మొన్న పిల్లి.. నేడు ఆబోతు..  | Two Villagers Fight For Ox Settled With 50k Fine At Chilkur Huzurnagar | Sakshi
Sakshi News home page

మొన్న పిల్లి.. నేడు ఆబోతు.. 

Apr 12 2022 10:49 AM | Updated on Apr 12 2022 10:54 AM

Two Villagers Fight For Ox Settled With 50k Fine At Chilkur Huzurnagar - Sakshi

చిలుకూరు: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ పోలీసులు కొద్దిరోజుల క్రితం పిల్లిపోరును తీర్చగా, తాజాగా సోమవారం చిలుకూరు పోలీసులు ఓ ఆబోతు పంచాయితీని పరిష్కరించారు. చిలుకూరు మండలం సీతారాంపురం గ్రామస్తులు ఆరేళ్ల క్రితం రామాలయం నిర్మించి గుడిపేరిట ఓ ఆబోతును వదిలేశారు. నెల రోజులుగా అది కనిపించకపోవడంతో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఇటీవల చిలుకూరులో ఆ ఆబోతును గంగిరెద్దు మాదిరిగా ఆడిస్తుండటంతో గమనించిన గ్రామస్తులు పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. రెండు గ్రామాల పెద్దల సమక్షంలో పోలీసులు పంచాయితీ నిర్వహించారు. గంగిరెద్దులవారు రూ. 30 వేల జరిమానా చెల్లించి ఆబోతును అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement