గవర్నర్‌ను కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు | Telangana Congress Leaders Meet Governor TamilSai | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ను కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు

Jun 25 2021 1:07 PM | Updated on Jun 25 2021 3:31 PM

Telangana Congress Leaders Meet Governor TamilSai - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గవర్నర్‌ తమిళసైను తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు శుక్రవారం కలిశారు. రాచకొండ పరిధిలో లాకప్‌డెత్‌పై గవర్నర్‌కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణలో రాజ్యాంగపరమైన స్వేచ్ఛ లేదని మండిపడ్డారు. మరియమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

మాజీ మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ, దళితులపై జరుగుతున్న దాడులపై గవర్నర్‌కు  వివరించామని తెలిపారు. తెలంగాణలో పోలీసులకు, టీఆర్ఎస్‌ నేతలకు తేడా లేదని వ్యాఖ్యానించారు. పోలీసులు.. టీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ఆచరణలో లేదని శ్రీధర్‌బాబు ధ్వజమెత్తారు.

చదవండి: తెలంగాణలో దళితుల ప్రాణాలకు విలువ లేదా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement