వ్యభిచారం చేసైనా డబ్బులు తెమ్మన్నాడు.. | Wife Kills Husband | Sakshi
Sakshi News home page

వ్యభిచారం చేసైనా డబ్బులు తెమ్మన్నాడు..

Published Wed, Sep 11 2024 7:26 AM | Last Updated on Wed, Sep 11 2024 9:52 AM

Wife Kills Husband

వేధింపులు తాళలేక హత్య చేశా 

లంగర్‌హౌస్‌ హత్య కేసులో వీడిన మిస్టరీ 

అంగీకరించిన మృతుడి భార్య, నిందితురాలి అరెస్ట్‌  

లంగర్‌హౌస్‌: వ్యభిచారం చేసైనా సరే మద్యం తాగేందుకు డబ్బులు తేవాలని వేధిస్తున్నందునే స్వయంగా భార్యే భర్తను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. లంగర్‌హౌస్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ నెల 7న జరిగిన హత్య కేసును  ఛేదించిన పోలీసులు నిందితురాలిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

 ఇన్‌స్పెక్టర్‌ రఘుకుమార్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వనపర్తి జిల్లా, పెద్దమందడి గ్రామానికి చెందిన ముక్తార్‌ అహ్మద్, నసీంబేగం దంపతులకు కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మూడేళ్ల క్రితం ముక్తార్‌ లంగర్‌హౌస్‌ డ్రీమ్‌ కాలనీలో నిరి్మస్తున్న భవనానికి వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. పేకాటతో పాటు తాగుడుకు బానిసైనన ముక్తార్‌ తరచూ భార్యను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. ఈ నెల 7న సాయంత్రం మద్యం మత్తులో ఇంటికి వచ్చిన ముక్తార్‌ తనకు ఇంకా మద్యం  కావాలని అందుకు డబ్బులు కావాలని భార్యను వేధిచాడు. 

తన వద్ద డబ్బులు లేవని చెప్పడా వ్యభిచారం చేసైనా డబ్బులు తేవాలని రోడ్డుపైకి తోసేశాడు. దీంతో తలకు గాయమైన నసీంబేగం భర్తను అంతమొందించాలని నిర్ణయించుకుంది. షేక్‌పేట్‌ కల్లు కంపౌండ్‌కు వెళ్లి కల్లు తాగి వచి్చన ఆమె భవనంలో నిద్రిస్తున్న ముక్తార్‌పై బండరాళ్లతో దాడి చేసింది. అనంతరం అక్కడి నుంచి లంగర్‌హౌస్‌లోని దర్గాకు వెళ్లి దాక్కుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నసీం బేగంను అదుపులోకి తీసుకోగా తానే హత్య చేసినట్లు తెలిపింది. నిందితురాలిని అరెస్ట్‌ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement