఇవ్వడానికే నోటీసు ఇవ్వడం కొంతలో కొంత ఊరట అవుతుందేమో! ఆమె సాక్ష్యం తర్వాత అధికారులు ఎలా స్పందిస్తారన్నదానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ పరిణామాలన్నిటి గురించి మాట్లాడడం ఒకరకంగా కెసిఆర్ కు కూడా ఎంబరాస్మెంటే అని చెప్పాలి. డిల్లీ లిక్కర్ స్కామ్ జరగలేదని, మల్లారెడ్డి కాలేజీలలో అవకతవకలు లేవని చెప్పే సాహసం కెసిఆర్ చేయలేకపోవచ్చు. కాకపోతే టిఆర్ఎస్ వారిని లక్ష్యంగా చేసుకుని కేంద్ర దర్యాప్తు సంస్థలను బిజెపి ప్రభావితం చేస్తోందన్న అభియోగం మోపవచ్చు. దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఉదాహరణకు మల్లారెడ్డి కాలేజీలకు సంబంధించి పట్టుబడ్డ 15 కోట్ల నగదుపై సంతృప్తికరమైన వివరణ ఇవ్వలేకపోతే రాజకీయంగా కూడా కొంత నష్టం వాటిల్లవచ్చు. ఏది ఏమైనా వచ్చే ఆరు నెలలు టిఆర్ఎస్ కు అత్యంత కీలకం. బిజెపి నేతలు తీవ్ర స్థాయిలో టిఆర్ఎస్ పై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల గడువు దగ్గరపడే కొద్ది ఈ కాక ఇంకా పెరిగే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. - హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
చోటా సన్మాన్.. బడా దావత్! ప్లేట్ బిర్యానీకి రూ.700? మరో విశేషం ఏంటంటే!
సాక్షి, సిటీబ్యూరో: ప్రజాధనం దుర్వినియోగమవుతోంది. ధార్మిక సేవల కోసం వినియోగించాల్సిన సర్కారీ సొమ్ము పక్కదారి పడుతోంది. యాత్రికులకు ఉత్తమ సేవలు అందించినవారికి అవార్డుల పేరుతో హజ్ కమిటీ భారీగా నిధులను దుబారా చేసింది. ఆతిథులకు మెగా విందును ఏర్పాటు చేసి ఖజానాకు గండికొట్టింది. ప్లేట్ బిర్యానీకి ఏకంగా రూ.700 చెల్లించి భారీగా వెనకేసుకుంది. కేవలం 200 మంది అతిథులను మాత్రమే ఆహ్వానించినట్లు చెప్పుకున్న కమిటీ.. బిల్లుల చెల్లింపుల వరకు వచ్చేసరికి ఈ సంఖ్యను 350 చేసేసింది. ఇలా ఏకంగా రూ.3.5 లక్షలను ఈ దావత్కు వెచ్చించింది. మరో విచిత్రమేమింటే.. ఈ ఆతిథ్యమిచ్చిన హోటల్ హజ్ కమిటీ చైర్మన్ది కావడం మరో విశేషం. హజ్ యాత్రికుల కోసం శిబిరం ఏర్పాటు చేసేందుకు ఏటా బడ్జెట్లో రూ.2 కోట్లను ప్రభుత్వం కేటాయిస్తోంది. ఈ నిధులకు అదనంగా చైర్మన్ పలుకుబడిని ఉపయోగించి మరో రూ.2 కోట్లను ప్రభు త్వం నుంచి రాబట్టారు. ఆర్థిక సంవత్సరం దగ్గర పడుతుండటంతో మంచినీళ్లలా నిధులను ఖర్చు చేస్తున్న హజ్ యంత్రాంగం.. లెక్కా పద్దు కూడా చూసుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. (చదవండి: NGRI Hyderabad: ఆ గనుల్లో బంగారం కంటే విలువైన లోహం) -
నేడు తెలంగాణ వ్యాప్తంగా సామూహిక గీతాలాపన
-
డిప్యుటేషన్ ఇష్టారాజ్యం.. నచ్చినవారికి ఎక్కడంటే అక్కడే! ఫిర్యాదుకు రెడీ?
సాక్షి, హైదరాబాద్: ట్రెజరీస్ అండ్ అకౌంట్స్లో డిప్యుటేషన్లకు సంబంధించి ఉన్నతాధికారుల ఏకపక్ష నిర్ణయాలే ఫైనల్. ఉద్యోగులు ఇదేమని ప్రశ్నిస్తే దశాబ్దాల క్రితం వచ్చిన ఆకాశ రామన్నల ఫిర్యాదులను మళ్లీ తెరమీదకు తెస్తామంటూ హెచ్చరిస్తుంటారు. డిప్యుటేషన్ల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అన్ని ఆధారాలతో ఉన్నతాధికారులపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. అందులో డిప్యుటేషన్లకు సంబంధించి వికలాంగులు, మహిళలు, తీవ్ర అనారోగ్య సమస్యలున్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలన్న నిబంధనలున్నా అవేవి పట్టించుకోకుండా అస్మదీయులకు మాత్రమే కోరుకున్నచోట డిప్యుటేషన్ ఇచ్చారని పేర్కొంటున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి తాను అంగవైకల్యంతో బాధపడుతున్నానని, ఒకరోజు విధులకు వెళ్లి వస్తే మూడురోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తోందని, దూరభారంతో ఇబ్బంది పడుతున్నానని, అందుకే డిప్యుటేషన్ ఇవ్వాలని వేడుకున్నా కనికరించలేదు. ఎలాంటి ఇబ్బందిలేని ఓ అధికారికి మాత్రం వైరా నుంచి ఖమ్మం జిల్లాకేంద్రానికి డిప్యుటేషన్ ఇచ్చారు. కుటుంబసభ్యుల అనారోగ్యం కారణంగా మంచిర్యాల నుంచి క్లియర్ వేకెన్సీ ఉన్న వైరాకు డిప్యుటేష¯న్ ఇవ్వాలని కోరితే కనీస స్పందన లేదని ఓ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్లో పనిచేస్తున్న మరో అవివాహిత ఉద్యోగి క్లియర్ వేకెన్సీ ఉన్న సంగారెడ్డికి డిప్యుటేషన్పై పంపాలని చాలాకాలంగా వేడుకుంటున్నా పెడచెవిన పెడుతున్నారు. మానవతాదృక్పథంతో డిప్యుటేషన్లు పరిశీలించి చర్య తీసుకోవాలని ఆర్థికమంత్రి పేషీ సిఫారసు చేసినా డైరెక్టరేట్లో మాత్రం బుట్టదాఖలవుతున్నాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. (చదవండి: ఇంటిపై జాతీయ జెండా ఎగురవేస్తున్నారా?.. ఈ నియమాలు తప్పనిసరి..) సిమ్కార్డుల పితలాటకం తరచూ సెల్ఫోన్ నెట్వర్క్ను మారుస్తుండటం సిబ్బందికి ఇబ్బందిగా మారింది. తాజాగా మరో కంపెనీకి సెల్ నెట్వర్క్ను మార్చటంతో గ్రామీణప్రాంతాలు, కార్యాలయ ఆవరణల్లోనూ సిగ్నల్స్ రాకపోవటంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం కార్యాలయాలకు రాగానే విధుల్లో లాగిన్ కావాలంటే వారి సెల్ఫోన్కు వచ్చే ఓటీపీయే ఆధారం. కానీ, ఓటీపీ వచ్చేందుకు గంటల సమయం పడుతుండటంతో ఒక్కపూట మొత్తం అవస్థలు పడుతున్నామని, సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు సీనియర్ ఐఏఎస్ అండ ఉందన్న ధీమాతో నిబంధనలన్నీ బేఖాతర్ చేస్తున్న ఉన్నతాధికారుల తీరుపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, ఆపై ప్రత్యక్ష కార్యాచరణ రూపొందించాలని ఉద్యోగులు, సంఘాలనేతలు భావిస్తున్నారు. రూ.23.8 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన భవనాలను స్వాధీనం చేసుకోకపోవటం, కొత్త కంప్యూటర్ల మొరాయింపు అంశంపైనా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని ఉద్యోగులు భావిస్తున్నారు. (చదవండి: పేదల భూములను లాక్కునేందుకే కేసీఆర్ ధరణి పోర్టల్) -
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు
-
అన్నయోజన కింద బియ్యం పంపిణీలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది
-
AARAA Mastan Survey Report: తెలంగాణ ఎన్నికలపై ‘ఆరా’ రిపోర్టు.. స్పందించిన కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్కు వస్తున్న ఆదరణ తట్టుకోలేక టీఆర్ఎస్, బీజేపీ కలిసి ‘ఆరా’సంస్థతో సర్వే రిపోర్టు ఇప్పించారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆరోపించారు. గాంధీభవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా సర్వే సంస్థ రిపోర్టు మార్చిందన్నారు. ఆరా సంస్థ చైర్మన్ తనతో వస్తే నిరూపిస్తానని సవాల్ చేశారు. రాష్ట్రంలో బీజేపీకి బలం లేదని, టీఆర్ఎస్, బీజేపీలను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తమ అంతర్గత సర్వే ప్రకారం కాంగ్రెస్ 90 నుంచి 99 సీట్లు గెలుస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చెప్పారని వెల్లడించారు. అయినా కాంగ్రెస్ కేడర్ ఇలాంటి సర్వేలను నమ్మదని, వచ్చే ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆయన చెప్పిన వివరాలు అబద్ధం మరోవైపు కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై ‘ఆరా’పోల్ స్ట్రాటజీస్ సంస్థ అధినేత ఆరా మస్తాన్ స్పందించారు. తమ సంస్థ సర్వే పేరుతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రకటించిన వివరాలు అబద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికిప్పుడు తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ 38.88 శాతం ఓట్లతో మొదటి స్థానంలో ఉంటుందని తెలిపారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 46.87 శాతంఓట్లతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్కు 2019 పార్లమెంటు ఎన్నికల నాటికి ఓట్ల శాతం 41.71కి తగ్గిందని, ఇప్పుడు ఎన్నికలు జరిగితే 38.88 శాతానికి పడిపోయినా, అత్యధిక శాతం ప్రజల మద్దతున్న పార్టీగా నిలుస్తుందని చెప్పారు. కాంగ్రెస్కు 2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగిన ప్రతి ఎన్నికలోనూఓట్ల శాతం తగ్గుతూ వచ్చిందని, ఇప్పుడు ఎన్నికలు జరిగితే కేవలం 23.71 శాతం ఓట్లు మాత్రమే లభిస్తాయని తమ సర్వేలో తేలినట్లు చెప్పారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగిన పార్లమెంటు ఎన్నికల నుంచి పుంజుకుంటూ వచ్చిన బీజేపీకి 30.48 శాతం ఓట్లు లభిస్తాయన్నారు. ఇతరులకు 6.91 శాతం ఓట్లు దక్కుతాయని తెలిపారు. ప్రతి మూడు నెలలకోసారి 119 నియోజకవర్గాల్లోని మూడో వంతు నియోజకవర్గాల్లో 2021 నవంబర్, ఈ ఏడాది మార్చి, ప్రస్తుత నెలలో సర్వేలు నిర్వహించినట్లు తెలిపారు. -
AARAA Mastan: తెలంగాణ ఎన్నికలపై సర్వే ఫలితాలు.. స్పందించిన బండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ చేస్తున్న పోరాటాలను ప్రజలు నమ్ముతున్నారని, అందుకే బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆరు శాతం నుంచి 30 శాతానికి బీజేపీ ఓట్ల శాతం పెరుగుదల మామూలు విషయం కాదన్నారు. బుధవారం కోరుట్లకు చెందిన కొందరు పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఓప్రైవేట్ సంస్థ సర్వే నివేదికను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. ‘బీజేపీ గ్రాఫ్ పెరిగితే టీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గిపోయింది. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల్లో గెలిచాం. మూడేళ్లుగా బీజేపీ గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. ప్రజలు బీజేపీని విశ్వసిస్తున్నారు. మరో 8 శాతం ఓట్లను పెంచుకోవడం బీజేపీకి కష్టమే కాదు. ప్రజలు మా పోరాటాలను గమనిస్తున్నారు’అని అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన వ్యాపారవేత్త మహిపాల్ రెడ్డి, అలాగే లోక్సత్తా సహా ఇతర పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఇకనైనా కేసీఆర్ మొద్దు నిద్ర వీడాలి.. సీఎం కేసీఆర్ ఇకనైనా మొద్దు నిద్ర వీడి, ప్రజలను ఆదుకోవాలని సంజయ్ డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన రుణమాఫీ హామీ నెరవేరకపోవడంతో రైతులకు బ్యాంకులు కొత్తగా రుణాలివ్వడం లేదన్నారు. ఇచ్చిన హామీ మేరకు రూ.లక్ష రుణమాఫీని వెంటనే అమలు చేయడంతోపాటు తక్షణమే బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి కొత్తగా రుణాలిచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
Photo Feature: అలుగు దుంకిన అందం
సాక్షి, హైదరాబాద్: ఎడతెరిపి లేని వర్షాలతో ఊరూ వాడా.. వాగూ వంకా.. ఏరులై పారుతున్నాయి. కొన్నిచోట్ల అలుగు దుంకుతున్న చెరువులతో అందాలు జాలువారుతున్నాయి. మరికొన్ని కట్టలు తెగి ఊళ్లను, చేలను ముంచెత్తుతున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మంగళవారం నాటికి రాష్ట్రంలో 49 చెరువులు పూర్తిగా తెగిపోయాయి. మరో 43 చెరువులకు గండ్లు పడ్డాయని అధికారులు చెబుతున్నారు. అలాగే, 25 కాల్వలకు సైతం గండ్లు పడ్డాయి. -
హైదరాబాద్: కూరగాయలపై వర్షాల ఎఫెక్ట్.. రేట్లు మరింత పెరిగే అవకాశం
సాక్షి, సిటీబ్యూరో: ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు! రాష్ట్రంలో ఉద్ధృతంగా కురుస్తున్న వర్షాలు కూరగాయల ధరల్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇటీవల వరుసగా ముసురు వానలు పడుతుండటంతో తోటల్లోని కూరగాయలను కోసేందుకు వీలులేకుండా పోయింది. పొలాలన్నీ బురదమయం కావడంతో కాయ, ఆకు కూరలను తెంచడం కష్టంగా మారింది. దీంతో నగర మార్కెట్లకు వచ్చే దిగుమతులపై ప్రభావం పడింది. కేవలం శివారు జిల్లాలే కాకుండా పొరుగు రాష్ట్రాల్లోనూ విస్తృతంగా వానలు పడుతుండడంతో అక్కడి నుంచి కూరగాయల రవాణా నిలిచిపోయింది. ఇది కూడా ధరల పెరుగుదలకు కారణంగా మారింది. నిన్నామొన్నటి వరకు హోల్సేల్, రిటైల్ వ్యాపారుల వద్ద ఉన్న నిల్వలు నగర ప్రజల అవసరాలను తీర్చినప్పటికీ, సోమవారం నుంచి ఇవి కూడా కరిగిపోవడంతో కూరగాయల రేట్లు మరింత పెరిగే అవకాశముందని మార్కెటింగ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. కూరగాయలకు డిమాండ్ పెరగడంతో వ్యాపారులు ధరలు పెంచేశారు. సాధారణ రోజుల్లో టమాటా కేజీ రూ.30 నుంచి రూ.40 ఉండగా.. సోమవారం దీని ధర కిలోకు రూ. 50 వరకు పలికింది. పచ్చిమిర్చీ కూడా ఘాటెక్కింది. ఏకంగా వాటి ధర కిలో రూ. రూ.60, రూ.80 వరకు చేరింది. ఇతర కూరగాయల ధరలు కూడా కిలో రూ.20 నుంచి రూ.30 పెరిగాయి. పుంజుకోని దిగుమతులు మార్కెట్లకు శుక్రవారం నుంచి కూరగాయల దిగుమతులు రాలేదు. రోజు వంద శాతం వివిధ రకాల కూరగాయలు దిగుమతి అయితే గత నాలుగైదు రోజుల నుంచి 30–50 శాతం మాత్రమే నగర హోల్సేల్ మార్కెట్లకు దిగుమతి అయినట్లు మార్కెటింగ్ శాఖ రికార్డులు చెబుతున్నాయి. బోయిన్పల్లి మార్కెట్కు సోమవారం కేవలం 12 వేల క్వింటాళ్లు, గుడిమల్కాపూర్ 4 వేల క్వింటాళ్ల కూరగాయలు దిగుమతి అయ్యాయి. అదే సాధారణ రోజుల్లో బోయిన్పల్లిలో మార్కెట్కు సగటున 32 వేల క్వింటాళ్లు, గుడిమల్కాపూర్కు 10 వేల క్వింటాళ్ల దిగుమతులు అవుతాయి. దీంతో డిమాండ్కు సరిపడా కూరగాయల అందుబాటులో లేకపోవడంతో ధరలు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. -
పాల ధారల జలపాతాలు చూసొద్దామా!
-
తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. కనువిందు చేస్తున్న ఆ 5 జలపాతాలు
రాష్ట్రంలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో చెరువులన్నీ అలుగు పారుతున్నాయి. వాగులు, వంకలు అలుపెరుగక పరుగెడుతున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి.. 1. ములుగు జిల్లాలో కొండలపై నుంచి జాలువారుతున్న ముత్యంధార 2. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని గుండాల (బాహుబలి) జలపాతం 3. మహబూబాబాద్ జిల్లా మిర్యాలపెంట గ్రామశివారులోని ‘ఏడుబావుల’ ఉరకలు 4. నిర్మల్ జిల్లాలో పరవళ్లు తొక్కుతున్న పొచ్చర 5. నాగర్కర్నూలు జిల్లా నల్లమలలోని మల్లెలతీర్థం. -
తెలంగాణలో భారీ వర్షాలు
-
కారు ‘ఓవర్లోడు’ సౌండ్.. సుమారు 45 నియోజకవర్గాల్లో నువ్వా నేనా?
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ పార్టీని బహుళ నాయకత్వ సమస్య వెంటాడుతోంది. సొంత పార్టీ నేతలతో పాటు కాంగ్రెస్, టీడీపీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీల నుంచి వచ్చి చేరిన నేతలతో కారు ఓవర్ లోడ్ కావడం కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతోంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను సుమారు 45 స్థానాల్లో టీఆర్ఎస్ బలమైన బహుళ నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది. మరో 20 నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితా లను కొంతమేర ప్రభావం చూపగలిగే నేతలు ఉన్నారు. మొత్తంగా కనీసం 30 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. సొంత పార్టీలోని బలమైన నేతలతో తలపడాల్సిన పరిస్థితి ఉంది. వచ్చే ఎన్నికల్లోనూ టికెట్ తమనే వరిస్తుందని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేస్తుండగా.. కొన్ని సెగ్మెంట్లలో సిట్టింగ్లకు మళ్లీ అవకాశం దొరకక పోవచ్చనే వార్తలు ఆశావహుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. మరోవైపు తమకు టికెట్ కష్టమని భావి స్తున్నవారు.. విపక్ష పార్టీలు చేరికల కోసం చేస్తున్న ప్రయత్నాలను అవకాశంగా తీసుకుని ఒకరి వెంట మరొకరు అన్నట్టుగా సొంతదారి చూసుకుంటున్నారు. మరికొందరు అసంతృప్త నేతలు మాత్రం పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు. అయితే నేతల అంతర్గత విభేదాలపై ఆరా తీసిన అధినేత ఇప్పటికే దిద్దుబాటు చర్యలకు దిగినట్టు పార్టీవర్గాలు చెబుతున్నాయి. చదవండి👉🏼సబిత కబ్జాలను ప్రోత్సహిస్తున్నారు పీకే నివేదికల నేపథ్యంలో.. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ బృందం ఈ ఏడాది మార్చిలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్కు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నివేదికలు అందజేసింది. ఈ నివేదికలను లోతుగా పరిశీలించి, ఎన్నికల నాటికి ఆయా నియోజకవర్గాల్లో ఉండే రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో సిట్టింగులు, ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే సొంత రాజకీయ అస్తిత్వం కోసం నిర్ణయాలు తీసుకోవాల్సిన తప్పనిసరి స్థితిలో కొందరు నేతలు ఇప్పటినుంచే సొంతదారిని వెతుక్కునే పనిలో పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు అవకాశం దక్కదని భావించిన అసంతృప్త నేతలు నల్లాల ఓదెలు (చెన్నూరు), బూడిద భిక్షమయ్య (ఆలేరు), విజయారెడ్డి (ఖైరతాబాద్), తాటి వెంకటేశ్వర్లు (అశ్వారావుపేట) తదితరులు ఇప్పటికే సొంతదారి చూసుకున్నారు. చదవండి👉🏼కేటీఆర్ సెటైర్, దేశ ప్రజలకు మోదీ అందించిన బహుమతి ఇదే! ప్రత్యర్థితో బహిరంగ యుద్ధం రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్న కొద్దీ వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న టీఆర్ఎస్ నేతలు పలువురు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఓ వైపు పార్టీపై, అధినేతపై విశ్వాసం ప్రకటిస్తూనే మరోవైపు స్థానికంగా ఉన్న తమ రాజకీయ ప్రత్యర్థితో బహిరంగ యుద్ధానికి దిగుతున్నారు. కొల్లాపూర్లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు..ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి, తాండూరులో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పి.మహేందర్రెడ్డి.. ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, ఉప్పల్లో ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి..మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ నడుమ ఆధిపత్య పోరు కొనసాగుతోంది. బొంతు జన్మదినం పురస్కరించుకుని మంగళవారం భారీయెత్తున దర్శనమిచ్చిన ఫ్లెక్సీలు నియోజకవర్గంలో చర్చనీయాంశమయ్యాయి. తాజాగా మహేశ్వరం నియోజకవర్గం కూడా ఈ జాబితాలో చేరింది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. హుస్నాబాద్, నకిరేకల్ తదితర అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా పరిస్థితి ఇదే విధంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ నేతల నడుమ ఆధిపత్య పోరు ఎక్కువగా కనిపిస్తోంది. రేగ కాంతారావు, పాయం వెంకటేశ్వర్లు (పినపాక), భానోత్ హరిప్రియ, కోరం కనకయ్య (ఇల్లందు), వనమా వెంకటేశ్వర్రావు, జలగం వెంకటరావు (కొత్తగూడెం), కందాల ఉపేందర్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు (పాలేరు) ఈ జాబితాలో ఉన్నారు. సబితా ఇంద్రారెడ్డి, హర్షవర్ధన్రెడ్డి, ఉపేందర్రెడ్డి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరినవారు కావడం గమనార్హం. ఆధిపత్య పోరు కొనసాగుతున్న మరికొన్ని నియోజకవర్గాలు, నేతలు -
కేంద్రం తెచ్చిన స్వమిత్వ పథకం ఏంటి? ఉపయోగాలేంటి?
సాక్షి, కామారెడ్డి: పల్లె ఇల్లు ఇక నుంచి ఆన్లైన్లోకి వెళ్లు.. ప్రతి ఇంటి లెక్క పక్కాగా సేకరిస్తారు. అందుకే కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ ఇంటింటి సర్వే చేపట్టింది. ‘స్వమిత్వ’పథకం పేరుతో ఇళ్ల సర్వే మొదలుపెట్టింది. గ్రామకంఠం మొత్తాన్ని డ్రోన్ కెమెరాల ద్వారా బంధించి, వాటి ఆధారంగా ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తారు. ఇందుకుగాను పైలెట్గా రాష్ట్రంలోని ఐదు గ్రామాలను ఎంపిక చేసింది. ఆయా గ్రామాల్లో ఇప్పటికే పంచాయతీ అధికారులు పని మొదలుపెట్టారు. పైలట్ గ్రామాలు ఇవే...: కామారెడ్డి జిల్లాలో దోమకొండ మండల కేంద్రం, ఆదిలాబాద్ జిల్లాలో తలమడుగు మండలం ఆర్లి(కే) గ్రామం, జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామం, రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సరస్వతిగూడ గ్రామాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో ఇప్పటికే ఇంటింటి సర్వే మొదలైంది. దోమకొండ మండల కేంద్రంలో 3,718 ఇళ్లు, 1,332 ఓపెన్ ప్లాట్లు, ఆర్లి(కే) గ్రామంలో 774 ఇళ్లు, 17 ఓపెన్ ప్లాట్లు, స్టేషన్ ఘన్పూర్లో 470 ఇళ్లు, 80 ఇళ్లస్థలాలు, గోధుమకుంటలో 279 ఇళ్లు, 235 ప్లాట్లు, సరస్వతిగూడలో 336 ఇళ్లు, 28 ప్లాట్లు ఉన్నట్టు డ్రాఫ్ట్ మ్యాప్ ద్వారా గుర్తించారు. చదవండి👉అమ్మో.. కోనోకార్పస్!.. దడ పుట్టిస్తున్న మడజాతి మొక్కలు స్వమిత్వ పథకం అంటే... సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియా(స్వమిత్వ) ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని డ్రోన్ కెమెరాలతో ఫొటోలు తీస్తారు. ఇళ్లు, ఇంటి చుట్టుపక్కల ఖాళీస్థలం కొలతలు తీసుకుంటారు. ఇంటి యజమాని పేరు, వివరాలు సేకరిస్తారు. ఇరుగుపొరుగు వారి పేర్లు నమోదు చేస్తారు. రోడ్డు ఉంటే ఆ వివరాలు పొందుపరుస్తారు. పెరడు జాగాను కొలుస్తారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అన్ని వివరాలను పక్కాగా నమోదు చేసుకుంటారు. సేకరించిన వివరాలన్నింటినీ ఆన్లైన్లో పొందుపరుస్తారు. ఉపయోగం ఏంటీ.. ఆన్లైన్లో వివరాలు నమోదు చేయడం ద్వారా ఇంటికి సంబంధించి డాక్యుమెంట్లు ఏవి అవసరమున్నా ఆన్లైన్ ద్వారా తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఇంటి విలువ ఆధారంగా బ్యాంకు రుణం పొందడానికి వీలు పడుతుందని అధికారులు అంటున్నారు. ఏ అవసరం ఉన్నా మీ సేవ ద్వారా ఇంటికి, ప్లాటుకు సంబంధించిన వివరాలన్నీ పొందవచ్చు. ఇంటింటి సర్వేలో మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొంటున్నారు. వివరాల సేకరణ పూర్తయిన తరువాత ఆన్లైన్లో నమోదు చేయనున్నట్లు పంచాయతీ అధికారి ఒకరు పేర్కొన్నారు. చదవండి👉చిన్నారి ఉసురుతీసిన ఐదు రూపాయల కాయిన్.. -
Prashant Kishor-KCR: కేసిఆర్కు ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సూచనలేంటీ?
రాజకీయాల్లో ఎప్పుడు తొందరగా ఒక నిర్ణయానికి రాకూడదు... చివరి బంతి పడేవరకు గెలుపు ఓటముల గురించి ఎవరూ ఊహించలేరు.. ఇది సాధారణంగా రాజకీయాల్లో ఆరితేరిన వాళ్ళు ఎక్కువగా చెప్పే మాటలు. తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఇంటాబయటా బాగానే చర్చలు జరుగుతున్నాయి. అసలు ప్రశాంత్ కిషోర్ ఏం చెప్తున్నారు? టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం చేస్తున్నారు? దీనిపై అందరి దృష్టి నెలకొంది. ఎవరేమి చెప్పినా అంతిమంగా తాను అనుకునేది చేస్తారనేది కేసీఆర్కు మొదటి నుంచి ఉన్న ఇమేజ్. అయితే ప్రశాంత్ కిషోర్ తీరు మరోలా ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో ప్రముఖ రాజకీయ అధినేతలకు వ్యూహకర్తగా వ్యవహరించి సక్సెస్ అయిన ప్రశాంత్ కిషోర్ ఈసారి తెలంగాణలో ఎలాంటి పాత్రను ఎంతవరకు పోషించబోతున్నారన్న దానిపై రకరకాల అంచనాలున్నాయి. పీకే టీం ఇచ్చే రిపోర్టులను, సలహాలను కేసీఆర్ పూర్తిగా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అన్నది టిఆర్ఎస్ లో ప్రస్తుతం అంతర్గతంగా జరుగుతున్న చర్చ. ప్రస్తుతం అత్యంత కీలకమైన అంశం నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపిక. ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లుగా సీఎం కేసీఆర్ టికెట్ల విషయంలో మార్పులు చేర్పులు చేస్తారా? అన్నదానిపై భారీగా ఆసక్తి నెలకొంది. ఇంతకీ ప్రశాంత్ కిషోర్ నివేదిక అని ప్రచారంలో ఉన్న అంశాలేంటీ? * కనీసం 30 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చాలి * పార్టీకన్నా ఎమ్మెల్యేలపైనే వ్యతిరేకత ఎక్కువ * ప్రజలకు అందుబాటులో లేని వాళ్లకు టికెట్లు వద్దు * కొత్త ముఖాలను తీసుకురావాలి * ఇతర రంగాల్లో సక్సెస్ అయి.. ప్రజలకు సుపరిచితులయిన వారి పేర్లను పరిశీలించాలి దుబ్బాక ఎన్నికల నుంచి ఇప్పటివరకు టీఆర్ఎస్పై భారీగా విమర్శలు చేస్తోన్న కమలం నేతలు.. టీఆర్ఎస్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్తుందంటూ ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి ఏప్రిల్ లో ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్నది బిజెపి, కాంగ్రెస్ పదేపదే చేస్తున్న ప్రచారం. కర్ణాటక అసెంబ్లీ తో పాటే తెలంగాణకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఈ పార్టీలు భావిస్తున్నాయి. అయితే తాము ముందస్తు కు వెళ్లే అవకాశం లేదని టిఆర్ఎస్ అధినాయకత్వం చెప్తున్నా ఎక్కడో ఓ మూల ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో ఆ అభిప్రాయం ఇంకా పోలేదు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో రాజ్భవన్ వర్గాలు గానీ, కేంద్రం గానీ ముందస్తుకు సుముఖంగా లేరన్నది ప్రజా బాహుళ్యంలో ఉన్న ప్రచారం. ఒక వేళ కేసీఆర్ ముందస్తుకు వెళ్లాలనుకుంటే ఉన్న ఒకే ఒక ఆప్షన్ అసెంబ్లీ రద్దు. ముందస్తు వచ్చినా రాకపోయినా... సాధారణ ఎన్నికలు కూడా అంత దూరంలో ఏమి లేవు. ఈ నేపథ్యంలోనే టికెట్ల అంశంపై ప్రశాంత్ కిషోర్ సర్వేలు నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ సర్వేలు చేస్తున్న మాట వాస్తవమేనని కేసీఆర్ కూడా ఇప్పటికే అంగీకరించారు. పార్టీ పనితీరు ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సర్వేల వివరాలు ఎలా ఉన్నా ఎమ్మెల్యేల పనితీరు పై జరుగుతున్న సర్వేలపై మాత్రం ఆ పార్టీ నేతలకు నిద్ర పట్టడం లేదు. కొత్తగా తమ నియోజకవర్గ పరిధిలోకి ఎవరు వచ్చినా సర్వేల పేరిట ఎక్కడైనా సమాచారం ఉన్నా వెంటనే ఎమ్మెల్యేలు అలర్ట్ అవుతున్నారు. తమకు అనుకూలంగా సర్వేలు వచ్చేందుకు నానా తంటాలు కూడా పడుతున్నారు. * ఎమ్మెల్యే స్థానికంగా అందుబాటులో ఉంటున్నారా? * ఎమ్మెల్యేకు సమస్యలు చెబితే ఎప్పటిలోగా పరిష్కరిస్తున్నారు? * ఈ సారి ఈ ఎమ్మెల్యేకు టికెట్ ఇస్తే గెలుస్తారా? * ఎమ్మెల్యే కాకుండా ఎవరికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉంది? ఈ అంశాలపై సర్వే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. 2018 లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి సక్సెసైన కేసీఆర్ అప్పుడు ఎన్నికల్లో దాదాపుగా మెజార్టీ సిట్టింగులకు మళ్లీ అవకాశం కల్పించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో ఈసారి కూడా అదే ఫార్ములాను అవలంబిస్తారా లేదా అన్నది పార్టీలో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఉమ్మడి జిల్లాలయిన వరంగల్, నల్గొండ, మహబూబ్నగర్, ఆదిలాబాద్, నిజామాబాదులలో మార్పులు చేర్పులకు అవకాశం ఎక్కువగా ఉంటుందని కొందరు అంటున్నారు. ఈ జిల్లాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటమి ఎదురయింది. దెబ్బతిన్న ఈ సెగ్మెంట్ల పై అధినేత కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇక్కడ కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఫిర్యాదులు కూడా అందాయి. ప్రశాంత్ కిషోర్ టీం ప్రస్తుతం చేస్తున్న సర్వేల వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్న కేసీఆర్, కనీసం 30 పైగా సీట్లలో మార్పులు చేస్తేనే మంచిదనే అభిప్రాయంతో ఉన్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ 30 మంది ఎవరు అనే విషయం కేసీఆర్కు తప్ప మిగతా ఎవరికీ క్లారిటీ లేదని చెబుతున్నారు. కేసీఆర్ చాలా సందర్భాల్లో ఎవరూ ఊహించని నిర్ణయాలు తీసుకుంటారు. పీకే 30 మందికి పైగా సిట్టింగులకు టికెట్ ఇవ్వకూడదని అంటే యధావిధిగా దానిని అమలు చేస్తారా లేక ప్రతికూల పరిణామాలు ఉన్న నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా దృష్టి సారించి వాటిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు అన్నది కూడా ఆలోచించాలి. గత రెండు ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్కు ఎంత అవసరమో ఈసారి ఎన్నికల్లో గెలుపు అంతకన్నా ముఖ్యమైనది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ముఖ్యమంత్రి బాధ్యతలను అప్పగించాలన్న వాదన చాలా రోజుల నుంచి పార్టీలో ఉంది. ఈసారి మంచి మెజార్టీ సాధిస్తే ముఖ్యమంత్రి బాధ్యతలను కేటీఆర్కు అప్పగిస్తారన్న భావన పార్టీ నేతల్లో ఉంది. ఇవన్నీ కేసీఆర్ అనుకున్న రీతిలో జరగాలంటే ప్రశాంత్ కిషోర్ ఇస్తున్న రిపోర్టులు కీలకమనే విషయాన్ని పార్టీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. -అప్పరసు నరసింహారావు, పొలిటికల్ బ్యూరో చీఫ్, సాక్షి టీవీ -
తెలంగాణ: ఆది, సోమవారాల్లో పలుచోట్ల వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశంఉందని వాతావరణ శాఖ తెలిపింది. వివిధ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు, ఒకట్రెండు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు వివరించింది. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి ఇంటీరియర్ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. ఇది సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించినట్టు పేర్కొంది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోని సగానికి పైగా జిల్లాలకు విస్తరించినట్లు తెలిపింది. మరో రెండ్రోజుల్లో పూర్తిస్థాయిలో రుతుపవనాలు వ్యాప్తి చెందే అవకాశంఉందని స్పష్టం చేసింది. -
తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
-
పాలన సంస్కరణలతోనే పురోగతి
సాక్షి, హైదరాబాద్: విప్లవాత్మకమైన పాలన సంస్కరణల ద్వారానే ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడి పురోగతి సాధించగలదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. అత్యధిక సంఖ్యలో యువ జనాభాను కలిగి ఉన్న భారత్ అగ్రశ్రేణి దేశంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. యూకే పర్యటనలో భాగంగా శుక్రవారం లండన్లోని భారత హైకమిషనర్ కార్యాలయం నెహ్రూ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. బ్రిటన్కు చెందిన పలువురు కీలక వ్యాపారవేత్తలు, భారతీయ సంతతి ప్రముఖులు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా డిప్యూటీ హై కమిషనర్ సుజిత్ జా య్ ఘోష్ , నెహ్రూ సెంటర్ డైరెక్టర్ అమిష్ త్రిపా ఠి ఆధ్వర్యంలో జరిగిన చర్చాగోష్టిలో మంత్రి అనే క అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్తో మంత్రి కేటీఆర్ దేశానికి రోల్ మోడల్గా తెలంగాణ ‘ఒకవైపు పాలనా సంస్కరణలు, పెట్టుబడులకు అనుకూలమైన స్నేహపూర్వక వాతావరణాన్ని ఏర్పాటు చేయడం, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించి పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా దేశాన్ని ముందుకు తీసుకుపోయేందుకు అవకాశం ఉంటుంది. ఇదే స్ఫూర్తి తో తెలంగాణ పురోగమిస్తూ భారతదేశానికి ఒక రోల్ మోడల్గా నిలుస్తోంది. తెలంగాణ అవతరణ సమయంలో నెలకొని ఉన్న సంక్షోభ పరిస్థితులను అధిగమించి ఈ రోజు ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలకు పెట్టుబడుల గమ్యస్థానంగా రాష్ట్రం మారింది. దీనికి పరిపాలనా సంస్కరణలే ప్రధాన కారణం..’అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ విజయాలు ప్రపంచానికి చాటాలి ‘ప్రజలకు అవసరమైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నాం. ప్రపంచంలోనే అతిపెద్దదైన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును అత్యంత తక్కువ సమయంలో నిర్మించాం. తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలు తెలంగాణకు మాత్రమే పరిమితం కాదు. వీటిని భారతదేశ విజయాలుగా పరిగణించి ప్రపంచానికి చాటాల్సిన అవసరముంది. వివిధ దేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు మాతృదేశం సాధిస్తున్న విజ యాలను ప్రపంచానికి చాటేందుకు కృషి చేయాలి..’అని మంత్రి పిలుపునిచ్చారు. విద్య, ఉపాధి, ఆరి ్థకాభివృద్ధి, దేశంలోని రాజకీయ పరిణామాలు.. తదితర అంశాలపై సమావేశానికి హాజరైనవారు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలు ఇచ్చారు. వేదాంత గ్రూప్ చైర్మన్తో భేటీ వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ వేద్తో కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలపై చర్చించడంతో పాటు హైదరాబాద్కు రావాల్సిందిగా ఆయనకు కేటీఆర్ ఆహ్వానం పలికారు. -
అయ్యో రాములు.. గిట్లయితే ఎట్ల! కొమ్మ విరగాల్నా? కాయ రాలాల్నా?
ఈ రైతు రాములు. కోహెడలో 6 ఎకరాల మామిడి తోట ఉండగా మరో ఐదున్నర ఎకరాల తోట లీజుకు తీసుకున్నాడు. లక్షా70వేలు లీజు కాగా అతని తోటకు 2లక్షల వరకు లీజు వస్తుంది. ఈ లెక్కన 3.70లక్షలు లీజుకే ఖర్చు కాగా 5టన్నులు మాత్రమే దిగుబడి వచ్చింది. అంటే కిలో రూ.45 లెక్క కట్టగా రూ.2.25లక్షలే వచ్చింది. అంటే లీజు ఖర్చే రాలేదు. మరో టన్ను వరకు వస్తుందనుకున్నా కాత ఈదురుగాలులతో నేలరాలింది. ముందే మంచు తేనె రోగం ముంచగా నష్టం తీవ్రంగా ఉందని ఉద్యానఅధికారులను కలిస్తే వారు చెప్పిన నిబంధనలతో నిరాశగా వెనుదిరిగాడు. కరీంనగర్ అర్బన్: ఇది కేవలం రాములు సమస్యే కాదు జిల్లాలో వేలమంది రైతులది ఇదే పరిస్థితి. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుంది నష్టపరిహారం పరిస్థితి. అసలే మంచు తేనే నిండా ముంచగా వచ్చిన అరకొర మామిడి కాయలను ఈదురుగాలులు నేలపాలుచేశాయి. ఎన్నడూ లేనివిధంగా పూత తగ్గగా దిగుబడిపై దిగులు పడ్డ రైతన్నకు అకాల వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. కనీసం ప్రభుత్వం నుంచి నష్టపరిహారమైనా వస్తుందని ఆశిస్తే నిబంధనలు కొరకరాని కొయ్యగా మారాయి. 33శాతం నష్టం నిబంధన వారి ఆశలపై నీళ్లు చల్లుతోంది. 33శాతం నష్టం జరగాలంటే కొమ్మలు విరగాలట.. కాయలు రాలాలట. అరకొర కాత రాలితే నష్టం జరిగినట్లు కాదట. గతంలో 50శాతం పంట నష్టం జరిగితే పరిహారానికి అర్హులుగా పరిగణించేవారు. ఒక రైతుకు ఎకరం మామిడి తోట ఉంటే అందులో 50శాతం నష్టపోయి ఉండాలి. అంటే కూకటి వేళ్లతో చెట్లు కూలడం, కొమ్మలు విరగడం, కాయలు సగానికి పైగా రాలితే పరిహారం దక్కేది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం 50శాతం నుంచి 33శాతానికి తగ్గించింది. అరకొర పండిన పంటను విక్రయించాలంటే ధర కిలో రూ.40–50మాత్రమే పలుకుతోంది. వేయి హెక్టార్లలో దెబ్బతిన్న తోటలు ఇటీవల పలుమార్లు వీచిన బలమైన ఈదురుగాలులు, వడగళ్ల వాన మామిడితోటలను కోలుకోని దెబ్బతీశాయి. జిల్లాలో 2600 హెక్టార్లలో మామిడి తోటలున్నాయి. ఈ సారి అరకొరగా 8,200 టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. మంచు తేనె తెగులుతో పాటు పూత లేకపోవడం, దిగుబడి చేతికందే సమయంలో ప్రకృతిలో మార్పుల కారణంగా ఈదురుగాలులతో వానతో తోటలు ధ్వంసమయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి వీచిన బలమైన గాలులతో వేయి హెక్టార్లలో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. అత్యధికంగా గన్నేరువరం, చిగురుమామిడి, మానకొండూర్ మండలాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. అలాగే చొప్పదండి, రామడుగు, తిమ్మాపూర్, కొత్తపల్లి, గంగాధర, వీణవంక మండలాల్లో తోటలు దెబ్బతిన్నట్లు ఉద్యాన అధికారులు గుర్తించినప్పటికి నిబంధనలు గుదిబండగా మారాయి. ధర అంతంతే కరోనా వైరస్ ప్రభావంతో గత 2020 నుంచి రైతులకు నష్టాలే. 2020కి ముందు కిలో రూ.50–60 పలికిన ధర ప్రస్తుతం రూ.40–50కి మించడం లేదు. కరోనా క్రమంలో కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో పండ్ల వ్యాపారాన్ని నిలిపివేయగా బొమ్మకల్ బైపాస్లో ఏర్పాటు చేశారు. ఈ సారి నుంచే మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు. కాగా ఇతర రాష్ట్రాల వ్యాపారులు కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. నాగ్పూర్, మహరాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల వ్యాపారులు ఇక్కడి ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేసి తరలించడం జరిగే ప్రక్రియ. కానీ కాత తక్కువగా ఉండటంతో అరకొర వ్యాపారులు వస్తుండగా ధర సగానికే పరిమితమైంది. రైతులకు నష్టం ఎన్నడూ లేనంతగా ఈ సారి మామిడి రైతులకు నష్టం జరిగింది. గతంలో మామిడి కాయలతో మార్కెట్ కళకళలాడేది. గతానికి పోల్చితే పావు వంతు కూడ మార్కెట్ లేదు. ధర ఉన్నా కాయ లేకపోవడం తీరని నష్టం. – నిమ్మకాయల పాషా, వ్యాపారి ప్రభుత్వం ఆదుకోవాలి ఎపుడైనా పూతను బట్టి తోటలను పడుతాం. కానీ ఈ సారి నష్టాలే తప్ప లాభం లేదు. ఇందుర్తిలో రూ.2లక్షలు పెట్టి 6ఎకరాల తోట పట్టిన. 2 టన్నులు కూడ రాలే. రూ.80వేలు వచ్చినయి. ప్రభుత్వమే ఆదుకోవాలి. – గంట సమ్మయ్య, కౌలుదారు, ఇందుర్తి -
ఆశగా ఆటగాళ్లు..! తెలంగాణలో ఉద్యోగాల భర్తీలో స్పోర్ట్స్ కోటా అమలు
ఖమ్మం స్పోర్ట్స్: చాన్నాళ్ల తర్వాత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఈక్రమంలో రెండు శాతం స్పోర్ట్స్ కోటా అమలుచేయడమే కాక, ఎలాంటి నిబంధనలు లేకుండా, ఎప్పుడు సాధించిన సర్టిఫికెట్లనైనా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉండడంతో జిల్లా క్రీడాకారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా విద్యా, ఉద్యోగ రంగాల్లో స్పోర్ట్స్ కోటా అమలుచేయాలని క్రీడా రంగ ప్రతినిధులు పోరాటాలు చేశారు. ఈనేపథ్యాన ఉమ్మడి రాష్ట్రంలో విడుదల చేసిన జీఓను ఈసారి నోటిఫికేషన్లలో అమలుచేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఉద్యోగాల పోటీ పరీక్షల్లో సత్తా చాటేందుకు నిరుద్యోగులు క్రీడాకారులు సిద్ధమవుతున్నారు. చదవండి👉 తెలంగాణలో ఇంటర్ పరీక్షలు.. ప్రిన్సిపల్ సంతకం లేకున్నా.. తొలిసారిగా 2012లో... క్రీడాకారులు, క్రీడాసంఘాల పోరాట ఫలితంగా తొలిసారిగా 2012లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 84 జీఓ విడుదల చేశారు. ఈ జీఓ ఆధారంగా అన్ని ఉద్యోగ ఖాళీల భర్తీలో రెండు శాతం స్పోర్ట్స్ కోటా అమలుకు అవకాశం దక్కింది. ఇదే జీఓను ఇప్పుడు అమలుచేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం విశేషం. సీనియర్స్, జూనియర్స్, సబ్ జూనియర్, ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ, అండర్ – 14, 17, 19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీల్లో ఆడి సర్టిఫికెట్లు పొందిన క్రీడాకారుల ఈ కోటా ద్వారా అవకాశం దక్కనుండడంతో ఉద్యోగం సాధించాలనే తపనతో చదువులో నిమగ్నమయ్యారు. నిబంధనలు లేకుండా... రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలవుతుండగా, స్పోర్ట్స్ కోటా అమలుచేయనున్న ప్రభుత్వం ఈసారి మాత్రం మూడేళ్ల నిబంధన లేకుండా అన్ని సర్టిఫికెట్లను పరిగణనలోకి తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. ఏదైనా జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో సాధించిన సర్టిఫికెట్ మూడేళ్ల వరకు అమల్లో ఉంటుందని గతంలో ప్రకటించారు. కానీ ఈసారి పలు ఉద్యోగాలకు వయస్సు నిబంధనలు సడలించినందున స్పోర్ట్స్ కోటా అమలులోనూ ఎప్పటి సర్టిఫికెట్లనైనా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో చాన్నాళ్ల క్రితం సర్టిఫికెట్లు సాధించి, ఇప్పటికీ ఉద్యోగాలు రాని అభ్యర్థులు మేలు చేకూరుతుందని చెబుతున్నారు. అయితే, అత్యధిక సర్టిఫికెట్లు కలిగిన వారికి తొలి ప్రాధాన్యత ఇచ్చే అవకాశమున్నట్లు తెలిసింది. చదవండి👉🏻 దిమాక్ దొబ్బిందా!.. త్రిబుల్ రైడింగ్.. ఆపై మద్యం కూడా.. ఖేలో ఇండియా ఎలా? నాలుగేళ్ల నుంచి దేశంలో ఖేలో ఇండియా పేరిట ఏటా జాతీయస్థాయి క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారు. అయితే, ఈ పోటీల్లో పాల్గొని సర్టిఫికెట్లు సాధించిన వారికి కూడా స్పోర్ట్స్ కోటా అమలవుతుందా, లేదా అనే విషయమై ఇంకా స్పష్టత రావడం లేదు. దీనికి తోడు ఐదారేళ్లలో కొత్తగా పుట్టుకొచ్చిన క్రీడల పరిస్థితి ఏమిటన్నది కూడా తెలియరావడం లేదు. కొన్ని క్రీడాంశాల్లో జిల్లా నుంచే నేరుగా అంతర్జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశముండడంతో ఆయా క్రీడాకారులకు అవకాశం ఇచ్చేది, లేనిది ఇంకా వెల్లడించలేదు. ఈ అంశంపై ప్రత్యేక కమిటీ నియమించాలని క్రీడావర్గాలు కోరుతున్నాయి. ఇది మంచి పరిణామం ఎన్నో ఏళ్లనుంచి స్పోర్ట్స్ కోటాను అన్ని ఉద్యోగాల్లో అమలు చేయాలని పోరాడుతున్నాం. ఇందులో భాగంగా రాష్ట్రప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో స్పోర్ట్స్ కోటా అమలుకు నిర్ణయించడం మంచి పరిణామం. ఇక నుంచి అన్ని నోటిఫికేషన్లలో అమలుచేస్తే బాగుంటుంది. – పుట్టా శంకరయ్య, ఆర్చరీ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి క్రీడాకారులకు ప్రోత్సాహం క్రీడాకారులను ప్రోత్సహించేలా స్పోర్ట్స్ కోటాను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో అమలు చేయడం బాగుంది. ఇప్పటి వరకు కొన్ని శాఖల్లో మాత్రమే నేరుగా స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాకాశాలు లభిస్తున్నాయి. ఈసారి అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి అవకాశం కల్పించడం ఆనందంగా ఉంది. – కె.ఆదర్శ్కుమార్, జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి యువకులకే అవకాశం ఇవ్వాలి రాష్ట్రప్రభుత్వం స్పోర్ట్స్ కోటా ద్వారా యువ క్రీడాకారులకే ఉద్యోగావకాశాలు కల్పిస్తే బాగుంటుంది. ఏది ఏమైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. రాష్ట్రంలోని యువత క్రీడలపై దృష్టి సారించేందుకు ఇది ఉపయోగపడుతుంది. మరింత మంది ఉత్తమ క్రీడాకారులు వెలుగులోకి వస్తారు. – జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షలు, మందుల వెంకటేశ్వర్లు ఉద్యోగం సాధిస్తాననే నమ్మకముంది ఉద్యోగాల భర్తీలో రాష్ట్రప్రభుత్వం స్పోర్ట్స్ కోటా అమలుచేయాలని నిర్ణయించడంపై సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు. ఇప్పటి వరకు జాతీయస్థాయి పోటీల్లో సాధించిన సర్టిఫికెట్లు పనికి రాకుండా పోతాయమోనని ఆవేదన చెందాను. కానీ ప్రభుత్వం నిర్ణయంతో ఈసారి ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం వచ్చింది. – ఎం.జైనాద్ బేగ్ -
గ్రూప్–1 నోటిఫికేషన్.. రేపే గుడ్న్యూస్..!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ఉద్యోగ భర్తీ ప్రక్రియలో ముందడుగు పడింది. ప్రభుత్వ శాఖల వారీగా ఉద్యోగాల భర్తీ ప్రతిపాదనలను ఇప్పటికే ఒకట్రెండుసార్లు క్షుణ్ణంగా పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఆయా శాఖల నుంచి సవరణ ప్రతిపాదనలు కోరింది. శనివారం బోర్డు సమావేశంలో దాదాపు అన్ని శాఖల ప్రతిపాదనలను మళ్లీ పరిశీలించగా సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఈ ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే గ్రూప్–1లో ఇంటర్వ్యూలు రద్దు చేసినందున దీనికి సంబంధించిన జీవో సోమవారం ఉదయానికి వస్తే సాయంత్రానికి 503 గ్రూప్–1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కావొచ్చని సమాచారం. చదవండి👉 ఇక పరీక్షలన్నీ సకాలంలోనే.. -
Sakshi Cartoon: పాల్గొనడానికి ఎవరూ లేర్సార్... పాల్గొనే వారికోసమైనా..
పాల్గొనడానికి ఎవరూ లేర్సార్... పాల్గొనే వారికోసమైనా పోరుబాట చేయాల్సిందే! -
మరో షాకిచ్చిన తెలంగాణ ఆర్టీసీ.. ఈసారి ఏకంగా రూ.10
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు మరో షాకిచ్చింది. ఇప్పటికే సెస్సుల పేరుతో చార్జీలు పెంచిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ రిజర్వేషన్ చార్జీలు పెంచేందుకు సిద్ధమైంది. రిజర్వేషన్ ధరలను రూ.20 నుంచి 30 రూపాయలకు పెంచేందుకు ఆర్టీసీ రంగం సిద్ధం చేసింది. అయితే, గుట్టుచప్పుడు కాకుండా చార్జీల పెంపు నిర్ణయం తీసుకున్న యాజమాన్యం ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. పెరిగిన రిజర్వేషన్ చార్జీలు మార్చి 27 నుంచి అమలు కానున్నట్టు సమాచారం. (చదవండి: సర్కారు గొర్రెల్ని తీసుకొని.. లాభాలు పంచుకుందామంటూ..) -
ఏమైందండీ! షాక్ కొట్టినట్లు అరిచారు!!
ఏమైందండీ! షాక్ కొట్టినట్లు అరిచారు!! -
హైదరాబాద్లో స్వచ్ఛ ఆటోలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
-
Telangana: కొలువుల భర్తీకి కొత్త రోస్టర్!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీలో కీలకమైన రోస్టర్ పట్టిక ఒకటో నంబర్ నుంచి అమల్లోకి రానుంది. రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి రావడంతో రోస్టర్ పాయింట్లు సైతం మొదటి నుంచి పరిగణనలోకి తీసుకోవడం అనివార్యం కానుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనప్పుడు తెలంగాణలో పది జిల్లాలు, రెండు జోన్లు ఉన్నాయి. జిల్లా, జోన్లు ఆధారంగా నియామకాలు చేపట్టే క్రమంలో ప్రభుత్వం రోస్టర్ను ఒకటో నంబర్ నుంచి అమలు చేసింది. ప్రత్యేక రాష్ట్రం నేపథ్యంలో అప్పట్లో ఆ విధానాన్ని ఎంచుకోగా... ఇప్పుడు నూతన జోనల్ విధానం అమల్లోకి రావడంతో మరోమారు రోస్టర్ పాయింట్లు క్రమసంఖ్య ఒకటి నుంచి అమలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం రిజర్వ్ చేసిన పాయింట్ల ఆధారంగా రోస్టర్ను కొనసాగించే వీలు లేకపోవడం, ఈడబ్ల్యూఎస్కు పదిశాతం కోటా ఇవ్వాల్సి రావడంతో కొత్తగా రోస్టర్ పాయింట్ల అమలు దిశగా ఉన్నతాధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. నూతన జోనల్ విధానం ప్రకారం ఇప్పటికే ప్రభుత్వ శాఖల్లో పోస్టుల విభజన, ఉద్యోగుల కేటాయింపులు దాదాపు పూర్తయ్యాయి. ప్రస్తుతం శాఖల వారీగా ఖాళీలపై స్పష్టత రాగా, కొత్త నియామకాల విషయంలో రోస్టర్ అమలుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మారిన కేడర్... కొత్త రోస్టర్ రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమలుతో ఉద్యోగ కేడర్లలో భారీ మార్పులు జరిగాయి. తెలంగాణ ఏర్పాటైన సమయంలో పది జిల్లాలు, రెండు జోన్లు ఉండగా.. ఇప్పుడు 33 జిల్లాలు, ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటయ్యాయి. ఇదివరకు జిల్లా స్థాయిలో ఉన్న పోస్టుల్లో కేవలం నాల్గోతరగతి, సబార్డినేట్ పోస్టులు మాత్రమే జిల్లా కేడర్లోకి వచ్చాయి. మిగతా పోస్టులు జోనల్ స్థాయిలోకి చేర్చారు. అదేవిధంగా ఇదివరకు జోనల్ స్థాయిలో ఉన్న పోస్టులు మల్టీ జోనల్ కేడర్లోకి చేర్చారు. దీంతో ఇదివరకున్న కేడర్తో నియామకాలు చేపట్టడం సాధ్యం కాదు. అదీగాక రోస్టర్ పాయింట్లలో ఈడబ్ల్యూఎస్ కోటా నంబర్లను ఖరారు చేయాలి. ఆ తర్వాత ఖరారైన రోస్టర్ను ఒకటో క్రమ సంఖ్య నుంచి అమలు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగ ఖాళీలు 65వేలు? కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపులు పూర్తవడంతో ఖాళీలపై ఒక అంచనా వచ్చింది. అన్ని విభాగాల్లో కలిపి దాదాపు 65వేల ఖాళీలు ఉన్నట్లు సమాచారం. వీటిలో ప్రత్యక్షంగా భర్తీ చేసే ఉద్యోగాలు, పదోన్నతుల ద్వారా నింపే ఉద్యోగాలపై ప్రభుత్వ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. ప్రత్యక్షంగా భర్తీ చేసే నియామకాలకు నోటిఫికేషన్లను నియామక బోర్డుల ద్వారా చేపట్టాలి. ఇందుకోసం ఆయా శాఖలు రోస్టర్ పాయింట్ల ఆధారంగా ప్రతిపాదనలను ప్రభుత్వ ఆమోదంతో ఆయా బోర్డులకు సమర్పించాలి. అయితే కొత్త రోస్టర్పై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు నోటిఫికేషన్లు వచ్చే అవకాశం లేదు. ఏమిటీ రోస్టర్? ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీలో రిజర్వేషన్లు క్రమపద్ధతిలో అమలు చేసే విధానమే రోస్టర్. రోస్టర్ పాయింట్లు ఒకటి నుంచి వంద వరకు ఉంటాయి. ఒకటో క్రమసంఖ్య జనరల్ మహిళతో మొదలవుతుంది. జనరల్ మహిళ, జనరల్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ మహిళ, ఎస్సీ జనరల్, ఎస్టీ మహిళ, ఎస్టీ జనరల్, బీసీ–ఏ, బీసీ–బీ, బీసీ–సీ, బీసీ–డీ, బీసీ–ఈ కేటగిరీలో మహిళలు, జనరల్, డిజేబుల్ మహిళ, డిజేబుల్ జనరల్ కేటగిరీలకు ఒక్కో క్రమసంఖ్యను రోస్టర్ పాయింట్లలో ఖరారు చేశారు. ఈ పాయింట్ల ఆధారంగా కొత్త నియామకాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఒకసారి రోస్టర్ అమలు చేసి ఎంపిక పూర్తి చేస్తే... ఏ పాయింట్ దగ్గర నియామకాలు పూర్తవుతాయో... తిరిగి నియామకాలు చేపట్టినప్పుడు ఆ పాయింట్ నుంచే క్రమసంఖ్యను కొనసాగించి నియామకాలు చేపడతారు. దీంతో రిజర్వేషన్లు పక్కాగా అమలవుతాయి. -
రాజ్యసభలో మోదీ వ్యాఖ్యలు.. తెలంగాణలో బీజేపీ పరిస్థితి మళ్లీ మొదటికి..?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీజేపీ బాగా పుంజుకుంటోందని భావిస్తున్న ప్రతిసారీ ఏదో ఒక రూపంలో అవరోధాలు, ప్రతికూల వాతావరణం ఏర్పడే పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా పార్టీ పటిష్టంగా మారిందని, బీజేపీ అనుకూల వాతావరణం ఉందనే అంచనాలో రాష్ట్ర పార్టీ నేతలు ఉన్నారు. ఈ సమయంలో రాష్ట్ర విభజనపై రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర బీజేపీని ఇరకాటంలో పడేశాయి. రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా సెంటిమెంట్ రగిలే అవకాశముందనే ఆందోళన ఆ పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. వాస్తవానికి కాంగ్రెస్పై ధ్వజమెత్తడంలో భాగంగా ప్రధాని మోదీ .. కాంగ్రెస్ ఏపీని విభజించిన తీరును తప్పుబట్టారని, కానీ ప్రజలు రాష్ట్ర విభజనకు బీజేపీ వ్యతిరేకమని భావించే ప్రమాదం ఏర్పడిందని వారంటున్నారు. తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార టీఆర్ఎస్ను రాజకీయంగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజావ్యతిరేక విధానాలు, నిర్ణయాల పరంగా గట్టిగా ఎండగడుతూ ప్రజల మద్దతును కూడగడుతున్న సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బందికరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రధాని వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మార్చుకుని బీజేపీపై ధ్వజమెత్తే అవకాశం ఉందని, ఆపార్టీకి మంచి అస్త్రాన్ని అందించినట్టయ్యిందని అంటున్నారు. విమర్శల దాడికి సమాధానం ఎలా? రాష్ట్రంలో గత కొన్నాళ్లుగా టీఆర్ఎస్, బీజేపీల మధ్య వాడీవేడిగా విమర్శలు, ప్రతి విమర్శల పర్వం నడుస్తోంది. ఢీ అంటే ఢీ అన్నట్టుగా వాతావరణం ఉంది. ముఖ్యంగా ఇటీవలి పరిణామాలతో తాము బాగా పుంజుకున్నామని, ప్రజల్లో మద్దతు పెరుగుతూ పార్టీ మంచి ఊపు మీద ఉందనే అభిప్రాయంతో బీజేపీ నేతలు ఉన్నారు. ఈ సమయంలో మోదీ.. ఏపీని కాంగ్రెస్ విభజించిన తీరుతో తెలంగాణ, ఏపీలు ఇప్పటికీ నష్టపోతున్నాయంటూ చేసిన వ్యాఖ్యలతో తమకు ఇబ్బందులు తప్పేలా లేవని నేతలు అంటున్నారు. ప్రధాని మోదీని, జాతీయ స్థాయిలో బీజేపీని లక్ష్యంగా చేసుకుని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు, ఇతర ముఖ్యనేతలు చేసే విమర్శలకు తగిన సమాధానం ఇవ్వలేని పరిస్థితుల్లో పడిపోయామనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఇంతకాలం తెలంగాణ రావడానికి బీజేపీ చేసిన కృషే కారణమని చెబుతూ వచ్చిన తాము ప్రస్తుతం ఆత్మరక్షణలో పడిపోయామని, మోదీ వ్యాఖ్యలను ఎలా సమర్థించగలమని రాష్ట్ర బీజేపీ నేతలు అంటున్నారు. 2014లో పార్లమెంట్ ఉభయసభల్లో బీజేపీ నిర్వహించిన పాత్ర, అప్పట్లో సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ ఇతర ముఖ్యనేతలు పార్టీపరంగా పూర్తి మద్దతును ఇవ్వడం వల్లనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందంటూ.. ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా తాము గొప్పగా చెప్పుకుంటున్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ఆవిర్భావాన్నే ప్రశ్నిస్తున్న విధంగా మోదీ చేసిన వ్యాఖ్యలతో తమ పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్టుగా తయారైందని వాపోతున్నారు. -
సీఎం కేసీఆర్ మేనమామ కన్నుమూత
సాక్షి, కామారెడ్డి: సీఎం కేసీఆర్కు మేనమామ వరుస అయ్యే గునిగంటి కమలాకర్రావు (94) శనివారం ఉదయం కామారెడ్డి పట్టణంలోని దేవి విహార్లో సొంత ఇంటిలో కన్నుమూశారు. రాజంపేట మండలం అర్గొండ గ్రామానికి చెందిన కమలాకర్రావు చాలా కాలంగా కామారెడ్డి పట్టణంలో నివసిస్తున్నారు. ఆయన సంతానం అంతా హైదరాబాద్లో ఉంటారు. కాగా పదేళ్ల క్రితం కమలాకర్రావు భార్య చనిపోయినపుడు దశదిన కర్మకు ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్ హాజరయ్యారు. కామారెడ్డిలో పర్యటించిన ప్రతిసారి సీఎం కేసీఆర్ తన మేనమామ ఇంటికి బాల్యంలో అనేక సార్లు వచ్చేవాడినని, అప్పుడు కామారెడ్డి గంజ్లో బెల్లం వాసన గుప్పుమని వచ్చేదంటూ గుర్తు చేసుకునే వారు. కమలాకర్రావు అంత్యక్రియలకు కేసీఆర్ కుటుంబ సభ్యులెవరూ హాజరుకాలేదు. (చదవండి: వ్యవసాయ భూముల విలువ.. 42 గ్రామాల్లో 150% పెంపు) -
సొంతిల్లు భారమే.. ‘అందుబాటు’ లేకుండా పోతే ఎలా?
ధరలు పైపైకి... హైదరాబాద్ శివార్లలోని నారాపల్లిలో గతేడాది జూలైలో చదరపు గజం ధర రూ.20 వేలు. 500 గజాల స్థలం కొంటే రూ.కోటి అయ్యేది. దానిపై 6 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలు అంటే రూ.6 లక్షలు చెల్లిస్తే సరిపోయేది. జూలైలో చదరపు గజానికి ధర రూ.30 వేలకు, రిజిస్ట్రేషన్ చార్జీ 7.5 శాతానికి పెంచారు. దానితో 500 గజాల స్థలానికి ధర రూ.1.5 కోట్లకు, దీనిపై రిజిస్ట్రేషన్ చార్జీ రూ.11.25 లక్షలకు పెరిగాయి. ఇప్పుడు మరోసారి భూముల ధరలను పెంచు తున్నారు. చదరపు గజానికి ధర రూ.45 వేలకు చేరుతుండటంతో.. అదే 500 గజాల స్థలానికి ధర రూ.2.25 కోట్లు, దీనిపై రిజిస్ట్రేషన్ చార్జీ రూ.16.85 లక్షలకు పెరుగుతోంది. ► అంటే గతేడాది జూలైకి ముందు 500 గజాలకు రూ.కోటి ధర ఉంటే.. ఇప్పుడు రూ.2.25 కోట్లకు రూ.6 లక్షలున్న రిజిస్ట్రేషన్ చార్జీ ఇప్పుడు రూ.16.85 లక్షలకు పెరుగుతోంది. ► వరంగల్ చౌరస్తా ఏరియాలో గతంలో చదరపు గజానికి రూ.27,500 ధరతో.. 500 గజాలకు రూ.1,37,50,000కు చెల్లిస్తే సరిపోయేది. దానిపై రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.8.25 లక్షలు అయ్యేవి. జూలైలో భూముల ధర, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడంతో.. ధర రూ.1,62,50,000 (చదరపు అడుగుకు రూ.32,500 చొప్పున), రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.12,18,750కు (7.5శాతం లెక్కన) చేరాయి. తాజాగా మరోసారి ధరలు పెంచడంతో.. అదే స్థలానికి రూ.2,07,50,000 (చదరపు అడుగు రూ.41,500) ధర, రిజిస్ట్రేషన్ చార్జీల కింద రూ.15,56,250 చెల్లించాల్సి వస్తోంది. అంటే.. ఆ స్థలానికి ఏడు నెలల కింద మొత్తంగా రూ.1,45,75,000 చెల్లిస్తే.. ఇప్పుడు రూ. 2,23,06,250 అవుతోంది. ..రాష్ట్రవ్యాప్తంగా భూముల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయిన పరిస్థితికి చిన్న ఉదాహరణలివి. ఎప్పటికైనా సొంతిల్లు ఉండాలనే సామాన్యుడికి ఇది అశనిపాతంగా మారుతోంది. ప్రభుత్వం భూముల విలువలను సవరించడంతో.. స్థలాల యజమానులు కూడా రేట్లు పెంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భూములు, ఇళ్ల ధరల పరిస్థితిపై ప్రత్యేక కథనం. సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్: ఏడు నెలల క్రితమే భూముల విలువలు, రిజిస్ట్రేషన్ చార్జీలు రెండింటినీ పెంచిన సర్కారు.. తాజాగా మరోసారి స్థలాల ధరలను సవరించనుంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఈ అమల్లోకి రానున్నాయి. ఇలా భూముల విలువలు పెరిగిపోవడం, నిర్మాణ సామగ్రి ధరల భారం కలిసి.. ఇళ్లు, అపార్ట్మెంట్ల ధరలపై ప్రభావం పడింది. భూముల ప్రభుత్వ ధరలకు, మార్కె ట్ విలువకు మధ్య వ్యత్యాసం తగ్గింది. దీనితో స్థలాల యజమానులు భూముల ధరలను పెంచేస్తున్నారు. మరోవైపు కొద్దినెలలుగా సిమెంట్, స్టీల్, ఇసుక వంటి నిర్మాణ సామగ్రి ధరలు బాగా పెరిగాయి. రెండేళ్లుగా కరోనా ప్రభావం వల్ల చాలా మంది కార్మికులు సొంత రాష్ట్రాలకు, ఊర్లకు వెళ్లిపోయారు. దానితో నైపుణ్యమున్న కూలీల రెట్లు రెం డింతలు అయ్యాయి. ఇలా పెరిగిన వ్యయంతో అ పార్ట్మెంట్లు, ఇళ్ల ధరలు భారంగా మారుతున్నా యి. భూముల ధరలు పెరగడం వల్ల అపార్ట్మెంట్ల ధరలు ఒక్కో చదరపు అడుగుకు రూ.500 వరకు పెరుగుతాయని నరెడ్కో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రేమ్కుమార్ ముమ్మారెడ్డి తెలిపారు. సొంతంగా కట్టుకుందామన్నా.. కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి చాలా మంది సొంత ఇల్లు ఉండాలని భావిస్తున్నారు. కొందరు కట్టిన ఇళ్లు కొనుక్కునే పనిలో పడగా.. చాలా మంది ఇప్పటికే కొనిపెట్టుకున్న స్థలాల్లో ఇంటి నిర్మాణాలపై దృష్టిపెట్టారు. అయితే సిమెంట్, స్టీల్, రంగులు, ఎలక్ట్రిక్ వస్తువులు వంటి అన్నిరకాల నిర్మాణ సామగ్రి ధరలు 50 శాతానికిపైగానే పెరిగాయి. లేబర్ ఖర్చులైతే రెండింతలయ్యాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో రవాణా చార్జీలూ పెరిగాయి. దీనితో మొత్తం నిర్మాణ వ్యయం మొతెక్కుతోంది. ఇంటీరియర్లు కాకుండా ప్రధాన నిర్మాణాల కోసం.. ఏడాదిన్నర కింద సగటున చదరపు అడుగుకు రూ.1,200 నుంచి రూ.1,400 వరకు వ్యయం అయ్యేది. కాంట్రాక్టర్లు అయితే రూ.1,500–1,600 వరకు చార్జీ చేసేవారు. పెరిగిన ధరలతో సాధారణంగానే ఒక్కో చదరపు అడుగుకు రూ.1,700 వరకు ఖర్చవుతోంది. అదే కాంట్రాక్టర్లు రూ.1,800 నుంచి రూ.2 వేల వరకూ చార్జి చేస్తున్నారు. ‘అందుబాటు’ లేకుండా పోతే ఎలా? బ్రాండ్ హైదరాబాద్గా వేగంగా ఎదుగుతుండటానికి కారణం.. ఇక్కడ ధరలు అందుబాటులో ఉండటం, తక్కువ జీవన వ్యయమేనని రియల్ఎస్టేట్ వర్గాలు చెప్తున్నాయి. ధరలు ఇలా పెంచుకుంటూ పోతే.. ఇతర నగరాలకు భాగ్యనగరానికి వ్యత్యాసం ఉండదని.. కంపెనీలు నగరానికి వచ్చే విషయంలో ఇబ్బంది అవుతుందని అంటున్నాయి. కాగా.. భూముల ధరలను పెంచిన ప్రభుత్వం.. స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల భారాన్ని ఆరు శాతానికి తగ్గించాలని క్రెడాయ్, ట్రెడా ప్రభుత్వాన్ని కోరాయి. ఈ మేరకు మంత్రులు కేటీఆర్, హరీశ్రావులను కలిసి కలిసి విజ్ఞప్తి చేశాయి. ఇతర రాష్ట్రాల తరహాలో చార్జీలు తగ్గించాలి రెండేళ్లుగా అనిశ్చిత పరిస్థితులతో నిర్మాణ సామగ్రి ధరలు పెరిగాయని, రియల్ ఎస్టేట్ కంపెనీలకు వ్యయభారం ఎక్కువైంద ని క్రెడాయ్ జాతీయ మాజీ అధ్యక్షుడు సి.శేఖ ర్రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్ర ప్రభుత్వాలు స్టాంపుడ్యూటీని తగ్గించి ప్రజలపై భారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. కానీ మన రాష్ట్రంలో అందుకు విరుద్ధంగా భూముల ధరలను, రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచుతున్నారని పేర్కొన్నారు. గత ఆరేళ్లుగా పెంచలేదు కదా అని కరోనా వంటి అనిశ్చితి సమయంలో రెండుసార్లు సవరించడం సరైన నిర్ణయం కాదని వ్యాఖ్యానించారు. భూముల ధరలను పెంచినప్పుడు రిజిస్ట్రేషన్ చార్జీలను సగానికి తగ్గించాలని సూచించారు. అపార్ట్మెంట్లపై ప్రభావం ఇదీ.. ► హైదరాబాద్లోని హయత్నగర్లో పాత రేటు ప్రకారం వెయ్యి చదరపు అడుగుల అపార్ట్మెంట్కు రూ.24 లక్షలు, రిజిస్ట్రేషన్ కోసం రూ.1.8 లక్షలు వ్యయం అయ్యేది. ఇప్పుడు కొత్త రేట్లతో అదే అపార్ట్మెంట్కు ధర రూ.30 లక్షలు, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.2.25 లక్షలకు పెరుగుతున్నాయి. ఇదే పరిమాణమున్న ఫ్లాట్ శంషాబాద్లో గతంలో రూ.35 లక్షలు, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.2.7 లక్షలు ఉంటే.. ఇప్పుడు ధర రూ.45 లక్షలు, చార్జీలు రూ.3,37,500 కట్టాల్సి వస్తోం ది. హైదరాబాద్ వ్యాప్తంగా అంతటా ఇదే పరిస్థితి. పైగా జీఎస్టీ కింద 5 శాతం పన్ను అదనంగా చెల్లించక తప్పదు. ► కరీంనగర్ ప్రకాశం గంజ్ ప్రాంతంలోని అపార్ట్మెంట్లలో చదరపు అడుగుకు 2 వేలు ధర ఉండేది. ఇప్పుడు రూ.2,500 చేశారు. గతంలో 1,500 చదరపు అడుగుల అపార్ట్మెంట్ విలువ రూ. 30లక్షలు, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.1.80 లక్షలుగా ఉండేవి. ఇప్పుడు అదే ఫ్లాట్ విలువ రూ.37.5 లక్షలకు, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.2,81,250కు చేరాయి. ► ఖమ్మంలో వెయ్యి చదరపు అడుగుల అపార్ట్మెంట్కు గతంలో మొత్తంగా రూ. 17 లక్షలు ఖర్చయితే.. ఇప్పుడు రూ. 21.5 లక్షలకు చేరుతోంది. జిల్లాల్లో పరిస్థితి ఇదీ.. ► జనగామలోని ఆర్టీసీ ఎక్స్రోడ్ సమీపంలో.. గతేడాది జూలైకి ముందు 1000 గజాల స్థలం రూ.కోటి, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.6 లక్షలు ఉండేవి. జూలైలో, తాజాగా పెరిగిన ధరలు, చార్జీలతో.. ప్రస్తుతం ధర రూ.2 కోట్లకు, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.15 లక్షలకు చేరుతున్నాయి. ► మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ చౌక్వద్ద గతంలో 200 గజాల స్థలాని కి రూ.47 లక్షలు ధర, రిజిస్ట్రేషన్ చా ర్జీలు రూ.3,52,500అయ్యేవి. ఇప్పు డు పెరిగిన ధరలతో.. అదే స్థలానికి ధర రూ.63.60లక్షలు, చార్జీలు రూ. 4.77 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. ► కరీంనగర్లోని కోర్టు ఏరియాలో స్థలం ధర గతంలో గజానికి రూ.19,500 ఉండేది. 120 గజాల (గుంట) భూమికి రూ.23,40,000 ధర, రూ.1,40,400 రిజిస్ట్రేషన్చార్జీ అయ్యేవి. ఇప్పుడు గజానికి రూ.26,400 లెక్కన అదే స్థలానికి.. రూ.31,68,000 ధర, రూ. 2,37,600 రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించాల్సి రానుంది. ► నిజామాబాద్ జిల్లాలో భూముల ధరలను 30 శాతం వరకు, అపార్ట్మెంట్ల ధరలను 25 శాతం వరకు పెంచారు. పెరిగిన ధరలపై రిజిస్ట్రేషన్ చార్జీల భారం కూడా పడుతోంది. జిల్లా కేంద్రం చుట్టుపక్కల ఎకరానికి రూ.30 లక్షల కనీస ధర ఉండగా రూ.52 లక్షలకు పెంచారు. ► ఖమ్మం నగరంలోని వీడీవోస్ కాలనీ లో 100 గజాల స్థలానికి గతంలో రూ.8,50,000 ధర, రూ.63,500 రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లిస్తే సరిపోయేది. తాజాగా స్థలం విలువ రూ. 11,50,000కు, రిజిస్ట్రేషన్ చార్జీల భారం రూ.86,250కు చేరుతోంది. -
తెలంగాణ: వచ్చేవారంలో పతాకస్థాయికి ఒమిక్రాన్.. తగ్గేది మాత్రం అప్పుడే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ వచ్చే వారం నాటికి తీవ్రస్థాయికి చేరుకుంటుందని కాంటినెంటల్ ఆసుపత్రుల చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వచ్చే వారం తర్వాత తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. దేశంలో రెండు మూడు వారాల్లో పీక్కు చేరుకుంటుందని చెప్పారు. ఫిబ్రవరి చివరి నాటికి తగ్గుముఖం పడుతుందన్నారు. మానవుడి పుట్టుక తర్వాత ఇంత వేగంగా విస్తరించిన వైరస్ లేదని, ఇదే మొదటిసారి అని తెలిపారు. ప్రస్తుతం కరోనా వైరస్ తీవ్రత, వ్యాప్తి, చికిత్స, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై డాక్టర్ గురు ఎన్ రెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. 80 శాతం మందికి వైరస్... మీజిల్స్ వైరస్ తీవ్రంగా విస్తరిస్తుంది అనుకున్నాం. కానీ ఒమిక్రాన్ దానిని మించిపోయింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా 80 శాతం మంది వైరస్ బారినపడతారు. 50 నుంచి 80 శాతం వేగంతో విస్తరిçస్తున్నందున త్వరగా ఇన్ఫెక్ట్ చేస్తుంది. దగ్గు, జలుబు తుంపర్ల ద్వారా ఇది విస్తరిస్తుంది. మాస్క్ లేకుండా ఉంటే మరింత వేగంగా విస్తరిస్తుంది. ఇళ్లలో ఒకరికి వస్తే ఇతరులకూ వ్యాపిస్తుంది. (చదవండి: ఆటలు వద్దు.. సూచనలు జారీ చేసిన విద్యాశాఖ కమిషనర్) ఊపిరితిత్తులను ఇన్ఫెక్ట్ చేయదు ఒమిక్రాన్ సోకినప్పుడు ఎక్కువ కేసుల్లో లక్షణాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు ఉంటాయి. గొంతులో ముక్కులో ఉండే వైరస్ ఇది. ఊపిరితిత్తులను ఇన్పెక్ట్ చేయదు. డెల్టా మందులు పనికిరావు డెల్టాకు వాడే మందులు ఒమిక్రాన్కు పనికిరావు. డెల్టాకు స్టెరాయిడ్స్, రెమిడిసివిర్, మోనొక్లోనాల్ యాంటీబాడీస్ ఉపయోగించాం. కానీ ఒమిక్రాన్కు ‘మాన్లువిరపిర్’అనే మాత్ర వేసుకోవాలి. ఇది ఎం తో సురక్షితమైంది. మొదటి రెండ్రోజులు జ్వరం అ లాగే ఉంటే ఈ మందు వేయొచ్చు. కానీ గర్భిణిలు, త్వరలో ప్రెగ్నెన్సీ వచ్చే వారికి ఇవ్వకూడదు. ఈ మందు తీసుకున్న ఆరు నెలల వరకు ప్రెగ్నెన్నీ కో సం ప్రయత్నించకూడదు. కొందరు అనుభవం లేని డాక్టర్లు ఇప్పటికీ అనవసరంగా క్లోరోక్విన్, ఐవర్మెక్టిన్, యాంటీబయోటిక్ మందులు ఇస్తున్నారు. డెల్టానా, ఒమిక్రానా తెలుసుకోవచ్చు ఎస్ జీన్ ఆర్టీపీసీఆర్ కోవిడ్ టెస్ట్చేస్తే అందులో ఒమిక్రానా లేదా డెల్టా అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఈ పరీక్షలు ప్రభుత్వంలో అందుబాటులో లేవు. ప్రైవేట్ పరీక్ష కేంద్రాల్లో కొన్నిచోట్ల చేస్తున్నారు. మేము మా ఆస్పత్రిలో రూ.1,200 తీసుకుని ఔట్ పేషెంట్లకు, అవసరమైన వారికి కూడా చేస్తున్నాం. డోలో వేసుకుంటే చాలు: ఒమిక్రాన్లో జ్వరం వస్తే డోలో వేసుకుంటే సరిపోతుంది. ఏడు రోజులు ఐసోలేషన్లో ఉండి, చివరి 24 గంటల్లోపు జ్వరం లేకుంటే సాధారణ జీవనంలోకి రావొచ్చు. డోలో వేసుకున్నా రెండు మూడు రోజుల్లో జ్వరం తగ్గకపోతే అప్పుడు డాక్టర్ను సంప్రదించాలి. ఇది సోకితే భవిష్యత్తులో కోవిడ్ రాదు ఒమిక్రాన్ వచ్చిపోయిన వారికి దీర్ఘకాలిక రోగనిరోధక శక్తి వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అది ఏళ్లపాటు ఉంటుందంటున్నారు. మళ్లీ భవిష్యత్తులో కోవిడ్ రాకుండా కాపాడుతుందని అంటున్నారు. ఒమిక్రాన్ వచ్చినవారికి డెల్టా వేరియంట్ వచ్చే అవకాశం ఉండదు. కానీ డెల్టా వచ్చిన వారికి ఒమిక్రాన్ వస్తుంది. బూస్టర్తో మెరుగైన రక్షణ రెండు వ్యాక్సిన్ల తర్వాత బూస్టర్ తీసుకోవాలని సూచిస్తున్నాం. మూడు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారికి పూర్తిస్థాయి భద్రత ఉంటుంది. ఒమిక్రాన్ వచ్చినా 90 శాతం మందికి ఐసీయూకు వెళ్లే ప్రమాదం ఉండదు. మరణాలు ఉండవు. అలసట, తలనొప్పి ఉంటాయి ఒమిక్రాన్ వచ్చి తగ్గిన తర్వాత మూడు నాలుగు వారాల వరకు అలసట, తలనొప్పి, ఆందోళనతో కూడిన మానసిక స్థితి ఉంటుంది. ఒమిక్రాన్ వైరస్ వెన్నెముక ద్రవంలోకి చేరుకొని, తర్వాత మెదడుకు చేరుకొని అక్కడ వాపు తీసుకొస్తుంది. దీనివల్ల నాలుగైదు వారాలు పై సమస్యలు వస్తాయి. నిద్ర సరిగా పట్టక పోవడం ఉంటుంది. పిల్లలు తట్టుకుంటున్నారు పిల్లలు ఒమిక్రాన్ను తట్టుకుంటున్నారు. ఎవరికీ ఏమీ కావట్లేదు. తల్లిదండ్రులు భయపడి పిల్లల్ని ఆస్పత్రులకు తీసుకొచ్చి చూపిస్తున్నారు. 10% కంటే తక్కువ ఐసీయూ ఆక్యుపెన్సీ హైదరాబాద్లో మాలాంటి ఐదారు పెద్దాసుపత్రుల్లోని ఐసీయూల్లో 10 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ ఉంది. కొందరు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలని కోరుకుంటూ వస్తున్నారు. కొందరు కొత్త మందుల కోసం వస్తున్నారు. మన ప్రభుత్వాలను అభినందించాలి మన దేశంలో వ్యాక్సినేషన్ బాగా జరగడం వల్ల మరణాలు పెద్దగా లేవు. మరణించేవారిలో 90 శాతం మంది వ్యాక్సిన్ తీసుకోనివారే. వ్యాక్సినేషన్తో ఎంతో ప్రయోజనం చేకూరింది. తెలంగాణ , ఏపీల్లో పీహెచ్సీల్లో సైతం వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచిన ప్రభుత్వాలను అభినందించాలి. (చదవండి: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. హాఫ్ హెల్మెట్కు బై బై?) -
పాజిటివిటీ రేటు 10 శాతం దాటితే తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ: డీహెచ్ శ్రీనివాసరావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈసందర్భంగా ఆరోగ్య విభాగం డైరెక్టర్ శ్రీనివాసరావు కోర్టుకు నివేదిక సమర్పించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 3.16 శాతంగా ఉందని, రాత్రి కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధించే పరిస్థితులు లేవని కోర్టుకు తెలిపారు. పాజిటివిటీ రేటు 10 శాతం దాటితే రాత్రి కర్ఫ్యూ ఆంక్షలు అవసరం అవుతాయని పేర్కొన్నారు. గత వారంలో ఒక్క జిల్లాలోనూ పాజిటివిటీ రేటు 10శాతంగా నమోదు కాలేదని వెల్లడించారు. మెదక్ లో అత్యధికంగా 6.45, కొత్తగూడెంలో అతి తక్కువగా 1.14 శాతం పాజిటివిటీ రేటు ఉందని అన్నారు. జీహెచ్ఎంసీలో 4.26, మేడ్చల్ లో 4.22 శాతం పాజిటివిటీ రేటు ఉందని నివేదికలో పేర్కొన్నారు. ఐసీయూ, ఆక్సిజన్ పడకల ఆక్యుపెన్సీ 6.1శాతంగా ఉందని నివేదికలో చెప్పుకొచ్చారు. ముందు జాగ్రత్త చర్యగా జనం గుమిగూడకుండా ఈనెల 31 వరకు ఆంక్షలు పొడిగించామని తెలిపారు. వారం రోజులుగా రోజుకు లక్షకు పైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని కోర్టు దృష్టికి తెచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి జ్వరం సర్వే జరుగుతోందని, మూడు రోజుల్లోనే లక్షణాలున్న 1.78 లక్షల మందికి కోవిడ్ కిట్లు పంపిణీ చేశామని తెలిపారు. తెలంగాణలో ఇప్పటివరకు 18 ఏళ్ల లోపు వారికి 59 శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందని డీహెచ్ శ్రీనివాసరావు వెల్లడించారు. 2.16 లక్షల మందికి ప్రికాషన్ డోసు కూడా ఇచ్చామని అన్నారు. అన్నీ తప్పుడు లెక్కలు కాగా, ప్రభుత్వం తప్పుడు గణాంకాలు సమర్పిస్తోందని పిటిషనర్ల న్యాయవాదులు తమ వాదన వినిపించారు. మూడు రోజుల్లో 1.70 లక్షల జ్వర బాధితులు బయటపడటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనమని అన్నారు. ప్రభుత్వ కిట్లలో పిల్లల చికిత్సకు అవసరమైన మందులు లేవని న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఈక్రమంలో ఏజీ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటోదని అన్నారు. ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు మాస్కులు, భౌతిక దూరం కూడా అమలు కాకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. కోవిడ్ నిబంధనలను జీహెచ్ఎంసీ, పోలీసులు కఠినంగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పరిస్థితిని వివరించేందుకు డీహెచ్ శ్రీనివాసరావు తదుపరి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కరోనా కేసులపై విచారణను ఈ నెల 28కి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. -
కీలక విషయాలు వెల్లడి.. రాష్ట్రాల కోవిడ్ మృతుల సంఖ్యలో భారీ తేడా?
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాలకు సంబంధించిన కోవిడ్ మరణాల లెక్కల్లో కొన్ని విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నమోదు చేసిన మృతుల సంఖ్యకు, కోవిడ్ పరిహారం పొందేందుకు వచ్చిన వినతులకు మధ్య భారీ తేడా ఉన్నట్టు తేలింది. కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50 వేలు పరిహారం ఇవ్వాలని గతంలో సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఎన్ని కుటుంబాలకు పరిహారం చెల్లించారో వివరాలు ఇవ్వాలని సుప్రీం కోర్టు మరోసారి ఆదేశాలివ్వగా రాష్ట్రాలు ఆ మేరకు వివరాలు సమర్పించాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 2,13,890 కుటుంబాలు పరిహారం కోరాయి. వారిలో 92,275 మందికి పరిహారం అందించారు. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 1,41,737 మరణాలు సంభవించాయి. (చదవండి: 2.2కు తగ్గిన ఆర్–వ్యాల్యూ.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే?) గుజరాత్లో 9, తెలంగాణలో 7 రెట్లు తేడా అదే సమయంలో గుజరాత్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ తేడా కనిపిస్తోంది. గుజరాత్ ప్రభుత్వ లెక్కల ప్రకారం అక్కడ 10,094 మంది కోవిడ్తో మృతి చెందారు. 89,633 మంది పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 58,843 కుటుంబాలకు చెల్లింపులు జరిగాయి. తెలంగాణ ప్రభుత్వ లెక్కల ప్రకారం అక్కడ కేవలం 3,993 కోవిడ్ మరణాలు నమోదవగా.. పరిహారం కోసం 28,969 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 12,148 కుటుంబాలకు సాయం అందించారు. అంటే గుజరాత్లో నమోదైన మృతుల సంఖ్యకు 9 రెట్లు అదనంగా.. తెలంగాణలో నమోదైన మృతుల సంఖ్యకు 7 రెట్లు అదనంగా పరిహారం కోసం దరఖాస్తులు వచ్చాయి. ఇక మరణాల సంఖ్య తక్కువ, పరిహారాలు కోరుతున్నవారి సంఖ్య ఎక్కువ ఉండటంపట్ల సుప్రీం కోర్టు స్పందించింది. మృతుల సంఖ్యలో వ్యత్యాసంపై తాము దృష్టి పెట్టడం లేదని, పరిహారం కోరినవారికి సాయం అందిస్తే చాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇదిలాఉండగా.. కరోనా సోకిన 30 రోజుల్లో అనారోగ్య కారణాలతో ఆ వ్యక్తులు మరణించినా, ఆత్మహత్యకు పాల్పడినా వాటిని కోవిడ్ మరణాలుగా పరిగణించాలని సుప్రీం కోర్టు గతంలో మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అలాగే దరఖాస్తు చేసుకునేందుకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా బాధిత కుటుంబాల్లో అవగాహన కల్పించాలని చెప్పింది. (చదవండి: ముంచుకొస్తున్న ముప్పు.. 248 రోజుల తర్వాత అత్యధిక కేసులు) -
ఆ డాక్టర్ భార్యకూ ఒమిక్రాన్.. తెలంగాణలో ఇది మొదటిసారి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒమిక్రాన్ కరోనా వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. ఇటీవల ఒక విదేశీయుడి నుంచి హైదరాబాద్ కార్పొరేట్ ఆస్పత్రికి చెందిన డాక్టర్కు ఒమిక్రాన్ సోకగా ఆదివారం ఫలితాల్లో ఆ వైద్యుడి భార్యకూ ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొదటిసారి ఒమిక్రాన్ రెండో కాంటాక్ట్కు కూడా వ్యాపించినట్లు తేలింది. ఇది ప్రమాదకరమైన పరిణామమని వైద్యులు చెబుతున్నారు. ఆ డాక్టర్ భార్యతో సహా ఆదివారం రాష్ట్రంలో 3 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఆమెతో కాంటాక్ట్లో ఉన్న వారందరినీ క్వారంటైన్లో ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ సూచించింది. (చదవండి: 15–18 ఏళ్ల పిల్లలందరికీ టీకాలు.. హైదరాబాద్కు ఊరట) ఒమిక్రాన్ సోకిన ఇద్దరిలో ఒకరు సోమాలియా దేశస్తుడు కాగా మరొకరు కెన్యా వ్యక్తి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 44కు పెరిగింది. ఇందులో 10 మంది రికవర్ అయ్యారు. కాగా ఆదివారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 248 మంది రాగా వీరిలో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. ఈ ఇద్దరిలో ఒమిక్రాన్ వేరియంట్ ఉందా? లేదా? గుర్తించేందుకు ప్రయోగశాలకు వీరి నమూనాలను పంపారు. మరోవైపు రాష్ట్రంలో కొత్తగా 109 కరోనా కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 6,80,662కు పెరిగింది. కరోనాతో ఒకరు మృతిచెందగా.. ఇప్పటి వరకు మొత్తం 4,022 మంది మృతిచెందారు. (చదవండి: కేపీహెచ్బీ కాలనీ.. హాస్టల్లో యువతి ఆత్మహత్య ) -
తెలంగాణ: డిసెంబరులో ఉచిత బియ్యం 5 కిలోలే.. రాష్ట్ర వాటా బందు!
సాక్షి, సిటీబ్యూరో: కరోనా కష్ట కాలంలో ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా ఉచిత బియ్యం ఇక యూనిట్ (లబ్ధిదారు)కు 5 కిలోల చొప్పున మాత్రమే పంపిణి జరగనుంది. కేంద్రం ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం (పీఎంజీకేవై) కింద ఉచిత బియ్యం పంపిణీ ప్రక్రియ గడువు 2022 మార్చి వరకు పొడిగించి కోటా విడుదల చేసినప్పటికీ రాష్ట్ర కోటాపై నిర్ణయం జరగలేదు. ఇప్పటి వరకు పీఎంజీకేవై కింద కేంద్రం యూనిట్కు అయిదు కిలోలు మాత్రమే కోటా కేటాయించినా.. రాష్ట్ర ప్రభుత్వం మరో అయిదు కిలోలు కలిపి యూనిట్కు 10 కిలోల చొప్పున పంపిణీ చేస్తూ వచ్చింది. తాజాగా కేంద్రం ఉచితం బియ్యం గడువు పొడిగించినా.. రాష్ట్ర ప్రభుత్వ మాత్రం కేంద్రం కోటాకే పరిమితమైంది. ఈ నెలలో ఉచిత బియ్యం కోటాను 5 కిలోలకు పరిమితం చేస్తూ పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. (చదవండి: Police Slapped Man Video: ఎందుకు కొట్టావు? పోలీసులకు చుక్కలు చూపించిన వ్యక్తి) ఉచిత బియ్యం ఇలా.. ► కరోనా కష్టకాలంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభమైంది. గతేడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు యూనిట్కు 12 కిలోల చొప్పున, ఆ తర్వాత జూలై నుంచి ఆగస్టు వరకు యూనిట్కు 10 కిలోల చొప్పున పంపిణీ చేశారు. ► సెకండ్ వేవ్ నేపథ్యంలో మొదటగా ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉచిత బియ్యం పంపిణీ చేయాలని భావించినా.. కరోనా సంక్షోభం వెంటాడుతుండటంతో నవంబరు వరకు గడువు పొడిగించారు. తాజాగా మరో నాలుగు నెలల వరకు పొడిగించారు. ► హైదరాబాద్ మహానగరంలో ఆహార భత్రద కార్డులు కలిగిన సుమారు 17.21 లక్షల కుటుంబాలున్నాయి. ఇందులో 59.55 లక్షల యూనిట్లు ఉన్నాయి. -
ముహూర్తం ఖరారు.. కి.మీ.కు 15 నుంచి 30 పైసలు పెంపు!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచేందుకు కసరత్తు జరుగుతోంది. వారం పదిరోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నెల రోజుల క్రితం ఆర్టీసీ అధికారుల తో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సమీక్షలో బస్సు చార్జీల అంశం ప్రస్తావనకు వచ్చిన విషయం తెలిసిందే. డీజిల్ భారం తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో చార్జీలను పెంచాలని అధికారులు సీఎంను కోరారు. తదుపరి మంత్రివర్గ సమావేశంలో దీనిపై ని ర్ణయం తీసుకుంటామని, ఈలోపు ప్రతిపాదనలు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. దీం తో నాలుగు ప్రతిపాదనలను అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయానికి సమర్పించారు. పెంపునకు ప్రభుత్వం కూడా సాను కూలంగానే ఉందన్న అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతోంది. కొన్ని రాజకీయ కారణాలతో నెల రోజులుగా ఈ కసరత్తు పెండింగులో పడింది. తాజాగా మరో సారి ఈ అంశంలో కదలిక వచ్చినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి భేటీ పిలుపు కో సం ఎదురుచూస్తున్న ఆర్టీసీ యాజమాన్యం.. ఉన్నతాధికారులతో మరోసారి ఈ అంశాన్ని ప్రస్తావించినట్టు సమాచారం. వా రం పది రోజుల్లో సమావేశం నిర్వహించి, ఓ ప్రతిపాదనకు ఆమోదం తెలిపే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. (చదవండి: హైదరాబాద్: సదర్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు) కి.మీ.కు 25 పైసల ప్రతిపాదనకు మొగ్గు రెండేళ్ల క్రితం ఆర్టీసీలో సమ్మె తర్వాత 2019 డిసెంబరులో ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలను సవరించింది. అప్పట్లో కిలోమీటరుకు 20 పైసల మేర పెంచింది. దీనివల్ల ప్రజలపై ఏటా రూ.550 కోట్ల భారం పడుతోంది. చార్జీలు పెంచిన సమయంలో డీజిల్ ధర లీటరుకు రూ.68గా ఉంది. ఇప్పుడది రూ.105కు చేరుకుంది. తాజాగా కేంద్రం సుంకం తగ్గించటంతో రూ.90 దిగువకు (ఆర్టీసీకి రాయితీ ధర మేరకు) చేరింది. అయినా... గతంలో చార్జీలు పెంచినప్పటి నుంచి ప్రస్తుత ధరతో బేరీజు వేసుకుంటే లీటరుపై రూ.20కి పైనే ఎక్కువగా ఉంది. అప్పటితో పోలిస్తే నిత్యం అదనంగా రూ.1.22 కోట్ల కంటే ఎక్కువ భారం పడుతోంది. ఈ నేపథ్యంలో చార్జీల పెంపు అనివార్యమేనన్నది ఆర్టీసీ అభిప్రాయం. ఇవీ ప్రతిపాదనలు ప్రభుత్వానికి ఆర్టీసీ ఇటీవల నాలుగు రకాల ప్రతిపాదనలు పంపింది. కి.మీ.కు 15 పైస లు, 20 పైసలు, 25 పైసలు, 30 పైసలు.. ఇలా దేని ప్రకారం ఎంత ఆదాయం పెరుగుతుందనే లెక్కలు అందించారు. 20 పైసలు పెంచితే రూ.625 కోట్ల ఆదాయం పెరుగుతుందని, 25 పైసలు పెంచితే దాదాపు రూ.750 కోట్లు పెరుగుతుందని, 30 పైసలైతే రూ.900 కోట్లకు పైగా పెరుగుతుందని పేర్కొన్నారు. ఇందులో కి.మీ.కు 25 పైసలు పెంచే ప్రతిపాదన అనుకూలంగా ఉంటుందన్న అభిప్రాయాన్ని ఆర్టీసీ వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. 30 పైసలైతే ఆర్టీసీకి మ రింత మెరుగ్గా ఉండనున్నా.. ప్రజలు భారం గా భావించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో మధ్యేమార్గంగా 25 పైసల పెంపుపై సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. తాజా తగ్గింపుతో రోజుకు రూ.90 లక్షలు ఆదా కేంద్రం తాజాగా ఎక్సైజ్ సుంకంపై తీసుకున్న నిర్ణయంతో చమురు ధరలు కొంతమేర తగ్గాయి. లీటరు డీజిల్పై రూ.10 తగ్గడంతో ఆర్టీసీకి పెద్ద ఊరటగానే మారింది. దీంతో రోజువారీ వినియోగిస్తున్న 6.50 లక్షల లీటర్ల డీజిల్పై లెక్కగడితే రూ.65 లక్షలు నేరుగా ఆదా అవుతుంది. ఆర్టీసీ వినియోగిస్తున్న అద్దె బస్సులపై వచ్చే ఆదాను కూడా జోడిస్తే అది రూ.90 లక్షల వరకు చేరుకుంటుంది. (చదవండి: TRS MPTC: గొర్రెల కాపరిగా టీఆర్ఎస్ ఎంపీటీసీ.. రోజూ కూలీ రూ.500) -
ముందే వచ్చిన సందడి
-
తడిసిముద్దయిన తెలంగాణ.. ఫొటోలు, వీడియోలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు సోమవారం మరింత దంచికొట్టాయి. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్నగర్, మెదక్ జిల్లాల్లో అధిక వర్షాపాతం నమోదైంది. (చదవండి: Doctor Missing Case: వీడని మిస్టరీ.. డాక్టర్ జయశీల్రెడ్డి ఏమయ్యారు?) సోమవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు భారీగా వానలు పడటంతో రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో 17.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పాల్వంచలో 16.4, చుంచుపల్లిలో 16.1, లక్ష్మీదేవిపల్లిలో 14.8, దమ్మపేటలో 12.6, టేకులపల్లిలో 11.4, అన్నపురెడ్డిపల్లిలో 10.8, ముల్కలపల్లిలో 10 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా సంగెంలో 14.8 సెం.మీ, నడికుడలో 14.5, బయ్యారంలో 12.3, చింతగట్టులో 10.8, ఎల్కతుర్తిలో 10, ధర్మసాగర్లో 10.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది. (చదవండి: Jobs In Telangana: తెలంగాణలో 65 వేల ఖాళీలు భర్తీ చేసేలా..) భారీ వర్షాలకు లోయర్ మానేర్ గేట్లన్నీ ఎత్తారు.. Lower manair dam right now all gates are open. #Telangana #telugunews pic.twitter.com/vsOpIiR1uj — Janam Sakshi news (@JanamsakshiDist) September 7, 2021 Lower Manair #Dam also known as #LMD was constructed across the #Manair #River, at #Alugunur village, #Thimmapur mandal, #Karimnagar District, in the #India state of #Telangana Drone View #rain #water pic.twitter.com/7Ndz1nDcNH — Shankar Updates 🇮🇳 (@shankar0091) September 6, 2021 సిరిసిల్లల్లో రోడ్లన్నీ జలమైన దృశ్యాలు.. #Telangana: Several roads waterlogged in Sircilla town due to incessant rainfall in the area via ANI pic.twitter.com/jIrg8kZTnA — Jagran English (@JagranEnglish) September 7, 2021 భారీ వర్షానికి కరీనంగర్ పరిస్థితి #kareemnagarrain #kareemnagarflood#Telangana pic.twitter.com/FVCVhVU8kT — Mohammad fasahathullah siddiqui (@MdFasahathullah) September 7, 2021 -
తెలంగాణలో 65 వేల ఖాళీలు భర్తీ చేసేలా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను జోన్లలోని కేడర్ల వారీగా భర్తీ చేసేందుకు కసరత్తు పూర్తయింది. అన్ని శాఖలు తమతమ పరిధిలోని ఖాళీల సంఖ్యతో సిద్ధంగా ఉన్నాయి. దాదాపు 65 వేలకు పైగా ఖాళీలున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది. ఈ నేపథ్యంలో 50 వేల నుంచి 65 వేల వరకు పోస్టుల భర్తీకి ఏకకాలంలో నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశాలున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. స్థానికతపై రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల మేరకు జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కేడర్ల వారీగా.. మంజూరైన పోస్టులు, అందులో పనిచేస్తున్న ఉద్యోగుల విభజనకు సంబంధించిన వివరాలను నిర్దేశిత నమూనాలో అన్ని ప్రభుత్వ శాఖలు సోమవారం తమ పరిధి లోని విభాగాల నుంచి తెప్పిం చుకున్నాయి. (చదవండి: నూటొక్క జిల్లాల.. కేటుగాడు!) రాష్ట్ర ఆర్థిక శాఖ మంగళ, బుధ, గురువారాల్లో ఆయా ప్రభుత్వ శాఖలతో వరుసగా మూడు రోజులపాటు సమావేశాలు నిర్వహించి రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగుల విభజనకు తుది రూపు ఇవ్వనుంది. దీంతో పాటు ఆయా కేడర్ల వారీగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను సంబంధిత శాఖల నుంచి సేకరించనుంది. ఈనెల 9తో అన్ని శాఖల్లోని కేడర్ల వారీగా ప్రభుత్వానికి స్పష్టమైన సమాచారం రానుంది. దానికితోడు రిక్రూట్మెంట్ ఇతరత్రా సర్వీసు నిబంధనలు తదితర అంశాలన్నింటిపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు అన్ని శాఖల అధికారులతో సమీక్షించనున్నారు. ఒకేసారి 50 వేల పోస్టులకు.. శాఖల వారీగా ఖాళీ పోస్టులకు సంబంధించిన వివరాలతో రాష్ట్ర ఆర్థిక శాఖ నివేదికను సిద్ధం చేయనుంది. ఈ నెల 10 లేదా ఆ తర్వాత సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమావేశమై ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులకు సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆర్థిక శాఖ సమర్పించనున్న ప్రతిపాదనలతో ముఖ్యమంత్రి సంతృప్తి చెందితే భర్తీకి మార్గం సుగమం కానుంది. దాదాపు ఏడు నెలల కింద సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఒకేసారి 50 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు రావాల్సి ఉంది. నవంబర్ చివరి వారంలో హుజూరాబాద్ శాసనసభ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశాలుండడంతో, ఎన్నికలకు నెల రోజుల ముందే కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. (చదవండి: TS: గెజిట్ అమలుకు గడువు పెంచండి) -
దీపావళి తర్వాతే హుజూరాబాద్ ఉప ఎన్నిక!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక దీపావళి పండుగ తర్వాతే జరుగనుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు.. ప్రస్తుతం హుజూరాబాద్ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘కొద్దిరోజులుగా కురుస్తున్న వానలు, పలుచోట్ల వరదలు పోటెత్తుతుండటం, వరుసగా పండుగలు రానుండడంతోపాటు కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో.. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని తెలంగాణ సహా 11 రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, సలహాదారులు ఈసీ దృష్టికి తెచ్చారు. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో నిర్వహించాల్సిన ఉప ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయడం లేదు..’’ అని తెలిపింది. ఉప ఎన్నికలకు సంబంధించి ఈ నెల ఒకటిన ఆయా రాష్ట్రాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అభిప్రాయాలు తెలుసుకున్నామని వివరించింది. అధికారులు ఆయా రాష్ట్రాల్లో ఉప ఎన్నికల నిర్వహణలో ఉన్న సవాళ్లను వివరించారని.. పండుగల సీజన్ ముగిశాకే ఉప ఎన్నికలు నిర్వహించాలని కోరారని వెల్లడించింది. అక్టోబర్ నుంచి కరోనా మూడో వేవ్ ప్రారంభం కావచ్చని కేంద్రం, పలు పరిశోధన సంస్థలు, సాంకేతిక నిపుణుల కమిటీలు అంచనా వేసిన విషయాన్ని తమ దృష్టికి తెచ్చారని పేర్కొంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, ప్రస్తుతానికి ఉప ఎన్నికలు నిర్వహించవద్దని నిర్ణయించినట్టు ప్రకటించింది. నవంబర్ చివరివారంలోనే.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురు స్తున్నాయి. ఈ నెలాఖరు నాటికి నైరుతి రుతుపవనాల ప్రభావం తగ్గి.. వానలు తగ్గుముఖం పడతా యి. అక్టోబర్ మూడో వారంలో దసరా, నవంబర్ తొలివారంలో దీపావళి పండుగలు ఉన్నాయి. మూడో వేవ్ వస్తుందని నిపుణులు హెచ్చరించిన అక్టోబర్ నెల కూడా అప్పటికి ముగిసి.. కరోనా పరిస్థితిపై స్పష్టత రానుంది. తర్వాత ఉప ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలై.. నవంబర్ చివరివారంలో లేదా డిసెంబర్ తొలివారంలో ఉప ఎన్ని కలు నిర్వహించే అవకాశం ఉంది. ఈటల రాజేం దర్ తన ఎమ్మెల్యే పదవికి జూన్ 12న రాజీనామా చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం ఆరు నెలలలోగా.. అంటే డిసెంబర్ 12 లోగా హుజూరాబాద్కు ఉప ఎన్నిక నిర్వహించాలి. ఆలోగా ‘దళితబంధు’ కొలిక్కి.. ఈసీ ప్రకటన మేరకు.. హుజూరాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ రావడానికి రెండు నెలలకుపైగా సమయం ఉంది. ఆలోగా నియోజకవర్గం పరిధిలో దళితబంధు పైలట్ ప్రాజెక్టు అమలును పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలోని ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల సాయంతో ఉపాధి కల్పించేందుకు ఇప్పటికే చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే లబ్ధిదారుల గుర్తింపు, నిధుల విడుదల జరిగాయి. ఎన్నికల షెడ్యూల్ నాటికి లబ్ధిదారులకు ఉపాధి ప్రక్రియ పూర్తి చేయనుంది. (చదవండి: KBC-13 : కేబీసీలో అనూహ్యంగా కేటీఆర్...ఎలాగంటే!) -
గుడ్న్యూస్.. పిల్లలకూ టీకా రెడీ.. 15 నుంచి మార్కెట్లోకి..
సాక్షి, హైదరాబాద్: గుజరాత్కు చెందిన జైడస్ క్యాడిలా కంపెనీ తయారు చేసిన జైకోవ్–డీ కరోనా వ్యాక్సిన్ ఈ నెల 15వ తేదీ నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 12 ఏళ్లు పైబడిన వారందరికీ ఈ టీకా ఇవ్వొచ్చని వెల్లడించింది. ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇతర టీకాలను ఉచితంగా ఇస్తున్నట్లుగానే ఈ కొత్త టీకాను కూడా ఇచ్చే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి. ధర విష యంలో ప్రభుత్వం ఎటువంటి ఒప్పందం చేసుకోనందున దీనిపై స్పష్టత రాలేదని అంటున్నారు. ప్రస్తుతం 18 ఏళ్లు దాటిన వారికి మాత్రమే టీకాలు వేస్తున్న సంగతి తెలిసిందే. (చదవండి: రియా చక్రవర్తితో సంబంధమేంటి?) ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో ప్రయోజనకరం ప్రస్తుతం విద్యాసంస్థలు తెరిచిన నేపథ్యంలో కొత్త టీకా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుం దని వైద్య ఆరోగ్యశాఖ భావిస్తోంది. పిల్లలను స్కూళ్లకు, కాలేజీలకు పంపడానికి చాలామంది తల్లిదండ్రులు జంకుతున్న సంగతి తెలిసిందే. కాగా కీలకమైన సమయంలో కొత్త టీకా అందు బాటులోకి వస్తోందని, దీన్ని ఏడో తరగతి నుంచి ఆపై తరగతులు చదువుతున్న వారం దరికీ వేయడానికి అవకాశం ఉందని అంటు న్నారు. నవంబర్ నెలలో భారత్ బయోటెక్కు చెందిన మరో టీకా అందుబాటులోకి రానుంది. దాన్ని రెండేళ్లకు పైబడిన వారం దరికీ వేయడానికి వీలుంటుందని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకా.. జైకోవ్–డీ టీకా మూడు డోసులు వేసుకోవాల్సి ఉంటుంది. మొదటి డోసు వేసుకున్న 28 రోజులకు రెండో డోసు వేస్తారు. ఆ తర్వాత మరో 28 రోజులకు మూడో డోసు వేస్తారు. మొత్తంగా మూడు డోసులను 56 రోజుల్లోగా పూర్తి చేస్తారు. ప్రస్తుతం కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు రెండు డోసులు వేస్తుండగా.. జాన్సన్ అండ్ జాన్సన్ వంటి కొన్ని టీకాలు ఒక డోసు వేస్తున్నారు. జైకోవ్–డీ టీకాను ఈ నెల 15వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో వేసేలా ప్రణాళిక రచించినట్లు చెబుతున్నారు. మార్కెట్లోకి వచ్చాక ప్రైవేట్ ఆసుపత్రుల్లో కొత్త టీకా వేయనున్నారు. దీని ధర ఇంకా వెల్లడి కాలేదని ఒక అధికారి తెలిపారు. రాష్ట్రంలో 12–18 ఏళ్ల వయస్సువారు 48 లక్షల మంది ఉంటారని అంచనా. వారందరికీ మూడు డోసుల టీకా వేయాలంటే కనీసం ఆరు నెలల సమయం పట్టే అవకాశముందని అంచనా వేస్తున్నారు. (చదవండి: డబ్బులు అడిగినందుకు ..పెట్రోల్ పోసి..) ఇది ఇంట్రా డెర్మల్ వ్యాక్సిన్ జైకోవ్–డీ ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లాస్మిడ్ డీఎన్ఏ టీకా. 12 నుండి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఈ వ్యాక్సిన్ సురక్షితం అని కంపెనీ చెబుతోంది. ఇది ఇంట్రాడెర్మల్ వ్యాక్సిన్. ఫార్మాజెట్ అనే పరికరంతో దీన్ని చేతిపై ప్రెస్ చేస్తారు. దీంతో చర్మం లోపలి పొరల్లోకి వ్యాక్సిన్ వెళుతుంది. సూది రహిత టీకా కావడం వల్ల చేతి దగ్గర నొప్పి ఉండే అవకాశం లేదు. దీన్ని 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ వద్ద నిల్వ చేయవచ్చు. 2010లో స్వైన్ ఫ్లూను ఎదుర్కోవటానికి వ్యాక్సిన్ను భారతదేశంలో జైడస్ క్యాడిలానే తయారు చేసింది. అలాగే గతంలో టెట్రావాలెంట్ కాలానుగుణ ఇన్ఫ్లూయెంజా టీకాను కూడా ఈ కంపెనీయే అభివృద్ధి చేసిందని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. -
బడుగుల ఆత్మగౌరవ మార్గం ఇదేనా?
మొన్న వివేక్, నిన్న స్వామిదాసు, నేడు ఈటల రాజేందర్ పదమూడేళ్లు నిరంతర పోరాటం చేసి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ను వదిలి బీజేపీలో చేరారు. ఆ సమయంలో కేంద్రంలో అధికారంలో వుండి ఉంటే బీజేపీ తెలంగాణను ఇచ్చిఉండేది కాదన్నది వాస్తవం. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాలపై బీజేపీ చూపుతున్న సవతితల్లి ప్రేమ లేదా ప్రేమరాహిత్యం ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. విభజన హామీలను కూడా ఇవ్వకుండా, తెలంగాణకు రావాల్సిన నిధులనివ్వడంలోనూ వేధిస్తూ బీజేపీ ఫెడరల్ స్ఫూర్తికి భంగం కలిగిస్తోంది. ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలోనైనా తెలంగాణ లోలా సబ్బండ వర్ణాలను పట్టించుకొని పాలన సాగిస్తున్న వైనముందేమో ఈ నాయకులే చెప్పాలి. తెలంగాణ ప్రభుత్యం ఈ ఏడేళ్ళలో చేపట్టిన పథకాలు, సంక్షేమ చర్యలు తెలంగాణలోని ప్రతి గడపనూ ఏదో విధంగా తాకుతున్న నగ్నసత్యం వీరికి తెలియంది కాదు. అయినా సరే టీఆర్ఎస్ పార్టీలో తమ ఆత్మగౌరవం పోయిందని, తమకు ప్రాముఖ్యత లేదని చిలకపలుకులు పలికే వీరు బీజేపీలో పొందుతున్న ఆత్మగౌరవం ప్రాముఖ్యత ఏంటో చెబితే బాగుం టుంది. మార్గనిర్దేశకులైన మేధావులు తమ మాటలకు, రాతలకు జవాబుదారీ కలిగివుండాలి. రాజకీయ విషయాల గురించి మాట్లాడినప్పుడు, స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు, చర్యలు చేసినప్పుడు తమ రాష్ట్రానికి లేదా దేశానికి ఏ పార్టీ ఏం చేసిందో, ఏం చేస్తోందో, ఏం చేయగలదో అనే విషయాల్లో స్పష్టత ఉండాలి. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ లౌకిక, ప్రజాస్వామిక, సామ్యవాద, మానవ కేంద్రక పాలననిచ్చే పార్టీ విషయంలో క్లారిటీ లేని మేధావులే ఎక్కువ ఉన్నారు. అందుకే తెలంగాణ రాజకీయాల్లో గందరగోళ పరి స్థితులేర్పడి ఈ నేలను రాజకీయ ప్రయోగశాలగా మార్చుతున్నారు. ఐఏఎస్ పదవి వదిలిపెట్టి పార్టీ స్థాపించి మూడు సార్లు ఢిల్లీ సీఎంగా గెలిచాడు అరవింద్ కేజ్రీవాల్. ఇతనికి ఏ రాజకీయ దృక్పథమూ లేదు. అవినీతి రహితపాలనే ఎజెండా. ప్రజల కనీసావసరాలైన విద్యుత్తు, నీరు, ప్రభుత్వ పాఠశాలలు, ఉత్తమ వైద్యం, మంచి రోడ్లు, మురికివాడలు లేకుండా చూడటం, అధికార్లంతా ప్రజలకు అవసరాల్లో అందుబాటులో ఉండటం ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ తానే రాజు, తానే మంత్రిగా, అన్నీ నిర్వహిస్తూ వస్తున్నాడు. జయప్రకాష్ నారాయణ అనే మరో ఐఏఎస్ అధికారి పదవి వదలి రాజకీయ పార్టీ స్థాపించాడు. నీతి గల రాజకీయాలు నడపడం ఆశయంగా పెట్టుకున్నారు. అతికష్టంగా ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచినా ఏ దృక్పథంలేని పార్టీగా మిగిలిపోయి పార్టీ దాదాపు అంతర్ధానమైంది. మరో ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ ప్రయత్నం చెయ్యబోయి విఫలమయ్యాడు. ఆకునూరి మురళి ఐఏఎస్ అధికారి. రాజకీయాభిప్రాయమున్నా, ప్రభుత్వ సలహాదారుగా ఉండి ఉత్తమ సలహాలిచ్చి మెప్పుపొందాడు. కాన్షీరాంగారు ఐఏఎస్ ఆఫీసర్ కాదు గాని విద్యాధికుడైన సైంటిస్ట్. నిరుపేద కుటుంబంనుంచి వచ్చిన దళితుడు. దళిత బహుజన రాజకీయాల కోసం ఉద్యోగం వదిలి, బ్రహ్మచారిగానే ఉండి తనను తాను ప్రజల కోసం అంకితం చేసుకున్నవాడు. కాలినడకన, సైకిల్పై దేశమంతా తిరిగి బహుజన రాజకీయాలను వ్యాప్తి చేసినవాడు. బీఎస్పీ పార్టీ స్థాపించి దేశంలోని అతిపెద్ద రాష్ట్రంలో ఆ పార్టీని మూడుసార్లు అధికారంలోకి తెచ్చిన సిద్ధాంతకర్త. ఒంటిచేత్తో పార్టీని దేశ వ్యాప్తం చేసి, బహుజన రాజకీయాలను దేశవ్యాప్తం చేసి అందుకోసమే జీవించి, మరణించినవాడు. కాన్షీరాం తర్వాత మాయావతి బీఎస్పీ అధినేత్రి అయినా కాన్షీరాం స్థాయిలో పార్టీని విస్తృతం చెయ్యలేకపోవడం వల్ల ఆ పార్టీ ఉత్తరప్రదేశ్కే పరిమితమైంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దళిత మేధావి, దళిత ఆర్తి ఉన్నవాడు. చాలామంది దళితులు, బీసీలు, పేదవారి లాగే ఆతని జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఎన్నోకష్టనష్టాలకోర్చి, చదువునే ప్రేమించి, కఠోర పరిశ్రమచేసి తన జీవిత లక్షమైన ఐపీఎస్ సాధించాడు. పోలీసాఫీసరుగా ఉన్నతోన్నత స్థానాలకెదిగాడు. పదహారు సంవత్సరాలు పోలీసు ఉన్నతాధికారిగా పనిచేశాడు. ప్రభుత్వ ఉత్తర్వులను సవినయంగా పాటించి, వీలైనంత వరకు ప్రజలతో సఖ్యంగా ఉండి అటు ప్రభుత్వ మన్ననలు, ఇటు ప్రజలమెప్పు పొందాడు. దళితులకు, పేదలకు మంచి చదువును ఇవ్వడం ఆయన తాత్విక స్వప్నం. పోలీసు అధికారిగా ఉంటే తన పేదల చదువుకల నెరవేరదని గురుకుల సంక్షేమ పాఠశాలల సెక్రటరీగా చేరాడు. రెండేండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ పదవిలో ఉన్నా టీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండుసార్లు రెన్యువల్ పొంది మొత్తం తొమ్మిదేళ్ళు ఆ పదవిలో పనిచేశాడు. గురుకుల సంక్షేమ విద్యాలయాల కార్యదర్శిగా ఆయనచేసిన అమూల్యమైన సేవలకు తృప్తిపడేకావచ్చు లేదా ప్రవీణ్ కుమార్ కోర్కె పైనే కావచ్చు కేసీఆర్ అతన్ని తొమ్మిదేండ్లు ఆ పదవిలో ఉంచాడు. సమర్థుడైన అధికారి అయితే ప్రభుత్వనిబంధనలను అతిక్రమించకుండానే ప్రజలకుపయోగపడే అద్భుతమైన పనులు చేయవచ్చని ఈ 9 సంవత్సరాల కాలం నిరూపించింది. ఈ కాలంలో 900 పాఠశాలలు, 50 డిగ్రీ కాలేజీలు, 7 పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీలు, మహిళా డిగ్రీ కాలేజీ, సైనిక్ స్కూల్, లా కాలేజ్, కోడింగ్ స్కూల్ తెలంగాణలో నాణ్యమైన విద్యనందించాయి. పేద దళిత, బీసీ, మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన ఇంగ్లిష్ విద్యా స్వప్నం, జాతీయ, అంతర్జాతీయ స్థాయి కళాశాలలో చదువుకునే అవకాశం, డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అయ్యే అవకాశం ఈ విద్యాలయాలవల్ల లభించింది. ప్రభుత్వం మంచి విద్యాలయాలు స్థాపించి వేల కోట్ల డబ్బులివ్వడం, పేద అణగారిన జాతుల విద్యార్థులను ప్రోత్సహించడం, ప్రవీణ్కుమార్ ఆశయ సిద్ధివల్ల ఈ ఫలితాలు వచ్చాయి. ఈ విజయంలో ప్రభుత్వంగా కేసీఆర్, అధికారిగా ప్రవీణ్కుమార్ భాగస్వాములే. ఈ స్వల్పకాలంలో ఇన్ని విద్యాలయాలు, రెండున్నర లక్షలమందికి పైగా నాణ్యమైన విద్య, ఆత్మగౌరవం, బడుగుల్లో ఆత్మగౌరవం కలిగిస్తే.. ఇంకో ఆరేళ్ల పూర్తి కాలంలో మరెన్ని విజయాలు లభించేవో ప్రవీణ్ కుమార్ ఆలోచించాలి. ప్రవీణ్కుమార్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంవల్ల, అదీ జాతీయపార్టీలో చేరడంవల్ల పరమపద సోపాన రాజకీయ చదరంగంలో ఈ తొమ్మిదేళ్లలో వచ్చిన కీర్తి ప్రతిష్ఠలు, లభించిన రాజకీయ సహకారం భవిష్యత్తులో లభిస్తాయా అన్నది కోటి డాలర్ల ప్రశ్న. డా‘‘ కాలువ మల్లయ్య వ్యాసకర్త కథా రచయిత మొబైల్ : 91829 18567 -
ఉప సర్పంచ్ వేధిస్తున్నారు.. సీఎం సభలో ఆత్మహత్య చేసుకుంటా
సాక్షి, హుజూరాబాద్ (కరీంనగర్): గ్రామంలో అభివృద్ధి పనులకు సంబంధించిన చెక్కులపై ఉప సర్పంచ్ గుజ్జ జయసుధ సంతకం చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని హుజూరాబాద్ మండలంలోని చెల్పూర్ సర్పంచ్ నేరెళ్ల మహేందర్గౌడ్ ఆరోపించారు. సోమవారం గ్రామంలో మీడియాతో ఆయన గోడు వెళ్లబోసుకున్నారు. అప్పులు తెచ్చి, గ్రామంలో అభివృద్ధి పనులను పూర్తి చేశామని, 10 నెలలవుతున్నా చెక్కులపై ఉప సర్పంచ్ సంతకాలు పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల డీఎల్పీవో విచారణ జరిపి వెళ్లినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. ఆర్థికంగా చితికిపోయిన తనకు ఈ సమస్య పరిష్కారం కాకపోతే చావే శరణ్యమని అన్నారు. పురుగు మందు డబ్బా చూపిస్తూ సోమవారం సీఎం కేసీఆర్ సభలో ఆత్మహత్య చేసుకుంటానని మహేందర్గౌడ్ పేర్కొన్నారు. -
టీఎస్ ఎంసెట్ అడ్మిషన్స్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్ అడ్మిషన్స్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 30 నుంచి సెప్టెంబర్ 9వరకు ధ్రువపత్రాల స్లాట్ బుకింగ్ చేపడుతున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ విభాగం మంగళవారం వెల్లడించింది. సెప్టెంబర్ 4 నుంచి 11 వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని తెలిపింది. సెప్టెంబర్ 13 వరకు వెబ్ఆప్షన్స్ నమోదు.. సెప్టెంబర్ 15న మొదటి విడత సీట్ల కేటాయింపు జరుపుతామని చెప్పింది. సెప్టెంబర్ 15 నుంచి 20 వరకు కాలేజీల్లో ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలని ఓ ప్రకటనలో పేర్కొంది. (చదవండి: రేవంత్ను నమ్మడం కరెక్టేనా?: మంత్రి ప్రశాంత్ రెడ్డి) -
730 మంది టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్లు ఏఆర్కు మార్పు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ) కానిస్టేబుళ్లు చాలాకాలంగా ఎదురుచూస్తోన్న ఆర్మ్డ్ రిజర్వ్డ్ (ఏఆర్) మార్పు ప్రక్రియకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఇటీవల కొత్తగా 3,805 మంది బెటాలియన్లో చేరడంతో 2005, 2006, 2007 బ్యాచ్లకు చెందిన 730 మంది కానిస్టేబుళ్లను టీఎస్ఎస్పీ శుక్రవారం రిలీవ్ చేసింది. వీరంతా శనివారం వారికి కేటాయించిన జిల్లా యూనిట్లలో రిపోర్టు చేశారు. దీనికి సంబంధించిన ఆదేశాలను గతేడాది డిసెంబరులోనే ప్రభుత్వం జారీ చేసినప్పటికీ సిబ్బంది కొరత కారణంగా అవి అమలు కాలేదు. 2008, 2009 బ్యాచ్ల కానిస్టేబుళ్ల ఏఆర్ కన్వర్షన్కు సంబంధించిన ఫైల్ను కూడా ఉన్నతాధికారులు ఆమోదించారని సమాచారం. -
తెలంగాణలో కొత్తగా 3,982 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులో కొద్దిగా తగ్గుముఖం పట్టాయని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మంగళవారం పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 3,982 కరోనా కేసులు నమోదైనట్టు వెల్లడించారు. వైరస్ బారినపడి 27 మంది మృతి చెందారని తెలిపారు. కరోనా కట్టడికి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్లో 40 శాతం ఇతరరాష్ట్రాల వారికి వైద్యం అందుతోందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్స్ ఉన్నాయని చెప్పారు. బ్లాక్ ఫంగస్ మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయని శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. -
రాష్ట్రవ్యాప్తంగా ‘కార్పొరేట్’ వైద్యం
సాక్షి, హైదరాబాద్: అన్ని జిల్లాల్లోనూ ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులను నెలకొల్పేలా ప్రోత్సహిం చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లో అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వైద్యరంగంపై నూతనంగా తీసుకున్న అనేక నిర్ణయాలను రాష్ట్రాలకు తెలియజేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతి (పీపీపీ)లో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని సూచించింది. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సహాయక వైద్య సేవల్లోనూ ప్రైవేట్ రంగాన్ని ముందుకు తీసుకురానున్నారు. ఇక జిల్లా రెసిడెన్సీ పథకం కింద పీజీ మెడికల్ విద్యార్థులంతా తప్పనిసరిగా మూడు నెలలపాటు జిల్లా ఆసుపత్రుల్లో పనిచేయాలని ఆదేశిం చింది. మరోవైపు ముఖ్యమైన జిల్లాల్లో క్రిటికల్ కేర్ ఆసుపత్రి బ్లాక్లను ఏర్పాటు చేస్తారు. మున్ము ందు కరోనా వంటి మహమ్మారులు ఎలాంటివి విజృంభించినా వాటిని ఎదుర్కొనేందుకు వీటిని ముందస్తు జాగ్రత్తగా ఏర్పాటు చేస్తారు. ఆ మేరకు తెలంగాణలో దాదాపు 20 జిల్లాల్లో ఇవి ఏర్పాటయ్యే అవకాశముంది. వీటిని కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులతో నెలకొల్పుతారు. గత పదేళ్లలో 75% కొత్త వ్యాధులు జంతువులు లేదా వాటి ఉత్పత్తుల ద్వారా ప్రబలినట్లు గుర్తించారు. గతేడాది ప్రపంచంలో కరోనాతోపాటు 60కు పైగా అంటువ్యాధు లు జనంపై దాడి చేశాయి. అందువల్ల జిల్లాల్లో క్రిటికల్ కేర్ ఆసుపత్రుల బ్లాక్లను ఏర్పాటు చేస్తారు. 25 లక్షల ఎకరాల్లో ఔషధ మొక్కల సాగు దేశవ్యాప్తంగా 25 లక్షల ఎకరాల్లో అత్యంత విలువైన ఔషధ మొక్కల సాగును చేపట్టనున్నారు. రైతులను, రైతు ఉత్పత్తిదారుల సంఘాలను, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఇందులో భాగస్వామ్యం చేస్తారు. ఔషధ మొక్కల సాగును ప్రోత్సహించ డం, పండించే సమయంలో నిర్వహణ, వాటికి అవసరమైన మార్కెట్ సదుపాయాల కోసం కేంద్రం రూ. 4 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని కోరింది. తెలంగాణలో దాదాపు లక్ష ఎకరాల్లో ఔషధ మొక్కల సాగుకు అనుకూలమైన వాతావరణం ఉన్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆయుష్ గ్రిడ్... డిజిటల్ ప్లాట్ఫాంపై ఆయుష్ గ్రిడ్ను ఏర్పాటు చేస్తారు. ఆయుష్ రంగంలో వైద్య సదుపాయాలు కల్పించడం, ఆస్పత్రులు, లేబొరేటరీలు ఏర్పా టు చేయడం దీని ఉద్దేశం. భారతీయ సంప్రదాయ వైద్యానికి అంతర్జాతీయ స్థాయి కల్పనకు ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి గ్లోబల్ సెం టర్ను ఏర్పాటు చేస్తారు. ‘జాతీయ, అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా ఆయుష్ రంగంలో నైపుణ్యాభివృద్ధి జరగాలి. ప్రైవేట్లో ఆయుష్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నెలకొల్పాలి. అందుకోసం ఆయుష్ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించాలి. ఆయుష్ వైద్య విద్యలో నాణ్యత, ప్రమాణాలను పెంచడం కోసం ప్రత్యేక వ్యవస్థలను నెలకొల్పాలి’అని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా 12,500 ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. 100 జిల్లాల్లో... జిల్లాస్థాయి ఆయుష్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తారు. అన్ని జిల్లాల్లో ప్రజారోగ్య లేబరేటరీలు అన్ని జిల్లాల్లోనూ సమగ్ర ప్రజారోగ్య లేబరేటరీలను నెలకొల్పుతారు. వాటిల్లో వైద్య పరీక్షలు చేస్తారు. 2022 డిసెంబర్ నాటికి దేశంలో లక్షన్నర హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. అందులో 11,024 సెంటర్లను అర్బన్ మురికివాడల్లో ఏర్పాటు చేస్తారు. ఆయా వెల్నెస్ సెంటర్లలో 12 రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. వెల్నెస్ సెంటర్ల ద్వారా ఆరోగ్యాన్ని ఎలా పెంచుకోవాలి, ఆరోగ్యంగా ఉండటానికి ఏంచేయాలన్న దానిపై దృష్టిపెడతారు. అందుకోసం ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేస్తారు. సరైన తిండి (ఈట్ రైట్), ఫిట్ ఇండియా, యోగాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. అత్యవసర మందులు, వైద్య పరీక్షలూ ఉండేలా ఏర్పాట్లు చేస్తారు. అలాగే దేశంలో మరిన్ని బల్క్ డ్రగ్ పార్కులు, మెడికల్ డివైజెస్ పార్కులను వచ్చే మూడేళ్లలో ఏర్పాటు చేయాలి. ఫార్మా టెక్నాలజీని ఆధునీకరించాలని కేంద్రం నిర్ణయించింది. -
వేసవిలో ఉపాధి కూలీలకు ‘డ్రై సీజన్ అలవెన్స్’
సాక్షి, హైదరాబాద్: వేసవిలో ఎండల తీవ్రత పెరగనున్న నేపథ్యంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీలకు ‘డ్రై సీజన్ అలవెన్స్’చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి జూన్ 30 వరకు ఉపాధి కూలీలు ఈ అలవెన్స్ను పొందనున్నారు. ఫిబ్రవరిలో 20 శాతం, మార్చి 25 శాతం, ఏప్రిల్/మేలలో 30 శాతం, జూన్లో 20 శాతం మేర ఈ అలవెన్స్ చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఎండా కాలంలో వేడి పెరగడం వల్ల చేసే పని తగ్గి ఆ మేరకు వారికొచ్చే కూలీ తగ్గే అవకాశాలున్నందున ఈ అలవెన్స్ను వర్తింపజేస్తారు. వేసవిలో ప్రధానంగా పైన పేర్కొన్న కాలంలో ఇచ్చే కూలీకి అనుగుణంగా చేయాల్సిన పని శాతాన్ని ఈ అలవెన్స్లో పేర్కొన్న మేర తగ్గిస్తారు. శనివారం ఈ మేరకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖల కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా ఉత్తర్వులిచ్చారు. ఈ ఆదేశాలకు సంబంధించిన ప్రతులను http:// www. rd. telangana. gov. in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఉపాధికి రూ.139.59 కోట్ల అదనపు నిధులు.. 2020–21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద అయిన ఖర్చుల కోసం రూ.139.59 కోట్ల మేర అదనపు నిధులకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన మంజూరు ఇచ్చింది. ఇదివరకే ఇచ్చిన బడ్జెట్ విడుదల ఉత్తర్వులకు కొనసాగింపుగా అదనపు నిధులకు పాలనపరమైన అనుమతినిస్తూ సందీప్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. -
నల్లచట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయండి: రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేంద్రం తీసుకువచ్చిన నల్ల వ్యవసాయ చట్టాలను అమలు చేయబోమని రాష్ట్ర అసెంబ్లీలో వెంటనే తీర్మానం చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ అనుముల రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. ‘వ్యవసాయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలోని అంశం. కేంద్రం తెచ్చిన చట్టాలను అమలు చేయాలా వద్దా అన్నది రాష్ట్రాల ఇష్టం. నరేంద్రమోదీ ప్రభుత్వం తెచ్చిన నల్లచట్టాలు నిర్బంధ చట్టాలు కావు. అయినా మోదీకి అమ్ముడుపోయిన కేసీఆర్ ఈ చట్టాలను రాష్ట్రంలో అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవి అమలైతే రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ఉండవు. పంటకు గిట్టుబాటు ధర ఉండదు. కంపెనీలు రైతులను మోసం చేస్తే కోర్టులకు వెళ్లే అవకాశం ఉండదు. రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించే ఈ చట్టాలను వెంటనే వెనక్కి పంపాలి’అని రేవంత్ అన్నారు. బుధవారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీలు మల్లు రవి, అంజన్కుమార్ యాదవ్, టీపీసీసీ అధికార ప్రతినిధి కౌశిక్చరణ్ యాదవ్లతో కలసి ఆయన మాట్లాడారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదేశాల మేరకు రైతు ఉద్యమానికి సంఘీభావంగా పదిరోజులపాటు ప్రజల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. అచ్చంపేటలో నిర్వహించిన రాజీవ్ రైతు భరోసా దీక్షలో అక్కడి రైతులు, కాంగ్రెస్ నేతల డిమాండ్ మేరకు పాదయాత్రగా మారిందని రేవంత్ చెప్పారు. కేంద్రం దుర్మార్గపు చర్యలను అడ్డుకుంటానని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు మోదీకి తలూపుతున్నారని, ఆయన నటనకు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని వ్యాఖ్యానించారు. పెద్ద రైతునని చెప్పుకునే కేసీఆర్కు రైతుల పక్షాన నిలిచే పెద్ద మనసు ఎందుకు రావడంలేదో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ఎకరాకు 25 లక్షలు ఇస్తే గజ్వేల్లో కేసీఆర్కు ఉన్న వెయ్యి ఎకరాల ఫామ్హౌస్ను ఫార్మా రైతులకు ఇస్తారా అని ప్రశ్నిం చారు. భవిష్యత్తులో నిరుద్యోగ, రైతాంగ అంశాలే ఎజెండాగా, జై కిసాన్, జై జవాన్ నినాదంతో ముందుకెళ్తామని రేవంత్ చెప్పారు. కాగా, 10 రోజులుగా రైతాంగ సమస్యలపై పాదయాత్ర నిర్వహించిన రేవంత్రెడ్డిని కాంగ్రెస్ పార్టీ కేడర్ అక్కున చేర్చుకుందని, ఆయన్ను తమ నాయకుడిగా గుర్తించిందని మాజీ ఎంపీ మల్లు రవి చెప్పారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కూడా తమ జిల్లాల్లో పాదయాత్ర చేయాలని రేవంత్ను కోరుతున్నారని, దీనిపై తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమించాలి: భట్టి విక్రమార్క ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పొరేట్ వ్యవస్థను ప్రోత్సహిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఉద్యమించాలని సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క రైతులకు పిలుపునిచ్చారు. ఆయన చేపట్టిన పోరుబాట–పల్లెబాట యాత్ర బుధవారం నాగర్కర్నూల్ జిల్లానుంచి నల్లగొండ జిల్లా డిండి మండలం తవక్లాపూర్కు చేరుకుంది. ఈ సందర్భంగా గ్రామంలో రైతులతో ముఖా ముఖి నిర్వహించారు. కేంద్ర ప్రభు త్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు పలుకుతూ.. సీసీఐ కేం ద్రాలను ఎత్తివేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల ప్రజల సాగు, తాగునీటి సమ స్య పరిష్కారానికి చేపట్టిన డిండి ఎత్తిపోతల పథ కం పనులను రెండున్నరేళ్లలో పూర్తి చేస్తానన్న సీఎం మాట ఏమైందని ప్రశ్నించారు. ఎక్కడ ఉప ఎన్నికలు వస్తే అక్కడ అమలుకు వీలుకాని హామీలిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ హన్మంతరావు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే బాలూనాయక్ పాల్గొన్నారు. -
వాలెంటైన్స్ డే: మంత్రి కొప్పుల ఈశ్వర్ లవ్ స్టోరీ
► జగిత్యాల జిల్లాలో.. ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు. అయితే, ప్రేమ విషయం పెద్దలకు చెప్పలేక యువతి ఉరివేసుకుంది. ఇది తెలిసి.. దుబాయ్లో ఉన్న ప్రియుడు ‘నువ్వు లేక నేను లేను’ అంటూ సెల్ఫీ వీడియో తీసుకుంటూనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. ► పెద్దలు పెళ్లికి అంగీకరించరనే కారణంతో ఆ ప్రేమికులిద్దరూ కలిసి బావిలోకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం వడ్లతండాలో చోటుచేసుకున్న ఘటన ఇది. ► నిజామాబాద్ జిల్లాలో.. వారిద్దరివీ వేర్వేరు కులాలు.. ప్రేమతో ఒక్కటవ్వాలనుకున్నారు. కానీ, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ఒకరు.. కాదని మరొకరు అభిప్రాయ భేదాలకు గురై.. చివరకు ఇద్దరూ ఉరివేసుకున్నారు. కేవలం పెద్దలు పెళ్లికి అంగీకరించరనే భయంతోనే గడిచిన మూడు నెలల్లో పదిహేనుకుపైగా ప్రేమజంటలు ఆత్మహత్యలకు పాల్పడ్డాయి. చనిపోవడానికి కూడా ధైర్యం కావాలి.. అదే ధైర్యాన్ని వారు పెద్దల్ని ఒప్పించడానికి లేదా కలిసి బతకడానికి చూపాలని అంటున్నారు ఒకప్పటి ప్రేమికులు. కులమతాలు వేరైనా.. ‘ప్రేమ కోసం ధైర్యంగా నిలబడ్డాం. ఆ ధైర్యంతోనే ఇరుపక్షాల పెద్దల్ని ఒప్పించాం. ఇప్పుడెలాంటి స్పర్థలు లేకుండా ఆనందంగా ఉన్నాం’ అంటున్నాయి ‘ప్రేమ–పెళ్లి’లో సక్సెస్ అయిన జంటలు. నొప్పించకుండా పెద్దలను ఒప్పించగలగాలి.. అందుకోసం ఎన్నాళ్లైనా వేచిచూడగలగాలి.. ఇలాంటివి లోపించే నేటి ప్రేమలు విషాదాంతమవుతున్నాయని చెబుతున్న వీరు.. నాడు తామేం చేశామన్న సంగతిని ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ తో పంచుకున్నారు. చనిపోవడానికైనా ధైర్యం కావాలి.. ఆ ధైర్యంతోనే కలిసి బతకొచ్చు ప్రేమలో సఫలం కావడానికి మేం చేసింది ఇదీ.. ‘ప్రేమికుల దినోత్సవం’ సందర్భంగా నాటి ప్రేమజంటలు చెబుతున్న సక్సెస్ స్టోరీస్ పెద్దల అంగీకారంతో.. జగిత్యాల: ‘ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. పెద్దల్ని ఒప్పించి చేసుకున్నా.. ఒకరినొకరు అర్థం చేసుకోవడమనేది ముఖ్యం’ అంటున్నారు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు. 37 ఏళ్ల కిందట వీరు పెద్దల సమక్షంలో ఆషాఢమాసంలో కులాంతర వివాహం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన స్నేహలత తండ్రి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు. ఆ సమయంలో సింగరేణిలో పనిచేస్తూ కమ్యూనిస్ట్ పారీ్టలో ఉన్న కొప్పుల ఈశ్వర్ స్నేహలతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె అసలు పేరు కోకిలాదేవి. కమ్యూనిస్ట్ ఉద్యమ సమయంలో చనిపోయిన తన తోటి సహచరి స్నేహలత పేరును ఈశ్వర్ తన సతీమణికి పెట్టుకున్నారు. ఉద్యమం కలిపింది.. తొర్రూరు: ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేటకు చెందిన సబీహాబాను, మహబాబూబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన మంగళపల్లి శ్రీనివాస్ 25 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆదివాసీలు, గిరిజనుల సమస్యలపై శ్రీనివాస్తో కలిసి సబీహాబాను ఉద్యమాలు చేపట్టింది. ఆ ఉద్యమ సాహచర్యం కాస్తా ప్రేమ.. పెళ్లికి దారితీసింది. ఇంటర్ వరకు చదివిన సబీహాబానును హిందీలో పీజీ చదివించి ప్రభుత్వ టీచర్ ఉద్యోగం సాధించేలా శ్రీనివాస్ సహకరించాడు. ప్రస్తుతం ఆమె చెర్లపాలెం ప్రభుత్వ పాఠశాలలో హిందీ టీచర్గా పనిచేస్తున్నారు. శ్రీనివాస్ ప్రత్యక్ష రాజకీయాల్లో చేరి తొర్రూరు జెడ్పీటీసీగా గెలుపొందారు. వీరికి ఇంజనీరింగ్ చదివే వాసే, 9వ తరగతి చదివే అమన్ సంతానం. ‘ప్రేమించడం తప్పుకాదు. నేడు దాన్ని సాధించేందుకు ఎంచుకునే మార్గాలే అభ్యంతరకరంగా ఉంటున్నా’యనేది వీరిమాట. ఒప్పించే చేసుకున్నాం మంచిర్యాలటౌన్: ‘మాది ప్రేమ వివాహమే. అయితే పెద్దల్ని ఒప్పించి చేసుకున్నాం’ అంటున్నారు మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి. ‘మాది కర్ణాటకలోని బెల్గాం జిల్లా గోకాక్ గ్రామం. సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో హైదరాబాద్ ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీసర్కిల్లో 2002లో చేరాను. అప్పుడే ఏపీలోని కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన సీవీ శంకర్రెడ్డి పరిచయమయ్యారు. మా ఇద్దరి భాషలు, రాష్ట్రాలు వేరు. అయినా ప్రేమ చిగురించింది. అయితే అది చదువుకు, లక్ష్యానికి అడ్డురాకూడదని నిర్ణయించుకున్నాం. 2002–03లో కోచింగ్ పూర్తి చేసుకుని ఇళ్లకు వెళ్లాం. ప్రేమ గురించి ఇంట్లో వాళ్లకు చెప్పాం. అలా పెద్దలను ఒప్పించి 2007లో పెళ్లి చేసుకున్నాం. 2009లో ఐపీఎస్కు, 2010లో ఐఏఎస్కు ఎంపికయ్యా. ఆయనకు తెలంగాణ టూరిజంలో ఉద్యోగం వచి్చంది. ప్రస్తుతం ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టూరిజం ఎగ్జిక్యూటివ్ డైరక్టర్. ఇప్పుడు మాకో పాప. పేరు ఆధ్య. మా అత్తగారు నన్ను కోడలిగా కాకుండా కూతురుగా చూసుకుంటుంది. అలాంటి మంచి కుటుంబాన్ని నా భర్త అందించారు. ఒప్పించడానికి నాలుగేళ్లు.. కోదాడ: ‘ప్రేమించినంత తేలిక్కాదు తల్లిదండ్రులను ఒప్పించడం. అందుకు ఓపికుండాలి.. నమ్మివచ్చిన భాగస్వామికి ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. మేం ప్రేమ వివాహం చేసుకున్నాక తల్లిదండ్రులను ఒప్పించడానికి నాలుగేళ్లు పట్టింది. అందరం కలిసిపోయాం. పిల్లలతో ఆనందంగా ఉన్నా’మని చెబుతున్నారు కోదాడకు చెందిన కందుల మధు– విజయలక్ష్మి దంపతులు. ఉస్మానియా యూనివర్సిటీలో 2010లో ఎంబీఏ చదివే రోజుల్లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. సామాజికవర్గాలు వేరు కావడంతో పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు. నాలుగేళ్ల తరువాత వీరి అన్యోన్య దాంపత్యాన్ని చూసిన ఇరుపక్షాల పెద్దలు ఇప్పుడు దగ్గరయ్యారు. నలభై ఐదేళ్ల క్రితం.. డోర్నకల్: ‘నలభై ఐదేళ్ల క్రితం.. ఇప్పటితో పోలిస్తే ఆ కాలంలో కట్టుబాట్లు ఎక్కువ. పెద్దలు కొందరు సరేనన్నారు. మరికొందరు కాదన్నారు. అయినా ధైర్యంగా పెళ్లి చేసుకుని నిలబడ్డాం’ అంటున్నారు డోర్నకల్ అంబేడ్కర్నగర్కు చెందిన దేవకృపామణి, ఉప్పరి నారాయణ. వీరి కులమతాలు వేర్వేరు. పక్కపక్కిళ్లలో ఉండటం, ఒకే పాఠశాల, కళాశాలలో చదువుతున్న క్రమంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటామంటే ఇరుపక్షాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పెళ్లి చేసుకుని ఒక్కటవ్వడమే కాక.. అందరినీ మెప్పించాలని ధైర్యంచేసి 1976, నవంబర్ 19న పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఇరు కుటుంబాలు కలసిపోయాయి. పిల్లల్లేకున్నా ఒకరికొకరుగా జీవితం సాగిస్తున్నారు నారాయణ, కృపామణి దంపతులు. ‘ప్రస్తుతం ప్రేమ పేరుతో జరుగుతున్న హింస, పెళ్లి చేసుకోలేమనే భయంతో ప్రాణాలు తీసుకోవడం వంటి సంఘటనలు వింటుంటే బాధ కలుగుతుంది. ధైర్యంగా ముందడుగు వేస్తే అన్నీ సర్దుకుంటాయి’ అంటున్నారు వీరు. నాలుగేళ్లకు ఒప్పించాం.. మహబూబాబాద్: తమ ప్రేమ.. పెళ్లి వైపు నడిపించిన రోజుల్ని గుర్తుచేసుకున్నారు మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్నాయక్. ‘32 ఏళ్ల క్రితం నేను వరంగల్ ఆర్ఈసీ (ప్రస్తుతం నిట్)లో చదువుకుంటున్న సమయంలో ఒక ఫెస్ట్లో మెడిసిన్ చదువుతున్న సీతామహాలక్ష్మి (గుంటూరు జిల్లా తెనాలి) పరిచయమైంది. అదికాస్తా ప్రేమగా మారింది. ఇద్దరి సామాజిక వర్గాలు వేర్వేరు. ఆమె ఇంట్లో విషయం తెలియడంతో.. మా ఇద్దరి మధ్య మాటలు బందయ్యాయి. అప్పట్లో ఇప్పటి మాదిరి సమాచార వ్యవస్థ లేదు. మా ప్రేమను కమ్యూనికేట్ చేసుకోవడానికి ఇబ్బంది పడేవాళ్లం. ఇద్దరం ప్రభుత్వోద్యోగాలు సాధించి పెద్దల్ని ఒప్పిద్దామనుకుంటే అప్పుడూ నిరాకరణే ఎదురైంది. వాళ్ల అంగీకారం కోసం నాలుగేళ్లు వేచిచూశాం. అయితే, మా ప్రేమలోని నిజాయితీని తరువాత పెద్దలు గుర్తించారు. చివరకు 1994లో వారే దగ్గరుండి పెళ్లి చేశారు. నేను ఆర్అండ్బీ డీఈగా ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సీతామహాలక్ష్మి ఎంతో సహకరించింది. ఆమె డాక్టర్. సూర్యచంద్ర, తేజస్వి.. మాపిల్లలు. ప్రేమకు కులమతాలు అడ్డుకాదు. కాకపోతే, జీవితంలో స్థిరపడి, పరస్పరం నమ్మకం, భరోసా ఏర్పడ్డాకే పెళ్లి చేసుకోవాలి. తొందరపడి ప్రేమలోకి దిగి.. పెద్దల భయంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రేమికులను చూస్తే బాధ కలుగుతుంది’. ఒప్పించి.. మెప్పించాం కోల్సిటీ (రామగుండం): ‘మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటే కనుక పెద్దలను ఒప్పించాలి’ అంటున్నారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన డాక్టర్లు మహేందర్కుమార్, లావణ్య. ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన మహేందర్కుమార్కు, గోదావరిఖని లక్ష్మీనగర్కు చెందిన లావణ్యకు సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలో 2006లో సీటొచి్చంది. చదువులో చురుగ్గా ఉండే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే కులాలు వేర్వేరు. మహేందర్ దాపరికం లేకుండా ఇంట్లో విషయం చెప్పి ఒప్పించాడు. లావణ్యా అలాగే చేసింది. చదువుకు తమ ప్రేమ అడ్డుకాకుండా.. ఇద్దరూ డాక్టర్లయ్యాక 2012 నవంబర్ 29న పెద్దల సమక్షంలో ప్రేమపెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులు నేటి ప్రేమల గురించి మాట్లాడుతూ– ‘ప్రేమలో పరిపక్వత ఉండాలి. పేరెంట్స్ను ఒప్పించి పెళ్లి చేసుకోగలమనే నమ్మకం ఉండాలి. మా కాలేజీలో దాదాపు 50 ప్రేమజంటల్ని చూశాం. కేవలం ఆరుజంటలే పెళ్లి చేసుకున్నాయి’ అని చెప్పారీ దంపతులు. మహేందర్ ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ పీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్, డీడీవోగా, డాక్టర్ లావణ్య జగిత్యాల జిల్లా మల్యాల పీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్, డీడీవోగా పని చేస్తున్నారు. -
ప్రభుత్వ ఉద్యోగులకు ఇక ఘనమైన వీడ్కోలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ రోజు ఘనంగా సన్మానించి ప్రభుత్వ వాహనంలో స్వగృహానికి సాగనంపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశించారు. పదవీ విరమణ సన్మాన కార్యక్రమానికి సంబంధించి విధివిధానాలు (స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొటోకాల్)ను తయారు చేయాలని అధికారులను కోరారు. పదవీ విరమణ చేసిన ఏడుగురు సచివాలయ ఉద్యోగులకు శనివారం బీఆర్కేఆర్ భవన్లో సన్మాన సభ నిర్వహించారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి పట్ల గౌరవంగా వ్యవహరించాలని, పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సేవలను ఈసందర్భంగా సీఎస్ కొనియాడారు. సాధారణ పరిపాలన శాఖ అదనపు కార్యదర్శి జి.క్రిష్ణవేణి, ఆ శాఖ ఆఫీస్ సబార్డినేట్ ఎన్.గంగమ్మ, ఐటీ శాఖ ఉప కార్యదర్శి టి.పద్మసుందరి, మైనారిటీ వెల్ఫేర్ శాఖ సహాయ కార్యదర్శి మహమ్మ ద్ నసీర్, పంచాయతీరాజ్ శాఖ సహాయ కార్యదర్శి మంజుల, ఆర్అండ్బీ శాఖ సెక్ష న్ ఆఫీసర్ అర్జున్ సింగ్, ఆర్థిక శాఖ సెక్షన్ అసిస్టెంట్ పాల్ ఫ్రాన్సిస్ పదవీ వీరమణ పొందిన వారిలో ఉన్నారు. కాగా, అటవీశాఖలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్గా రిటైర్ అయిన కౌసర్ అలీకి కూడా ఆ శాఖ అధికారులు సగౌరవంగా వీడ్కోలు పలికారు. -
బీజేపీ ఎంబీసీ కోకన్వీనర్గా సూర్యపల్లి శ్రీనివాస్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర ఎంబీసీ సెల్ కోకన్వీనర్గా సూర్యపల్లి శ్రీనివాస్ను నియమించినట్టు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బీసీల్లో అత్యంత వెనుకబడిన కులాలకు పార్టీలో ప్రాతినిథ్యం కల్పించేందుకు ఎంబీసీ సెల్ ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. పార్టీ బలోపేతానికి పాటు పడాలని శ్రీనివాస్కు ఈ సందర్భంగా భాస్కర్ సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. బీజేపీ బలోపేతానికి కృషి అత్యంత వెనుకబడిన కులాలను భాగస్వాములను చేసి బీజేపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని సూర్యపల్లి శ్రీనివాస్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తనకు అవకాశం ఇచ్చినందుకు పార్టీకి, ఆలె భాస్కర్కు ధన్యవాదాలు తెలిపారు. -
రేపు తేలనున్న తెలంగాణ పీఆర్సీ అంశం
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల వేతన సవరణ (పీఆర్సీ), పదవీ విరమణ వయసు పెంపు, ఇతర సమస్యలపై ఈ నెల 27న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ.. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపే అవకాశముంది. తక్షణమే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదివారం సీఎస్కు ఆదేశించిన విషయం తెలిసిందే. సోమేశ్కుమార్ సోమవారం టీఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ను బీఆర్కేఆర్ భవన్కు పిలిపించి చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఉద్యోగ సంఘాలు చర్చలకు ఎప్పుడు వస్తాయో తేదీ నిర్ణయించుకుని చెప్పాలని కోరారు. అన్ని ఉద్యోగ సంఘాలతో చర్చించి తేదీ తెలుపుతామని ఆయన సీఎస్కు చెప్పారు. వేతన సవరణ, పదవీ విరమణ వయసు పెంపు తదితర అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. ఈ నెల 27న త్రిసభ్య కమిటీతో సమావేశమై చర్చలు జరపాలని ఉద్యోగ సంఘాల భావిస్తున్నాయి. అదే రోజు సీఎస్ సోమేశ్కుమార్ ఉద్యోగ సంఘాల చేతికి పీఆర్సీ నివేదికను అందజేసే అవకాశాలున్నాయి. 27న చర్చలు విజయవంతంగా ముగిస్తే, సీఎస్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ వెంటనే సీఎం కేసీఆర్కు చర్చల సారంపై నివేదిక సమర్పించనుంది. ఈ నెలాఖరులోగా సీఎం కేసీఆర్ ఉద్యోగులకు పీఆర్సీ, పదవీ విరమణ వయసు పెంపుపై కీలక ప్రకటన చేసే అవకాశాలున్నాయి. పీఆర్సీపై త్రిసభ్య కమిటీ భేటీ పీఆర్సీపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ సోమవారం బీఆర్కేఆర్ భవన్లో సమావేశమైంది. వేతన సవరణ నివేదికతో పాటు ఉద్యోగులకు నిర్ధిష్ట కాల వ్యవధిలో పదోన్నతులు, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పొడిగింపు, సర్వీసు నిబంధనల సరళీకరణ తదితర అంశాలపై చర్చించింది. త్వరలో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని నిర్ణయించింది. ఉద్యోగ సంఘాలతో సమావేశాల షెడ్యూల్ను సైతం రూపొందించినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. సమావేశంలో త్రిసభ్య కమిటీ సభ్యులు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ పాల్గొన్నారు. -
బుద్ధుడి ధాతువు ఆంధ్రప్రదేశ్కే..
నాంపల్లిలోని స్టేట్ మ్యూజియంలో బుద్ధుడి ధాతువు(ఎముక) ప్రధాన ఆకర్షణ. బుద్ధ గ్యాలరీలో ఇది ఉంది. ఇది ఏపీకి తరలనుంది. అలాగే గుంటూరులో జరిగిన ‘కాలచక్ర’ఉత్సవాలకు వెళ్లిన తెలంగాణ వస్తువులు తిరిగి ఇక్కడికి రానున్నాయి. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పురావస్తు సంపద బట్వాడా మొదలైంది. రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాల అధీనంలో ఉన్న పురాతన సంపద పంపకం జరుగుతోంది. రెండు రాష్ట్రాల వైపు నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీల ఆధ్వర్యంలో ఈ పంపకం సాగుతోంది. 1956కు ముందున్న వస్తువులన్నీ తెలంగాణకే చెందుతాయని కమిటీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఆ తర్వాత సమకూరిన వాటిలో.. ఏ ప్రాంతంలో లభించినవి ఆ ప్రాంతం ఉన్న రాష్ట్రానికి చెందనున్నాయి. 1956 తర్వాత ఖరీదుకు సమకూర్చుకున్నవి 58:42 దామాషా ప్రకారం (ఏపీకి 58.. తెలంగాణకు 42) పంచనున్నారు. తొలుత స్టోర్లలో ఉన్న వాటిని పంచుతున్నారు. ఆ తర్వాత ప్రదర్శనలో ఉన్నవాటిని బట్వాడా చేయనున్నారు. హైదరాబాద్లోని డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి స్టేట్ మ్యూజియంలో ఉన్న నాణేలకు సంబంధించి ఏపీకి ఇప్పటికే 30 వేల నాణేలను కేటాయించారు. వాటిని విడిగా ఏపీ అధికారులు స్థానికంగా భద్రపరుచుకున్నారు. మొత్తం 3.65 లక్షల వస్తువులను పంచుకోవాల్సి ఉంది. సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి పురావస్తు సంపద పంపకాలకు కసరత్తు జరుగుతున్నా ఏకాభిప్రాయం కుదరక కొలిక్కి రాలేదు. ఆరున్నరేళ్ల తర్వాత ఓ నిర్ణయానికి రావడంతో బట్వాడా ప్రక్రియ మొదలైంది. 1956కు ముందు తెలంగాణతో ఏపీకి సంబంధం లేనందున అంతకుముందున్న పురాతన సంపదపై పూర్తిగా తెలంగాణకే హక్కు ఉం టుందన్న విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు పురావస్తు పంపక కమిటీ చైర్మన్ డాక్టర్ రాజారెడ్డి, కన్వీనర్ రాములు స్పష్టం చేశారు. ఆ తర్వాత రెండు ప్రాంతాలు ఒకే రాష్ట్రంగా ఉన్నం దున ఏ ప్రాంతంలో లభించిన వస్తువులపై ఆ ప్రాం తానికే హక్కు ఉంటుందని తేల్చినట్టు తెలంగాణ కమిటీ సభ్యుడు రంగాచార్యులు తెలిపారు. చదవండి: ఉచితంగా వృత్తి విద్యా కోర్సులు నాణేలే ఎక్కువ.. ప్రపంచంలో బ్రిటిష్ మ్యూజియం తర్వాత అత్యధిక నాణేలు ఉన్నది హైదరాబాద్ స్టేట్ మ్యూజియంలోనే. ఇక్కడ 3.45 లక్షల నాణేలున్నాయి. వీటిల్లో ఆంధ్రప్రదేశ్కు 53 వేలు చెందుతాయని తాజాగా అధికారులు లెక్కలు తేల్చారు. వీటిల్లోంచి 30 వేలను గత పక్షం రోజుల్లో దశలవారీగా అందజేశారు. నాణేల్లో బంగారువి 17 వేలుంటే, ఏపీకి ఇచ్చేవి 5 వేలుగా గుర్తించారు. ఇక తెలంగాణలో లభించినా.. కొన్ని ఏపీ ప్రాంత సామ్రాజ్యాలకు సంబంధించినవి ఉన్నాయి. దీంతో వాటిని ఏపీకి ఇవ్వాలన్న యోచనలో తెలంగాణ అధికారులున్నట్లు సమాచారం. నల్లగొండ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో బయటపడినవి ఏపీ ప్రాంతానికి చెందిన వెంగీ చాళుక్యుల సామ్రాజ్యానికి చెందినవి కావటంతో వాటిని ఏపీ కోరుతోంది. బుద్ధుడి ధాతువు ఆంధ్రప్రదేశ్కే.. నాంపల్లిలోని స్టేట్ మ్యూజియంలో ప్రధాన ఆకర్షణల్లో బుద్ధుడి ధాతువు ఒకటి. బుద్ధ గ్యాలరీలో ఇది ఉంది. ఇది బుద్ధుడి ఎముక. దీంతోపాటు ఆయన చితాభస్మం కూడా ఉంది. ఇది విశాఖపట్నం సమీపంలోని బావికొండలో 1980లో జరిపిన తవ్వకాల్లో వెలుగుచూసింది. ఇవి ఉన్న పాత్రలో బుద్ధుడి కాలానికి సంబంధించి చిన్న బంగారు, వెండి వస్తువులున్నాయి. ఆ పాత్రను నాంపల్లి మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. ఇప్పుడది ఏపీకి తరలివెళ్లనుంది. తెలంగాణలో మరెక్కడా బుద్ధుడి ధాతువు లేనందున దీన్ని హైదరాబాద్లోనే ఉంచేలా ఏపీని కోరాలని అధికారులు నిర్ణయించారు. అలాగే కృష్ణాజిల్లా మోటుపల్లిలో చోళుల కాలానికి చెందిన నటరాజ, పార్వతి, నాయనార్ల తామ్ర విగ్రహాలున్నాయి. ఇవి కూడా మ్యూజియంలో ప్రధానాకర్షణ. ఇవీ ఏపీకి వెళ్లనున్నాయి. అమరావతి శిల్పాలు తెలంగాణకు.. చెన్నై రాజధానిగా 1953కు ముందు ఏపీ కొనసాగినప్పుడు ఆంధ్రాలోని అమరావతిలో లభించిన అద్భుతశిల్పాలు చెన్నై, తంజావూరు మ్యూజియంలలో ఉంచారు. 1917లో నాటి తెలంగాణ స్టేట్ పురావస్తు అధికారులు పరస్పర మార్పిడిలో భాగంగా తమిళనాడు నుంచి కొన్ని శిల్పాలు తెచ్చారు. ఇందులో అమరావతివి కూడా ఉన్నాయి. అవి 1956కు ముందు వచ్చినందున ఇప్పుడవి తెలంగాణ లోనే ఉంటాయని అధికారులు చెబుతున్నారు. అలాగే ఫణిగిరి, నేలకొండపల్లి సహా వివిధ ప్రాంతాల్లో లభించిన కొన్ని వస్తువులు ఏపీలో ఉన్నాయి. అవి తెలంగాణకు రానున్నాయి. ఇక దలైలామా ఆధ్వ ర్యంలో గుంటూరులో జరిగిన కాలచక్ర ఉత్సవాల సమయంలో కూడా తెలంగాణ నుంచి పెద్ద సం ఖ్యలో శిల్పాలు, ఇతర పురాతన వస్తువులు గుంటూరుకు తరలాయి. అవి తెలంగాణకు వస్తాయి. -
భళా.. భారతి!
తొర్రూరు: పురుషులకు మాత్రమే పరిమితమైన విద్యుత్ లైన్మెన్ పోస్టును తొలిసారి ఓ గిరిజన యువతి చేజిక్కించుకుంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం బోజ్యా తండా పంచాయతీ పరిధిలోని దేశ్యా తండాకు చెందిన వాంకుడోతు భారతి దేశంలోనే తొలి జూనియర్ లైన్ వుమెన్గా ఎంపికై రికార్డు సృష్టించింది. 2019లో రాష్ట్ర ప్రభుత్వం లైన్మెన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయగా.. మహబూబాబాద్ జిల్లా నుంచి భారతి దరఖాస్తు చేసుకుంది. అయితే, ఈ పోస్టులకు పురుషులు మాత్రమే అర్హులని, మహిళా అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించలేమని అధికారులు సెలవిచ్చారు. అయినా వెనక్కు తగ్గని భారతి హైకోర్టును ఆశ్రయించగా.. మహిళలను కూడా లైన్ వుమెన్ ఉద్యోగాలకు పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. దీం తో అధికారులు మహిళా అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించారు. ఇందులో క్లిష్టమైన స్తంభాలు ఎక్కే పరీక్షలో కూడా ప్రతిభ కనబరిచిన భారతి జూనియర్ లైన్ వుమెన్ ఉద్యోగానికి ఎంపికైంది. ఈమెతో పాటు సిద్దిపేట జిల్లాకు చెందిన బబ్బూరి శిరీష కూడా ఉద్యోగాన్ని సాధించింది. లంబాడ సామాజిక వర్గానికి చెందిన తనకు చెట్లు ఎక్కడం, వ్యవసాయ పనులు చేయడం అలవాటేనని, ఆ ధైర్యంతోనే తాను స్తంభాలు ఎక్కగలనని కోర్టుకు, ప్రభుత్వానికి విన్నవించుకున్నానని భారతి చెప్పారు. తాను ఉద్యోగానికి ఎంపికైనట్లు ఇప్పటికే సమాచారం అందిందని, ప్రభుత్వం నుంచి నియామక పత్రం రాగానే ఉద్యోగంలో చేరి విధులు నిర్వర్తిస్తానని తెలిపింది. కాగా, భారతి భర్త మోహన్ ప్రైవేటు ఉద్యోగి. వీరికి ఎనిమిదేళ్ల సాయితేజ, నాలుగేళ్ల శాన్విశ్రీ సంతానం. -
ఆ పేర్లలోనే ఏదో కరెంట్ ఉంది
భారతి, శిరీష... ఆ పేర్లలోనే ఏదో కరెంట్ ఉంది.‘చెట్టులెక్కగలవా ఓ నరహరి’ అని చెంచిత అడిగింది.నరహరి అడగలేదు.ఎందుకంటే చెంచితకు చెట్టులెక్కడం రాదు.. పుట్టలెక్కడం రాదు అని జనాభిప్రాయం.చెట్లే ఎక్కలేని స్త్రీలు కరెంట్ పోల్ ఏమెక్కుతారని కూడా చాలా ఏళ్లుగా అభిప్రాయం.‘మేము ఎక్కగలం’ అన్నారు భారతి, శిరీష.లైన్లను దారిలో పెట్టగలం అని పెట్టి మరీ చూపిస్తున్నారు.ఉమెన్ పవర్ అంటే ఏమిటో కాదు. ఇటువంటి స్త్రీలు చూపేదే. పల్లెటూరులో పుట్టి పెరిగిన ఇద్దరు యువతులు కొత్త చరిత్రకు నాంది పలికారు. విద్యుత్ శాఖలో మహిళలు చేయలేరని భావించే లైన్మెన్ ఉద్యోగానికి రాష్ట్రంలో తొలిసారిగా ఎంపికై ఎంతోమందికి వెలుగు బాట చూపారు. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో అవరోధాలు ఎదురైనా పట్టుదల తో ముందుకు సాగారు. కోర్టును ఆశ్రయించి అనుకున్నది సాధించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం దేశ్యా తండాకు చెందిన 32 ఏళ్ల వాంకుడోతు భారతి, సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం గణేష్పల్లి గ్రామానికి చెందిన 20 ఏళ్ల బబ్బూరి శిరీషల విజయగాథ ఇది. తల్లి, మేనమామతో శిరీష ఇంతకాలం పురుషులకే పరిమితమైన విద్యుత్ లైన్మెన్ పోస్టును మహిళలుగా తొలిసారి మీరు చేజిక్కించుకోవడం ఎలా ఉంది? భారతి: చాలా ఆనందంగా ఉంది. ముందు ఉద్యోగం కోసం చాలా సాధారణంగానే అన్ని ప్రయత్నాలు చేశా. కానీ, ఇలా అందరూ అభినందనలు చెబుతుంటే గర్వంగా కూడా ఉంది. శిరీష: మేం పడిన కష్టానికి ఫలితం దక్కిందనిపించింది. ఈ ఉద్యోగాన్నే ఎంచుకోవడానికి కారణం? భారతి: తండాలో పుట్టి పెరిగాను. గిరిజనులమైన మాకు వ్యవసాయమే ఆధారం. అయినా, ఎంకామ్ వరకు చదువుకున్నాను. ఐటిఐ చేస్తే ఉద్యోగావకాశాలు పెరుగుతాయనీ అదీ పూర్తి చేశాను. గవర్నమెంటు ఉద్యోగాలకు ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఆ క్రమంలోనే లైన్మెన్ నోటిఫికేషన్ గురించి తెలిసింది. చిన్నప్పటి నుంచీ పొలాల్లో చెట్లు ఎక్కాను, నాట్లేశాను, కలుపుతీశాను, ఎండవానలు తేడా లేకుండా పనులు చేశాను. లైన్మన్ ఉద్యోగం చేయడం పెద్ద కష్టం అనిపించలేదు. శిరీష: మా అమ్మ నాన్నలకు నేనొక్కదాన్నే కూతురును. మాకు ఎలాంటి ఆస్తిపాస్తుల్లేవు. రెక్కలకష్టమే జీవనాధారం. ఊళ్లో పనులు దొరక్క నా చిన్నప్పుడే అమ్మనాన్నలు మేడ్చల్కు వలసవెళ్లారు. అక్కడి కంపెనీల్లో కూలి పనులు చేస్తూ పూటగడుపుకునేవారు. మేడ్చల్లోని ప్రభుత్వ పాఠశాలలో పదవతరగతి చదివా. ఆ తర్వాత పరిస్థితుల కారణంగా తిరిగి ఊరికి వెళ్లిపోయాం. ఊళ్లోనే ఉంటున్న నాకు మా మేనమామ చెప్పడంతో ఐటిఐ పూర్తిచేశాను. ఆ తర్వాత అంబేద్కర్ యూనివర్శిటీ నుంచి డిగ్రీ చేస్తూ, ఈ ఉద్యోగానికి అప్లై చేశాను. ఈ ఉద్యోగం ఆడవాళ్లు చేయదగినది కాదు అని నాకు ఎంతమాత్రం అనిపించలేదు. లైన్మెన్ పోస్టుల్లో మహిళా అభ్యర్థులకు అవకాశమే లేదన్నారు. మరి ఆ అవరోధాలను ఎలా ఎదుర్కొన్నారు? భారతి: 2019 సెప్టెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది. అందులో స్త్రీలు అప్లయ్ చేసుకోవడానికి అసలు ఆప్షనే లేదు. అన్ని రంగాల్లో స్త్రీలకు 33 శాతం అవకాశాలు ఉన్నాయంటారు, మరి దీనికి ఎందుకు లేదు అని కోర్టుకు వెళ్లాను. కోర్టు పర్మిషన్ ఇచ్చింది. రిటన్ టెస్ట్ అయిపోయింది. పోల్ టెస్ట్కి మళ్లీ అడ్డంకులు. మళ్లీ కోర్టుకు వెళ్లాం. భవిష్యత్తులో న్యాయం చేయాలని బెంచ్ తీర్పునిచ్చింది. ఈ కాపీని తీసుకెళ్లి సంబంధిత అధికారులకు చూపించగా... ‘కోర్టు తీర్పు భవిష్యత్తులో అని ఉందిగా...తర్వాత చూద్దాంలే...’ అని దాట వేశారు. మళ్లీ కోర్టుకు వెళ్లాం. గడువు లోపల పోల్ టెస్ట్ పెట్టి, కంప్లీట్ చేయమని మళ్లీ కోర్టు అదేశాలు ఇచ్చింది. ఆ టెస్ట్లో 1 మినిట్లోపు పోల్ ఎక్కి దిగాలి. అందులో పాసయ్యాను. అధికారులు అభినందించి, ఎంపికైనట్టు చెప్పారు. శిరీష: ఈ పోస్టుకు దరఖాస్తుచేసే సమయంలో మహిళలకు అప్షన్ లేకపోవడం చాలా ఆందోళనగా అనిపించింది. ఈ రోజుల్లో ఇంకా మగ–ఆడ తేడా చూపే ఉద్యోగాలు ఉన్నాయా అనుకున్నాను. మొత్తానికి కోర్టుకు వెళ్లడంతో పర్మిషన్ వచ్చింది. కిందటి నెల 23న హైద్రాబాద్ యూసుఫ్గూడలోని సీపీటీఐ (సెంట్రల్ పవర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్)లో విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో పోల్ క్లైంబింగ్ పరీక్ష నిర్వహించడంతో విజయవంతంగా పరీక్షలో నెగ్గాను. విద్యుత్ స్తంభాలు ఎక్కడం, దిగడం... ఈ పనులు మీరెలా నేర్చుకున్నారు? భారతి: ఇద్దరు పిల్లల తల్లిని. ఎనిమిదేళ్ల కొడుకు, నాలుగేళ్ల కూతురు ఉన్నారు నాకు. తండాల్లో పుట్టి పెరిగినదాన్ని. చెట్లు ఎక్కి దిగడం చిన్నప్పటి నుంచీ నాకు అలవాటే. ఆ ధైర్యంతోనే స్తంభాలు ఎక్కగలనని కోర్టుకు విన్నవించుకున్నా. అయినా పోల్ టెస్ట్కు ముందు వరంగల్లోని ఎన్పీసిఎల్ గ్రౌండ్లో నెల రోజుల పాటు రోజూ ఉదయం సాయంత్రం ప్రాక్టీస్ చేశాను. శిరీష: మా మేనమామ శేఖర్గౌడ్ ప్రత్యేకంగా తర్ఫీదునిచ్చాడు. ఇంట్లో తాడుతో స్తంభాలు ఎక్కే విధానం, ఆ తర్వాత ప్రజ్ఞాపూర్లోని సబ్స్టేషన్ లో పోల్ ఎక్కడం నేర్పాడు. రేషన్ బియ్యం తప్ప ఇతర పోషకాహారం లభించని దయనీయ స్థితిలో ఉన్న నాకు ఫిజికల్ ఫిట్నెస్ కోసం పోషకాహారం సమకూర్చాడు. దాదాపు ఆరునెలలు సాధన చేశాను. ఎంతో ఆత్మవిశ్వాసం, అంతకుమించి ధైర్యం తో లైన్మెన్ ఉద్యోగంలో చేరిన వీరికి అభినందనలు చెబుదాం. కష్టమేమీ కాదు.. పేదరికంలో ఎన్నో కష్టాలు పడ్డాను. వాటి ముందు స్తంభాలు ఎక్కి, ఎలక్ట్రికల్ పనులు చేయడం పెద్ద కష్టమేమీ అనిపించలేదు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిరుత్సాహపడలేదు. మొండిగా కోర్టు చుట్టూ తిరిగా. గవర్నర్ అభినందించడం జీవితంలో మరిచిపోలేను. – బబ్బూరి శిరీష నిమిషంలో పోల్ టెస్ట్ పాస్ నా చిన్నతనంలో తండా నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్కి నడిచివెళ్లేదాన్ని. ఇంటర్ దేరుట్ల కాలేజీలో, డిగ్రీ భద్రాచలంలో గవర్నమెంట్ కాలేజీలో, ఎంకామ్ కేయూ యూనివర్శిటీలో చదివాను. పద్దెనిమిదేళ్ల క్రితం పెళ్లయ్యింది. పిల్లలు పుట్టాక అత్తగారింటివద్దే వ్యవసాయపనులు చేసుకుంటూ ఉండిపోయాను. అయినా, ప్రతీ ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. లైన్మన్ జాబ్ ఇన్నాళ్లకు వచ్చింది. రోజు మొత్తం వ్యవసాయం పనులు చేయడం వల్ల నిమిషంలో పోల్ ఎక్కడం పెద్ద కష్టమేమీ అనిపించలేదు. – వాంకుడోతు భారతి – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఇన్పుట్స్: – వై.సురేందర్, సాక్షి, గజ్వేల్ ఫొటోలు: కె.సతీష్, సిద్దిపేట Telangana's 1st linewoman : 20 years old Sirisha cracked the junior lineman Exam by TSSPDCL to become 1st linewoman in Telanagana Congratulations Sirisha proud of your accomplishments #womenempowerment @PMOIndia @MinistryWCD @IPRTelangana @PIBHyderabad @airnews_hyd @DDYadagiri — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) January 2, 2021 -
‘పొరుగు’ను పట్టించుకోండి సారూ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. కార్మిక చట్టాల ప్రకారం అందాల్సిన లబ్ధికి వారు నోచుకోవడం లేదు. కొందరికైతే ప్రతి నెలా ఐదో తేదీలోపు అందాల్సిన జీతం డబ్బులు నెలలు గడుస్తున్నా అందడంలేదు. ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ఇష్టారాజ్యం, వీటిని అదుపు చేయడంలో యంత్రాంగం విఫలమవుతుండటంతో చివరకు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అష్టకష్టాలు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 వేల మంది ఉద్యోగులు ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. నిర్దేశించిన పోస్టులో రెగ్యులర్ ఉద్యోగి చేసే అన్ని రకాల పనులను వీరు నిర్వహిస్తారు. పేరుకు బాగానే ఉన్నా.. వేతనాలు, ఇతర సౌకర్యాల విషయంలో అధమమే. ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా వీరంతా నియమితులు కావడం.. వేతన చెల్లింపులు నేరుగా ఉద్యోగి ఖాతాకు కాకుండా ఏజెన్సీకి ప్రభుత్వం విడుదల చేయడంతో ప్రభుత్వానికి, ఉద్యోగికి మధ్య అంతరం ఎక్కువగా ఉంటోంది. సమస్యలు వస్తే వాటి పరిష్కారంపై ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టకపోవడం కూడా ఒక కారణమే.. ఏజెన్సీలతో ఇబ్బందులే.. తాత్కాలిక ఉద్యోగ నియామకాల విషయంలో ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఉద్యోగంలో చేరే సమయంలో పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు సైతం వస్తుండగా.. నెలవారీగా ఇచ్చే వేతనాలు ఇవ్వకుండా జాప్యం చేయడం, వేతనాల్లో కోతలు విధించడం, ఉద్యోగులకు చేకూరాల్సిన ప్రధాన లబ్ధి ఈఎస్ఐ, పీఎఫ్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఔట్సోర్సింగ్ సిబ్బంది తీవ్రంగా నష్టపోతున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పెద్దగా ఫలితం ఉండటంలేదు. మరోవైపు ఏజెన్సీలపై జిల్లా ఉపాధి కల్పన అధికారికి ఫిర్యాదులిచ్చినప్పటికీ అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఇదివరకు ఔట్సోర్సింగ్/కాంట్రాక్టు ఉద్యోగులను టామ్కామ్ (తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ) ద్వారా చేపట్టామని, కానీ కాంట్రాక్టు ఉద్యోగుల నిర్వహణ ఇబ్బందులతో ఆ ప్రక్రియను ప్రభుత్వం జిల్లాలకు అప్పగించింది. అయితే ఔట్సోర్సింగ్ ఏజెన్సీలపై కార్మిక, ఉపాధి కల్పన శాఖకు అజమాయిషీ లేదని ఆ శాఖ సంచాలకుడు కేవై నాయక్ చెబుతున్నారు. యాదాద్రిలో టీమ్.. కరీంనగర్లో వారధి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నిర్వహణ ప్రక్రియ యాదాద్రి భువనగిరి, కరీంనగర్ జిల్లాల్లో భిన్నంగా ఉంది. ఇందుకోసం యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రత్యేకంగా టీమ్ (తెలంగాణ ఎంప్లాయీస్ అసిస్టెన్స్ మిషన్) పనిచేస్తుండగా.. కరీంనగర్ జిల్లాలో వారధి అనే సొసైటీ ఉంది. వీటికి ఆయా జిల్లాల కలెక్టర్లు చైర్మన్గా వ్యవహరిస్తారు. అలాగే వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు కూడా ఇందులో ఉంటారు. ఆయా జిల్లాల పరిధిలో ఏ శాఖకు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగులు అవసరమైనా.. ఈ సంస్థలు ఎంపిక చేస్తాయి. ఈ ఉద్యోగాల్లో కూడా మెరిట్, రోస్టర్, రిజర్వేషన్ కచ్చితంగా అమలు చేస్తున్నామని టీమ్ సంస్థ సభ్య కార్యదర్శి శ్రీనివాసుల వెంకట రంగయ్య చెబుతున్నారు. అలాగే వేతన చెల్లింపులు, పీఎఫ్, ఈఎస్ఐ ప్రక్రియంతా నిర్దేశించిన గడువు నాటికి కచ్చితంగా చెల్లించడమే తమ బాధ్యత అని వారధి సభ్య కార్యదర్శి గాదె ఆంజనేయులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి పద్ధతే పాటిస్తే బాగుంటుందని పలువురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అంటున్నారు. జిల్లా కలెక్టర్లు చైర్మన్గా ఉంటూ జిల్లా ఉపాధి కల్పన అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలు ఇప్పటికే ఉన్నా.. చాలాచోట్ల ఆ కమిటీలు యాక్టివ్గా లేవని సమాచారం. ఏపీలో ఇలా... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ సర్వీసుల విషయంలో మరింత ముందుంది. నియామకాల్లో మధ్యవర్తిత్వం లేకుండా పూర్తి పారదర్శకత, వేతన చెల్లింపుల్లో కచ్చితత్వం, ఉద్యోగులకు కలగాల్సిన లబ్ధిని పక్కాగా అందించాలనే లక్ష్యంతో ఆప్కోస్ (ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్సోర్స్డ్ సర్వీసెస్) పేరిట ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలను ఈ కార్పొరేషన్ ద్వారా నియమిస్తున్నారు. ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. అలాగే మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తున్నారు. -
కొలిక్కి వస్తున్న లెక్కలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలపై లెక్క దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. ఈ లెక్కల కోసం గత మూడు రోజులుగా సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ), ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు వివిధ ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, అధిపతులతో భేటీ అయి ఖాళీల వివరాలను సేకరించారు. దాదాపు 50 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించిన నేపథ్యంలో సీఎస్ సోమేశ్కుమార్ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ సమావేశాలు జరిగాయి. గురు, శుక్ర, శనివారాల్లో జరిగిన ఈ సమావేశాల్లో భాగంగా కొన్ని శాఖల నుంచి పూర్తి స్థాయిలో సమాచారం రాలేదని, దాదాపు 40 వేలకుపైగా పోస్టుల లెక్క తేలిందని తెలుస్తోంది. మిగిలిన శాఖల నుంచి పూర్తి స్థాయిలో లెక్కలు వస్తే ఆ సంఖ్య 50 వేలు దాటుతుందని అంచనా. కాగా, వివిధ శాఖల్లోని ఖాళీ పోస్టులను ప్రాధాన్యతల వారీగా భర్తీ చేయాలని, అన్నీ ఒకేసారి కాకుండా అత్యవసర ఖాళీలను ముందు భర్తీ చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు శాఖల వారీగా వచ్చే ఖాళీల వివరాలతో కూడిన సమగ్ర నివేదికను త్వరలోనే జీఏడీ అధికారులు సీఎం కేసీఆర్కు సమర్పించనున్నారు. ఈ నివేదిక ప్రకారం వారం రోజుల్లో సమీక్షించనున్న సీఎం కేసీఆర్.. ఉద్యోగ ఖాళీల విషయంలో అనుసరించాల్సిన విధానంపై తుది నిర్ణయం తీసుకుంటారని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా, మరికొన్ని శాఖలకు సంబంధించిన కసరత్తు ఇంకా పూర్తి కావాల్సి ఉంది. పాఠశాల విద్యకు సంబంధించిన లెక్కలు సోమ, మంగళ వారాల్లో జీఏడీ, ఆర్థిక శాఖలకు అందించనున్నట్లు సమాచారం. ఈ సమాచారం మేరకు టీచర్ పోస్టుల ఖాళీలపై ఓ స్పష్టత రానుంది. -
బోగస్ పెళ్లిళ్లు 90!
ఆదిలాబాద్ అర్బన్: జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కల్యాణలక్ష్మి స్కాంలో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు మూడేళ్లుగా వచ్చిన కల్యాణలక్ష్మి దరఖాస్తులను పరిశీలించిన తహసీల్దార్లు 90 పెళ్లిళ్లకు సంబంధించిన దరఖాస్తులు బోగస్గా ఉన్నాయని గుర్తించారు. ఒకసారి కల్యాణలక్ష్మి డబ్బులు తీసుకోగా మళ్లీ అవే ఫొటోలతో రెండోసారి దరఖాస్తు చేసినట్లుగా పరిశీలనలో తేలింది. మావల మండలానికి చెందిన మూడు బోగస్ దరఖాస్తులకు సంబంధించి డబ్బుల రికవరీ చేయగా, నాలుగు మండలాల పరిధిలోని 87 బోగస్ పెళ్లిళ్లకు సంబంధించి డ బ్బులు రికవరీ చేసే పనిలో అధికారులు నిగమ్నమయ్యారు. బోగస్ లబ్ధిదారులు, మధ్యవర్తుల బ్యాంకు ఖాతాలను నిలిపివేయాలని కలెక్టర్ ఇది వరకే ఎల్డీఎంను ఆదేశించారు. అయితే బోగస్దారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు అలానే ఉన్నాయా? లేక డ్రా చేశారా? డ్రా చేస్తే ఆ డబ్బులు ఎలా.. ఎప్పుడు రికవరీ చేయాలనే దానిపై అధికారులు సమాలోచన చేసి ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో యంత్రాంగం తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. (చదవండి: చిచ్చురేపిన క్రికెట్.. కాల్పుల కలకలం) ఈ ఏడాదిలోనే జరిగిందా? రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను 2016లో ప్రారంభించి మొదట రూ.50,116 ఆడపిల్లల పెళ్లిళ్లకు సాయంగా అందించింది. దానిని 2018 ఏప్రిల్లో రూ.1,00,116కు పెంచింది. ఏటా వేల సంఖ్యలో వివాహాలు జరగడం, పథకానికి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవడం లాంటివి జరుగుతున్నాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా.. మూడు సెట్ల జిరాక్స్ కాపీలను తహసీల్ కార్యాలయంలో అందజేయడం తప్పనిసరి. కాని అలా జరగలేదు. అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్న వారి దరఖాస్తులు మాత్రమే మ్యానువల్గా తహసీల్ ఆఫీసులకు అందాయి. బోగస్ పెళ్లిళ్లకు సంబంధించిన మ్యానువల్ దరఖాస్తులు తహసీల్దార్ల కార్యాలయాలకు రాలేదని అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఆన్లైన్ను ఆసరాగా చేసుకొని కొందరు అక్రమార్కులు తమకు అనుకూలమైన వ్యక్తుల ఫొటోలు, బ్యాంకు ఖాతాలు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జతచేసి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. అంతటితో ఆగకుండా సంబంధిత మండల తహసీల్దార్ల లాగిన్ నుంచి నేరుగా ఆర్డీవో కార్యాలయానికి పంపుతూ వచ్చారు. ఒకసారి కల్యాణలక్ష్మి డబ్బులు పొందిన లబ్ధిదారుల ఫొటోలు మళ్లీ పెట్టి తల్లిదండ్రుల పేర్లు, బ్యాంకు ఖాతా, ధృవీకరణ పత్రాలు మార్చి రెండోసారి కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేసినట్లుగా అధికారులు గుర్తించారు. 2019లో పెళ్లి జరిగినట్లుగా దరఖాస్తులో పొందుపర్చి డబ్బులు ఈ ఏడాదిలో దండుకున్నట్లు విచారణలో తేలినట్లుగా సమాచారం. కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కాలంలోనే బోగస్ పెళ్లిళ్లకు చెందిన బిల్లులు ఎక్కువ పాసయ్యాయని అధికారులు అనుమానిస్తున్నారు. కాగా, తహసీల్దార్లు లాగిన్, పాస్వర్డ్ను ఎప్పటికప్పుడు మార్చుకునే అవకాశం ఉన్నా.. ఆ సమయంలో చేంజ్ చేద్దామనే ఆలోచన రాకపోవడం గమనార్హం. (చదవండి: అయ్యో.. ఐఫోన్ అందకపాయె..! ) కొనసాగుతున్న విచారణ.. జిల్లాలోని ఆయా తహసీల్దార్ కార్యాలయాల్లో కల్యాణలక్ష్మి పథకానికి వచ్చిన దరఖాస్తుల పరిశీలన ముగిసింది. మూడేళ్లుగా వచ్చిన దరఖాస్తులను నాలుగైదు రోజుల పాటు కుప్పలు తెప్పలుగా పోసి క్షుణ్ణంగా పరిశీలించారు. 90 దరఖాస్తులు బోగస్గా తేలగా, 3 దరఖాస్తుల డబ్బులు రికవరీ చేశారు. మిగతా 87 దరఖాస్తులకు సంబంధించిన లబ్ధిదారుల నివాస ప్రాంతాలు ఉట్నూర్, ఇచ్చోడ, నేరడిగొండ, బోథ్, బజార్హత్నూర్, ఇంద్రవెల్లి, సిరికొండ మండలాల్లో ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. అయితే బోథ్, నేరడిగొండ, బజార్హత్నూర్, గుడిహత్నూర్, మావల మండలాల తహసీల్దార్ల లాగిన్ల నుంచి దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రధానంగా ఎవరు దరఖాస్తుదారు, చెక్ ఎవరి పేరిట మంజూరైంది? బ్యాంకు ఖాతా.. పెళ్లికి సంబంధించిన పత్రాలు, ఫొటో, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, తదితరవి వాటిపై ఆయా మండల కార్యాలయాల్లో విచారణ జరుగుతోంది. బోగస్గా గుర్తించినవి సరైనవేనా.? అనేది తెలుసుకునేందుకు క్షేత్రస్థాయికి వెళ్లి విచారిస్తున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. విచారణ ముగిశాక ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెబుతున్నారు. విచారణ జరుగుతోంది కలెక్టర్ ఆదేశాల మేరకు దరఖాస్తులు పరిశీలించి బోగస్గా 90 దరఖాస్తులు గుర్తించాం. ఇందులో మూడు దరఖాస్తులకు చెందిన డబ్బులు రికవరీ అయ్యాయి. మిగతా 87 దరఖాస్తులపై విచారణ జరుగుతోంది. పూర్తి చేసేందుకు కొంత సమయం పడుతుంది. అనంతరం రికవరీ చేస్తాం. – జాడి రాజేశ్వర్, ఆదిలాబాద్ ఆర్డీవో -
టీపీసీసీ చీఫ్ ఎంపిక మరింత ఆలస్యం!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ ప్రారంభించామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ తెలిపారు. ఇప్పటివరకు 162 మంది నేతల అభిప్రాయాలను సేకరించామని అన్నారు. తెలంగాణకు చెందిన ఏఐసీసీ నేతల నుంచి జిల్లా స్థాయి నేతల వరకు అభిప్రాయాలు తెలుసుకున్నామని ఢిల్లీలో సోమవారం ఆయన మీడియాతో పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి పార్టీ నేతల అభిప్రాయాలను సేకరించామన్నారు. సేకరించిన అభిప్రాయాలను సోనియా, రాహుల్ గాంధీలకు అందజేస్తానని వెల్లడించారు. ఈ కసరత్తు పూర్తి కావడానికి మరికొంత సమయం పడుతుందని ఠాగూర్ చెప్పుకొచ్చారు. తుది నిర్ణయం పార్టీ అధిష్టానమే తీసుకుంటుందని స్పష్టం చేశారు. తమ సంప్రదింపుల్లో ‘పీసీసీ చీఫ్ ఎవరైతే బాగుంటుందో చెప్పాలని’ నేతల్ని కోరామని తెలిపారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఎవరికైనా పీసీసీ ఎంపిక కసరత్తుపై ఇబ్బందిగా ఉంటే నేరుగా పార్టీ అధిష్ఠానాన్ని కలవొచ్చని సూచించారు. టీఆర్ఎస్-బీజేపీ వైఖరి ఢిల్లీలో దోస్తీ-గల్లీ మే కుస్తీ అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్-మోదీ భేటీ ద్వారా ఈ విషయం తెలుస్తోందని అన్నారు. ఇక టీఆర్ఎస్ నేతలపై మరో 6 నెలల పాటు ఎలాంటి ఐటీ, ఈడీ దాడులు ఉండవని అర్ధమైందని ఠాగూర్ తెలిపారు. (చదవండి: నేడు ఢిల్లీకి కోమటిరెడ్డి, శ్రీధర్బాబు!) మోదీ-కేసీఆర్ భేటీపై బండి సంజయ్, కిషన్ రెడ్డి ఏం చెబుతారో చూడాలని అన్నారు. ప్రజాదరణ లేని నాయకులు కాంగ్రెస్ను వీడుతున్నారని, అలాంటి వారితో తమ పార్టీకి నష్టమేమీ లేదని పేర్కొన్నారు. ప్రజాదరణ కలిగిన బలమైన నేతలు వీడితేనే ప్రమాదమని చెప్పారు. అసలైన కాంగ్రెస్ నేతలెవరూ తమ పార్టీని ఎట్టి పరిస్థితిలో వీడరని ఠాగూర్ ధీమా వ్యక్తం చేశారు. సంస్థాగతమైన లోపాల కారణంగానే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని, అందుకు బాధ్యత వహిస్తూ జీహెచ్ఎంసీ విభాగం అధ్యక్షుడు రాజీనామా చేశారని ఆయన గుర్తు చేశారు. (చదవండి: హైదరాబాద్లో కాంగ్రెస్కు ఏమైంది? ) -
తెలంగాణలో కొలువుల జాతర
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొలువుల జాతర మొదలవనుంది. పోలీస్ శాఖ, విద్యా శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదివారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. సీఎం నిర్ణయంతో దాదాపు 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశమున్నట్టుగా తెలుస్తోంది. ఉపాధ్యాయ, పోలీసు ఉద్యోగాలతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. వ్యవసాయేతర ఆస్తులు–వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించిన అనుసరించాల్సిన పద్ధతులపై ఆయన ఆదివారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త చెప్పారు. (చదవండి: ఇదేం పనయ్యా.. కానిస్టేబుల్!) రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ను సీఎం ఆదేశించారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో దాదాపు 50 వేల వరకు ఖాళీలున్నట్లు ప్రాథమిక సమాచారం. వాటన్నంటినీ భర్తి చేయాలి. వేల సంఖ్యలో ఉపాధ్యాయులు, పోలీసుల రిక్రూట్మెంట్ జరగాల్సి ఉంది. ఈ రెండు విభాగాలతో పాటు రాష్ట్రంలోని ఇతర శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు వెంటనే సేకరించాలి. ఇంకా ఏఏ శాఖల్లో ఎంత మంది ఉద్యోగుల అవసరం ఉందో లెక్క తేల్చాలి. అలా లెక్క తేలిన తర్వాత వాటిని భర్తీ చేయడం కోసం వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలి’ అని సీఎం కేసీఆర్ ఆదేశించారు. (చదవండి: 14 నెలల తర్వాత ప్రధానిని కలిసిన సీఎం) -
‘సర్కారు భూమిల మన్నుబొయ్య..’
సాక్షి, మహబూబాబాద్: దళితులకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న మూడెకరాల భూమి ఓ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. దళితుల మధ్య చిచ్చు రేపింది. ఈ ఘటన బొమ్మకల్ గ్రామంలో జరిగింది. గతంలో ఈ గ్రామంలోని 20 మంది దళితులకు 3 ఎకరాల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. 20 మందికి పంపిణీ చేసిన మూడు ఎకరాల భూమిని గ్రామ సర్పంచ్ ఒప్పందంతో అర్హులైన ఒక్కో దళిత కుటుంబానికి ఎకరం చొప్పున పంచుకోవాలని గతంలో దళితులంతా ఒప్పందం చేసుకున్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మూడు ఎకరాల భూమిని 20 మందికి మాత్రమే వర్తిస్తుందని లబ్ధిదారులు అనడంతో దళితులంతా ఆగ్రహించారు. మహిళలని కూడా చూడకుండా లబ్దిదారులపై విచక్షణరహితంగా దాడికి దిగారు. తీవ్ర గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పెద్దవంగర ఎస్ఐ జితేందర్ పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. దళితులంతా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు సమర్పించారని ఎస్ఐ తెలిపారు. ఇక గ్రామంలోని కొంతమంది దళితులకే ప్రభుత్వం భూములు ఇవ్వడంతోనే ఈ గొడవలకు కారణమైందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘సర్కారు భూమిల మన్నుబొయ్య మా పానాలు తీస్తరా’ అని బాధితులు ఆక్రోశం వెళ్లగక్కారు. -
చలి చంపేస్తోంది!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మంగళవారం ఉదయం 8.30 నుంచి బుధవారం ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రంలో నమోదైన గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే... ఖమ్మంలో గరిష్టంగా 32.6 డిగ్రీ సెల్సియస్, ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలో కనిష్టంగా 7.1 డిగ్రీల సెల్సియస్ నమోద య్యాయి. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని 9 మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పది డిగ్రీల కంటే తక్కువగా నమోదైనట్లు వాతా వరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. చదవండి: సిద్దిపేటలో సామూహిక గృహ ప్రవేశాలు ప్రస్తుత సీజన్లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే నమోదవుతున్న ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 2.6 డిగ్రీలు తక్కువ నమోదవుతుండగా.. గరిష్ట ఉష్ణోగ్రత 3.9డిగ్రీలు అధికంగా నమోదవుతోంది. జిల్లా కేంద్రాలవారీగా ఉష్ణోగ్రతల నమోదును పరిశీలిస్తే.. నల్లగొండ మినహాయించి అన్నిచోట్లా గరిష్ట ఉష్ణోగ్రతలు 30డిగ్రీల కంటే ఎక్కువగా నమోదయ్యాయి. అధికంగా ఖమ్మం 32.6 డిగ్రీలు, నిజామాబాద్ 32.4డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. అత్యల్పంగా ఆదిలాబాద్లో 10.6 డిగ్రీలు, మెదక్లో 11.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
రైతు వెంటే తెలంగాణ రాష్ట్రం
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ చెదురు మదురు ఘటనలు మినహా మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. దాదాపుగా అన్ని పార్టీలు రోడ్డెక్కి నిరసన తెలిపాయి. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు ధర్నాల్లో పాల్గొన్నారు. విపక్ష కాంగ్రెస్, ప్రజాసంఘాలు, ఉద్యోగ, కార్మిక సంఘాలు కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారీ ప్రదర్శనలు నిర్వహించాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజారవాణా స్తంభించింది. వివిధ యూనివర్సిటీల పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆర్టీసీ, ప్రైవేటు ట్రాన్స్పోర్టు వాహనాలు రోడ్డెక్కలేదు. రైల్వే సర్వీసులకు, ఆసుపత్రులు, పెట్రోల్ బంకులు తదితర అత్యవసర సర్వీసులకు బంద్ నుంచి మినహాయింపు ఇవ్వడంతో ఎలాంటి ఆటంకం కలగలేదు. కొన్నిచోట్ల ధర్నాలు, వ్యవసాయ చట్టాల విషయంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. పోలీసుల జోక్యంతో ఉద్రిక్తతలు చల్లారాయి. పలుచోట్ల వాణిజ్య, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూతబడ్డాయి. మరికొన్నిచోట్ల మాత్రం ఆందోళనకారులు బలవంతంగా మూయించారు. మొత్తంమీద మంగళవారం రాష్ట్రంలో నిర్వహించిన భారత్ బంద్లో చెదురు ముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా భారత్ బంద్కు మద్దతు ప్రకటించడంతో అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా «ఎక్కడికక్కడ ధర్నాలకు దిగారు. మంత్రులంతా జాతీయ రహదారులను దిగ్బంధించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉమ్మడి జిల్లాలవారీగా బంద్ ఎలా జరిగిందంటే... హైదరాబాద్ పరిధిలో... రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో మంగళవారం భారత్ బంద్తో జనజీవనం స్తంభించింది. ప్రజారవాణా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దూరప్రాంతాల నుంచి రైళ్లలో నగరానికి చేరుకున్న వారు ఇళ్లకు చేరుకోవడం కష్టంగా మారింది. ఎంజీబీఎస్, జేబీఎస్లలో ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రయాణికులు బస్సుల కోసం పడిగాపులు కాశారు. మంత్రి తలసాని సికింద్రాబాద్లో రైతులకు మద్దతుగా నిరసన కార్యక్రమంలో పాల్గొనగా, ఆజంపురాలో హోంమంత్రి మహమూద్ అలీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. రంగారెడ్డిలో... జిల్లాలోని షాద్నగర్లో మంత్రి కేటీఆర్ ఆందోళనకు దిగారు. కేంద్రం కార్పొరేట్ శక్తులకు మేలు చేసేలా కొత్త వ్యవసాయ చట్టాలు రూపొందించిందని దుయ్యబట్టారు. మద్దతు ధర అంశాన్ని చట్టంలో ఎక్కడా ప్రస్తావించకపోవడాన్ని తప్పుబట్టారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరంలో తుక్కుగూడ వద్ద శ్రీశైలం హైవే వద్ద జరిగిన నిరసనలో పాల్గొన్నారు. వరంగల్లో.. రైతు బిల్లులుకు వ్యతిరేకంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మడికొండలో హైదరాబాద్ రహదారిపై ధర్నా చేశారు. మంత్రి సత్యవతి రాథోడ్, మానుకోట జిల్లా కేంద్రంలో ధర్నా చేశారు. నల్లగొండ జిల్లాలో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై వందలాది ట్రాక్టర్లతో సూర్యాపేట జిల్లా రైతులు నిరసనకు దిగారు. జనగాం ఎక్స్రోడ్డు వద్ద మంత్రి జగదీశ్రెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్, కేతెపల్లి మండలం కొర్ల పహాడ్ వద్ద ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రాస్తారోకోలో పాల్గొన్నారు. హుజూర్నగర్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేశారు. మహబూబ్నగర్లో.. మహబూబ్నగర్లో జరిగిన నిరసనలో మంత్రి శ్రీనివాస్గౌడ్ పాల్గొని కేంద్రం తీరును తప్పుబట్టారు. ఆలంపూర్ చెక్పోస్టు వద్ద ధర్నాలో మంత్రి నిరంజన్రెడ్డి పాల్గొన్నారు. షాద్నగర్ మార్కెట్ కమిటీ యార్డు వద్ద ఎంపీ రేవంత్ రెడ్డి కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు. కరీంనగర్లో.. కరీంనగర్ శివారులోని అలుగునూరు వద్ద హైదరాబాద్ హైవేపై మంత్రి గంగుల కమలాకర్ సహా పలువురు సీనియర్ నేతలు నిరసన తెలిపారు. ధర్మారం, చొప్పదండిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చొప్పదండి వద్ద కాంగ్రెస్ నేత మేడిపల్లి సత్యం అనుచరులతో కలసి మంత్రి కొప్పులను అడ్డగించడంతో ఉద్రిక్తత తలెత్తింది. బస్టాండ్ వద్ద జరిగిన ధర్నాలో టీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్కు మధ్య వాగ్వాదం జరిగింది. కోరుట్ల కార్గిల్ చౌరస్తాలో మొక్కజోన్నలకు మద్దతు ధర కల్పించాలని రైతులు ఆందోళనకు దిగారు. మెదక్లో.. సన్న వడ్లు కొనాలంటూ ధర్నాలు చేస్తున్న బీజేపీ నేతలు.. ముందు కేంద్రం జారీ చేసిన లెవీ సేకరణ చట్టాన్ని రద్దు చేయాలని మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. హుస్నాబాద్, తుప్రాన్, గజ్వేల్లో జరిగిన రాస్తోరోకోలో మంత్రి హరీశ్రావు పాల్గొని నిరసన తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో.. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ పట్టణంలో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. జోగు రామన్న బోరాజ్ వద్ద జాతీయ రహదారిపై ధర్నాలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు కూడా జిల్లా కేంద్రాలు, జాతీర రహదారులపై ధర్నాలు నిర్వహించారు. నిజామాబాద్లో.. కామారెడ్డిలో 44వ జాతీయ రహదారిపై ఎమ్మెల్సీ కవిత, విప్ గంప గోవర్దన్ రాస్తారోకోకు దిగారు. కేంద్రం మద్దతు ధర విషయాన్ని ప్రస్తావించక పోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. మంత్రి వేల్పుల ప్రశాంత్రెడ్డి 64వ జాతీయ రహదారిపై ధర్నాలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో.. మంత్రి పువ్వాడ అజయ్ ఖమ్మం పట్టణంలో రాస్తారోకోలో పాల్గొన్నారు. బూర్గంపాడు మండలం కారపాక పట్టణంలో జాతీయ రహదారి ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ధర్నాలో పాల్గొన్నారు. పలుచోట్ల చెదురుమదురు ఘటనలు.. భారత్ బంద్కు అనుకూలంగా హైదరాబాద్లో ఆందోళన చేస్తున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను కొందరు అడ్డుకున్నారు. ఇంతకాలం రైతుల సమస్యలు పక్కనబెట్టి ఇప్పుడు ఆందోళనలు ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు. బంద్పై నిలదీసిన ఓ వ్యక్తిని ఎమ్మెల్యే ఆగ్రహంతో నెట్టేడం వివాదాస్పదమైంది. మియాపూర్లో ప్రధాన రహదారులపై పోలీసులు బారికేడ్లు పెట్టడంతో వాటిని తొలగించాలని వాహనదారులు వాగ్వాదానికి దిగారు. ఆదిలాబాద్ జిల్లా గుడి హత్నూర్లో షాపులు తెరిచిన వారితో ఆందోళనకారులు వాగ్వాదానికి దిగారు. హైదరాబాద్లోని పాతబస్తీ పూర్తిగా బంద్ పాటించింది. కొన్ని ప్రాంతాల్లో ఆందోళనకారులకు, వ్యాపారులకు వాగ్వాదం నడిచింది. ఆమనగల్లులో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వర్గీయులు బాహాబాహీకి దిగారు. కర్రలు, నీళ్ల సీసాలు విసురుకున్నారు. -
మహానదే ఫస్ట్
సాక్షి, హైదరాబాద్: గోదావరి– కావేరి నదుల అనుసంధాన ప్రక్రియపై కొత్త అభ్యంతరాలు తెరపైకి వచ్చాయి. గోదావరి బేసిన్లో రాష్ట్ర అవసరాలు తీరాకే మిగులు నీటిని తరలించాలని మొదటినుంచీ గట్టిగా కోరుతున్న తెలంగాణ, ప్రస్తుతం మహానదిలో మిగులుగా ఉన్న నీటిని గోదావరికి తరలించాకే దిగువన అనుసంధాన ప్రక్రియ (గోదావరి– కావేరి) చేపట్టాలని బలంగా వాదిస్తోంది. గోదావరికి ఉపనదిగా ఉన్న ఇంద్రావతిలో మిగులు నీటిని చూపెట్టి వాటిని కావేరికి తరలిస్తామన్న ప్రతిపాదనను ప్రస్తుతం ఛత్తీస్గఢ్ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో... మొదట మహానది– గోదావరి అనుసంధానం చేయాలని తెలంగాణ పట్టుబడుతోంది. మహానదిలో మిగులు నీరు గోదావరిలో కలిస్తే రాష్ట్ర అవసరాలకు ఇబ్బంది రాదని, అప్పుడు గోదావరి–కావేరి అనుసంధానం చేస్తే తమకు అభ్యంతరమేమీ ఉండదని తెలిపింది. సోమవారం జరిగిన జాతీయ జల వనరుల అభివృధ్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) భేటీలోనూ ఇదే అంశాన్ని స్పష్టం చేసింది. మహానదిలో మిగులు 100 టీఎంసీలే: ఒడిషా ఒకనదిలో అధిక లభ్యత ఉన్న నీటిని ఆ నది పరివాహక ప్రాంత అవసరాలకు తీరాక మరో నదికి తరలించే క్రమంలో చేపట్టిన నదుల అనుసంధాన ప్రక్రియకు ఆదినుంచి ఇక్కట్లే ఎదురవుతున్నాయి. మొదటగా ఒడిషాలోని మహానది మొదలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని గోదావరి, కృష్ణాలను కలుపుతూ తమిళనాడు, కర్ణాటక పరిధిలోని కావేరి నది వరకు అనుసంధానించే ప్రక్రియకు కేంద్రం శ్రీకారం చుట్టింది. మహానదిలో సుమారు 320 టీఎంసీలలతో పాటు గోదావరిలో ఏపీ, తెలంగాణలకున్న 1,480 టీఎంసీల నీటి కేటాయింపులు పోనూ మరో 530 టీఎంసీల మిగులు జలాలున్న దృష్ట్యా వాటిని రాష్ట్ర పరిధిలోని ఇచ్చంపల్లి (గోదావరి)– నాగార్జునసాగర్ (కృష్ణా), ఇచ్చంపల్లి–పులిచింతల ప్రాజెక్టులను అనుసంధానించి గోదావరి నీటిని కృష్ణాకు తరలించాలని ప్రణాళిక వేసింది. అయితే ఈ ప్రతిపాదనపై ఎగువన ఉన్న ఒడిషా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మహానదిలో 321.39 టీఎంసీల మేర మిగులు జలాలున్నాయన్న కేంద్రం లెక్కలతో ఒడిషా విబేధించింది. మహానదిలో 100 టీఎంసీలకు మించి మిగులు లేదని వాదించింది. ఈ అనుసంధానంతో తమ రాష్ట్రంలోని 1,500లకు పైగా ప్రాంతాలు ప్రభావితమవుతాయని అభ్యంతరం తెలిపింది. తెలంగాణ సైతం గోదావరిలో లభ్యంగా ఉన్న 954 టీఎంసీల నీరు రాష్ట్ర అవసరాలకే సరిపోతుందని, ఎప్పుడో 30 ఏళ్ల కిందట చేసిన అధ్యయనాన్ని పట్టుకొని గోదావరిలో 350 టీఎంసీ అదనపు జలాలున్నాయనడం (తెలంగాణ రాష్ట్ర పరిధిలో) సరికాదని అంటోంది. అదనపు జలాలపై తాజాగా అధ్యయనం చేసి నిర్ణయం చేయాలని, అలాకాకుండా గ్రావిటీ ద్వారా వచ్చే 500 టీఎంసీల అదనపు జలాలోŠల్ కేవలం 40 టీఎంసీలు తెలంగాణకు కేటాయించి మిగతా 460 టీఎంసీల నీటిని కృష్ణా ద్వారా పెన్నాకు తరలించుకుపోతామంటే తాము అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మహానది–గోదావరి ప్రతిపాదనను పక్కనపెట్టి, గోదావరి–కావేరి అనుసంధానాన్ని కేంద్రం తెరపైకి తెచ్చి నాలుగు రకాల ప్రతిపాదనలు రూపొందించింది. చత్తీస్గఢ్ కొర్రీ... ఇక గోదావరి– కావేరి అనుసంధాన ప్రక్రియలో భాగంగా 247 టీఎంసీల నీటిని ఖమ్మం జిల్లాలోని అకినేపల్లి నుంచి కృష్ణా, కావేరికి తరలించాలని కేంద్రం ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనపై తెలంగాణ అభ్యంతరాలు చెబుతుండటంతో వరంగల్ దగ్గర్లోని జనంపేట ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. భూ సేకరణను తగ్గించేలా పైప్లైన్న్ ద్వారా నాగార్జునసాగర్కు తరలించాలని ప్రతిపాదించింది. దీన్ని కూడా తెలంగాణ తిరస్కరించింది. దీంతో ఇచ్చంపల్లి నుంచి తరలింపు అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఈ అంశంపై చర్చ జరుగుతున్న తరుణంలో ప్రస్తుతం మిగులు ఉన్నాయని చెబుతున్న ఇంద్రావతి నీళ్లను పూర్తిగా తామే ఉపయోగించుకుంటామని ఎన్డబ్ల్యూడీఏ ముందు చత్తీస్గఢ్ గట్టిగా వాదిస్తోంది. ఇంద్రావతిలో మిగులు జలాలు ఉన్నాయని పేర్కొంటూ వాటి ఆధారంగా దిగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు చేపట్టవద్దని సూచించింది. ఇంద్రావతిపై తమ ప్రభుత్వం బ్యారేజీలు, ప్రాజెక్టులు నిర్మిస్తోందని, వీటి ద్వారా 273 టీఎంసీల వినియోగం చేస్తామని అంటోంది. దీంతో తెలంగాణ సైతం మహానదిలో మిగులు నీటిని గోదావరికి తరలించి, రాష్ట్ర అవసరాలు తీర్చుతూ మిగులు నీటిని కావేరికి తరలించాలని పట్టుబడుతోంది. దీంతో పాటే ఎగువన రాష్ట్రాలు వారి రాష్ట్రాల సరిహద్దు పరిధిలో అంతర్గత నదుల అనుసంధానాన్ని చేపడుతున్నాయని, దీనిద్వారా దిగువ రాష్ట్రాలకు రావాల్సిన నీటి లభ్యత తగ్గుతుందని అభ్యంతరం తెలిపింది. అయితే దీనిపై రాష్ట్ర అభ్యంతరాలను లిఖితపూర్వకంగా వారం రోజుల్లో తమకు తెలియజేయాలని తెలంగాణను కేంద్రం ఆదేశించింది. -
పెంచేసి.. పంచుకున్నారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నదులు, వాగులు, వంకలపై నిర్మిస్తున్న చెక్డ్యామ్ల నిర్మాణ పనుల టెండర్ల వ్యవహారమంతా అడ్డగోలుగా మారింది. పనులపై ప్రభుత్వ నజర్ లేకపోవడంతో జిల్లాల్లో కాంట్రాక్టర్లు ఇష్టారీతిన అధిక ధరలకు కోట్ చేసి పనులు దక్కించుకుంటున్నారు. చాలా జిల్లాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతో సిండికేట్గా మారుతున్నారు. ఎవ రికే పని దక్కాలో ముందుగానే నిర్ణయమైపోతోంది. అందుకనుగుణంగా 3 నుంచి 4% వరకు అధిక ధరలకు కోట్ చేసి పనులు చేజిక్కించుకుంటున్నారు. పలుచోట్ల కేవ లం 2 టెండర్లు మాత్రమే దాఖలు కావడం సిండికేట్ అయ్యారనడానికి నిదర్శనం. రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతగా 632 చెక్డ్యామ్లను రూ. 2,890 కోట్లతో చేపట్టాలని నిర్ణయించి ఇప్పటికే సాంకేతిక అనుమతుల ప్రక్రియ పూర్తిచేశారు. ఇందులో గోదావరి బేసిన్లో 444, కృష్ణాబేసిన్లో 188 చెక్డ్యామ్లు ఉన్నాయి. ఇప్పటివరకు 625 పనులకు టెండర్లు పిలవగా, 560 చెక్డ్యామ్ల టెండర్లు ఖరారు చేశారు. ఇందులో 450 చెక్డ్యామ్లకు సంబంధించిన ఒప్పందాలు పూర్తయ్యాయి. అయితే టెండర్ల దాఖలు విషయంలో సంబంధిత జిల్లాలోని ప్రధాన కాంట్రాక్టర్లంతా సిండికేట్గా మారి ఎక్సెస్ ధరలకు వాటిని దక్కించుకున్నారు. ముఖ్యంగా ఒకే నది లేక వాగుపై ఉండే మూడు, నాలుగు చెక్డ్యామ్లను కలిపి ఒక క్లస్టర్గా చేశారు. ఇవన్నీ భారీ వ్యయంతో కూడుకున్నవి కావడంతో వాటన్నింటినీ ఎక్సెస్ ధరలకే దక్కించుకునేలా కాంట్రాక్టర్లు పావులు కదిపారు. కరీంనగర్లో ‘రింగు’రింగా... ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలివిడతలో 114 చెక్డ్యామ్లను రూ.854 కోట్లతో పూర్తిచేయాలని నిర్ణయించారు. ఇందులో గోదావరి ఉపనది మానేరులో ఏడాదంతా నీరు నిలిచి ఉండేలా 29 చెక్డ్యామ్లు, మూలవాగుపై 12 ప్రతిపాదించారు. వీటికి విడివిడిగా టెండర్లు పిలవాలని తొలుత భావించినా, వీలైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఒక నదిపై నిర్మించే చెక్డ్యామ్లన్నింటినీ ఒక క్లస్టర్గా చేసి వాటన్నింటికీ కలిపి ఒకే టెండర్ పిలిచారు. ఈ విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 57 పనులను 18 క్లస్టర్ల కింద చేర్చి రూ.380 కోట్లతో టెండర్లు పిలిచారు. ఇందులో అత్యధికంగా మానేరుపై కరీంనగర్ బ్రిడ్జికి సమీపంలో 5 చెక్డ్యామ్ల నిర్మాణానికి రూ.75.48 కోట్లతో టెండర్లు పిలవగా దీనిని 2.34 శాతం ఎక్సెస్తో జిల్లా నేత దగ్గరి బంధువులు దక్కించుకున్నారు. కరీంనగర్ మండల పరిధిలోనే ఇరుకుల్లవాగుపై 3 చెక్డ్యామ్ల నిర్మాణానికి 15.40 కోట్లతో టెండర్లు పిలవగా, ఇక్కడ సైతం 4.50 శాతం ఎక్సెస్తో టెండర్ దక్కించుకున్నారు. ఈ రెండు చోట్ల పనులు దక్కించుకున్న ఏజెన్సీతో పాటే మరో ఏజెన్సీ మాత్రమే టెండర్ వేయడం గమనార్హం. ఇక మంథని మండల పరిధిలో మానేరు వాగుపై మరో 3 చెక్డ్యామ్ల నిర్మాణానికి రూ.42.38 కోట్లతో టెండర్లలోనూ స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల మేరకు ఇద్దరే టెండర్లలో పాల్గొనగా, 3.78 శాతం ఎక్సెస్తో స్థానిక నేత చెప్పిన ఏజెన్సీకే టెండర్ దక్కింది. ఇదే రీతిన మానుకొండూర్ నియోజకవర్గ పరిధిలో రూ.38.45 కోట్ల విలువైన రెండు చెక్డ్యామ్ పనులను 2.69శాతం, జమ్మికుంట మండల పరిధిలోని రూ.60.73 కోట్ల పనులకు (3 చెక్డ్యామ్లు) 2.88 శాతం అధికంగా టెండర్లు వేశారు. కస్లర్ల పరిధిలో లేకుండా ఒక్కొక్కటిగా ఉన్న చెక్డ్యామ్ల టెండర్లు మాత్రం కనిష్టంగా ఒక శాతం నుంచి 18 శాతం వరకు లెస్ టెండర్లు దాఖలయ్యాయి. వరంగల్ జిల్లాకు చెందిన ఓ కీలక నేతకు దగ్గరగా ఉండే కాంట్రాక్టర్కు రూ.60 కోట్లు, కరీంనగర్ జిల్లాకు చెందిన కీలక నేత బంధువు ఏజెన్సీకి రూ.70 కోట్లు, ఇదే జిల్లాలో ఓ ప్రధాన ప్రాజెక్టు పరిధిలో పనిచేసిన మరో ఏజెన్సీకి రూ.75 కోట్లు, మరో ముఖ్య నేతకు చెందిన ఏజెన్సీకి రూ.75 కోట్ల పనులు దక్కాయి. మొత్తంగా ఎక్సెస్ దాఖలు చేసిన పనుల టెండర్ల విలువ రూ.380 కోట్లుగా ఉండగా, అధిక ధరలతో కోట్ చేయడంతో ప్రభుత్వంపై కనీసంగా రూ.30 కోట్ల మేర భారం పడింది. నిజామాబాద్లో మూడు ఏజెన్సీలకే ... ఇక నిజామాబాద్ జిల్లాలో అయితే చెక్డ్యామ్ల టెండర్లలో మరీ విపరీతంగా ప్రవర్తించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 71 చెక్డ్యామ్ పనులకు ఇప్పటివరకు రూ.250 కోట్లతో టెండర్లు పిలవగా మూడు, నాలుగు ఏజెన్సీలకే మొత్తం పనులు పంచేశారు. జిల్లాలో కీలకంగా ఉన్న ప్రజాప్రతినిధులకు దగ్గరగా ఉన్న ఈ ఏజెన్సీలు ముందుగానే పర్సెంటేజీలు మాట్లాడుకొని అధిక ధరలకు టెండర్లు కోట్ చేసి పనులు దక్కించుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం పనుల్లో రూ.100 కోట్లు, 60 కోట్లు, 50 కోట్లు విలువైన పనులను మూడు ఏజెన్సీలకే కట్టబెట్టారు. ఇవన్నీ ఎక్సెస్తోనే కావడం గమనార్హం. ఒక్క ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోనే 47.59 కోట్ల పనులకు టెండర్లు పిలవగా, రెండే ఏజెన్సీలు టెండర్లు దాఖలు చేశాయి. అయితే విచిత్రంగా ఈ రెండు ఏజెన్సీలు తమకు దక్కిన పనులను 3.99 శాతం ఎక్సెస్తోనే పొందాయి. ఇదే నియోజకవర్గంలో మరో 16 పనులను ఒకే క్లస్టర్ కిందకి చేర్చి 35 కోట్లతో టెండర్లు పిలవగా, 4.59 శాతం ఎక్సెస్తో ఓ ఏజెన్సీ టెండర్లు దక్కించుకుంది. ఇదే ఏజెన్సీకి పక్కనే ఉన్న జుక్కల్ నియోజకవర్గంలోని 53.43 కోట్ల పనులు, బాన్సువాడ నియోజకవర్గంలోని రూ.24.34 కోట్ల పనులు అదే 4.59 శాతం అధిక ధరలతో దక్కేలా జిల్లా కీలక నేతలేæ చక్రం తిప్పారు. జిల్లాకు చెందిన ముఖ్యనేతకు దగ్గరగా ఉండే మరో ఏజెన్సీకి సైతం ఆర్మూర్, బోధన్ నియోజకవర్గాల్లోని మొత్తం రూ.50 కోట్ల విలువ చేసే చెక్డ్యామ్లను కట్టబెట్టారు. మరికొన్ని చోట్ల చిన్న కాంట్రాక్టర్లు పనులు దక్కించుకున్నా, వారిపై ఒత్తిళ్లు తెచ్చి తమకు అనుకూలమైన స్థానిక కాంట్రాక్టర్లకు సబ్ కాంట్రాక్టు ఇప్పించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇతర జిల్లాల్లోనూ ఇదే తంతు ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లాల్లోనూ ఇదే రీతిన స్థానిక ప్రజాప్రతినిధులు ముందుగానే ఏజెన్సీలతో మాట్లాడుకొని ఎక్సెస్ ధరలకు టెండర్లు వేయించారు. వరంగల్ జిల్లాలో ఓ కీలక నేత తన సామాజికవర్గానికి చెందిన కాంట్రాక్టర్కు రూ.52 కోట్ల విలువైన చెక్డ్యామ్ల పనులు ఇప్పించారు. నల్లగొండ జిల్లాలోనూ వరంగల్, కరీంనగర్కు చెందిన కీలక నేతలు తమకు అనుకూలంగా ఉండే వ్యక్తికే రూ.100 కోట్ల విలువైన పనులను 4 శాతానికి మించి ఎక్సెస్కు ఇప్పించుకున్నారు. -
వలసలపై ఫోకస్
సాక్షి, హైదరాబాద్: పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి... ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలి. వీలైనంత త్వరగా తెలంగాణ అంతటా బలోపేతం కావాలి. మిషన్– 2023 లక్ష్యంగా దూసుకెళ్లాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కమలనాథులు శరవేగంగా వ్యూహరచన చేస్తున్నారు. పకడ్బందీగా భవిష్యత్ ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రాంతాల వారీగా బలాబలాలను బేరీజు వేసుకుంటున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ‘సర్జికల్ స్ట్రైక్’ఇచ్చిన ఉత్సాహంతో బీజేపీ ఇప్పుడు... ‘సాఫ్రాన్ స్ట్రైక్’కు పదును పెడుతోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల్లోని అసంతృప్త, కీలక నేతలను కాషాయదళంలోకి తీసుకురావడంపై ప్రత్యేకదృష్టి పెట్టింది. ఎవరెవరు వస్తారు, ఎవరైతే మనకు లాభం... అనే కోణంలో పార్టీల వారీగా... పక్కాగా జాబితాలను సిద్ధం చేస్తోంది. పార్టీలోకి వచ్చే నాయకులతో మాట్లాడే బాధ్యతలు ముఖ్యులకు అప్పగించి... అధినాయకత్వంతో భవిష్యత్తుకు భరోసా ఇప్పిస్తోంది. ఢిల్లీ కేంద్రంగా ఆపరేషన్ ఆకర్ష్ను నడిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు 2023లో వచ్చినా, అంతకుముందే వచ్చినా.. సర్వసన్నద్ధంగా ఉండేలా పార్టీ శ్రేణులను కార్యోన్ముఖులను చేస్తోంది. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చే లక్ష్యంతో భవిష్యత్తు కార్యాచరణను రూపొందించింది. ఇందులో భాగంగా గతంలో బీజేపీ గెలిచిన స్థానాలు, గట్టిపోటీనిచ్చిన స్థానాలు, ప్రజలు బీజేపీపై ఆదరణ చూపిన ప్రాంతాల్లో మొదట పట్టు సాధించాలనే వ్యూహంతో ముందుకు సాగుతోంది. వాటితో పాటు దశలవారీగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలపైనా దృష్టి పెట్టేలా కార్యాచరణ అమలులో పెట్టనుంది. పక్కాగా చేరికల వ్యూహం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో పలువురు నాయకులు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల నుంచి బీజేపీలో చేరారు. వారిలో మాజీ మంత్రి డీకే అరుణ, జితేందర్రెడ్డి, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి సుధాకర్రెడ్డి, రాపోలు ఆనందభాస్కర్, వీరేందర్గౌడ్, బొడిగె శోభ తదితరులున్నారు. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ నేత, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, మాజీ మంత్రి ముఖేష్గౌడ్ కుమారుడు విక్రమ్గౌడ్లను పార్టీలోకి తీసుకొచ్చింది. తాజాగా కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్పర్సన్ విజయశాంతిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా... టీఆర్ఎస్, కాంగ్రెస్లపై ఆపరేషన్ సాఫ్రాన్ స్ట్రైక్కు శ్రీకారం చుట్టింది. బడానేతలకు గురిపెడితే... అవతలిపక్షాన్ని దెబ్బకొట్టడంతో పాటు బీజేపీవైపు ఆకర్షితులయ్యే వారి సంఖ్య పెరుగుతుందని భావిస్తోంది. మరోవైపు సామాజిక సమీకరణాలకూ ప్రాధాన్యం ఇస్తోంది. ఢిల్లీ కేంద్రంగా ఆపరేషన్ ఆకర్ష్ను అమలు చేస్తూ వలసల వ్యూహానికి పదును పెట్టింది. వరుస ఓటములతో డీలాపడ్డ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరే 20 మందికిపైగా నేతల జాబితాను రూపొందించినట్లు తెలిసింది. టీఆర్ఎస్ నుంచి కూడా అసంతృప్తుల వలసలు ఉంటాయని, అలా వచ్చే అవకాశమున్న వారితో జాబితాను కూడా సిద్ధం చేసినట్లు తెలిసింది. కొందరు ఎమ్మెల్యేలు కూడా వస్తారనే ధీమాతో ఉంది. వారితో సంప్రదింపులు జరిపే బాధ్యతను పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు మరికొందరు ముఖ్యనేతలకు అప్పగించింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రితో బీజేపీ ముఖ్యనేత ఒకరు ఇప్పటికే చర్చలు జరిపారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డితో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్రయాదవ్ ఇటీవల స్వయంగా భేటీ అయ్యారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డి బీజేపీలో చేరుతారంటూ గతంలోనే ప్రచారం జరిగింది. మరోవైపు నాగార్జునసాగర్కు ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కుటుంబంతో బీజేపీ వర్గాలు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ముందుగా రంగారెడ్డి, మహబూబ్నగర్ హైదరాబాద్ సరిహద్దుల్లోని ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలపై బీజేపీ మొదట ఫోకస్ పెట్టింది. 1996లో హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో అప్పటి ఎంఐఎం చీఫ్ సలావుద్దీన్ ఒవైసీ చేతిలో వెంకయ్యనాయుడు ఓడిపోయినా... గట్టిపోటీనిచ్చారు. అప్పుడు హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్న చేవెళ్ల, పరిగి, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి అత్యధిక ఓట్లు లభించాయి. అందుకే అక్కడి నుంచి తమ కార్యాచరణ ప్రణాళికను అమలు చేసేందుకు పూనుంది. కొండా విశ్వేశ్వర్రెడ్డితో టచ్లో ఉంది. మహమూబ్నగర్లోనూ పార్టీ కేడర్ బలంగా ఉందని విశ్వసిస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో మహబూబ్నగర్లో యెన్నం శ్రీనివాస్రెడ్డి బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న మాజీ ఎంపీ ఏపీ జితేందర్రెడ్డిది ఈ జిల్లాయే. దీనికితోడు జిల్లాలో పార్టీ విస్తరణను దృష్టిలో పెట్టుకొని డీకే అరుణకు ప్రాధాన్యత ఇచ్చిన బీజేపీ ఆమెను జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించింది. వీరిద్దరి నేతృత్వంలో మహబూబ్నగర్పై ప్రత్యేక దృష్టి సారించి పని చేసేలా బీజేపీ వ్యూహం రూపొందిస్తోంది. వరంగల్ కార్పొరేషన్లో పట్టు కోసం.. త్వరలో రానున్న గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ సత్తా చాటే దిశగా బీజేపీ పావులు కదుపుతోంది. ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీజేపీకి మంచి పట్టున్న స్థానాలు ఉన్నాయి. దేశంలో బీజేపీకి రెండే ఎంపీ స్థానాలు ఉన్న 1984లో హన్మకొండ నుంచి చందుపట్ల జంగారెడ్డి బీజేపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. అంతేకాదు పరకాల నియోజకవర్గం నుంచి 1985లోనే వి.జయపాల్ బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో మార్తినేని ధర్మారావు హన్మకొండ ఎమ్మెల్యేగా ఉన్నారు. మేయర్గా డాక్టర్ టి.రాజేశ్వర్రావు బీజేపీ నుంచే పని చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా గ్రామీణ, పట్టణప్రాంతాల్లో బీజేపీకి మంచి కేడర్ ఉంది. అందుకే వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలపై గురి పెట్టింది. అక్కడ పార్టీ బలోపేతానికి ఈ ఎన్నికను పునాదిగా చేసుకోవాలని భావిస్తోంది. ఉత్తర తెలంగాణలో ముగ్గురు ఎంపీలపై భారం వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్ధిపేట్ మున్సిపల్ ఎన్నికల తరువాత మొత్తంగా ఉత్తర తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించి పని చేయాలని భావిస్తోంది. అందుకు ఇప్పుడు కార్యాచరణ ప్రణాళికలను కూడా సిద్ధం చేస్తోంది. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ పైనే ఉమ్మడి జిల్లాలో పార్టీ విస్తరణ బాధ్యత పెట్టారు. నిజామాబాద్లో ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ వంటి నేతలు ఉన్నారు. ఆదివాలాబాద్లో ఎంపీగా సోయం బాపురావు గెలిచారు. కాబట్టి ఆయా జిల్లాల్లో పార్టీ విస్తరణకు కోసం పెద్ద ఎత్తున చేరికలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ టీఆర్ఎస్లోని అసంతృప్త నేతలే టార్గెట్గా ముందుకు వెళుతోంది. మెదక్ జిల్లాపైనా కసరత్తు చేస్తోంది. దుబ్బాకలో బీజేపీ విజయం... పార్టీలోకి వలసలను పెంచుతుందనే ధీమాలో ఉంది. ఇక చివరగా ఖమ్మం, నల్గొండ జిల్లాలపై దృష్టి సారించేలా చర్యలు చేపడుతోంది. క్యాడర్ ఉంది... లీడర్లు కావాలి... రాష్ట్రంలో ఒకప్పుడు బీజేపీకి పట్టున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిం చింది. చాలాచోట్ల గ్రామీణ ప్రాంతా ల్లోనూ పార్టీకి కేడర్ ఉందని, సైలెంట్ ఓటర్లు ఉన్నారని... బలమైన నాయకత్వం అవసరమని భావి స్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీలోకి వచ్చే నేతల జాబితాలను సిద్ధం చేస్తోంది. ఒకప్పుడు హైదరాబాద్లో బలంగా ఉన్న పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతింది. ఆ తరువాత 2019లో తెలంగాణలో అనూహ్యంగా నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకుంది. బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడు అయ్యాక దుబ్బాకలో సంచలన విజయం సాధించిన బీజేపీ... జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అంచనాలకు మించి రాణించింది. గ్రేటర్లో పట్టు నిలిచిందని భావిస్తున్న కమలనాథులు... రాష్ట్రవ్యాప్తంగా విస్తరణపై దృష్టి సారించారు. -
ప్రతి రోజూ10లక్షలు..
సాక్షి, హైదరాబాద్: కరోనా టీకా రాగానే రోజుకు 10 లక్షల మందికి వేయాలని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అలా వారం రోజుల్లో 70 లక్షల మందికి వేసేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇతర టీకాల మాదిరిగా కాకుండా... తక్కువ సమయంలో ఎక్కువ మందికి వ్యాక్సిన్స్ ఇవ్వ డంతోనే కోవిడ్–19ను కట్టడి చేయవచ్చు. అందుకు రాష్ట్రంలో ఎంపిక చేసిన 10 వేల మంది ఏఎన్ఎంలు, నర్సులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఒక్కొక్కరు రోజుకు 100 మందికి టీకా వేస్తారు. అలా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు. ఒకవేళ టీకా ఎక్కడైనా వికటిస్తే తక్షణమే స్పందించేలా నిష్ణాతులైన డాక్టర్లతో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేస్తారు. వారికి కూడా శిక్షణ ఇస్తారు. ఇప్పటికే టీకా డ్రైరన్ నిర్వహించారు. సాఫ్ట్వేర్ను సరిచూసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వ ర్యంలోని ఉన్నతాధికారులు వీటిని పరిశీలించి చూశారు. కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు కేంద్రం నుంచి రాష్ట్రానికి టీకాలు రాగానే ప్రాధాన్య క్రమంలో ఇచ్చేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. మొదటి దశలో రాష్ట్రంలో 70 లక్షల మందికి టీకాలు వేస్తారు. వారిలో 3 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లోని డాక్టర్లు, నర్సులు సహా క్షేత్ర స్థాయి ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, ఇతర ఆరోగ్య సిబ్బం దికి ఇస్తారు. అలాగే పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, జర్నలిస్టులు, ఫ్రంట్లైన్ కార్మికులు, 50 ఏళ్లు పైబడిన వారు, ఆలోపు వయస్సుండి ఇతరత్రా అనారోగ్య సమ స్యలున్న వారికి టీకాలు వేస్తారు. ఈ మేరకు మొదటి దశ లబ్ధిదారుల వివరాలను వైద్య ఆరోగ్యశాఖ కేంద్రానికి పంపించింది. వ్యాక్సిన్ పక్కదారి పట్టకుండా ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. టీకాలకు సంబం ధించి వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు నేతృత్వంలో ప్రతి రోజూ ఉన్నస్థాయి సమీక్షలు చేస్తున్నారు. కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ఎప్పుడు టీకా అందుబాటులోకి వస్తుందన్న దానిపై తమకు ఇంకా ఎటువంటి సమాచారం రాలేదని వైద్య ఆరోగ్య వర్గాలు చెబుతున్నాయి. అయితే రాగానే వేగంగా వేసేందుకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపాయి. టీకాల నిల్వకు జిల్లా కేంద్రాల్లో రిఫ్రిజిరేటర్లు... టీకాలను నిల్వ ఉంచేందుకు అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక రిఫ్రిజిరేటర్లను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) 20 జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేసింది. మిగిలిన జిల్లాల్లోనూ త్వరలో ఏర్పాటు చేస్తారు. అన్ని పీహెచ్సీల్లోనూ సాధారణ రిఫ్రిజిరేటర్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. 70 లక్షల మందికి సరిపోయే టీకాలను భద్రపరిచే రిఫ్రిజిరేటర్ వ్యవస్థ మన వద్ద అందుబాటులో ఉందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడిం చింది. ఇవన్నీ మైనస్ 20 డిగ్రీలలోపు వరకు సామర్థ్యంతో ఉంటాయి. సెకండ్ వేవ్... వ్యాక్సిన్పైనే దృష్టి ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖ పూర్తిగా సెకండ్ వేవ్ నియం త్రణ, వ్యాక్సిన్ పంపిణీపైనే దృష్టిసారించింది. ఈ రెండిం టినీ ఒకేసారి నిర్వహించడం ఇప్పుడు మా ముందున్న కీలకమైన సవాల్. టీకాను ఎంత వేగంగా ఇస్తే అంత త్వరగా కరోనాను నియంత్రిం చగలం. పైగా రెండు డోసులు ఇవ్వాల్సి ఉన్నందున యాంటీబాడీస్ తయా రుకావడానికి సమయం కూడా పడుతుంది. అందువల్ల వ్యాక్సిన్తో సంబంధం లేకుండా ప్రజలు మాస్క్ పెట్టుకో వాలి. – డాక్టర్ శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు టీకాలు వేసేందుకు 10 వేల మంది ఏఎన్ఎంలు, నర్సులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఒక్కొక్కరు రోజుకు 100 మందికి టీకా వేస్తారు. ఎక్కడైనా వికటిస్తే తక్షణమే స్పందించేందుకు నిపుణులైన డాక్టర్లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రాధాన్య క్రమం: తొలుత 3 లక్షల మంది డాక్టర్లు, నర్సులు, వైద్యారోగ్య క్షేత్రస్థాయి సిబ్బంది. పారిశుధ్య కార్మికులు, పోలీసులు, జర్నలిస్టులు, ఫ్రంట్లైన్ వర్కర్లు, 50 ఏళ్లు పైబడిన వారికి ఇస్తారు. తర్వాత అనారోగ్య సమస్యలున్న 50 ఏళ్లలోపు వారికి వేయాలనేది నిబంధన. బీపీ, షుగర్, జీవనశైలి, ఇతర వ్యాధులున్న వారి జాబితాను రూపొందించడమే సమస్య. టీకా ఎప్పుడొస్తోంది?: అధికారికంగా ఇంకా తేదీ ఏమీ ప్రకటించలేదు. అయితే మరికొన్ని వారాల్లోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల కిందట ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో చెప్పారు. శాస్త్రవేత్తల నుంచి గ్రీన్సిగ్నల్ రాగానే వ్యాక్సిన్ విడుదల ఉంటుందన్నారు. కత్తిమీద సాములా పంపిణీ.. కరోనా తీవ్రత ప్రాంతానికి, దేశానికో రకంగా ఉంది. వైరస్ ఒక్కోచోట ఒక్కోరకంగా ప్రాణహాని కలిగిస్తుంటే, కొన్నిచోట్ల సాధారణంగా వచ్చి పోతోంది. టీకా పంపిణీ వ్యూహం అందుకు తగ్గట్లుగానే ఉంటుంది. మన దేశంలో మొదటి దశలో 30 కోట్ల మందికి కరోనా టీకా ఇవ్వాలని కేంద్రం నిర్ణ యించిన సంగతి తెలిసిందే. మన రాష్ట్రంలో దాదాపు 70 లక్షల మందికి ఇస్తారు. ఫ్రంట్లైన్ వర్కర్లు, 50 ఏళ్లు దాటిన వారితో పాటు.. ప్రాధాన్యత క్రమంలో 50 ఏళ్ల లోపు అనా రోగ్య సమస్యలున్న వారికి కూడా వేయాలన్నది నిబంధన. అయితే వీరిని ఎలా గుర్తిం చాలో వైద్య ఆరోగ్య శాఖకు సవాల్గా మారింది. బీపీ, షుగర్, జీవనశైలి వ్యాధులు సహా ఇతర అనారోగ్య సమస్యలున్న వారిని గుర్తించి జాబితా తయారు చేయడంపై గందరగోళం నెలకొంది. వ్యాక్సిన్ పక్కదారి పట్టే చాన్స్ ఉందని అధికారులు భయపడుతున్నారు. దీనిపై నిఘా పెట్టి నా రాజకీయ ఒత్తిడులు ఉంటాయని అంటున్నారు. -
‘తెలంగాణలో దూకుడు పెంచండి’
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో బీజేపీ కార్యకర్తలు దూకుడు పెంచాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సూచించారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చూపిన పంథానే ఇకముందు కూడా కొనసాగించాలన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి , సీనియర్ నేత వివేక్ వెంకట్స్వామి, మాజీ ఎంపీ, ప్రముఖ నటి విజయశాంతిలతో కలసి ఆదివారమిక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అమిత్షాతో భేటీ అయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను ఆయనకు వివరించారు. ఓట్ల శాతంతోపాటు సీట్ల సంఖ్య కూడా పెరిగిందని చెప్పారు. దుబ్బాక ఫలితం అనంతరం జీహెచ్ఎంసీ ఫలితాలు కూడా సానుకూలంగా రావడంతో నేతలు, కార్యకర్తలందరినీ అమిత్ షా అభినందించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ విజయశాంతి తిరిగి బీజేపీలో చేరుతున్న విషయాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్కు రాజీనామా చేసిన విజయశాంతి సోమవారం ఉదయం 11 గంటలకు బీజేపీ సభ్యత్వం తీసుకోనున్నారు. అదేరోజు సాయంత్రం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కండువా కప్పి విజయశాంతిని పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఉద్యమకారులను కేసీఆర్ విస్మరించారు: సంజయ్ అమిత్షాతో సమావేశం అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ‘టీఆర్ఎస్, కాంగ్రెస్ల్లో చేరిన విజయశాంతి మళ్లీ ఇప్పుడు మాతృసంస్థకు రావడం సంతోషం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసలైన తెలంగాణ ఉద్యమకారులను సీఎం కేసీఆర్ విస్మరించారు. ప్రజాస్వామ్య తెలంగాణ కోసం బీజేపీ చేస్తున్న పోరాటాన్ని ఉద్యమకారులు గుర్తించారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఏ ఎన్నికలైనా ఒకే తరహా పోరాటం చేస్తాం. గెలుపోటములను సమంగా స్వీకరిస్తాం’ అని సంజయ్ తెలిపారు. బీజేపీలో చేరనున్న మహిళా పైలెట్ తెలంగాణ గిరిజన మహిళాపైలట్ అజ్మీరా బాబీ బీజేపీలో చేరనున్నారు. ఆదివారం అమిత్షాను కలసిన సంజయ్ బృందంలో ఆమె కూడా ఉన్నారు. సోమవారం ఉదయం విజయశాంతితోపాటు అజ్మీరా కూడా పార్టీలో చేరననున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. -
తెలంగాణలో వై‘రష్’ తగ్గింది
సాక్షి, హైదరాబాద్: అక్టోబర్లో దసరా.. నవంబర్లో దీపావళి.. మరోవైపు చలికాలం.. ఆయా సందర్భాల్లో కరోనా తీవ్రంగా పెరుగుతుందని సర్కార్ తీవ్ర ఆందోళన చెందింది. కానీ రాష్ట్రంలో వైరస్ ఉధృతి తగ్గిందని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ మేరకు గణాంకాలతో సహా సర్కారుకు విన్నవిం చింది. కీలక పండుగల సందర్భంగా ప్రజలు తీసుకున్న జాగ్రత్తలు, ప్రభుత్వ ముందస్తు చర్యలతో వైరస్ను నియంత్రించగలిగినట్లు వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేస్తూ నివేదిక తయారు చేసింది. రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గింది. దసరా తర్వాత కేసుల సంఖ్య పెరగలేదు. దీపావళి తర్వాత కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని తెలిపింది. అక్టోబర్ ఒకటో తేదీన 54,098 కరోనా పరీక్షలు చేయగా, 2,009 మందికి పాజిటివ్ వచ్చింది. అంటే పాజిటివిటీ రేటు 3.71 శాతం నమోదైంది. ఆ నెలలోనే దసరా వచ్చిపోయింది. తర్వాత నవంబర్ ఒకటో తేదీన 25,643 పరీక్షలు చేయగా, 922 కేసులు నమోదయ్యాయి. అంటే పాజిటివిటీ రేటు 3.59 శాతంగా నమోదైంది. అంతకు ముందు నెలతో పోలిస్తే కాస్తంత తగ్గింది. ఇక నవంబర్ రెండో వారంలో దీపావళి వచ్చింది. ఆ తర్వాత కేసుల సంఖ్య పెరగలేదని వైద్య, ఆరోగ్యశాఖ చెబుతోంది. దీపావళి అయిన 16 రోజుల తర్వాత ఇప్పుడు డిసెంబర్ ఒకటో తేదీన 51,562 కరోనా పరీక్షలు చేస్తే, అందులో 565 మందికి పాజిటివ్ వచ్చింది. అంటే పాజిటివిటీ రేటు 1.1 శాతంగా నమోదైందని నివేదిక తెలిపింది. ఈ పరిస్థితుల్లో నెల రోజుల వ్యవధిలో పాజిటివిటీ రేటు ఏకంగా మూడు రెట్లు తగ్గిందని నివేదిక వెల్లడించింది. వాస్తవంగా ఆగస్టు ఒకటో తేదీన కరోనా పాజిటివిటీ రేటు 9.84 శాతం ఉండగా, సెప్టెంబర్ నెలలో 4.87 శాతంగా ఉంది. ఇప్పుడు గణనీయంగా తగ్గిపోవడం ఊరట కలిగిస్తోందని నివేదిక తెలిపింది. 88 శాతం కరోనా పడకలు ఖాళీ.. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టిందనడానికి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా పడకలు ఖాళీగా ఉండటం కూడా కారణంగా చెప్పవచ్చని నివేదిక తెలిపింది. సరిగ్గా నాలుగు నెలల క్రితం ఆగస్టు ఒకటో తేదీన ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 56.40 శాతం కరోనా పడకలు ఖాళీగా ఉండగా, ఈ నెల ఒకటో తేదీన కరోనా పడకలు 88 శాతం ఖాళీగా ఉన్నాయని వైద్య, ఆరోగ్య నివేదిక తెలిపింది. కేసులు తగ్గడం, ప్రజల్లో వైరస్ పట్ల అవగాహన ఏర్పడటంతో ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య తగ్గిందని నివేదిక తెలిపింది. ఈ నెల ఒకటో తేదీన 61 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 8,561 కరోనా పడకలున్నాయి. అందులో 757 నిండిపోగా, ఇంకా 7,804 పడకలు ఖాళీగా ఉన్నాయి. అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏకంగా 91.15 శాతం పడకలు ఖాళీగా ఉన్నాయని నివేదిక తెలిపింది. అలాగే 220 ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో 8,509 కరోనా పడకలు ఉండగా, వాటిల్లో 1,290 కరోనా రోగులతో నిండిపోయాయి. ఇంకా 7,219 పడకలు ఖాళీగా ఉన్నాయి. అంటే 84.84 శాతం ఖాళీగా ఉన్నాయని తెలిపింది. 87 ఆసుపత్రుల్లో సాధారణ పడకల ఎత్తివేత.. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా కోసం ప్రత్యేకంగా కేటాయించిన పడకలను ఎత్తేస్తున్నాయి. కరోనా ఉధృతి తగ్గడం, పడకలు నిండకపోవడంతో ఆసుపత్రులు సాధారణ చికిత్సలకు మరలిపోతున్నాయి. వైద్య, ఆరోగ్యశాఖ నివేదిక ప్రకారం ప్రస్తుతం 61 ప్రభుత్వ, 220 ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా చికిత్సలు అందిస్తున్నాయి. వాటిల్లో సాధారణ ఐసోలేషన్ పడకలు, ఆక్సిజన్ పడకలు, ఐసీయూ పడకలుగా విభజించి కరోనాకు కేటాయించాయి. అయితే వాటిల్లో సాధారణ ఐసోలేషన్ పడకలను చాలా ఆసుపత్రులు ఎత్తేశాయి. 68 ప్రైవేట్ ఆసుపత్రులు, 19 ప్రభుత్వ ఆసుపత్రులు సాధారణ కరోనా పడకలను ఎత్తేశాయి. అలాగే ఆక్సిజన్ పడకలను నాలుగు ప్రభుత్వ, 10 ప్రైవేట్ ఆసుపత్రులు ఎత్తేశాయి. అలాగే కీలకమైన ఐసీయూ పడకలను 9 ప్రైవేట్ ఆసుపత్రులు, 15 ప్రభుత్వ ఆసుపత్రులు సైతం ఎత్తేశాయి. వీటిని ఇతర వ్యాధులకు సంబంధించిన రోగుల కోసం కేటాయించాయి. పొంచివున్న ‘సెకండ్ వేవ్’.. ప్రస్తుతం కరోనా మహమ్మారి ఉధృతి తగ్గినా రాబోయే రెండు నెలలు అత్యంత కీలకమని వైద్య, ఆరోగ్యశాఖ హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా, దేశంలో అక్కడక్కడ సెకండ్ వేవ్ వణికిస్తున్నందున జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. సెకండ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని, జాగ్రత్తలు తీసుకోకుంటే అది ప్రతాపం చూపిస్తుందని అధికారులు చెబుతున్నారు. వచ్చే కిస్మస్, నూతన సంవత్సర వేడుకలు, ఆ తర్వాత సంకాంత్రి పండుగ సందర్భంగా మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరుతున్నారు. ఇంకా పెళ్లిళ్ల వేడుకల్లోనూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోకుంటే మళ్లీ వ్యాప్తి.. రాష్ట్రంలో కరోనా ఉధృతి గణనీయంగా తగ్గింది. పాజిటివిటీ రేటు నెలలోనే మూడు రెట్లు తగ్గింది. దసరా, దీపావళి పండుగల సందర్భంగా కేసులు అధికంగా పెరుగుతాయని భయపడ్డాం.. కానీ ప్రభుత్వం అప్రమత్తం చేయడం, ప్రజలు జాగ్రత్తగా ఉండటంతో అటువంటి పరిస్థితి లేకపోగా, కేసుల సంఖ్య తగ్గడం ఊరటనిచ్చే విషయం.. అయితే రాబోయే రెండు నెలలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. సెకండ్ వేవ్ ప్రమాదం పొంచి ఉంది కాబట్టి మనం జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్లీ వైరస్ విజృంభిస్తుంది. – డాక్టర్ శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకుడు వైరస్ జీనోమ్లో మార్పుల వల్లే... కరోనా కేసులు తగ్గడానికి పలు కారణాలున్నాయి. వైరస్ జీనోమ్లో మార్పుల వల్ల కరోనా కాస్తంత బలహీనపడి తీవ్రత తగ్గింది. అలాగే కరోనాపై ప్రజల్లో అవగాహన పెరిగింది. గతంలో కంటే ప్రజలు ఎక్కువగా డీ, సీ విటమిన్లు వాడారు. జింక్ సంబంధిత మాత్రలూ వేసుకున్నారు. డీ విటమిన్ 60 నుంచి 70 యూనిట్ల వరకుంటే, 95 శాతం మేరకు కరోనా వైరస్ వచ్చే చాన్సే లేదు.. ఇటు బలవర్ధక ఆహారం తీసుకోవడం, పరిశుభ్రత పెరగడం వంటివి కారణాలుగా ఉన్నాయి. అయితే వైరస్ మళ్లీ తన ప్రతాపం చూపదని అనుకోలేం. ఎందుకంటే అది ఎప్పటికప్పుడు తనకు తాను మార్పు చేసుకుంటోంది. అది ఎలాంటి మార్పులకు లోనవుతుందో చెప్పలేం.. – డాక్టర్ మధుమోహన్రావు, శాస్త్రవేత్త, నిమ్స్ పరిశోధన అభివృద్ధి విభాగం -
‘తెలంగాణ ధరణి’ పేరుతో నకిలీ యాప్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన ధరణి వెబ్సైట్కు లింక్ చేస్తూ నకిలీ యాప్ సృష్టించిన ఇద్దరు కర్ణాటక వాసులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరు ఆ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ ద్వారానే పోస్ట్ చేసినట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ శనివారం తెలిపారు. ప్రభుత్వం రూపొందించిన ధరణి వెబ్సైట్లో భూ రికార్డులు, పహాణీ, ఫామ్ బీ–1, తదితరాలు పొందుపరిచింది. సర్కారు ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి మొబైల్ యాప్ను రూపొందించలేదు. దీన్ని గమనించిన కర్ణాటకలోని బసవకల్యాణం ప్రాంతానికి చెందిన ప్రేమ్ మూలే, మహేశ్ కుమార్ ధండోటే ఓ మొబైల్ యాప్ రూపొందించారు. దీనికి ‘ధరణి తెలంగాణ ల్యాండ్ రికార్డ్స్’అనే పేరు పెట్టారు. గూగుల్ ప్లే స్టోర్లో ఈ యాప్ను చూసిన అనేక మంది దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. నిందితులు యూట్యూబ్ ద్వారా యాప్ తయారీ నేర్చుకుని, దానిని క్లిక్ చేస్తే తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ధరణి వెబ్సైట్కు లింకు అయ్యేలా మాత్రమే డిజైన్ చేయగలిగారు. అంతకు మించి ఇందులో ఏ వివరాలూ పొందుపరచలేదు. ఈ యాప్ విషయం ఇటీవల తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ దృష్టికి వచ్చింది. దీంతో సంబంధిత అధికారులు సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ భద్రంరాజు రమేశ్, ఎస్సై వెంకటేశం దర్యాప్తు చేశారు. గూగుల్ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ప్రేమ్, మహేశ్ ఈ యాప్ను రూపొందించినట్లు గుర్తించారు. దీంతో అక్కడకు వెళ్ళిన ప్రత్యేక బృందం నిందితులను అరెస్టు చేసి తీసుకువచ్చింది. ఇద్దరినీ కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. -
రైతులకు సన్నాల సంకటం!
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: సన్న రకాలు సాగు చేసిన రైతులు సంకట స్థితిలో పడ్డారు. ఈ ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో నామమాత్రంగా కొనుగోలు జరుగుతున్నాయి. దొడ్డు రకాల కొనుగోళ్లకే ఐకేపీ, పీఏసీఎస్ నిర్వాహకులు ప్రాధాన్యం ఇస్తుండటంతో రైతులు రైస్ మిల్లుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. నల్లగొండ జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో, సూర్యాపేట జిల్లాలో 3.22 లక్షలు, ఖమ్మం జిల్లాలో 2.32 లక్షలు, నిజామాబాద్ జిల్లాలో 3.80 లక్షలు, కామారెడ్డి జిల్లాలో 2.43 లక్షలు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3.98 లక్షల ఎకరాల్లో అత్యధికంగా వరి పంటను సాగు చేశారు. ఈ జిల్లాల్లో సాగైన పంటలో 70 శాతం పైగా సన్నరకాలే. నియంత్రిత సాగు విధానంలో భాగంగా రైతులు సన్న రకాల సాగుకే మొగ్గు చూపారు. కానీ పంట చేతికి వచ్చాక ఈ పంట సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ధాన్యం అమ్మడానికి రైతులు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. సన్న రకాలైన ఆర్ఎన్ఆర్, 108 సంపూర్ణ, సిద్ది 44, బీపీటీ, పూజలు, హెచ్ఎంటీ, వరంగల్ 44 రకాలు ఎక్కువగా సాగయ్యాయి. ఈ రకాల వరి కోతలు ప్రారంభమై ఇరవై రోజులు గడుస్తున్నా.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మాత్రం వీటిని అంతంత మాత్రంగానే కొనుగోళ్లు చేస్తుండటం గమనార్హం. మిల్లుల బాట ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రైతులు ధాన్యం అమ్మకానికి మిల్లుల బాట పట్టారు. పంట కోసిన వెంటనే మిల్లుల్లో సన్న రకం కొనుగోలు చేస్తున్నారు. పది రోజులుగా ధాన్యం ట్రాక్టర్లతో మిల్లుల వద్ద రద్దీ పెరిగింది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టోకెన్ సిస్టం పెట్టారు. తహసీల్దార్ల నుంచి టోకెన్ అందితేనే రైతులు పంట కోసుకొని మరుసటి రోజు మిల్లులకు ధాన్యం తీసుకెళ్లాలి. ఈ పరిస్థితితో టోకెన్ల కోసం కూడా రైతులు క్యూ కడుతున్నారు. మూడు రోజులకోసారి మం డల కార్యాలయాల్లో టోకెన్లు ఇస్తుండటంతో ఇవి దొరకని రైతులు పంట అంతా తూరి పోతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కొనుగోలు చేయక తిప్పలు సూర్యాపేట జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్ 306 కేంద్రాలకు గాను 148 కేంద్రాలు తెరిచారు. కానీ వీటిలో చాలా కేంద్రాల్లో సన్న రకం ధాన్యం కొనుగోలు చేయడం లేదు. మిల్లులకు లేదా వ్యవసాయ మార్కెట్లలో ఈ ధాన్యం అమ్మాలని వీటి నిర్వాహకులు రైతులకు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్, వ్యవసాయ మార్కెట్లు కలిపి 441 కేంద్రాలకు 21 కేంద్రాలు తెరిచారు. పాలేరు డివిజన్లో వరి కోతలు ప్రారంభమయ్యాయి. నల్లగొండ జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలు అక్కడక్కడ ఏర్పాటు చేసినా వీటిల్లో సన్న ధాన్యం కొనుగోళ్లు లేకపోవడంతో ఈ జిల్లా రైతులు ఎక్కువగా మిర్యాలగూడలోని మిల్లులకు ధాన్యం అమ్మకానికి తీసుకెళ్తున్నారు. సన్నరకం కొనుగోలు చేయడం లేదు ఈ రైతు పేరు మట్టపల్లి గురులింగం. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం వట్టిఖమ్మంపహాడ్ ఇతని గ్రామం. మూడెకరాల్లో సన్న రకం వరి సాగు చేశాడు. నాలుగు రోజుల క్రితం పంట కోసిన ధాన్యాన్ని గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రానికి తీసుకెళ్లాడు. ఈ ధాన్యం కొనుగోలు చేయడం లేదని మిల్లులకు, లేదా వ్యవసాయ మార్కెట్కు తీసుకెళ్తే కొనుగోలు చేస్తారని ఐకేపీ నిర్వాహకులు ఉచిత సలహా ఇచ్చారు. ఎక్కడికి ధాన్యం తీసుకెళ్లాలో తెలియక ఈ కేంద్రంలోనే ధాన్యాన్ని ఆరబెట్టాడు. ప్రభుత్వం చెబితేనే సన్న రకం వేశామని, మరి ప్రభుత్వ కేంద్రాల్లో ఈ ధాన్యం ఎందుకు కొనుగోలు చేయరన్నది గురులింగం ఆవేదన. -
‘గ్రాడ్యుయేట్లు’ 10 లక్షల మంది
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, ప్రతినిధి నల్లగొండ: రెండు పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ స్థానాల్లో ఓటర్ల నమోదుకు శుక్రవారంతో గడువు ముగిసిపోగా, దాదాపు 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వరంగల్–ఖమ్మం–నల్ల గొండపట్టభద్రుల శాసనసభ నియోజకవర్గానికి 4,70,150 మంది, మహబూబ్నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ నియోజకవర్గానికి 4,71,772 మంది కలిపి మొత్తం 9,41,922 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆఫ్లైన్ ద్వారా వచ్చిన కాగితపు దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ పూర్తైతే, మొత్తం దరఖాస్తుల సంఖ్య 10 లక్షలకు మించే అవకాశాలున్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయం వర్గాలు తెలిపాయి. వరంగల్ నియోజకవర్గం పరిధిలో భారీ సంఖ్యలో ఆఫ్లైన్ దరఖాస్తులు రావడంతో వాటిని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తైతే మహబూబ్నగర్ స్థానం కన్నా వరంగల్ స్థానం పరిధిలోనే అధిక దరఖాస్తులు రానున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 1న ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రకటించనున్నారు. మళ్లీ డిసెంబర్ 1 నుంచి 31 వరకు కొత్తగా ఓటర్ల నమోదు కోసం పట్టభద్రుల నుంచి దరఖాస్తులతో పాటు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు. వచ్చే జనవరి 12లోగా ఈ దరఖాస్తులు, అభ్యంతరాలను పరిష్కరించి, అదే నెల 18న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. గతంలో ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్లోనే ముసాయిదా జాబితా ప్రకటన తర్వాత మరోసారి కొత్త దరఖాస్తుల స్వీకరణకు నెల రోజుల అవకాశం కల్పించిందని, అయితే ఈ మేరకు హైకోర్టు కొత్తగా గడువు పొడిగించినట్టు కొన్ని పత్రికల్లో తప్పుడు వార్తలు వచ్చాయని సీఈఓ కార్యాలయ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. -
తెలంగాణలో కొత్తగా 1607 పాజిటివ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 1607 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో గత 24 గంటల్లో 937 మంది డిశ్చార్జ్ అయ్యారు. వైరస్ బాధితుల్లో మరో ఆరుగురు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1372 కు చేరింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల మొత్తం సంఖ్య 2,48,891 కు చేరింది. వైరస్ నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 2,27,583. తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న కేసులు 19,936. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. -
ఇంజనీరింగ్లో 45 రకాల కోర్సులు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్లో భాగంగా వెబ్ ఆప్షనకు ఆదివారం అర్ధరాత్రి నుంచే అవకాశం కలి్పంచేలా ఏర్పాట్లు చేసినా, సాంకేతిక కారణాలతో సోమవారం మధ్యాహ్నం 3 గంటల తరువాత మొదలైంది. ఈనెల 20తో సరి్టఫికెట్ల వెరిఫికేషన్, 22తో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ పూర్తి చేసేలా, 24న సీట్ల కేటాయింపును ప్రకటించేలా అధికారులు ఇదివరకే షెడ్యూలు జారీ చేశారు. ఇక సోమవారం సాయంత్రం వరకు 57,530 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, అందులో 51,880 మంది సరి్టఫికెట్ల వెరిఫికేషన్కు హాజరయ్యారు. వారిలో 10,032 మంది వెబ్ ఆప్షన్లను ఇచ్చుకున్నారు. కోర్సుల వివరాల్లో పలు మార్పులు, చేర్పుల తరువాత కనీ్వనర్ కోటాలో 72,998 సీట్లు అందుబాటులో ఉన్నాయని.. ఇంజనీరింగ్లో 69,116, ఫార్మసీలో 3,882 సీట్లున్నట్లు ప్రవేశాలు కమిటీ వెల్లడించింది. ఇంజనీరింగ్లో 45 రకాల కోర్సులను అనుమతించగా, ఫార్మసీలో రెండు కోర్సులను అనుమతించింది. కొత్త కోర్సులు, ప్రధాన బ్రాంచీల్లోని సీట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 126 సీట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డాటా సైన్స్ 168, సీఎస్ఈ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెరి్నంగ్) 5,310, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ అండ్ బ్లాక్ చెయిన్ టెక్నాలజీ 126, కంప్యూటర్ ఇంజనీరింగ్ 42, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ 252, సీఎస్ఈ(సైబర్ సెక్యూరిటీ) 1,806, సీఎస్ఈ (డాటా సైన్స్) – 3,213, సీఎస్ఐటీ 336, సీఎస్ఈ (నెట్ వర్క్స్) 126, సీఎస్ఈ (ఐవోటీ) 1,281, కంప్యూటర్ ఇంజనీరింగ్ 210, సీఎస్ఈ 16,681, ఈసీఈ 13,397, సివిల్ 6,378, ఈఈఈ 6,907, ఐటీ 4,650, మెకానికల్ 5,980, మైనింగ్ 328 సీట్లు. -
తెలంగాణ: 1,554 పాజిటివ్, 7 మంది మృతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 43,916 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 1,554 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,19,224 కు చేరింది. వైరస్ బాధితుల్లో తాజాగా 7 మంది మరణించడంతో.. మొత్తం మృతుల సంఖ్య 1256 కు చేరింది. కోవిడ్ నుంచి కొత్తగా 1,435 మంది కోలుకోవడంతో ఆ సంఖ్య 1,94,653 చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 23,203 యాక్టివ్ కేసులున్నాయి. ఈమేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ శుక్రవారం హెల్త్ బులెటిన్లో పేర్కొంది. ఇప్పటివరకు 37,46,963 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని వెల్లడించింది. కరోనా రోగుల రికవరీ రేటు భారత్లో 87.5 శాతం ఉండగా.. రాష్ట్రంలో 88.79 శాతంగా ఉందని తెలిపింది. అదే సమయంలో దేశంలో కరోనా మరణాల రేటు 1.5 శాతం ఉండగా.. తెలంగాణలో 0.57 శాతం ఉందని పేర్కొంది. -
మనకు కరోనా రిస్క్ తక్కువే..!
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణలో కోవిడ్–19 కేసుల సంఖ్య పెరుగుతున్నా మరణాల సంఖ్య మాత్రం పెద్దగా లేదు. కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న వేగం కాస్త అటూఇటుగా ఉన్నప్పటికీ మరణాన్ని జయిస్తున్నవారే అధికం. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో రిస్క్ తక్కువగా ఉండడానికి ప్రధాన కారణం.. ఇక్కడ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తక్కువగా ఉండడమే. దేశంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి జాతీయ సగటు కంటే తెలంగాణ సగటు అతి తక్కువగా ఉంది’అని ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ (ఐఐపీఎస్) నివేదిక వెల్లడించింది. జూలై 2017 నుంచి జూన్ 2018 మధ్యకాలంలో దీర్ఘకాలిక వ్యాధులున్న వారి గణాంకాలను ఆధారం చేసుకుని రాష్ట్రాల వారీగా కోవిడ్–19 బారిన పడి కోలుకున్న.., మరణించిన వారి సంఖ్యను లెక్కిస్తూ ఐఐపీఎస్ అధ్యయనం చేసింది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న వారి గృహాలను ప్రామాణికంగా తీసుకుంటూ గణాంకాలను విశ్లేషిస్తే జాతీయ స్థాయిలో 9.38 శాతం గృహాలు రిస్క్లో ఉన్నట్లు నిర్ధారించింది. రాష్ట్రంలో రిస్క్ 6.12 శాతమే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గణాంకాలను సేకరించిన ఐఐపీఎస్.. రాష్ట్రాల వారీగా జాతీయ సగటును పోల్చుతూ పరిశీలన చేసింది. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో సగటున 9.38 శాతం గృహాలు రిస్క్ జాబితాలో ఉన్నాయి. ఇదే తెలంగాణ రాష్ట్రానికి వస్తే రిస్క్ కేవలం 6.12 శాతంగా ఉంది. దేశంలో అత్యధికంగా రిస్క్ ఉన్న గృహాలు కేరళలో (33.19 శాతంతో) ఉన్నట్టు ఆ అధ్యయనం తెలిపింది. ఆ తర్వాతి వరుసలో ఆంధ్రప్రదేశ్ 19.82 శాతం, గోవా 15.89 శాతం, పంజాబ్ 15.51 శాతం, హిమాచల్ప్రదేశ్ 14.49 శాతంతో రిస్క్ జాబితాలో ఉన్నాయి. ఇక రిస్క్ జాబితాలో ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో తెలంగాణ రాష్ట్రం కింది నుంచి 11వ స్థానంలో ఉంది. ఈ లెక్కన ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో రిస్క్ తక్కువగా ఉండడం వల్లే కోవిడ్–19 మరణాలు తక్కువగా సంభవిస్తున్నట్లు తేల్చింది. తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్–19 మరణాల్లో దీర్ఘకాలిక వ్యాధులున్న వారు 55.04 శాతంగా ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మిగతా 44.96 శాతం మరణాల్లో అత్యధికులు సకాలంలో వైద్యం తీసుకోకపోవడం వల్లే చనిపోయినట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. అరవై దాటిన వారే ఎక్కువ వయసు రీత్యా పరిశీలిస్తే అరవై సంవత్సరాలు దాటిన వారిలో రిస్క్ ఎక్కువగా ఉన్నట్లు ఐఐపీఎస్ పరిశీలన చెబుతోంది. దీర్ఘకాలిక వ్యాధులున్న వారిలో అరవై ఏళ్లు దాటిన వారు 52.25 శాతం ఉండగా, 45 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్నవారు 40.82 శాతం ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో 15 నుంచి 44 సంవత్సరాల వారుండగా.. 15 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ల సంఖ్య అతి తక్కువగా ఉంది. -
‘మక్క’ల్లో మస్తు తిన్నరు!
సాక్షి, హైదరాబాద్: మక్కల విక్రయాల్లో మెక్కుడు.. బడా వ్యాపారులకు మొక్కుడు.. చిన్నవ్యాపారులను తొక్కుడు.. ఇదీ మార్క్ఫెడ్ బాగోతం. నీకింత, నాకింత.. అన్నట్లుగా అధికారులు, బడా వ్యాపారులు వ్యవహరిస్తున్నారు. ‘మార్క్ఫెడ్ ఎప్పుడూ నష్టాల్లోనే ఉంటుంది. కానీ, అందులో కొందరు అధికారులు మాత్రం కోట్లకు పడగలెత్తుతార’న్నది వ్యవసాయశాఖలో సాధారణంగా వినిపించే మాట. గత రబీ మొక్కజొన్న టెండర్లలో వ్యాపారులకు లబ్ధి, తమకు అక్రమ ఆదాయం సమకూరేలా వ్యూహాన్ని రచించారు. ఒకేసారి కనీసం 80 వేల మెట్రిక్ టన్నులు కొనగలిగే సామర్థ్యం కలిగిన బడా వ్యాపారులే బరిలోకి దిగేలా నిబంధనల్లో మార్పులు చేశారు. 100 గోదాముల్లో నిల్వలు... గత యాసంగికి సంబంధించి 9.43 లక్షల టన్నుల మొక్కజొన్నలను క్వింటాకు రూ.1,760 చొప్పున రైతులకు చెల్లించి మార్క్ఫెడ్ కొనుగోలు చేసింది. అందుకోసం రూ.1,659 కోట్లు వెచ్చించింది. ఆ మొక్కజొన్నలను రాష్ట్రంలో దాదాపు 100 గోదాముల్లో నిల్వ చేసింది. వాటిని తిరిగి వ్యాపారులకు విక్రయించేందుకు టెండర్లు ఆహ్వానించింది. అయితే మూలధర నిర్ణయించకుండానే టెండర్లు పిలవడం విమర్శలకు తావిస్తోంది. పంటను కొనుగోలు చేసిన ధర కన్నా చాలా తక్కువ ధరకు కేటాయించడంపై విమర్శలు వస్తున్నాయి. రెండు జిల్లాల్లో ఓ సంస్థ క్వింటాకు రూ.1,190 చొప్పున టెండర్ దక్కించుకొంది. అంటే.. క్వింటాకు రూ. 570 చొప్పున మార్క్ఫెడ్కు నష్టం వాటిల్లింది. ఆ టెండర్ సంస్థ ఇప్పుడు క్వింటాకు రూ.1,350 పైగా మార్కెట్లో అమ్ముతూ సొమ్ము చేసుకుంటోంది. (చదవండి: తహసీల్దార్లకే ‘నాలా’ అధికారాలు!) రూ.50 కోట్ల టర్నోవర్ కలిగిన ఏజెన్సీలకే దక్కేలా మొన్నటి వరకు మార్క్ఫెడ్లో గోదాములవారీగా చిన్న, చిన్న మొత్తాల్లో గ్రూప్లు చేసి టెండర్లు పిలిచేవారు. దానివల్ల దాదాపు 100 గోదాముల్లోని మొక్కజొన్నల కోసం చిన్న వ్యాపారులు కూడా టెండర్లలో పాల్గొనేవారు. 8.48 లక్షల టన్నుల మొక్కజొన్న నిల్వలను పది పెద్ద విభాగాలుగా విభజించి టెండర్లు పిలిచారు. ఒక్కో గ్రూప్లో దాదాపు రూ.100 కోట్లకుపైగా విలువైన మొక్కజొన్న నిల్వలు ఉంటాయి. క్వింటా మొక్కజొన్నలకు గరిష్ట బిడ్డింగ్ ధర రూ.1,128 కాగా, కనిష్టంగా రూ.1,001 కోట్ చేశారు. నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని మొక్కజొన్నకు రూ.1,190 ధర ఇచ్చేలా వ్యాపారిని ఒప్పించారు. అన్నింటికీ కలిపి ఏడు ఏజెన్సీలే బిడ్డింగ్ దాఖలు చేయడం గమనార్హం. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధర క్వింటాకు రూ. 1,760 కాగా... హైదరాబాద్ పౌల్ట్రీ మార్కెట్ ధర ప్రస్తుతం రూ. 1,500 ఉంది. కొత్త మొక్కజొన్నలను వ్యాపారులు రూ. 1,350 చొప్పున కొంటున్నారు. ఈ మూడు ధరల్లో ఏ ఒక్కదాన్ని కూడా పరిగణనలోకి తీసుకోలేదు. (చదవండి: కరీంనగర్లో భారీ అగ్నిప్రమాదం) మూలధర నిర్ణయిస్తే ముందుకు రాలేదు: మార్క్ఫెడ్ ‘ఈ–టెండర్లో మొక్కజొన్నను విక్రయిస్తుంటాం. సేకరించిన ధరను బట్టి మూల ధర నిర్ణయించినా, చాలామంది బిడ్డర్లు ముందుకు రాలేదు. వర్షాల వల్ల మొక్కజొన్న చాలాచోట్ల దెబ్బతిన్నది. రంగుమారింది. విక్రయించకపోతే బూజు పట్టిపోతుంద’ని మార్క్ఫెడ్ అధికారులు చెబుతున్నారు. అధికారులు మాయాజాలం చేస్తున్నారనడంలో ఎలాంటి వాస్తవం లేదని అంటున్నారు. -
ఎల్ఆర్ఎస్ పేరుతో నయా దోపిడీ
రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అక్రమ లేఅవుట్లు, అందులోని ప్లాట్ల క్రమబద్ధీకరణ చేయడానికి లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రెండు జీవోలను విడుదల చేసింది. జీవో 131, జీవో 135. వీటి ప్రకారం 2020 ఆగస్టు 26 వరకూ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కల్గి ఉన్న యజమానులు దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు. ప్రస్తుతమున్న అనుమతుల్లేని లేఅవుట్ వెంచర్లన్నీ తప్పనిసరిగా అనుమతి పొందాల్సి ఉంటుంది. గ్రామకంఠం భూములకు ఇది వర్తించదు. వ్యక్తిగత ప్లాట్ యజమాని వెయ్యి ఫీజుతో, లేఅవుట్ వెంచర్ యజమాని రూ.10 వేలు ఆన్లైన్ ద్వారా చెల్లించి అక్టోబర్ 15లోగా దరఖాస్తు నమోదు చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 16 లక్షల అనధికార ప్లాట్లు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించినట్టు చెబుతున్నారు. ఈ 16 లక్షల మంది అప్లై చేసుకుంటే వచ్చే ఫీజుతోనే సుమారు రూ.160 కోట్ల ఆదాయం వస్తుంది. ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారు 2021 జనవరి 31 వరకూ ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకున్నట్లయితే 16 లక్షల ప్లాట్లకు గాను ఒక్కో దానికి సుమారు రూ.50 వేల చొప్పున వేసుకున్నా, రూ. 8 వేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశముంది. (చదవండి: ఎల్ఆర్ఎస్: ‘3 లక్షల కోట్లు దండుకోవాలని చూస్తోంది’) ప్రభుత్వం ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకోవడంతో పేద, మధ్యతరగతి ప్రజలపై పెనుభారం పడుతోంది. చిన్న చిన్న ప్లాట్లు కల్గిన వారిలో 80 శాతం మంది పేద, మధ్యతరగతి వారే ఉన్నారు. అసలే కరోనా లాక్డౌన్తో అన్ని వర్గాల ప్రజలు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన దయనీయమైన స్థితిలో మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చి నిరంకుశంగా వ్యవహరించడం సిగ్గుచేటు. లాక్డౌన్ సమయంలో ప్రజలను ఆదుకోవడానికి కొంత నగదు ఇచ్చి బియ్యం పంపిణీ చేయడంతో పాటు, ఇంటి అద్దెలను సైతం కట్టొద్దని చెప్పిన ముఖ్యమంత్రి నేడు వేల కోట్ల రూపాయలు ఎల్ఆర్ఎస్ పేరుతో వసూలు చేయడానికి పూనుకోవడం దుర్మార్గమైన చర్య. ప్రస్తుతమున్న ప్లాట్లు కొనుగోలు చేసి ఎల్ఆర్ఎస్ చేయిం చుకోకపోతే వాటిని అమ్మాలన్నా, వాటిలో నిర్మాణాలు చేపట్టాలన్నా అనుమతి ఉండదని; మంచినీటి కనెక్షన్, డ్రైనేజీ ఏర్పాటు, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ఏ విధమైన రిజిస్ట్రేషన్ జరగవని చెప్పడం– పరోక్షంగా ప్రజలను ప్రభుత్వం బెదిరించి ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నట్టు స్పష్టంగానే కన్పిస్తోంది. లేఅవుట్లలో ఎక్కువ వరకూ 200–250 గజాల ప్లాట్లు ఉంటాయి. ఇప్పుడు రోడ్లు విస్తరించే క్రమంలో ఆ ప్లాట్ల విస్తీర్ణం తగ్గిపోతోంది. రెండు వైపులా రోడ్ల ప్లాటు అయితే హక్కుదారులకు ఏమీ మిగలడం లేదు. అయినా వారి నుంచి కూడా మొత్తం ప్లాట్ల విస్తీర్ణానికి చార్జీలు వసూలు చేస్తున్నారు. పోయిన విస్తీర్ణానికి నష్టపరిహారం ఇవ్వడం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 2015లో ఎల్ఆర్ఎస్ను తీసుకొచ్చింది. అక్రమ లేఅవుట్లు, అనధికార ప్లాట్లు క్రమబద్ధీకరించుకోవాలని సూచించింది. ఆ సమయంలో దరఖాస్తు రూపంలో రూ.10 వేలు చొప్పున వసూలు చేశారు. ఎక్కువ దరఖాస్తులను పరిష్కరించకుండానే మూలన పడేశారు. తిరిగి నేడు మళ్లీ ఎల్ఆర్ఎస్ చేయించుకోవాలంటూ కొత్త జీవో తేవడంతో గతంలో కట్టిన డీడీల మాటేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. (చదవండి: సారూ.. మాకేది మోక్షం!) కేంద్రం నుంచి జీఎస్టీ రాష్ట్ర పన్నుల వాటాగా రూ.8 వేల కోట్లు రావాలని చెబుతున్నారు. పదే పదే అడిగినా ఇవ్వడం లేదని, కరోనా వైరస్ కట్టడి చేయడానికి కూడా ఆర్థిక సాయమందించడం లేదని గగ్గోలు పెడుతున్నారు. దేవుడితో పోరాడుతానని చెప్పిన ముఖ్యమంత్రి కేంద్రంతో ఎందుకు పోరాడి నిధులు రాబట్టలేకపోతున్నారో ప్రజలకు తెలియజేయాలి. కేంద్రంతో పోరాడే దమ్ము లేకనే పేద, మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారు. వాస్తవంగా రిజిస్ట్రేషన్ చట్ట ప్రకారం నిషేధాస్తులు తప్ప ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయడం ఏమాత్రం ఆపకూడదు. కానీ ఆగస్టు నెల చివరి నుంచి రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిపివేయడం చట్టవిరుద్ధం. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చి ఆరేళ్లు అవుతున్నా ఇప్పటివరకూ ఎందుకు అనుమతి లేని ప్లాట్లు, లేఅవుట్లకు రిజిస్ట్రేషన్ చేయనిచ్చారు? కొన్ని ప్లాట్లు, వెంచర్లలో భవన నిర్మాణాలు సైతం జరిగాయి. ఇన్ని ఏళ్ల కాలంలో ఎల్ఆర్ఎస్ స్కీమ్ గుర్తు రాలేదా? ప్రజలు అనేక కష్టాల్లో ఉన్నప్పుడు ఏకపక్షంగా ఆర్థికభారం మోపడం తగదు. తక్షణమే జీవో 131, 135లను రద్దుచేయాలి. వ్యాసకర్త: జూలకంటి రంగారెడ్డి, మాజీ శాసనసభ్యులు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు -
తెలంగాణలో 1983 కేసులు, 10 మరణాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1983 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,02,594 కు చేరింది. వైరస్ బాధితుల్లో మరో 10 మంది మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 1181 కి చేరింది. గత 24 గంటల్లో వైరస్ బాధితుల్లో 2381 మంది కోలుకోవడంతో.. రికవరీ కేసుల మొత్తం సంఖ్య 1,74,769 కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 26,644 యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 292, రంగారెడ్డి జిల్లాలో 187 కేసులు నమోదైనట్టు తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంగళవారం హెల్త్ బులెటిన్లో పేర్కొంది. ఇక కరోనా మరణాల రేటు దేశంలో 1.6 శాతం ఉండగా.. రాష్ట్రంలో 0.58 శాతంగా ఉందని తెలిపింది. బాధితుల రికవరీ రేటు భారత్లో 84.7 శాతం ఉండగా.. తెలంగాణ 86.26 శాతంగా ఉందని వెల్లడించింది. సోమవారం ఒక్కరోజే 50,598 వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశామని, ఇప్పటివరకు 32,92,195 నమూనాలు పరీక్షించామని పేర్కొంది. (చదవండి: కరోనా : ఆ ఐదు రాష్ర్టాల్లో అధికం) -
కేబీసీ సీజన్ 12: చలించిపోయిన అమితాబ్
ముంబై: బిగ్ బీ అబితాబ్ వ్యాఖ్యాతగా కౌన్ బనేగా కరోడ్ పతి (కేబీసీ) 12 వ సీజన్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పాపులరైన ఈ షోలో తెలంగాణ నుంచి సబితా రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్లోని అల్వాల్ ప్రాంతంలో ఆమె టీచర్గా పనిచేస్తున్నారు. అయితే, ఎప్పుడూ సరదా సరదాగా షోను నడిపించే బిగ్ బీ సబితా లైఫ్ జర్నీ గురించి తెలుసుకుని విచలితుడయ్యారు. భర్తను కోల్పోయి, పిల్లలను పెంచి పెద్ద చేసిన తీరు పట్ల ఆయన ప్రశంసలు కురింపిచారు. స్ఫూర్తిమంతమైన జీవన ప్రయాణమని అమితాబ్ కొనియాడారు. ఒక టీచర్గా పిల్లలకు మంచి విద్యను అందిస్తానని సబిత చెప్పుకొచ్చారు. జీవితంలో పిల్లలకు ఆస్తులు ఇవ్వకున్నా కానీ, మంచి విద్యను అందివ్వాలని చెప్పారు. ఆమె పాల్గొన్న కేబీసీ సీజన్ 12, ఆరో ఎపిసోడ్ సోనీ టీవీలో నేటి రాత్రి (మంగళవారం) ప్రసారమవనుంది. ప్రస్తుతం సోనీ ప్రీమియం సబ్స్క్రైబర్లకు ఈ ఎపిసోడ్ అందుబాటులో ఉంది. (చదవండి: స్నేహితుడికి అమితాబ్ ఫన్నీ రిప్లై) సబితారెడ్డి పిల్లలు అమ్మ కోరిక మేరకు ఇక కేబీసీ సీజన్ 12, ఆరో ఎపిసోడ్లో సబితారెడ్డితో పాటు మరో 7 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. కంటెస్టెంట్ ప్రదీప్కుమార్ సూద్ బిగ్ బీ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి 12.5 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకుని ఆట నుంచి పక్కకు తప్పుకున్నారు. కేబీసీలో పాల్గొనడం తన తల్లి కోరిక అని ప్రదీప్ చెప్పారు. ఆమె కల నెరవేరినందుకు ఆనందంగా ఉందన్నారు. గతంలో కేబీసీలో పాల్గొనేందుకు ప్రయత్నించానని ఈసారి ఆ అవకాశం దక్కిందని పేర్కొన్నారు. ఆయన పంజాబ్లోని అమృత్సర్లో సీనియర్ డివిజనల్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ప్రదీప్ తర్వాత సబితారెడ్డి కేబీసీ క్విజ్లో పాల్గొన్నారు. ఇదిలాఉండగా.. అమితాబ్, ఆయన తనయుడు అభిషేక్ కొద్ది రోజుల క్రితం కరోనాబారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే. (చదవండి: ‘కౌన్ బనేగా కరోడ్పతి’ పేరుతో ఘరానా మోసం) -
తెలంగాణలో 2 లక్షలు దాటిన కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనాబారిన పడుతున్నవారి సంఖ్య తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1335 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 2,00,611 కు చేరింది. ఆదివారొ ఒక్కరోజే 8 మంది వైరస్ బాధితులు ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1171 కు చేరింది. అయితే, కోవిడ్ బాధితుల రికవరీ రేటు తెలంగాణలో 85.93 శాతానికి పెరగడం శుభ పరిణామం. గత 24 గంటల్లో రాష్ట్రంలో 2176 మంది కోవిడ్ రోగులు కోలుకున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,72,388. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 27,052. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సోమవారం హెల్త్ బులెటిన్లో పేర్కొంది. ఇక దేశంలో మరణాల రేటు 1.5 శాతంగా ఉండగా తెలంగాణలో 0.58 శాతంగా ఉందని తెలిపింది. గత 24 గంటల్లో 36,348 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశామని, దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 32,41,597 కు చేరిందని వెల్లడించింది. -
‘పోత బిడ్డో సర్కారు దవాఖానకు అనేట్టుగా ఉంది’
సాక్షి, సిద్దిపేట: టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ అభివృద్ధి శరవేగంగా సాగుతోందని మంత్రి హరీష్రావు అన్నారు. దేశంలోని 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్, 12 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నాయని, కానీ ఎక్కడా లేని విధంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రతి ఇంటికీ తాగునీరు ఇస్తోందని తెలిపారు. నిరుపేదలకు ఆసరా ఫించన్లు, బీడీలు చుట్టే మహిళలకు బీడీ కార్మిక భృతి ఇస్తోందని పేర్కొన్నారు. దుబ్బాకలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో మంగళవారం ఆయన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. (చదవండి: దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల) తెలంగాణ వచ్చాక ఎక్కడా తాగునీటి సమస్య లేదని స్పష్టం చేశారు. తొలి కాన్పు తల్లి గారే చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రూ. 12 వేలు, కేసీఆర్ కిట్ ఉచితంగా ఇస్తోందని చెప్పారు. రైతులకు వ్యవసాయానికి పెట్టుబడి కింద రైతుబంధు ఇస్తున్న ఒకే ఒక ప్రభుత్వం టీఆర్ఎస్ సర్కారు మాత్రమేనని అన్నారు. పంటలకు గిట్టుబాటు ధర అందించామని గుర్త చేశారు. త్వరలోనే ప్రతీ ఎకరాకు సాగునీరు అందించి కాళేశ్వరం నీళ్లతో రైతుల కాళ్లు కడుగుతామని వ్యాఖ్యానించారు. దుబ్బాక నియోజక వర్గంలో 57 వేల మందికి పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. ‘ఇతర పార్టీల నేతలు డబ్బాల్లో రాళ్లు వేసి ఉపేది ఊపుతున్నారు. నాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనేవారు, కానీ నేడు నేను పోత బిడ్డో సర్కారు దవాఖానకు అన్నట్టుగా తెలంగాణ సర్కారు పని చేస్తోంది. ఇప్పటిదాకా 7 లక్షల మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ కింద 5555 కోట్ల రూపాయలు అందించిన ఘనత టీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్కే దక్కింది’అని హరీష్ పేర్కొన్నారు. (చదవండి: మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ ) -
మూడ్రోజుల పాటు వర్షాలు...
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆదివారం తెల్లవారు జామున అల్పపీడనం ఏర్పడింది. సోమవారం నాటికి ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. ఒకట్రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు సైతం కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ స్పష్టంచేసింది. -
తెలంగాణలో లక్షా 57 వేలకు చేరిన కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిరోజూ 2 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో కొత్తగా 2,216 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,57,096 కి చేరింది. వైరస్ బాధితుల్లో కొత్తంగా 11 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 961 కి చేరింది. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 2,603 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోవిడ్ నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,24,528 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 31,607 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం హెల్త్ బులెటిన్లో పేర్కొంది. (చదవండి: మధ్య వయస్కులూ.. తస్మాత్ జాగ్రత్త..!) -
ఎల్ఆర్ఎస్కు భారీ స్పందన
సాక్షి, హైదరాబాద్: లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్)కు భారీ స్పందన లభిస్తోంది. ఈ నెల 2 నుంచి ఎల్ఆర్ఎస్ కింద దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించగా, శనివారం రాత్రి నాటికి రాష్ట్రవ్యాప్తంగా 70,193 దరఖాస్తులు వచ్చాయి. 10 రోజుల వ్యవధిలోనే ఇంత అనూహ్యమైన స్పందన రావడం గమనార్హం. మున్సిపాలిటీల పరిధిలో 30,353, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 16,912, గ్రామపంచాయతీల పరిధిలో 22,928 దరఖాస్తులు వచ్చాయి. కేవలం దరఖాస్తు ఫీజుల రూపంలోనే ప్రభుత్వానికి ఇప్పటి వరకు రూ.7.12 కోట్ల ఆదాయం వచ్చింది. అనధికార, అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లను చేయమని, ఇలాంటి లేఅవుట్లలో భవన నిర్మాణాలకు సైతం అనుమ తులు జారీ చేయబోమని ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవడంతో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోవ డం తప్పనిసరిగా మారింది. ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరించుకుంటేనే రిజిస్ట్రేషన్లు జరపడంతో పాటు భవన నిర్మాణ అనుమతులు జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో అనుమతి లేని వ్యక్తిగత ప్లాట్ల యజమానులు, లేఅవుట్ల డెవలపర్లలో గుబులు పట్టుకుంది. దీంతో ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరించుకోవడానికి సామాన్యులతోపాటు డెవలపర్లు భారీసంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు. -
తెలంగాణలో ఒక్కరోజే 2278 కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2278 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,54,880 కి చేరింది. వైరస్ బాధితుల్లో కొత్తగా 10 మంది మృతి చెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 950 కి చేరింది. శుక్రవారం ఒక్కరోజే 2458 మంది కోవిడ్ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,21,925. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 32,005. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం హెల్త్ బులెటిన్లో పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 77.75 శాతం ఉండగా.. తెలంగాణలో 78.7 శాతంగా ఉందని తెలిపింది. మరణాల రేటు భారత్లో 1.66 శాతంగా ఉండగా.. రాష్ట్రంలో 0.61 శాతంగా ఉందని వెల్లడించింది. గత 24 గంటల్లో 62,234 వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశామని, ఇప్పటివరకు మొత్తం 20,78,695 పరీక్షలు చేశామని తెలిపింది. (చదవండి: టిక్టాక్కు ప్రత్యామ్నాయంగా ‘బిస్కెట్’ ) -
సంచార జాతులు మరువలేని రోజు
2020 సెప్టెంబర్ 7. సంచార జాతులు, అత్యంత వెనుకబడిన 17 బీసీ కులాలు మర్చిపోలేనిరోజు. తరాలు మారినా మారని తలరాతను మార్చిన రోజది. ‘‘పెద్ద సారులూ! మా బాధను వినండి. ఎక్కని గడప లేదు, మొక్కని దేవుడు లేడు. మమ్మల్ని కనీసం బీసీ కులాల జాబితాలో కలుపుకోండి. మేం ఆశ్రితకులం. మేం సంచార జాతులం...’’ అన్న ఆ మూగవేదనలు ఈ నేలంతా విన్పిస్తూనే ఉన్నాయి. వాళ్ల పిల్లలకు చదువులు లేవు. జనజీవితంలో కలగలిసి ఉన్నట్లే ఉంటారు, బతుకు దెరువుకోసం సంచారులై సాగిపోతుంటారు. గత 70 ఏళ్లుగా వీళ్లను కాలం ఎట్లా వదిలివేసిందో తెలియదు. అందరూ అట్టడుగు వర్గాల గురించి పెద్దగా మాట్లాడేవాళ్ళే. కానీ, ఈ సంచార జాతులకు కనీస గుర్తింపును కూడా ఎందుకు ఇవ్వలేకపోయారన్నది ప్రశ్న. ఈ జాతుల వాళ్లు కనీసంగా విజ్ఞాపనా పత్రాన్ని రాసి వ్వలేని స్థితిలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం అవతరణ తర్వాత అన్ని రంగాలలో పునర్నిర్మాణం జరుగుతున్నట్లుగానే బహుజన బతుకుల పునర్నిర్మాణం మొదలయ్యింది. ఇందులో భాగంగా సమగ్రంగా బీసీల జీవన విధానంపై అధ్యయనం చేయటానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీసీ కమిషన్ను ఏర్పాటు చేశారు. తెలంగాణలో సామాజిక సూత్రాలను అమ లుచేసే దిశగానే అధ్యయనం కొనసాగించాలని, సమాజంలో సగభాగమైన బీసీల బతుకుచిత్రం మార్చటానికి అధ్యయనమే తొలిపునాది కావాలని కమిషన్ నియామకం తర్వాత సుదీర్ఘంగా ఐదుసార్లు సమావేశాలు జరిపి కమిషన్కు దిశానిర్దేశం చేశారు. బీసీ(ఇ) గ్రూపులోని ముస్లింల జీవన విధానాన్ని అధ్యయనం చేయాల్సిందిగా కమిషన్ను ఆదేశిం చారు. ఆ నివేదికను ముఖ్యమంత్రికి అందివ్వగానే ప్రత్యేక అసెంబ్లీని ఏర్పాటుచేసి ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించటం జరిగింది. అదే రోజు ఎస్టీలకు 6 నుంచి 10 శాతానికి రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభు త్వానికి నివేదించింది. కనీసం కుల సర్టిఫికెట్లకు నోచుకోకుండా ఉన్న సంచార జాతులను బీసీ కులాల్లో చేర్చాల్సి వుంది. 70 ఏళ్ల పాలకులు చేయలేని పనిని కేసీఆర్ చేశారు. సంచార జాతులను బీసీ కులాల్లో కలిపే విషయంపై చీఫ్ సెక్రటరీ బాధ్యతలు తీసుకోవలసిందిగా చెప్పారు. కేసీఆర్ చేసిన ఈ ప్రకటన చరిత్రాత్మ కమైనది. అది ఉద్యమకాలం నుంచి ఆయనను దగ్గ రగా చూసిన వాళ్లకు బాగా తెలుసు. ఒక విషయాన్ని తెలుసుకోవటానికి పుస్తక పఠనం ఉండాలి, క్షేత్ర స్థాయి అధ్యయన అనుభవం ఉండాలి. ఈ రెండూ కేసీఆర్లో ఉన్నాయి. బీసీ కులాల్లో చేర్చాల్సిన వారి పట్టికను ఇవ్వగానే వీళ్లంతా సంచార జాతుల వాళ్లే అన్నారు. 1. అద్దపువారు, 2. అహీర్/అహీర్ యాదవ కులము, 3. బాగోతుల/ భాగవతుల, 4. బైల్ కమ్మర/ ఘిసాడి/ గడియ లోహార్, 5.ఏనూటి/ యేనేటివాళ్లు, 6.గంజికూటి, 7.గౌడజెట్టి, 8.గవిలి/ గోవ్లీ/గౌలి/గవ్లి, 9.కాకిపడగల, 10.కుల్లకడిగి/ కుల్లె కడిగి/ చిట్టెపు, 11.పటంవారు/ మాసయ్యలు, 12. ఓడీ, 13.సారోల్లు/ సోమవంశ క్షత్రియ, 14. సొన్నా యిల/ సన్నాయిల/ సన్నాయోల్లు, 15. శ్రీక్షత్రియ రామజోగి/ రామబోగి/ రామజోగులు, 16. తెర చీరల/ తెల్వూరి/ బైకాని, 17. తోలుబొమ్మలవారు/ బొప్పలకులాల సంచారజాతుల వాళ్లు ఇప్పటిదాకా అనుభవించిన బాధలు అలవికానివి. వీళ్లది ఏ కులమో బీసీ కులపట్టికలో లేకపోవటంతో ఏ రెవెన్యూ అధికారి వీళ్లకు కులసర్టిఫికెట్లు ఇచ్చేవారు కాదు. బళ్లలో, హాస్టళ్లలో చేర్చుకునేటప్పుడు అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. రుణాలు పొందే సౌకర్యాలు ఉండేవి కావు. విద్యా, ఉద్యోగ విషయాలలో రిజర్వేషన్లు లేవు. ఇప్పుడు వీటన్నింటి నుంచి విముక్తి కలగబోతోంది. తరతరాలుగా సామాజిక చరిత్రను మోస్తున్న, గానం చేస్తున్న సంచార జాతులకు మంచి రోజులు రావాలి. పటం కథలు చెప్పుకుంటూ తిరిగే వారి పిల్లలు ఖగోళశాస్త్ర రంగంలోకి అడుగులు మోపాలి. తెలం గాణ రాష్ట్రం వస్తే ఏమవుతుందంటే, సంచార జాతుల బహుజనానికి విముక్తి లభిస్తుంది. జూలూరు గౌరీశంకర్, తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ సభ్యులు -
హడావుడి లేకుండా అసెంబ్లీ సమావేశాలు షురూ..!
సాక్షి, హైదరాబాద్: సోమవారం ప్రారంభమైన శాసనసభ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ పరిసరాల్లో విభిన్న వాతావరణం కనిపించింది. ప్రజా ప్రతినిధులు, అధికారులు, పోలీసులు, మీడియా, సందర్శకులతో సందడిగా కనిపించే అసెంబ్లీ ప్రాంగణంలో ఈసారి కరోనా నేపథ్యంలో పెద్దగా హడావుడి కనిపించలేదు. మీడియా పాయింట్ ఎత్తివేయడం, లాబీలు, గ్యాలరీలోకి సందర్శకులకు అనుమతి ఇవ్వక పోవడంతో అసెంబ్లీ పరిసరాలు బోసిపోయాయి. మంత్రులు మినహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వ్యక్తిగత సిబ్బందిని కూడా అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించలేదు. సీఎం, స్పీకర్, మంత్రులు సహా అందరూ మాస్క్లతో సభకు హాజరు కాగా, సభలో భౌతిక దూరం పాటిస్తూ సమావేశాల్లో పాల్గొన్నారు. సభ లోపల, బయటా కరచాలనాలు, గుమి కూడటం వంటివి లేకుండా సమావేశం వాయిదా పడిన వెంటనే ఎవరికి వారుగా తిరుగుముఖం పట్టారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే వారికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు అసెంబ్లీ ప్రాంగణంలో డయాగ్నస్టిక్ కేంద్రం ఏర్పాటు చేసి, అందరికీ పరీక్షలు నిర్వహించారు. మాస్క్ పెట్టుకోండి.. దూరం పాటించండి : స్పీకర్ పోచారం సూచనలు సాక్షి, హైదరాబాద్: శాసనసభ సమావేశాలకు హాజరయ్యే సభ్యులంతా కరోనా నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి సూచించారు. సోమవారం సభ ప్రారంభం కాగానే జాతీయ గీతాలాపన అనంతరం ఆయన సభ్యులకు పలు సూచనలు చేశారు. సభ్యులం తా సభకు హాజరయ్యే ముందు జ్వరాన్ని తనిఖీ చేసుకోవాలని.. జ్వరం, దగ్గు, జలుబు ఉంటే అది తగ్గేవరకు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలని తెలిపారు. గాలి, వెలుతురు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్క్ పెట్టు కోవాలని, చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని, అనవసరంగా వేటినీ తాకరాదని స్పష్టంచేశారు. రోగనిరోధక శక్తి పెంచుకునేలా పౌష్టి కాహారం తీసుకోవాలని, అనారోగ్యం ఉన్నవారితో కలవరాదని చెప్పారు. నీటి సీసాలు పంచుకోరాదని, లిఫ్టు వాడొద్దని పోచారం సూచించారు. చర్చలు సజావుగా జరిగేందుకు సహకరించాలి : మంత్రి వేముల సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలపై శాసనసభ, మండలిలో అర్థవంతమైన చర్చలు జరిగేందుకు ప్రభుత్వ చీఫ్ విప్, విప్లు కీలక పాత్ర పోషించాలని శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సూచించారు. పలు అంశాలకు సంబంధించి స్వల్పకాలిక, లఘు చర్చలపై విప్లు అంశాల వారీగా సన్నద్ధం కావాలని తెలిపారు. సభ్యుల హాజరును పర్యవేక్షించాలని చెప్పారు. శాసనసభ, మండలిలో చీఫ్ విప్లు, విప్లతో సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రి సమావేశమై చర్చించారు. సభను ఎన్ని రోజులైనా నిర్వహించేందుకు సీఎం సుముఖంగా ఉండడంతో అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో చీఫ్ విప్లు బోడకుంటి వెంకటేశ్వర్లు, దాస్యం వెంకటేశ్వర్లు, విప్లు భానుప్రసాద్రావు, ఎంఎస్ ప్రభాకర్, శాసనసభ విప్లు గంప గోవర్ధన్, గొంగిడి సునీత, బాల్క సుమన్, రేగ కాంతారావు, గువ్వల బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
28 వరకు శాసనసభ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ వర్షాకాల సమావేశాలను ఈ నెల 28 వరకు 18 రోజులపాటు నిర్వహించాలని అసెంబ్లీ వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సోమవారం నిర్ణయించింది. సభ నిర్వహణ తీరుతోపాటు సభలో చర్చించాల్సిన అంశాలపై బీఏసీలో కూలంకషంగా చ ర్చించారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివా స్రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో సీఎం కేసీఆర్, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశాలు పొడిగించాల్సి వస్తే ఈ నెల 28న మళ్లీ బీఏసీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. సభను ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు ప్రారంభించి గంట ప్రశ్నోత్తరాలు, మరో అరగంట జీరో అవర్ చేపడతారు. ప్రశ్నోత్తరాల్లో గరిష్టంగా ఆరు ప్రశ్నలకే అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. టీ విరామం తర్వాత లఘు చర్చ ఉంటుంది. ఈ నెల 12, 13, 20, 27 తేదీల్లో సమావేశాలకు విరా మం ఇస్తారు. బిల్లులు ప్రవేశపెట్టేందుకు ప్రత్యేక సమావేశం సమావేశాల సందర్భంగా బిల్లులు ప్రవేశపెట్టే సమయంలో రెండు లేదా మూడు రోజులపాటు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంట ల వరకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కా నుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కొత్త రెవెన్యూ చట్టం బిల్లును ఈ నెల 9న సభలో ప్రవేశపెట్టనుండగా 10, 11 తేదీల్లో ఈ అంశంపై చర్చ జరగనుంది. ఈ నెల 9 నుంచి 28 వరకు ప్రతిరోజూ ప్రభుత్వ కార్యకలాపాలు, బిల్లులు ప్రస్తావనకు వస్తాయి. కాంగ్రెస్ ప్రతిపాదించిన అంశాలివే కరోనా కేసులు, కృష్ణా జలాలు, ఎల్ఆర్ఎస్/బీఆర్ఎస్, బెల్టు షాపులు, పోడు వ్యవసాయం, పాత సచివాలయం కూల్చివేత, ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ప్లాన్, నూతన విద్యావిధానం, విపక్షాల పాత్ర వంటి 11 అంశాలను చర్చించాలని కాంగ్రెస్ సభాపక్షం నేత భట్టి విక్రమార్క ప్రతిపాదించారు. రెవెన్యూ చట్టం బిల్లును రూపొందించేందుకు మూడేళ్లు పట్టినందున దాన్ని అధ్యయనం చేసేందుకు తగినంత గడువు ఇవ్వాలని భట్టి కోరినట్లు తెలిసింది. మీడియా పాయింట్ను ఎత్తేయడంపై బీఏసీలో వాడివేడి చర్చ జరిగినట్లు సమాచారం. మీడియా పాయింట్ ఎత్తివేత ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే అని భట్టి వాదించగా సభలో అన్ని అంశాలపై మాట్లాడేందుకు తగినంత సమయం ఇస్తామని, ఎన్నిరోజులైనా చర్చకు సిద్ధమని సీఎం కేసీఆర్ స్పష్టం చేసినట్లు తెలిసింది. అసెంబ్లీ తరహాలోనే మండలి.. శాసనసభ తరహాలోనే శాసనమండలి సమావేశాలు కూడా 18 రోజులపాటు నిర్వహించాలని మండలి బీఏసీ నిర్ణయించింది. కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణ యం తీసుకున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో సభా నాయకుడు సీఎం కేసీఆర్తోపాటు మం త్రులు వేముల ప్రశాంత్రెడ్డి, ఈటల రాజేందర్, ఎస్. నిరంజన్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, విప్ గొంగిడి సునీత, విపక్ష నేతలు అక్బరుద్దీన్ ఒవైసీ, భట్టి విక్రమార్క, శాసనసభ కార్యదర్శి డాక్టర్ వి. నర్సింహాచార్యులు పాల్గొన్నారు. పీవీకి భారతరత్న... రెవెన్యూ చట్టం మంగళవారం ఉద యం 11 గంటలకు ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్న ఇవ్వాలనే తీర్మానాన్ని ప్రభుత్వం ప్రతిపాదించనుంది. ఈ సందర్భంగా పీవీ శతజ యంతి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో మంగళవారం ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ను రద్దు చేయాలని బీఏసీ నిర్ణయించింది. మరోవైపు ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్న ఏఐఎంఐఎం గైర్హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. విపక్షాలు కోరినన్ని రోజులు సమావేశాలు: కేసీఆర్ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించేందుకు అసెంబ్లీ సమావేశాలు వేదికగా ఉపయోగపడతాయని, ప్రతిపక్షాలు కోరినన్ని రోజులు సభ నడిపేందుకు సిద్ధమని బీఏసీ భేటీలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. పార్టీలవారీగా, సభ్యుల సంఖ్య ఆధారంగా చర్చా సమయం కేటాయించాలని స్పీకర్ను కోరారు. ప్రభుత్వం తరఫున ఈ సమావేశాల్లో 16 అంశాలను ప్రతిపాదిస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. సీఎం ప్రతిపాదనలకు అంగీకరిస్తున్నట్లు ఏఐఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. తమ పార్టీ తరఫున ప్రతిపాదించే అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్ పక్ష నేత భట్టి విక్రమార్క కోరగా సీఎం అంగీకరించారు. -
తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ రద్దు
సాక్షి, హైదరాబాద్ : రెవెన్యూ శాఖ ప్రక్షాళనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. క్షేత్రస్థాయిలో పనిచేసే గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) వ్యవస్థను రద్దు చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 7,039 వీఆర్వో పోస్టులు రద్దయ్యాయి. మరోవైపు కాలం చెల్లిన చట్టాలకు స్వస్తిచెప్పి కొత్త రెవెన్యూ చట్టం తేనుందనే ప్రచారం జరిగినా ప్రస్తుతం అమల్లో ఉన్న భూ యాజమాన్య హక్కులు–1971 చట్టం స్థానే.. తెలంగాణ భూ యాజమాన్య హక్కులు–పట్టాదార్ పాస్పుస్తకాల బిల్లు–2020’కు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లు బుధవారం అసెంబ్లీ ముందుకు రానుంది. రెవెన్యూ సిబ్బందికి అధికారాల కత్తెర, హోదాల మార్పు, కొత్త విభాగాల కూర్పుతో ఈ చట్టానికి రూపకల్పన చేసిన సర్కారు.. వీఆర్వో వ్యవస్థను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ వీఆర్వో పోస్టుల రద్దు బిల్లును కూడా కేబినెట్ ఆమోదించింది. మొదట్నుంచి ఈ వ్యవస్థపై గుర్రుగా ఉన్న ప్రభుత్వం వీఆర్వోలపై వేటు వేసింది. అందులో భాగంగా సోమ వారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. వీఆర్వోల వద్ద ఉన్న రికార్డులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతో వీఆర్వోలపై మెడపై కత్తివేలాడుతున్నట్లు తేటతెల్లమైంది. రిజిస్ట్రేషన్ల శాఖతో అనుసంధానం! అవినీతి రహితంగా, వివాదాలకు తావివ్వకుండా రెవెన్యూ సేవలను సులభతరం చేయాలనే ఆలోచనతో ఉన్న ప్రభుత్వం.. కోర్ బ్యాంకింగ్ తరహాలో రెవెన్యూ రికార్డుల్లో మార్పుచేర్పులు చేయాలని భావిస్తోంది. భూమి రిజిస్ట్రేషన్ జరిగిన మరుక్షణమే మ్యుటేషన్, పట్టాదార్ పుస్తకం జారీ అయ్యేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ప్రస్తుత విధానం వల్ల అవినీతి, వివాదాలకు ఆజ్యం పోస్తుందని భావించిన సర్కారు.. నోటీసులు, విచారణలు, రికార్డుల అప్డేషన్, ఆన్లైన్ పేరిట కాలయాపన చేయకుండా అదే రోజు పాస్పుస్తకం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖను అనుసంధానం చేయడం ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయనుంది. అధికారాల బదలాయింపు, వికేంద్రీకరణతో ఇరుశాఖలు ఏకీకృతం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై ప్రతి మండలంలో తహసీల్దార్ కమ్ సబ్ రిజిస్ట్రార్ ఒకరే ఉండనున్నారు. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు, ఇతర సేవలపై ఇరు శాఖల అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇదిలావుండగా, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లను సబ్ రిజిస్ట్రార్లు, వ్యవసాయభూముల రిజిస్ట్రేషన్లను తహసీల్దార్ చేస్తారనే మరో ప్రచారం కూడా ఉంది. వీఆర్వో ఎందుకొద్దంటే.. గ్రామస్థాయిలో వీఆర్వో, వీఆర్ఏల వ్యవస్థకు స్వస్తి పలకాలని నిర్ణయించిన సర్కారు.. అధికారాల కూర్పు, పేర్ల మార్పుపై కసరత్తు చేసింది. తహసీల్దార్ మొదలు కలెక్టర్ వరకు రెవెన్యూ అధికారాల్లో సాధ్యమైనంత వరకు తగ్గించాలని నిర్ణయించింది. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా పహాణీలో కాస్తు కాలమ్ ఎత్తివేసిందున.. కాస్తు కాలమ్ను గ్రామస్థాయిలో నమోదు చేసే వీఆర్వో వ్యవస్థ అవసరంలేదనే అంచనాకు ప్రభుత్వం వచ్చింది. దీంట్లో భాగంగా 1985, 1991ల్లో తీసుకువచ్చిన చట్ట సవరణలకు కొనసాగింపుగా వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థలను రద్దు చేయాలని నిర్ణయించింది. మరోవైపు వీఆర్వోలు, వీఆర్ఏ (గ్రామ రెవెన్యూ సహాయకులు)లను పురపాలక, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖల్లో విలీనం చేసే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే, వీఆర్ఏలలో కొందరిని మాత్రం కొనసాగించాలని సర్కారు భావిస్తోంది. తహసీల్దార్తో లింకు తెగిపోకుండా కొనసాగించడమే ఉత్తమమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
-
వీఆర్వో వ్యవస్థ రద్దుకు అంతా సిద్ధమైనట్టేనా!
సాక్షి, హైదరాబాద్: పాలనలో ఇప్పటికే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులేస్తోంది. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా సాగుతున్న కేసీఆర్ సర్కార్ వీఆర్వో వ్యవస్థ రద్దుకు యోచిస్తున్నట్టుగా సమాచారం. రాష్ట్రంలోని వీఆర్వోల వద్దనున్న రికార్డులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసినట్లుగా పభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. మధ్యాహ్నం 3 గంటలకల్లా రికార్డులను స్వాధీనం చేసుకోవాలని, సాయత్రం 5 గంటల వరకు రికార్డుల స్వాధీనం ఏ మేరకు పూర్తయిందో నివేదికలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ అయినట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ వైఖరిపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏకపక్షంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం తగదని హితవు పలుకుతున్నాయి. కాగా, కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పన చేస్తున్నట్లు గత అసెంబ్లీ సమావేశాల్లోనే సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి ప్రారంభమైన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లోనే కొత్తచట్టాన్ని ప్రకటిస్తారని తెలిసింది. దానికి అనుగుణంగానే గ్రామాధికారుల వ్యవస్థ రద్దుకు అంతా సిద్ధం చేసినట్టుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, వీఆర్వోలను ఉద్యోగాల నుంచి తొలగించకుండా వేరే శాఖలో సర్దుబాటు చేసే విధంగా సీఎం కేసీఆర్ ఇదివరకే అధికారులకు ఆదేశాలు జారీచేసినట్లుగా తెలిసింది. గ్రామీణ ప్రాంతంలో రెవెన్యూ శాఖలో కీలకంగా వారికి ఉద్యోగ భద్రత సైతం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించినట్లు సమాచారం. (చదవండి: ‘పునర్వ్యవస్థీకరణ’పై ప్రకటన ) -
ప్రణబ్ దాదాకు తెలంగాణ అసెంబ్లీ సంతాపం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ నేపథ్యంలో కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా శాసనసభ సమావేశ మందిరంలోనూ, బయటా భౌతిక దూరానికి ప్రాధాన్యతిస్తూ సభ్యులు, ఇతరుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి, స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులతో పాటు సభ్యులందరికీ పార్టీలకతీతంగా కరోనా నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి చేశారు. నెగెటివ్గా వచ్చినవారినే సభలోకి అనుమతించారు. స్పీకర్ పోచారం సూచనలు సభ ప్రారంభమైన తర్వాత శాసన స్పీకర్ పోచార శ్రీనివాస్ రెడ్డి సభ్యులకు కోవిడ్ నియంత్రణ జాగ్రత్తలు చదివి వినిపించారు. జ్వరం, దగ్గు, జలుబు ఉంటే సభ్యులు ఇంటి దగ్గరే ఉండాలని చెప్పారు. సభ్యులందరూ తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని అన్నారు. శానిటైజర్లను తరుచూ ఉపయోగిస్తూ ఉండాలని సూచించారు. సభ్యుల మధ్య కనీసం 6 అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలని చెప్పారు. సాధ్యమైనంత వరకు లిఫ్ట్ను ఉపయోగించరాదని స్పీకర్ కోరారు. (చదవండి: ‘పునర్వ్యవస్థీకరణ’పై ప్రకటన ) ప్రణబ్ ముఖర్జీకి సభ సంతాపం మాజీ రాష్ట్రపతి, భారత రత్న ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల తెలంగాణ అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. దేశం గొప్ప నాయకుడిని కోల్పోయిందని వ్యాఖ్యానించారు. సంకీర్ణ ప్రభుత్వాలను నడిపించడంతో ఆయన కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. తెలంగాణతో ప్రణబ్కు అవినాభావ సంబంధం ఉందని చెప్పారు. ఎన్నో రాజకీయ సంక్షోభాలను ప్రణబ్ పరిష్కరించారని కొనియాడారు. నమ్మిన విలువలకు నిలబడిన వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కాగా, శాసనసభ ఆవరణలో రద్దీని తగ్గించేందుకు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల వ్యక్తిగత సహాయకులకు అనుమతి నిరాకరించడంతో పాటు మీడియా, అధికారులకు జారీ చేసే పాస్ల సంఖ్యను భారీగా కుదించారు. నేటి నుంచి సుమారు 20 రోజుల పాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కొనసాగనున్నాయి. -
తెలంగాణలో కొత్తగా 1802 కేసులు 9 మరణాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1802 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,42,771 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 9 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 895 కు చేరింది. తాజాగా 2711 మంది కోవిడ్ పేషంట్లు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 1,10,241. యాక్టివ్ కేసుల సంఖ్య 31,635. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ సోమవారం హెల్త్ బులెటిన్లో పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా రోగుల రికవరీ రేటు 77.25 శాతంగా ఉండగా.. తెలంగాణలో 77.2 శాతంగా ఉందని తెలిపింది. ఇక దేశంలో కరోనా మరణాల రేటు 1.70 శాతంగా ఉండగా.. రాష్ట్రంలో 0.62 శాతంగా ఉందని వెల్లడించింది. గత 24 గంటల్లో 36,593 వైరస్ నిర్ధారణ పరీక్ష చేశామని, మొత్తం పరీక్షల సంఖ్య 17,66,982 కు చేరిందని పేర్కొంది. (చదవండి: కరోనా వచ్చి పోయిందేమో? ) -
‘ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు అభినందనలు ’
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రభుత్వం ప్రకటించిన సులభతర వాణిజ్య రాష్ట్రాల జాబితాలో మొదటి, మూడవ స్థానాల్లో నిలిచిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందనలు తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాలు ముందువరసలో చోటు దక్కించుకోవడం ఆనందదాయకమని శనివారం ట్వీట్ చేశారు. (చదవండి : ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఏపీ నెంబర్ వన్) కాగా, ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్ (సులభతర వ్యాపార నిర్వహణ) -2020 ర్యాంకులను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంట్లో ఏపీ బర్వన్ స్థానంలో నిలిచింది. బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ ఓవరాల్ ర్యాంకింగ్లోనూ జాతీయ స్థాయిలో మొదటిస్థానంలో నిలిచింది. రెండోస్థానంలో ఉత్తర ప్రదేశ్, మూడోస్థానంలో తెలంగాణ రాష్ట్రాలు నిలిచాయి. -
తెలంగాణలో లక్షా 30 వేలు దాటిన కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 2892 పాజిటివ్ కేసులు నమోదవండంతో మొత్తం కేసుల సంఖ్య 1,30,589 కు చేరింది. వైరస్ బాధితుల్లో కొత్తగా 10 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 846 కు చేరింది. మంగళవారం ఒక్కరోజే 2240 మంది కోవిడ్ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 97,402. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 32,341. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం హెల్త్ బులెటిన్లో పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 77.02 శాతంగా ఉండగా.. రాష్ట్రంలో 74.5 శాతంగా ఉంది. భారత్లో మరణాల రేటు 1.76 శాతంగా ఉండగా.. తెలంగాణలో 0.64 శాతంగా ఉంది. గత 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 59,491 పరీక్షలు నిర్వహించామని మొత్తం పరీక్షల 14,83,267 కు చేరిందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. (చదవండి: మీకు అర్థమవుతోందా..!) -
అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణకు రెడీ
సాక్షి, హైదరాబాద్: అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణకు తెలంగాణ మున్సిపల్ శాఖ అవకాశం కల్పించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 31.08.2020 నుంచి లే అవుట్ రెగ్యులరైజేషన్ (ఎల్ఆర్ఎస్) ప్రక్రియ ప్రారంభించినట్టు ఉత్తర్వుల్లో తెలిపింది. ఆగస్టు 26 లోపు చేసిన లే అవుట్ ఓనర్లకు, రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్ ఓనర్లకు ఎల్ఆర్ఎస్కు అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొంది. ఎల్ఆర్ఎస్కు సంబంధించి మున్సిపల్ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ కింది మార్గదర్శకాలకు లోబడే లే అవుట్లను రెగ్యులర్ చేస్తామని అధికారులు తెలిపారు. ⇒ నాలాకు 2 మీటర్ల దూరం ఉండాలి. ⇒ వాగుకు 9 మీటర్ల దూరం ఉండాలి. ⇒ 10 హెక్టార్లలోపు ఉన్న చెరువుకు 9 మీటర్ల దూరం ఉండాలి . ⇒ 10 హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న చెరువుకు 30 మీటర్ల దూరం ఉండాలి. ⇒ ఎయిర్పోర్టు, డిఫెన్స్ స్థలానికి 500 మీటర్ల దూరం ఉండాలి. ⇒ వ్యక్తిగత ప్లాట్ ఓనర్స్ వెయ్యి రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు, లే అవుట్ ఓనర్స్ 10 వేలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ⇒ 100 గజాల లోపు ఉన్న వారు గజానికి 200 రూపాయల చొప్పున చెల్లించాలి. ⇒ 101 నుంచి 300 గజాలు ఉన్నవాళ్లు గజానికి 400 రూపాయలు చెల్లించాలి. ⇒ 301 నుంచి 500 గజాలు ఉన్నవాళ్లు గజానికి 600 రూపాయలు చెల్లించాలి. (చదవండి: ప్రైవేటు జలగలు..! ) -
తెలంగాణ: ఒక్కరోజే 2734 మందికి పాజిటివ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 2734 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,27,697 కు చేరింది. తాజాగా వైరస్ బాధితుల్లో 9 మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 836 కు చేరింది. సోమవారం ఒక్కరోజే 2325 మంది కోవిడ్ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 95,162. తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 31,699. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం హెల్త్ బులెటిన్లో పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా రికవరీ రేటు 76.94 శాతంగా ఉండగా.. రాష్ట్రంలో 74.5 శాతం అని తెలిపింది. అలాగే దేశవ్యాప్తంగా కోవిడ్ మరణాల రేటు 1.77 శాతంగా ఉండగా.. తెలంగాణలో 0.65 శాతంగా ఉందని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 58,264 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశామని, ఇప్పటివరకు 14,23,846 నమూనాలు పరీక్షించామని బులెటిన్లో పేర్కొంది. (చదవండి: దారుణం: భార్యకు కరోనా.. గుండెపోటుతో భర్త మృతి) -
తెలంగాణ ఈసెట్ పరీక్ష ప్రారంభం
-
కొనసాగుతున్న తెలంగాణ ఈసెట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈసెట్ నేటి ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 వరకు ముగుస్తుంది. మరొక సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు కొనసాగుతుంది. ఇక కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. విద్యార్థుల భద్రతపై అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా, ఉదయం పరీక్షకు 14,415 మంది అభ్యర్థులు, మధ్యాహ్నం పరీక్షకు 13,600 మంది విద్యార్థులు హాజరుకానున్నట్టు పరీక్షలు నిర్వహిస్తున్న జేఎన్టీయూ అధికారులు తెలిపారు. తెలంగాణలో 56, ఏపీలో 4 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. మాస్క్, శానిటైజర్ తప్పనిసరి చేశామని, పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరిస్తామని అధికారులు ఇదివరకే స్పష్టం చేశారు. కాగా, కోవిడ్ కారణంగా వాయిదాపడిన ఈసెట్, వైరస్ విజృంభణ అనంతరం నిర్వహిస్తున్న తొలి కామన్ ఎంట్రన్స్ టెస్టు కావడం గమనార్హం. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయిన విద్యార్థులకు బీటెక్ సెకండియర్లో ప్రవేశాల కోసం ఈసెట్ పరీక్షలు నిర్వహిస్తారు. (చదవండి: అనుమతి లేకున్నా కరోనా టెస్టులు!) రేపు జేఈఈ మెయిన్ దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం మంగళవారం నుంచి సెప్టెంబర్ 6 వరకు జేఈఈ మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. దీనికోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశా రు. ఐఐటీ ఢిల్లీ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్టు (సీబీటీ) విధానంలో ఒక్కరోజులో 85 వేలమంది మెయిన్ పరీక్షలకు హాజరుకానున్నా రు. తెలంగాణ నుంచి 67,319 మంది, దేశవ్యాప్తంగా 8.58 లక్షల మంది పరీక్షలు రాయనున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్, సికింద్రాబాద్తోపాటు రంగారెడ్డి, నల్లగొండ, కరీంనగర్, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాల్లో పరీక్షా కేంద్రాలున్నాయి. (చదవండి: జేఈఈ, నీట్ పరీక్షలపై సందేహాలెన్నో!?) -
తెలంగాణలో 1873 పాజిటివ్, 9 మంది మృతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిని 24 గంటల్లో 1873 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,24,963 కు చేరింది. తాజాగా వైరస్ బాధితుల్లో 9 మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 827 కు చేరింది. ఆదివారం ఒక్కరోజే 1849 మంది కోవిడ్ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 92,837. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 31,299. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సోమవారం హెల్త్ బులెటిన్లో పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా రికవరీ రేటు 76.55 శాతంగా ఉండగా.. రాష్ట్రంలో 73.3 శాతం అని తెలిపింది. అలాగే దేశవ్యాప్తంగా కోవిడ్ మరణాల రేటు 1.78 శాతంగా ఉండగా.. తెలంగాణలో 0.66 శాతంగా ఉందని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 37,791 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశామని, ఇప్పటివరకు 13,65,582 నమూనాలు పరీక్షించామని బులెటిన్లో పేర్కొంది. -
ఆ విషయంలో వెనుకబడ్డ చట్టసభ సభ్యులు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం (ఏసీడీపీ) కింద ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను వినియోగించుకోవడంలో చట్టసభల సభ్యులు వెనకబడి ఉన్న ట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో అత్యవసర కార్యక్రమాలు, అభివృద్ధి పనులను వేగంగా జరపాలనే ఉద్దేశంతో ఏటా ప్రభుత్వం విడుద ల చేస్తున్న ఏసీడీపీ నిధుల్లో సగం మేర ఖజానాలోనే మూలుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎంపీ ల్యాడ్స్ తరహాలో క్రమం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేస్తున్నప్పటికీ వినియోగం మాత్రం పూర్తి స్థాయిలో ఉండడంలేదు. ఒక్కో సభ్యుడికి ఏటా రూ.3 కోట్ల చొప్పున ప్రభుత్వం ఇస్తుండగా... వీటిని తమ విచక్షణాధికారంతో ఖర్చు చేసే వెసులుబాటు ఉంది. (చదవండి: బెంజి కార్లలో వచ్చి కల్లు తాగుతున్నారు.. ) ఐదేళ్లలో 1,900 కోట్లు... తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 2014–15 వార్షిక సంవత్సరం నుంచి 2018–19 వార్షిక సంవత్సరం వరకు ఐదేళ్ల కాలంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఏసీడీపీ నిధుల కింద రూ.1,900 కోట్లు విడుదల చేసింది. అయితే వీటిలో కేవలం రూ.1,228.93 కోట్లు ఖర్చు చేశారు. అంటే విడుదల చేసిన నిధులలో కేవలం 64.66 శాతం మాత్రమే ఖర్చు చేయగా.. మిగతావన్నీ ఖజానాలో మూలుగుతున్నాయి. ఖర్చు కాని నిధులను క్యారీఫార్వర్డ్ చేసే వెసులుబాటు ఉన్నప్పటికీ సకాలంలో వీటిని వినియోగించకపోవడంతో ఆశిం చిన ప్రయోజనం కలగడం లేదు. ఎమ్మెల్యేలు కాస్త నయం... ఏసీడీపీ కార్యక్రమం కింద విడుదలైన నిధులను ఖర్చు చేయడంలో ఎమ్మెల్సీల కంటే ఎమ్మెల్యేలు కాస్త ముందు వరుసలో ఉన్నారు. ఐదేళ్లలో ఎమ్మెల్యే కోటాలో ప్రభుత్వం రూ.1,440 కోట్లు విడుదల చేయగా... ఇప్పటివరకు రూ.974.85 కోట్లు (67.69 శాతం)ఖర్చు చేశారు. ఎమ్మెల్సీల కోటాలో రూ.460.5 కోట్లు విడుదల చేస్తే ఇప్పటివరకు రూ.254.08 కోట్లు (55.17శాతం)మాత్రమే ఖర్చు చేశారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే ఎమ్మెల్యేలు కాస్త ఎక్కువ నిధులు ఖర్చు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో వినియోగించకపోవడంతో నియోజకవర్గాల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. (చదవండి: తుపాకీతో మాజీ మంత్రి బెదిరింపులు) -
తెలంగాణలో కొత్తగా 2,924 కేసులు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 2,924 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,23,090కు చేరాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 10 మంది మరణించారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 818కి చేరింది. తాజాగా 1,638 మంది కోవిడ్ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్చ్ అయ్యారు. (చదవండి : 66 రోజుల్లో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్?) ఇప్పటి వరకు మొత్తంగా 90, 988 మంది డిశ్చార్జ్ అయినట్లు తెలంగాణ ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది. ప్రస్తుతం తెలంగాణలో 31,284 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 76.43 శాతంగా ఉండగా.. తెలంగాణలో 73.9 శాతంగా ఉంది. కొత్తగా వచ్చిన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 461 నమోదయ్యాయి. ఆ తర్వాత ఖమ్మంలో 181, కరీంనగర్ 172 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. -
తెలంగాణలో కొత్తగా 2,751 కేసులు, 9 మరణాలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 2,751 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,20,116కు చేరాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 9 మంది మరణించారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 808కి చేరింది. తాజాగా 1675 మంది కోవిడ్ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్చ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తంగా 89,350 మంది డిశ్చార్జ్ అయినట్లు తెలంగాణ ఆరోగ్య శాఖ శనివారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 76.49 శాతంగా ఉండగా.. తెలంగాణలో 74.3 శాతంగా ఉంది. కొత్తగా వచ్చిన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 432 నమోదయ్యాయి. ఆ తర్వాత రంగారెడ్డిలో 185, మేడ్చల్ జిల్లాలో 128 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. (చదవండి : కరోనాతో ఎంపీ వసంతకుమార్ కన్నుమూత ) -
తెలంగాణలో 2932 కేసులు, 11 మంది మృతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ కేసులు మళ్లీ భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2932 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,17,415 కు చేరింది. గత 24 గంటల్లో వైరస్ బాధితుల్లో 11 ప్రాణాలు విడిచారు. దీంతో కరోనాతో మరణించిన వారి మొత్తం సంఖ్య 799 కు చేరింది. తాజాగా 1580 మంది కోవిడ్ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్చ్ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 87,675. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 28941. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం హెల్త్ బులెటిన్లో పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 76.33 శాతంగా ఉండగా.. తెలంగాణలో 74.6 శాతంగా ఉంది. -
తెలంగాణలో కొత్తగా 3,018 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నాయి. తాజాగా బుధవారం ఒకే రోజు మూడు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 3,018 మంది కరోనా బారిన పడ్డారని తెలంగాణ ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,11,688 కి చేరింది. తాజాగా 10 మంది వైరస్ బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 780 కి చేరింది. గడచిన 24 గంటల్లో 1,060 మంది కోవిడ్ పేషంట్లు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 85,223 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 25,685 యాక్టివ్ కేసులున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 75.92 శాతంగా ఉండగా.. తెలంగాణలో రికవరీ రేటు 76.30 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటివరకు 10,82,094 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని వెల్లడించింది. -
తెలంగాణ: 2579 పాజిటివ్, 9 మరణాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. కొత్తగా 2579 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,08,670 కు చేరింది. తాజాగా 9 మంది వైరస్ బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 770 కి చేరింది. తాజాగా 1752 మంది కోవిడ్ పేషంట్లు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 84,163 కు చేరింది. ప్రస్తుతం 23,737 యాక్టివ్ కేసులున్నాయి. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం హెల్త్ బులెటిన్లో పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 75.27 శాతంగా ఉండగా.. తెలంగాణలో రికవరీ రేటు 77.44 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటివరకు 10,21,054 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని వెల్లడించింది. -
తెలంగాణలో 1842 కేసులు, 6 మరణాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1842 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,0,6091 కు చేరింది. తాజాగా ఆరు మంది కరోనా బాధితులు ప్రాణాలు విడువడంతో ఆ సంఖ్య 761 కు చేరింది. వైరస్ నుంచి కొత్తగా 1825 మంది కోలుకుని ఆదివారం ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 82,411 మంది కోవిడ్ పేషంట్లు ఇప్పటివరకు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,919 యాక్టివ్ కేసులున్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్లో 373 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సోమవారం హెల్త్ బులెటిన్లో పేర్కొంది. తెలంగాణలో రికవరీ రేటు 77.67 శాతంగా ఉందని తెలిపింది. గత 24 గంటల్లో 36,282 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశామని, దాంతో మొత్తం పరీక్షల సంఖ్య 9,68,121 కి చేరిందని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. (చదవండి: నాన్న శవమా.. నాకు వద్దు) -
తెలంగాణలో లక్ష దాటిన కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ అధికమవుతోంది. గడిచిని 24 గంటల్లో 2,474 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,01,865 కు చేరింది. తాజాగా ఏడుగురు కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 744 కు చేరింది. కొత్తగా 1768 మంది కోవిడ్ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 78,735 కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం హెల్త్ బులెటిన్లో పేర్కొంంది. రాష్ట్రంలో రికవరీ రేటు 77.29 శాతంగా ఉందని తెలిపింది. తాజా కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ 477, రంగారెడ్డి 201, నిజామాబాద్లో 153 నమోదయ్యాయని వెల్లడించింది. తెలంగాణలో ప్రస్తుతం 22,386 యాక్టివ్ కేసులు ఉన్నాయి. (చదవండి: తేమ నియంత్రణతో కరోనా కట్టడి) -
విషాదం: లోపలున్న 9 మందీ మృతి
సాక్షి, నాగర్కర్నూల్: శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అగ్ని ప్రమాదంలో లోపల చిక్కుకున్న తొమ్మిదిమందీ మృత్యువాత పడ్డారు. ఈ మేరకు తెలంగాణ జెన్ కో అధికారులు ప్రకటించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం...‘రాత్రి 10.30 గంటలకు ప్యానెల్స్లో మంటలు చెలరేగాయి. ప్రమాదం గుర్తించిన ఉద్యోగులు మంటలార్పేందుకు యత్నించారు. ప్రాణాలు లెక్క చేయకుండా ప్లాంట్ను కాపాడేందుకు ప్రయత్నించారు. రాత్రి 12 గంటల సమయంలో ఫోన్ చేసి ప్రమాదంపై సమాచారం అందించారు. ఆపదలో చిక్కుకున్నట్లు కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పారు. ప్రమాద సమయంలో 17 మంది ఉద్యోగులు ప్లాంట్లో ఉన్నారు. 9 మంది దురదృష్టవశాత్తు మంటల్లో చిక్కుకుని చనిపోయారు. మరో 8 మంది సురక్షితంగా బయటపడ్డారు’అని పేర్కొన్నారు. (పవర్ హౌజ్ ప్రమాదం: సీఐడీ విచారణకు కేసీఆర్ ఆదేశం) మృతుల వివరాలు 1.DE శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్ 2.AE వెంకట్రావు, పాల్వంచ 3.AE మోహన్ కుమార్, హైదరాబాద్ 4.AE ఉజ్మ ఫాతిమా, హైదరాబాద్ 5.AE సుందర్, సూర్యాపేట 6. జూనియర్ ప్లాంట్ ఆపరేటర్ రాంబాబు, ఖమ్మం జిల్లా 7. జూనియర్ ప్లాంట్ ఆపరేటర్ కిరణ్, పాల్వంచ 8. టెక్నీషియన్ మహేష్ కుమార్ 9.హైదరాబాద్కు చెందినా అమరన్ బ్యాటరీ కంపెనీ ఉద్యోగి వినేష్ కుమార్ -
ఏది డెంగీ.. ఏది కరోనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా ఓ వైపు జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటే.. మరోవైపు డెంగీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఎక్కడికక్కడ దోమలు పెరిగిపోతున్నాయి. దీంతో రాబోయే 15 రోజుల పాటు డెంగీ జ్వరాలు విస్తరించే అవకాశముందని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అయితే జ్వ రం వస్తే.. డెంగీదా? లేక కరోనాదా? తెలి యక జనానికి గందరగోళంగా మారింది. ము న్ముందు కరోనాతోపాటు డెంగీ కేసులు కూడా పెరిగే అవకాశం ఉండటంతో వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కిందిస్థాయిలో ఇంటిం టి సర్వే చేసి జ్వర బాధితులను గుర్తించాలని ఆదేశించింది. కరోనా కట్టడి చర్యలను పక్కాగా అమలు చేస్తూనే.. మరోవైపు డెంగీ, మలేరియా, చికున్ గున్యా తదితర వ్యాధుల ను నియంత్రించడంపై వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది. (చదవండి: బాధితులతో రాయ‘బేరాలు’) గతేడాది తీవ్రంగానే డెంగీ.. గతేడాది డెంగీ తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అధికారిక లెక్కల ప్రకారమే అప్పుడు ఏకంగా 13వేల డెంగీ కేసులు నమోదయ్యాయి. సరిగ్గా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో డెంగీ వీరవిహారం చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 1,100 వరకు డెంగీ కేసులు, 600 మలేరియా కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. డెంగీకి, కరోనాకు కామన్గా రెండింటికీ ఒకే తరహా లక్షణాలుండటంతో ఏదేంటో అంతుబట్టడం లేదని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, బాగా నీరసంగా ఉండటం డెంగీలో ఉండే సాధారణ లక్షణాలు. ఇవే కరోనాలో కూడా ఉండటంతో బాధితులు తమకు ఏది సోకిందో టెస్టులు జరిగి నిర్ధారణయ్యే వరకు తెలుసుకోలేకపోతున్నారు. ప్రస్తుతం రెండూ కలిసి వచ్చే అవకాశాలున్నాయా అన్న భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో రెండింటినీ ఒకేసారి ఎదుర్కోవాల్సి రావడం వైద్య యంత్రాంగానికి సవాల్గా మారింది. ఈ నేపథ్యంలోనే ఒక్కో ఆశ కార్యకర్త 50 ఇళ్లకు వెళ్లి జ్వర పరీక్షలు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశించింది. కరోనా కాలం కావడంతో ఉన్న సిబ్బంది అంతా దానికోసమే పనిచేయాల్సి వస్తోంది. దీంతో ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత దృష్ట్యా తక్షణ నియామకాలు చేపట్టాలని సర్కారు ఆదేశించినప్పటికీ.. చాలాచోట్ల తాత్కాలిక నియామకాలకే నోటిఫికేషన్లు ఇవ్వడంతో భర్తీ ప్రక్రియ ముందుకుసాగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. (చదవండి: తెలంగాణలో 1682 కేసులు, 8 మంది మృతి) జిల్లాలకు ఇవే మార్గదర్శకాలు.. ⇒ ప్రతి జిల్లాలోనూ కరోనా కేసులు ఎక్కువున్న ప్రాంతాలు, తక్కువ ఉన్న ప్రాంతా లు, అసలు కేసులు నమోదు కాని ప్రాంతాలుగా వేర్వేరుగా విభజించాలి. ⇒ దోమల నిర్మూలన కార్యక్రమాన్ని చేపడుతూనే కరోనా నిబంధనలను పాటించడంపై ప్రజలను చైతన్యం చేయాలి. ⇒ కరోనా జాగ్రత్తలతోపాటు ఇళ్లు, పరిసరా ల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. ⇒ అన్ని ఆరోగ్య కేంద్రాల్లోనూ డెంగీ, మలేరియా చికిత్సకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలి. ⇒ డెంగీ, మలేరియా ప్రభావిత ప్రాంతాల్లో ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి జ్వర నిర్ధారణ చేయాలి. ⇒ మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలతో కలసి దోమల నిర్మూలన కార్యక్రమాల ను చేపట్టాలి. æ డెంగీ, కరోనా రెం డూ ఉన్న వ్యక్తులను గుర్తిస్తే వెంటనే సమీపం లోని ఆసుపత్రికి సమాచారమివ్వాలి. -
తెలంగాణలో 1682 కేసులు, 8 మంది మృతి
సాక్షి, హైదరాబాద్: గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 19,579 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1682 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొత్తగా నమోదైనవాటితో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 93,937 కు చేరింది. వైరస్ బాధితుల్లో తాజాగా 8 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 711 కు చేరింది. మంగళవారం 2070 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 72,202 కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 21,024 యాక్టివ్ కేసులున్నాయి. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం హెల్త్ బులెటిన్లో పేరొంది. ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 7,72,928 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశామని తెలిపింది. రికవరీ రేటు 76.86% ఉందని వెల్లడించింది. (24 గంటల్లో భారత్లో 55,079 పాజిటివ్)