
అమ్మవారికి ఘటాల నివేదన
గరుగుబిల్లి మండలంలోని రావుపల్లి గ్రామంలో శ్రీ గట్టాలమ్మ ఆలయ పునః ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా మహిళలు ఆదివారం ఘటాలతో ఊరేగింపు
నిర్వహించారు. ఉదయం 5 గంటలకు మేళతాళాల నడుమ, మంగళ వాయిద్యాలతో పెద్ద సంఖ్యలో మహిళలు ఘటాలతో బారులు తీరారు. ఊరేగింపుగా గట్టాలమ్మ తల్లి ఆలయానికి తరలివెళ్లారు. ఉదయం 11 గంటలకు విగ్రహం, పూర్ణ కలశ ప్రతిష్ఠ మహోత్సవం భక్తుల నడుమ అత్యంత
వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ బొంతాడ మహేశ్వరరావు, గ్రామస్తులు పాల్గొన్నారు. – గరుగుబిల్లి
Comments
Please login to add a commentAdd a comment