
జాతీయస్థాయి ఖోఖో పోటీలకు తోండ్రంగి విద్యార్థిని
చీపురుపల్లిరూరల్(గరివిడి): దేశ రాజధాని న్యూడిల్లీలో జరగనున్న జాతీయస్థాయి ఖోఖో పోటీలకు తోండ్రంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని రౌతు జాహ్నవి ఎంపికై ంది. మే 1 నుంచి 5 వరకు జరగనున్న 68వ స్కూల్గేమ్స్ పోటీల్లో అండర్–19 విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున జాహ్నవి ప్రాతినిధ్యం వహించనుంది. ఈ క్రీడాకారిణి జనవరిలో చిత్తూరులో జరిగిన రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టులో స్థానం సాధించింది. ఈ సందర్భంగా జాహ్నవిని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె.రమేష్కుమార్, పీడీ సత్యనారాయణ అభినందించారు.