సమైక్య రాష్ట్రం కోసం నేడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించబోయే ఆమరణ దీక్షకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. లోటస్పాండ్లో ఇవాళ పదిన్నరకు ఆయన నిరాహారదీక్ష చేపట్టనున్నారు. దీక్షావేదికతోపాటు, దీక్షకు మద్దతుగా తరలివచ్చే అభిమానులు, కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పార్టీనేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎజెండాలు పక్కన పెట్టి ఎవరి జెండాలు వారు పట్టుకొని సమైక్య రాష్ట్రమే ఎజెండాగా అందరూ ముందుకు ఉరకాల్సిన సందర్భమిది. రాష్ట్రం ముక్కలు కాకుండా కాపాడుకోవడానికి రాజకీయాలకతీతంగా కదలాల్సిన చారిత్రక సందర్భమిది. జగన్ ఇచ్చిన ఈ పిలుపుతో సీమాంధ్రలో సమైక్య ఉద్యమం మహోధృతంగా కొనసాగుతోంది. ప్రాణం కాదు ప్రజలు ముఖ్యమంటూ నేటి నుంచి జగన్ ఆమరణ దీక్ష చేపట్టనున్నారు.