ఈటల మల్లయ్య మృతిపట్ల మంత్రి కేటీఆర్‌ సంతాపం | Minister KTR Condoles Death of Etela Mallaiah | Sakshi
Sakshi News home page

ఈటల మల్లయ్య మృతిపట్ల మంత్రి కేటీఆర్‌ సంతాపం

Published Wed, Aug 24 2022 9:25 PM | Last Updated on Thu, Aug 25 2022 10:10 AM

Minister KTR Condoles Death of Etela Mallaiah - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తండ్రి మల్లయ్య(104) మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ సంతాపం తెలిపారు. ఈటల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించిన కేటీఆర్‌.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

కొంతకాలంగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్న మల్లయ్య మెదక్‌ జిల్లాలోని ఆర్‌వీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి బ్రెయిన్‌డెడ్‌తో తుదిశ్వాస విడిచారు. మృతుడు మల్లయ్యకు ముగ్గురు కుమారులు, ఐదుగురు కూతుళ్లు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement