
సాక్షి, నల్గొండ: నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ నిలబెట్టుకుంది. ఆ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి మరోసారి విజయం సాధించారు. ఆది నుంచి ఆధిక్యంలో కొనసాగిన ఆయన ఎట్టకేలకు తీన్మార్ మల్లన్నపై గెలుపొందారు. కాగా మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి విజయం సాధించిన విషయం తెలిసిందే. బీజేపీ అభ్యర్థి రామచందర్రావుపై ఆమె గెలుపొందారు.
Comments
Please login to add a commentAdd a comment