Corona in Telangana: 2579 New Positive Cases and 9 Deaths Recorded in Last 24Hrs | తెలంగాణలో కొత్తగా 2579 పాజిటివ్‌, 9 మరణాలు - Sakshi
Sakshi News home page

తెలంగాణ: 2579 పాజిటివ్‌, 9 మరణాలు

Aug 25 2020 8:44 AM | Updated on Aug 25 2020 5:11 PM

Coronavirus: 2579 Positive Cases Reported In Telangana - Sakshi

కొత్తగా 2579 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,08,670 కు చేరింది. తాజాగా 9 మంది వైరస్‌ బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 770 కి చేరింది.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. కొత్తగా 2579 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,08,670 కు చేరింది. తాజాగా 9 మంది వైరస్‌ బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 770 కి చేరింది. తాజాగా 1752 మంది కోవిడ్‌ పేషంట్లు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 84,163 కు చేరింది. ప్రస్తుతం 23,737 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 75.27 శాతంగా ఉండగా.. తెలంగాణలో రికవరీ రేటు 77.44 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటివరకు 10,21,054 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement