ఉద్యోగ భద్రత..వేతనాల పెంపు ఇతర సమస్యల పరిష్కారానికి చాలా నెలల నుంచి ఆందోళన చేపడుతున్నాం. మా సమస్యలను ప్రభుత్వానికి విన్నవించాం. సమస్యలు పరిష్కారం కాలేదు. తప్పని పరిస్థితుల్లో ఈ నెల 17న కలెక్టరేట్ వద్ద శాంతియుత నిరసన తెలుపుతున్నాం. అలాగే 24న జిల్లా కో ఆర్డినేటర్ కార్యాలయం వద్ద, 27న మంగళగిరిలోఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కార్యాలయం వద్ద విధులను బహిష్కరించి శాంతియుత నిరసన తెలపాలని రాష్ట్ర కమి టీ నిర్ణయించింది. – విజయ్, అధ్యక్షులు, జిల్లా ఎన్టీఆర్ వైద్య సేవ వైద్య మిత్రల యూనియన్