
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 97,236 మందికి పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 3,527 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బాధితుల్లో 19 మంది మరణించారు. గత 24 గంటల్లో 3,982 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 5,30,025గా ఉంది.
ఇక రాష్ట్రంలో ప్రస్తుతం 37,793 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు 1,49,27,319 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్ బాధితుల్లో 3207 మంది మృతి చెందారు. ఇక కరోనా కేసుల్లో అత్యధికంగా నమోదైన వాటిలో జీహెచ్ఎంసీ పరిధిలో 519 ,మేడ్చల్లో 188, ఖమ్మంలో 215గా ఉన్నాయి.
చదవండి: లాక్డౌన్ ఉల్లంఘిస్తే ఐసోలేషన్కే..!
Comments
Please login to add a commentAdd a comment