Corona Vaccine Distribution Arrangements In Hyderabad | Covid 19 Vaccine Telangana - Sakshi

హైదరాబాద్‌లో కరోనా వాక్సిన్‌ పంపిణీకి ఏర్పాట్లు

Dec 15 2020 1:04 PM | Updated on Dec 15 2020 4:42 PM

Coronavirus Vaccine Distribution Arrangements In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  కోవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీకి వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. జనవరి రెండో వారంలోగా వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఉందని, ఆ మేరకు వాక్సిన్‌ స్టోరేజీ, పంపిణీ ప్రక్రియ ముందే సిద్ధం చేసి ఉంచాలని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. కోవిడ్‌ ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా పని చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బందికి తొలి విడతగా వ్యాక్సిన్‌ వేయాలని నిర్ణయించింది.  

  • వ్యాక్సిన్‌ పంపిణీకి ఆస్పత్రుల్లో పనిచేస్తున్న ఆయాల నుంచి డాక్టర్ల వరకు అందరి వివరాలను ఇప్పటికే సేకరించింది.  
  • సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ నుంచి వ్యాక్సిన్‌ను చుట్టల్‌బస్తీ, బేగంబజార్, హరాజ్‌పెంట, శ్రీరాంనగర్‌ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లోని స్టోరేజ్‌ సెంటర్లకు తరలిస్తారు. అక్కడి నుంచి నేరుగా అవసరమైన వారి చెంతకు చేరుస్తారు.  
  • ఇప్పటికే కోల్డ్‌స్టోరేజీ బాక్సులు కూడా నగరానికి చేరుకున్నాయి. సాధారణ వ్యాక్సిన్‌ మాదిరే కోవిడ్‌ వాక్సిన్‌ను కూడా 2 నుంచి 8 డిగ్రీల వద్ద నిల్వ చేయనున్నారు.  
  • తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పని చేస్తున్న వైద్య సిబ్బంది 2.67 లక్షల మందిని గుర్తించగా...వీరిలో హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 76,804 మంది, రంగారెడ్డి జిల్లాలో 25,211 మంది, మేడ్చల్‌ జిల్లాలో 10,050 మందిని గుర్తించారు.  
  • గ్రేటర్‌ పరిధిలో 42 శాతం మంది ఉండగా, వీరిలో ఒక్క హైదరాబాద్‌ జిల్లాలోనే 28 శాతం ఉన్నట్లు అంచనా.   
  • రెగ్యులర్‌ వాక్సిన్లకు ఆటంకం కలగకుండా.. కోవిడ్‌ వాక్సినేషన్, పనితీరుపై జిల్లా స్థాయి వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి నేటి నుంచి రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వనుంది.  
  • డీఎంహెచ్‌ఓ, డీఐఓ, సహా పలువురు మెడికల్‌ ఆఫీసర్లకు తొలి విడత శిక్షణ ఇవ్వనుంది. ఆ తర్వాత వీరు కంప్యూటర్‌ ఆపరేటర్లు, పీహెచ్‌సీలో పని చేస్తున్న స్టాఫ్‌ నర్సులు, ఏఎన్‌ఎంలకు శిక్షణ ఇవ్వనున్నారు.  
  • పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో రెగ్యులర్‌ వాక్సినేషన్‌కు ఇబ్బంది లేకుండా బుధ, శనివారాలు మినహాయించి మిగిలిన రోజుల్లో కోవిడ్‌ వాక్సిన్‌ వేయనున్నారు. 
  • ఒక్కో ఏఎన్‌ఎం రోజుకు ఎంపిక చేసిన ప్రాంతంలో వంద మందికి కరోనా టీకా వేయాల్సి ఉంటుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement