![mathangi swarnalatha bhavishyavani ujjaini mahankali bonalu 2024](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/22/Swarnalatha-010.jpg.webp?itok=LLO0i2zR)
సాక్షి, హైదరాబాద్: బోనాల సందర్భంగా మహంకాళి ఆలయంలో రెండో రోజు భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులు వడి బియ్యం, చీరా సారెలతో అమ్మవారికి మొక్కులు సమర్పిస్తున్నారు.
మహంకాళి అమ్మవారి ఆలయానికి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చేరుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభం తో స్వాగతం పలికారు. భవిష్యవాణి రంగంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పాల్గొన్నారు. ఆషాడం ఆరంభం అవగానే గోల్కొండలో మొదలైన బోనాల పండుగ లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయంలో ముగుస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు.
‘రాష్ట్ర పండగ బోనాల పండగ ఎంతో వైభవంగా జరుగుతోంది. అన్ని విభాగాలు సహకారంతో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించగలిగాం. వచ్చే వారం లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాలకు సర్వం సిద్ధమైంది. విగ్రహం మార్పుపై ముఖ్యమంత్రితో చర్చించి దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటాం’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment