26న జిల్లాస్థాయి వాలీబాల్‌, కబడ్డీ పోటీలు | - | Sakshi
Sakshi News home page

26న జిల్లాస్థాయి వాలీబాల్‌, కబడ్డీ పోటీలు

Published Sat, Feb 22 2025 1:10 AM | Last Updated on Sat, Feb 22 2025 1:10 AM

-

బొండపల్లి: ఈనెల 26న మండలంలోని కొత్తపాలెం గ్రామంలో శ్రీ కృష్ణమ్మ పేరంటాలు తల్లి మహోత్సవాలను పురస్కరించుకుని జిల్లా స్థాయి కబడ్డీ, వాలీబాల్‌ పోటీలతో పాటు ఎడ్లబళ్ల ప్రదర్శన పోటీలు, గుర్రపు స్వారీ పోటీలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు మాజీ వైస్‌ ఎంపీపీ బొడ్డు రాము, గ్రామ సర్పంచ్‌ బొడ్డు సత్యవతి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో విజేతలకు రూ.10వేలు, రూ.6వేలు, రూ.4 వేలు ప్రథమ, ద్వితీయ, తృతీయ పోటీల్లో విజేతలకు నగదు పారితోషకాలను అందజేయడంతో పాటు మధ్యాహ్నం భారీ అన్నసమారాధన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాల్లో ప్రజలు, పోటీదారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement