ujjaini mahankali bonalu
-
వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి రంగం ఊరేగింపు (ఫొటోలు)
-
మహంకాళి ఆలయంలో రెండో రోజు కొనసాగుతున్న భక్తుల రద్దీ
సాక్షి, హైదరాబాద్: బోనాల సందర్భంగా మహంకాళి ఆలయంలో రెండో రోజు భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులు వడి బియ్యం, చీరా సారెలతో అమ్మవారికి మొక్కులు సమర్పిస్తున్నారు. మహంకాళి అమ్మవారి ఆలయానికి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చేరుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభం తో స్వాగతం పలికారు. భవిష్యవాణి రంగంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పాల్గొన్నారు. ఆషాడం ఆరంభం అవగానే గోల్కొండలో మొదలైన బోనాల పండుగ లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయంలో ముగుస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్ర పండగ బోనాల పండగ ఎంతో వైభవంగా జరుగుతోంది. అన్ని విభాగాలు సహకారంతో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించగలిగాం. వచ్చే వారం లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాలకు సర్వం సిద్ధమైంది. విగ్రహం మార్పుపై ముఖ్యమంత్రితో చర్చించి దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటాం’అని అన్నారు. -
సికింద్రాబాద్ మహంకాళి బోనాల వేడుకల్లో ప్రముఖులు (ఫొటోలు)
-
ఉజ్జయినీ మహంకాళీ బోనాల ఉత్సవాల్లో అపశ్రుతి
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరలో అపశ్రుతి నెలకొంది. లష్కర్ బోనాల ఉత్సావాల్లో భాగంగా పలహార బండ్ల ఊరేగింపులో విద్యుత్ షాక్ తగిలి ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడిని కార్వాన్ ప్రాంతానికి చెందిన ఆకాష్గా(23) గుర్తించారు. మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన ఆకాష్.. ఆదివారం రాత్రి విద్యుత్ స్తంభాన్ని ముట్టుకోవడంతో షాక్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ మార్చురీ తరలించారు. కాగా నిన్న రాత్రి కురిసిన వర్షం కారణంగా కరెంట్ పోల్కు పవర్ రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు చారిత్రక సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర ఆదివారం వైభవంగా జరిగింది. సీఎం కేసీఆర్ దంపతులతో పాటు వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనాలు, సాక, తొట్టెలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సోమవారం మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమం జరిగింది. రంగంలో మాతంగి స్వర్ణలత భవిష్కవాణి వినిపించారు. ఈ ఏడాది అగ్ని ప్రమదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్వర్ణలత చెప్పారు. కాస్తా ఆలస్యమైనా మంచి వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రజలు ఎలాంటి భయందోళన చెందవద్దని అన్నారు. చదవండి: ఈటల, అర్వింద్కు భద్రత పెంపు.. కేంద్రం కీలక నిర్ణయం -
లష్కర్ బోనాల్లో కీలక ఘట్టం.. భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ లష్కర్ బోనాల్లో సోమవారం ఉదయం కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమం జరిగింది. రంగంలో మాతంగి స్వర్ణలత భవిష్కవాణి వినిపించారు. ఈ ఏడాది అగ్ని ప్రమదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్వర్ణలత చెప్పారు. కాస్తా ఆలస్యమైనా మంచి వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రజలు ఎలాంటి భయందోళన చెందవద్దని అన్నారు. రంగంలో భవిష్యవాణి వినిపిస్తూ.. మీరు చేసిన పూజలతో నేను సంతోషంగా ఉన్నాను. ఎలాంటి లోపం లేకుండా పూజలు అందుకున్నాను. అయిదు వారాల పాటు నన్ను ముత్తైదులందరూ భక్తిశ్రద్ధలతో కొలుచుకోవాలి. నైవేద్యాలు సమర్పించాలి. నా వద్దకు వచ్చిన వారిని చల్లగా చుసుకునే బాధ్యత నాది. 5 వారాలు నాకు సాక పోయండి నాయన. ఏది బయట పెట్టాలో ఏది పెట్టకూడదో నాకు మాత్రమే తెలుసు. గతేడాది నాకు మాట ఇచ్చి ఎందుకు మరిచిపోయారు. కావాల్సినంత బలాన్ని ఇచ్చాను. నేను మీతోనే ఉంటాను’ అని పేర్కొన్నారు. కాగా, రంగం కార్యక్రమం నేపథ్యంలో మహంకాళి ఆలయంలో భక్తులకు అమ్మవారి దర్శనం నిలిపివేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. భవిష్యవాణి వినేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. రంగం కార్యక్రమం పూర్తయిన తర్వాత మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. బోనాల సందర్భంగా ఉజ్జయిని మహంకాళి ఆలయానికి లక్షల మంది భక్తులు పోటెత్తారని, రాత్రంతా దర్శనాలు జరిగాయని చెప్పారు. సీఎం, మంత్రులు, వివిధ పార్టీల పెద్దలు ఆలయాన్ని దర్శించుకున్నారని తెలిపారు. అమ్మవారు భవిష్యవాణిలో బోనాలు కార్యక్రమం బాగా జరిగిందని చెప్పడం సంతోషకరమన్నారు. చదవండి: చేసే పనీ.. చేటు చేయొచ్చు.. ఉద్యోగాలతో అనారోగ్యాలు తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బోనాలకు అన్ని శాఖలు సహకరించాయని, వారందరికి ధన్యవాదాలు తెలిపారు. ఎటువంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు జరిగాయని అన్నారు. మరికాసేపట్లో పోతరాజుల ఊరేగింపు, ఘటోస్తవం ఘనంగా జరుగుతుందన్నారు. సాయంత్రం 7 గంటలకు మళ్ళీ ఫలహారం బండ్ల ఊరేగింపు జరుగుతుందని పేర్కొన్నారు. కాగా చారిత్రక సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర ఆదివారం వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ దంపతులతో పాటు వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనాలు, సాక, తొట్టెలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆదివారం ఉదయం 3.30 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబసభ్యులతో కలిసి దేవాలయానికి వచ్చారు. ఆయన సతీమణి స్వర్ణ అమ్మవారికి బోనం సమర్పించారు. మంత్రి మొదటి పూజ చేసిన అనంతరం 4.15 గంటలకు సాధారణ భక్తులను అనుమతించారు. పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. -
Bonalu 2023: వైభవంగా ఉజ్జయినీ మహంకాళి బోనాలు
రాంగోపాల్పేట్: చారిత్రక సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర ఆదివారం వైభవంగా జరిగింది. సీఎం కేసీఆర్ దంపతులతో పాటు వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనాలు, సాక, తొట్టెలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆదివారం ఉదయం 3.30 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబసభ్యులతో కలిసి దేవాలయానికి వచ్చారు. ఆయన సతీమణి స్వర్ణ అమ్మవారికి బోనం సమర్పించారు. మంత్రి మొదటి పూజ చేసిన అనంతరం 4.15 గంటలకు సాధారణ భక్తులను అనుమతించారు. పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం ముఖ్యమంత్రి కేసీఆర్ తన సతీమణితో కలిసి అమ్మవారిని దర్శించుకుని పట్టువ్రస్తాలు సమర్పించి పూజలు చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్, ఈవో గుత్తా మనోహర్రెడ్డి, వేద పండితులు, అర్చకులు పూర్ణ కుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, ఎంపీ కేకే తదితరులు కూడా సీఎంకు స్వాగతం పలికారు. సీఎం వెంట మంత్రులు ప్రశాంత్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎంపీ జోగినిపల్లి సంతోష్ వచ్చారు. కాగా హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, ఎంపీ కె.కేశవరావు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, దానం నాగేందర్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, కె.కవిత, మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డి, మాజీ ఎంపీలు వి.హన్మంతరావు, అంజన్కుమార్ యాదవ్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ కవిత బంగారు బోనంతో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయానికి వచ్చే సమయంలో విడిగా వచ్చిన కవిత, తిరిగి వెళ్లేటప్పుడు మాత్రం తల్లిదండ్రులతో కలిసి వెళ్లారు. పద్మారావు ఇంట్లో విందుకు సీఎం మహంకాళి అమ్మవారికి పూజలు చేసిన తర్వాత ముఖ్యమంత్రి నేరుగా టకారాబస్తీలోని డిప్యూటీ స్పీకర్ పద్మారావు నివాసానికి వెళ్లారు. ఆయన కుటుంబసభ్యులతో కలిసి బోనాల విందును ఆరగించారు. సీఎంతో పాటు ఆయన సతీమణి, మంత్రులు మల్లారెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్గౌడ్, ఎంపీ సంతోష్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, కవిత తదితరులు ఉన్నారు. -
సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి రంగం ఊరేగింపు (ఫొటోలు)
-
మీ తప్పుల వల్లే కుండపోత వర్షాలు కురిపిస్తున్నా
-
వర్షాల వల్ల ప్రజలు కొంత ఇబ్బంది పడతారు: స్వర్ణలత
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది బోనాల పండగ సందర్భంగా ఎన్ని కష్టాలు పడ్డా తనకు మొక్కులు చెల్లించారని మాతాంగి స్వర్ణలత మహంకాళి అమ్మవారి భవిష్యవాణి వినిపించారు. సోమవారం స్వర్ణలత ఉజ్జయిని మహంకాళి ఆలయంలోని రంగం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆమె అమ్మవారి భవిష్యవాణి వినిపిస్తూ.. ఎన్ని కష్టాలు పడ్డా నాకు మొక్కులు చెల్లించారని అన్నారు. వర్షాల వల్ల ప్రజలు కొంత ఇబ్బంది పడతారని చెప్పారు. ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటానని స్వర్ణలత అమ్మవారి భవిష్యవాణి చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అమ్మవారి భక్తులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఆదివారం వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనాలు, సాక సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. -
భక్తులు లేకుండా తొలిసారి అమ్మవారి బొనాల వేడుకలు
-
సాక పెట్టి సాగంగ... మొక్కులు తీరంగ
హైదరాబాద్: తెలతెలవారంగా... జనమంతా తరలంగా... సాక పెట్టి సాగంగా... మొక్కులు తీరంగా... డప్పుల దరువేయంగా... బొట్టుపెట్టి బోనమెత్తగా.. భక్తజనం హోరెత్తగా... లష్కర్ పోటెత్తగా... అమ్మా.. బైలెల్లినాదో..! మహంకాళి తల్లి బైలెల్లినాదో..! సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఆదివారం వైభవంగా సాగింది. లక్షలాదిమంది భక్తులు అమ్మవారికి బోనాలు, సాక సమర్పించి సల్లంగ చూడాలని మొక్కుకున్నారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచి భక్తులు అమ్మావారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. సాధారణ భక్తుల నుంచి ప్రముఖుల వరకు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రాన్ని సల్లంగా చూడాలని మొక్కుకున్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, హైకోర్టు న్యాయమూర్తి అమర్నాథ్ గౌడ్, ఎంపీలు రేవంత్రెడ్డి, రంజిత్రెడ్డి, బీబీ పాటిల్, ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, రాంచందర్రావు, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్రెడ్డి తదితరులు హాజరై అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు. అమ్మవారి వద్ద హారతి తీసుకుంటున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రులు ఇంద్రకరణ్, తలసాని ఓల్డ్దాస్ మండి నుంచి ఒక వాహనంలో బంగారు బోనంసహా 1008 బోనాలను మాజీ ఎంపీ కవిత, పలువురు భక్తులు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. భక్తుల బోనాలు.. పోతురాజుల విన్యాసాలు... సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలన్నీ పండుగ వాతావరణం నెలకొంది. భక్తుల రద్దీకి తోడు వీఐపీల తాకిడి పెరగడంతో సాధారణ భక్తులు తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ రద్దీని నియంత్రిస్తూ రాకపోకలపై భక్తులకు మార్గనిర్దేశం చేయాల్సిన పోలీసులు, ఇతర విభాగాల అధికారులు వీఐపీల సేవలో తరించిపోయారు. భక్తులు గంటల తరబడి క్యూలైన్లో నిలబడాల్సి రావడం, మంచినీరు, మూత్రశాలలు లేకపోవడంతో మహిళలు, చిన్నపిల్లలు ఇబ్బంది పడాల్సి వచ్చింది. తొలిపూజ చేసిన మంత్రి తలసాని అమ్మవారి బోనాల జాతరలో భాగంగా ఆదివారం ఉదయం 4 గంటలకు మంత్రి తలసాని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆయన సతీమణి అమ్మవారికి బోనం సమర్పించారు. అటు తర్వాత మంత్రి తొలిపూజ చేశారు. అనంతరం సాధారణ భక్తులకు అమ్మవారి దర్శనానికి అవకాశం కల్పించారు. మంత్రితోపాటు కార్పొరేటర్ అత్తెల్లి అరుణగౌడ్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ సురిటి కృష్ణ కుటుంబసభ్యులు ఉన్నారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. -
ఉజ్జయినీ మహంకాళిని దర్శించుకున్న కేసీఆర్
రాంగోపాల్పేట్: చారిత్రక సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజల్లో పాల్గొన్నారు. అంతకుముందు తెల్లవారుజాము 4 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆది, సోమవారాల్లో జరిగే బోనాలు, రంగం వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవెందర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. జాతర నేపథ్యంలో రెండువేల మంది సిబ్బందితో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. సీసీటీవీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. అమ్మవారికి శాక, ఫలహారపు బండ్లు, తొట్టెల ఊరేగింపు, పోతురాజుల విన్యాసాలు, బలిగంప, గావు పట్టడం, అంబారీ ఊరేగింపు వంటి ప్రధాన ఘట్టాలు రెండు రోజులపాటు కొనసాగుతాయి. గతేడాది ఘటోత్సవం నుంచి రంగం వరకు 15 రోజుల పాటు 20 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా ఈ ఏడాది ఆ సంఖ్య 25 లక్షలు దాటే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు రోజుల్లోనే కనీసం 5 లక్షల మందికి పైగా దర్శనానికి వస్తారని భావిస్తున్నారు. దీంతో భక్తుల రద్దీకి అనుగుణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. -
బోనాల జాతర షురూ
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్లో ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి మినీ జాతర శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఉదయం అయిదు గంటల నుంచే భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు ఒడిబియ్యం సమర్పించారు. పోతురాజుల నృత్యాలతో అమ్మవారి ఊరేగింపు ఘనంగా జరిగింది. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కాగా బోనాలకు ముందు వచ్చే శుక్రవారాన్ని మినీ జాతరగా పిలుస్తారు. పాతబస్తీలో మొదలైన సందడి మరోవైపు పాతబస్తీలోని లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి దేవాలయంలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. జీఎచ్ఎంసీ కమిషనర్ దాన కిశోర్, నగర పోలీస్ కమిషనర్ అంజని కుమార్ కలశ స్థాపన ద్వారా ఉత్సవాలను ప్రారంభించారు. ఉత్సవాల నిర్వహణ కోసం జీహెచ్ఎంసీ రూ. 25 కోట్లు కేటాయించింది. బోనాలు జరిగే ఆలయాల వద్ద శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. -
రంగం చెబుతున్న స్వర్ణలత
-
ఉజ్జయిని మహంకాళి జాతరలో కీలక ఘట్టం
-
మహంకాళికి గానాభిషేకం
-
అమ్మవారికి బంగారు బోనం తీసుకొచ్చిన ఎంపీ కవిత
-
ఘనంగా లష్కర్ బోనాల సంబరాలు
-
ఉజ్జాయిని మహంకాళీ అమ్మవారికి బంగారు బోనం
-
జులై 15 నుంచి బోనాల ఉత్సవాలు ప్రారంభం
-
పోగొట్టుకున్న ఐఫోన్ యువతికి అప్పగింత
హైదరాబాద్ (రాంగోపాల్పేట్): ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరలో ఓ యువతి పోగొట్టుకున్న పర్సును దక్కన్ మానవ సేవా సమితి ప్రతినిధులు దాన్ని తిరిగి ఆమెకు అప్పగించారు. గత సోమవారం శివాజీనగర్కు చెందిన స్నేహలత అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చి పొరపాటున తన పర్సును పోగొట్టుకుంది. అందులో రూ.30 వేలకు పైగా విలువ చేసే ఐఫోన్, రూ.3 వేల నగదు, ఏటీఎం, క్రెడిట్ కార్డులు, పాన్కార్డు ఉన్నాయి. ఈ పర్సు దేవాలయం వద్ద విధుల్లో ఉన్న దక్కన్ మానవ సేవా సమితి ప్రతినిధికి దొరికింది. దీంతో పర్సులో ఉన్న మొబైల్ నంబర్ల ఆధారంగా ఫోన్లు చేసి సంప్రదించి, యువతి స్నేహలతకు బుధవారం రాత్రి ఐఫోన్, పర్సు అందజేశారు. దక్కన్ మానవ సేవా సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ శీలం ప్రభాకర్, ప్రతినిధులు, సీకే నర్సింగరావు, జ్ఞానేశ్వర్ తదితరులకు ఆ యువతి కృతజ్ఞతలు తెలిపింది. -
బోనాలలో జోగిని శ్యామల డ్యాన్స్
-
నేడు సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలు
హైదరాబాద్ : సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి బోనాలు నేడు. ఈ నేపథ్యంలో అమ్మవారికి ఆదివారం ఉదయం మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పట్టువస్త్రాలు సమర్పించారు. బోనాలు సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ రోజు ఉదయం 7.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. -
మహంకాళి బోనాలకు ఏర్పాట్లు పూర్తి
-
ఉజ్జయిని మహంకాళి బోనాల పోస్టర్ విడుదల
హైదరాబాద్: ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల పోస్టర్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు. పోస్టర్ విడుదల చేసిన తర్వాత మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది కూడా బోనాల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు. బోనాల ఉత్సవాలలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. -
ఉజ్జయిని మహంకాళి బోనాలు