పులివాహనంపై వీరభద్రుడి విహారం | - | Sakshi
Sakshi News home page

పులివాహనంపై వీరభద్రుడి విహారం

Published Fri, Feb 28 2025 12:29 AM | Last Updated on Fri, Feb 28 2025 12:28 AM

పులివాహనంపై వీరభద్రుడి విహారం

పులివాహనంపై వీరభద్రుడి విహారం

రాయచోటి టౌన్‌: రాయచోటి వీరభద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం స్వామి వారు పులివాహనంపై ఊరేగారు. అర్చకులు ఉదయం స్వామి, అమ్మవారికి అభిషేకాలు జరిపారు.అనంతరం రంగు రంగుల పూలు, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించి ప్రత్యేకంగా పులివాహనంపై కొలువుదీర్చారు. రాయచోటి పురవీధుల్లో ఊరేగించారు. మార్కెట్‌ వీధి, గాంధీబజార్‌, కంసలవీధి, బ్రాహ్మణ వీధుల గుండా ఊరేగింపు కొనసాగింది. భక్తులు స్వామి, అమ్మవార్లకు కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.కార్యక్రమంలో ఈవో డీవీ రమణారెడ్డి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement