తమిళనాడుకు కేంద్రం సంక్రాంతి కానుక అందించింది. అక్కడి అన్ని పార్టీల నాయకులు ముక్తకంఠంతో కోరుతున్న 'జల్లికట్టు' ఆటకు అనుమతి మంజూరు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు శాఖ ఒక నోటిఫికేషన్ ద్వారా తెలిపింది. తమిళనాడులో జల్లికట్టుతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, పంజాబ్, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లో ఎడ్ల పందాలకు కూడా అనుమతి ఇచ్చింది. ప్రతియేటా సంప్రదాయంగా నిర్వహించుకునే ఈ ఆటలను ఇక ముందు కూడా నిర్వహించుకోవచ్చని, అయితే అందుకోసం జంతువుల పట్ల క్రూరంగా మాత్రం వ్యవహరించకూడదని నోటిఫికేషన్లో తెలిపారు.
Published Fri, Jan 8 2016 11:23 AM | Last Updated on Thu, Mar 21 2024 9:48 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement