రాజీనామాలతో రాష్ట్రం సమైక్యంగా ఉంటుందనుకోనని కిల్లి కృపారాణి మళ్లీ పాత పాటే పాడారు. ఆమో గురువారం పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం కృపారాణి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని ప్రజలను మభ్య పెట్టడం సమంజసం కాదన్నారు.రాష్ట్రం సమైక్యంగా ఉంటుందంటే తాను రాజీనామా చేయటానికి సిద్ధంగా ఉన్నానన్నారు. సీడబ్ల్యూసీ తీర్మానానికి లోబడే వ్యవహరించాలని ఆమె అన్నారు. ఈ నెల 18, 19 తేదీల్లో జీవోఎంను కలుస్తామని కిల్లి కృపారాణి తెలిపారు. తుపాను బాధితుల కోసం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని సోనియా గాంధీని కోరినట్లు ఆమె తెలిపారు.
Oct 17 2013 12:06 PM | Updated on Mar 20 2024 3:51 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement