nod
-
ఏబీ వెంకటేశ్వర్రావుకు కేంద్రం షాక్
న్యూఢిల్లీ: ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఏబీవీ పదవిలో ఉన్నపుడు పాల్పడిన అవినీతిపై ఏపీ ప్రభుత్వం సమర్పించిన వివరాలు పరిశీలించిన తర్వాత ఆయన ప్రాసిక్యూషన్కు కేంద్రం అనుమతిచ్చింది.దీంతో త్వరలో అవినీతి కేసులో ఏబీవీ ప్రాసిక్యూషన్ ప్రారంభం కానుంది. టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీప్గా పనిచేస్తున్నప్పుడు సెక్యూరిటీ పరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డాడంటూ ఏబీపై అవినీతి కేసు నమోదైంది. ఐపీఎస్ అధికారి కావడంతో ప్రాసిక్యూషన్కు కేంద్రం అనుమతి తప్పనిసరైంది. ఇప్పుడు అనుమతి రావడంతో విచారణకు లైన్ క్లియరైంది. -
భారత్లో జేవీలపై యాపిల్ ‘చైనా’ సంస్థల ఆసక్తి
న్యూఢిల్లీ: ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్కు సరఫరా చేసే చైనా సంస్థలు భారత్లోను తమ ప్లాంట్లను ఏర్పాటు చేయడంపై ఆసక్తిగా ఉన్నాయి. దేశీ కంపెనీలతో కలిసి జాయింట్ వెంచర్లను నెలకొల్పాలని భావిస్తున్నాయి. ఇందుకోసం అవి త్వరలోనే కేంద్రం అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. యాపిల్ ఇప్పటికే అనధికారంగా సరఫరాదారుల జాబితాను అందించిందని పేర్కొన్నాయి. ఆయా సంస్థలతో ఎలాంటి సమస్యలు లేనందున వాటి ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపే అవకాశం ఉన్నట్లు వివరించాయి. ప్రస్తుతం దాదాపు 5-7 శాతం యాపిల్ ఉత్పత్తుల తయారీ భారత్లో జరుగుతున్నాయి. -
తెలంగాణ: 2,391 కొత్త ఉద్యోగాలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లో మరిన్ని పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేసింది. ఇప్పటికే 9,096 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులివ్వగా... వీటి భర్తీకి సంబంధించిన ఏర్పాట్లను గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్ఈఐఆర్బీ) పూర్తి చేసింది. తాజాగా మరో 2,225 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులిచ్చింది. ఈమేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో బీసీ గురుకుల పాఠశాలలకు సంబంధించి 2,132 పోస్టులకుగాను ఐదు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేయగా... జనరల్ గురుకులాల పరిధిలో 93 ఉద్యోగాలకు మరో జీఓ జారీచేశారు. అలాగే, సమాచార, పౌరసంబంధాల శాఖ పరిధిలో 166 పోస్టుల భర్తీకి మరో జీవోను ఆర్థిక శాఖ జారీ చేసింది. గురుకులాల్లో బోధన పోస్టుల భర్తీ బాధ్యతలు టీఆర్ఈఐఆర్బీకి, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీని టీఎస్పీఎస్సీకి, స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీని టీఎంహెచ్ఎస్ఆర్బీకి అప్పగించింది. -
వైభవ్ జెమ్స్, కంకార్డ్ బయోటెక్ ఐపీవోలకు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: విశాఖపట్టణం కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించిన వైభవ్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్తోపాటు రేర్ ఎంటర్ప్రైజెస్కు పెట్టుబడులున్న కంకార్డ్ బయోటెక్ త్వరలో పబ్లిక్ ఇష్యూకి రానున్నాయి. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఆగస్ట్లో కంకార్డ్, సెప్టెంబర్లో వైభవ్ సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్ను దాఖలు చేశాయి. ఇతర వివరాలు చూద్దాం.. వైభవ్ జెమ్స్ బంగారు ఆభరణాల విక్రేత వైభవ్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ పబ్లిక్ ఇష్యూకి సెబీ అనుమతించింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 210 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్ సంస్థ గ్రంధి భారత మల్లికా రత్న కుమారి(హెచ్యూఎఫ్) 43 లక్షల షేర్లను ఆఫర్ చేయనున్నట్లు ప్రాస్పెక్టస్లో పేర్కొంది. ఈక్విటీ జారీ నిధులలో రూ. 12 కోట్లను 8 కొత్త షోరూముల ఏర్పాటుకు వినియోగించనుంది. రెండేళ్లపాటు ఇన్వెంటరీ కొనుగోలుకి మరో రూ. 160 కోట్లు కేటాయించనుంది. సాధారణ కార్పొరేట్ అవసరాలకు సైతం నిధులను వెచ్చించనుంది. బంగారం, వజ్రాలు, ప్లాటినం, వెండి ఆభరణాలను కంపెనీ విక్రయిస్తోంది. అంతేకాకుండా విశేష బ్రాండు ద్వారా ప్రీమియం జ్యువెలరీని అందిస్తోంది. కంకార్డ్ బయోటెక్ ఫెర్మంటేషన్ ఆధారిత బయోఫార్మాస్యూటికల్ ఏపీఐల తయారీ కంపెనీ కంకార్డ్ బయోటెక్ పబ్లిక్ ఇష్యూకి సెబీ అనుమతించింది. ఐపీవోలో భాగంగా పీఈ సంస్థ క్వాడ్రియా క్యాపిటల్కు చెందిన హెలిక్స్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ రూ. 2.09 కోట్లకుపైగా విలువైన షేర్లను విక్రయానికి ఉంచనుంది. కంకార్డ్లో దివంగత రాకేశ్ జున్జున్వాలా, ఆయన భార్య రేఖ ఏర్పాటు చేసిన రేర్ ఎంటర్ప్రైజెస్కు సైతం పెట్టుబడులున్నాయి. కంపెనీ ప్రధానంగా అంకాలజీ, యాంటీఫంగల్, యాంటీబాక్టీరియల్ తదితర ప్రత్యేక విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది. గుజరాత్లో మూడు తయారీ ప్లాంట్లను కలిగి ఉంది. 2022 మార్చికల్లా కంపెనీ 56 బ్రాండ్లతో 65 ప్రొడక్టులను రూపొందిస్తోంది. వీటిలో 22 ఏపీఐలు, 43 ఫార్ములేషన్లు ఉన్నాయి. వీటికి అదనంగా వివిధ దేశాలలో 120 డీఎంఎఫ్లను దాఖలు చేసింది.వైభవ్ జెమ్స్ ఐపీవోకు ఓకేకంకార్డ్ బయోటెక్కూ సెబీ అనుమతి -
3 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం
సాక్షి, అమరావతి: శాసనసభ సోమవారం మూడు బిల్లులను ఆమోదించింది. కార్పొరేట్, ఇతర పెద్ద కంపెనీలు రాష్ట్రంలో తమ ఫ్రాంచైజీలు, డీలర్లకు లైసెన్సు ఇచ్చేటప్పుడు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజులకు సంబంధించిన భారత (ఏపీ) స్టాంపు చట్ట సవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది నియామకంలో ఏకరూపత ఉండేలా సంబంధిత కమిటీల్లో ఉన్నత విద్య, ఆర్థిక శాఖాధికారులను నియమించేందుకు ఉద్దేశించిన ఏపీ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లును, క్యాంపస్ల వారీగా ఉన్న నియామక ప్రక్రియ, రోస్టర్ నిర్ణయాన్ని యూనివర్సిటీ ప్రాతిపదికగా చేసే అధికారాన్ని రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయానికి దఖలుపరిచే సవరణ బిల్లును సభ ఆమోదించింది. కాగా, మరో ఐదు బిల్లులను మంత్రులు సభలో ప్రవేశపెట్టారు. ఏపీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ చట్ట సవరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. ఏపీ సర్వే, సరిహద్దుల చట్ట సవరణ బిల్లు, ఏపీ భూమి హక్కులు, పట్టాదార్ పాస్ పుస్తకాల చట్ట సవరణ బిల్లు, ఏపీ కౌలుదారీ (ఆంధ్ర ప్రాంత) రద్దు చట్ట సవరణ బిల్లును రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఏపీ కో–ఆపరేటివ్ సొసైటీల చట్ట సవరణ బిల్లును వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి ప్రవేశపెట్టారు. మండలిలో నాలుగు బిల్లులు ఆమోదం అసెంబ్లీలో ఆమోదించిన నాలుగు బిల్లులను శాసన మండలిలో సభ్యులు ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ (సవరణ) బిల్లు–2022, ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (సవరణ) బిల్లు–2022, ఆంధ్రప్రదేశ్ సివిల్ సరీ్వసెస్ (డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ట్రిబ్యునల్) (రద్దు) బిల్లు–2022, ఆంధ్రప్రదేశ్ (వ్యవసాయ ఉత్పత్తి, పశువుల) మార్కెట్లు (సవరణ) బిల్లు–2022లను మండలి ఆమోదించింది. ఇదీ చదవండి: ఏపీ అసెంబ్లీకి ఫోన్ ట్యాపింగ్ హౌస్ కమిటీ నివేదిక -
ఎన్డీటీవీ వాటా కొనుగోలు: కొనసాగుతున్న వివాదం
న్యూఢిల్లీ: ఎన్డీటీవీలో గల వాటాను గతంలో ఐటీ అధికారులు తాత్కాలిక అటాచ్మెంట్ చేపట్టిన నేపథ్యంలో ఈక్విటీ మార్పిడికి ఐటీ శాఖ నుంచి అనుమతులు పొందవలసి ఉంటుందని ప్రమోటర్ గ్రూప్ సంస్థ ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్ తాజాగా పేర్కొంది. ఇందుకు ఆదాయపన్ను శాఖ అధికారులకు దాఖలు చేస్తున్న అప్లికేషన్కు జత కలవమంటూ అదానీ గ్రూప్ సంస్థ వీసీపీఎల్ను ఆహ్వానించింది. అయితే ఈ వివాదాన్ని వీసీపీఎల్ తప్పుపట్టింది. చెల్లించని రుణాలకుగాను వారంట్లను వెనువెంటనే ఈక్విటీగా మార్పు చేయమంటూ ఆర్ఆర్పీఆర్ను మరోసారి డిమాండ్ చేసింది. వారంట్లను ఈక్విటీగా మార్చుకోవడం ద్వారా ఆర్ఆర్పీఆర్లో వీసీపీఎల్ 99.5 శాతం వాటాను పొందేందుకు నిర్ణయించుకుంది. తద్వారా మీడియా సంస్థ ఎన్డీటీవీలో ఆర్ఆర్పీఆర్కుగల 29.18 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు ప్రకటించింది. దీంతో ఎన్డీటీవీ వాటాదారుల నుంచి మరో 26 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్ను సైతం ప్రకటించింది. ఇందుకు షేరుకి రూ. 294 ధరలో రూ. 493 కోట్లు వెచ్చించేందుకు సన్నాహాలు చేసిన సంగతి తెలిసిందే. -
విక్రమ్ సోలార్ ఐపీవోకు సెబీ గ్రీన్సిగ్నల్
న్యూఢిల్లీ: దేశీ మాడ్యూల్ తయారీ కంపెనీ విక్రమ్ సోలార్ పబ్లిక్ ఇష్యూకి క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అను మతి లభించింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 1,500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 50 లక్షల షేర్లను వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. స్టాక్ ఎక్స్చేంజీల లిస్టింగ్కు వీలుగా కంపెనీ మార్చిలో సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. కంపెనీ సోలార్ ఫొటోవోల్టాయిక్ మాడ్యూల్స్ తయారీసహా.. సమీకృత సోలార్ ఎనర్జీ సొల్యూషన్స్ అందిస్తోంది. ఈక్విటీ జారీ నిధులను 2,000 మెగావాట్ల సామర్థ్యంగల సమీకృత సోలార్ సెల్, సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ ఏర్పాటుకు వినియోగించనుంది. 2021 డిసెంబర్కల్లా రూ. 4,870 కోట్ల విలువైన ఆర్డర్బుక్ను కలిగి ఉంది. -
ఆర్ఆర్ఆర్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
-
అద్దె ఇళ్ళు: మోడల్ టెనెన్సీ యాక్ట్కు గ్రీన్ సిగ్నల్
సాక్షి,న్యూఢిల్లీ: మోడల్ టెనెన్సీ యాక్ట్ను కేంద్ర మంత్రివర్గం బుధవారం అమోదించింది. అద్దె ఇళ్ల కొరతను పరిష్కరించేందుకు కొత్త వ్యాపార వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. తద్వారా ప్రైవేటు భాగస్వామ్యంతో అద్దె ఇళ్ల వ్యాపార రంగానికి నాంది పలికింది. తాజా చట్టం ఆధారంగా ఇప్పటికే ఉన్న అద్దె చట్టాలను తగిన విధంగా సవరించేందుకు వీలుగా అన్ని రాష్ట్రాలు. కేంద్రపాలిత ప్రాంతాలకు దీన్ని పంపనుంది. అన్ని రకాల ఆదాయవర్గాలకు తగిన అద్దె ఇళ్లను అందుబాటులోకి తేవడం తోపాటు, అద్దె ఇళ్ల మార్కెట్ను స్థిరీకరించడం లక్ష్యంగా కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఖాళీగా ఉన్న భవనాలను అద్దెకు ఇచ్చే వెసులుబాటుతో పాటు ప్రైవేటు రంగానికి వ్యాపారావకాశాలను కల్పించేదిగా ఉపయోగపడనుంది. దేశవ్యాప్తంగా అద్దెగృహాలకు సంబంధించి చట్టపరమైన చట్రాన్నిసరిదిద్దడంలో సహాయపడుతుందని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. అన్ని ఆదాయ వర్గాలకు తగిన అద్దె హౌసింగ్ స్టాక్ను రూపొందించడానికి ఈ చట్టం దోహదపడుతుందని, తద్వారా నిరాశ్రయుల సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వం తెలిపింది.అద్దె గృహాలను క్రమంగా అధికారిక మార్కెట్ వైపుకు మార్చడం ద్వారా, మగృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. 2019 లో కేంద్రం "మోడల్ అద్దె చట్టం" ను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం అధికారిక అద్దె ఒప్పందం అవసరం, ఎంత సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి, అద్దె పెరుగుదల రేటు, తొలగింపుకు కారణాలు వంటి అంశాలను ఇది పరిష్కరిస్తుంది. అలాగే అద్దెను సవరించడానికి మూడు నెలల ముందు భూ యజమాని వ్రాతపూర్వకంగా నోటీసు ఇవ్వాలి. అంతేకాకుండా, అద్దెదారు ముందుగానే చెల్లించాల్సిన సెక్యూరిటీ డిపాజిట్ చట్టం ప్రకారం గరిష్టంగా రెండు నెలలు. అద్దెదారుతో వివాదం జరిగితే యజమాని విద్యుత్, నీటి సరఫరాను కట్ చేయలేడు. దీంతోపాటు మరమ్మతులు చేయటానికి లేదా ఇతర అవసరాలకు 24 గంటల ముందస్తు నోటీసు లేకుండా యజమాని అద్దె ప్రాంగణంలోకి ప్రవేశించలేడని కూడా ఈ చట్టంలో పొందుపరిచారు. చదవండి: Vaccination : గుడ్న్యూస్ చెప్పిన డీసీజీఐ Sun Halo: అందమైన రెయిన్బో.. ట్విటర్ ట్రెండింగ్ -
రెమ్డెసివిర్ : మైలాన్కు అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా నివారణకు ఉపయోగించే యాంటీ వైరల్ ఔషధం ‘రెమ్డెసివిర్’ తయారీ, మార్కెట్ చేయడానికి ఫార్మాస్యూటికల్ మేజర్ మైలాన్ లాబ్స్కు అనుమతి లభించింది. అమెరికా పార్మా దిగ్గజం గిలియడ్ సైన్సెస్కు చెందిన ఈ ఔధషం తయారీకి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) మైలాన్కు అనుమతి ఇచ్చిందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. (కరోనా టీకా: మరో కీలక అడుగు) కరోనాతో ఆసుపత్రిలో చేరిన రోగులకు అత్యవసర వినియోగానికి మాత్రమే ఉపయోగించాలన్న ఆంక్షలతో యాంటీ-వైరల్ డ్రగ్ రెమ్డెసివిర్ తయారీకి, మార్కెటింగ్కు మైలాన్కు అవకాశం దక్కింది. తాజా అనుమతితో ఔషధ తయారీకి మైలాన్ శరవేగంగా సన్నద్ధమవుతోంది. దీంతో దేశంలో మూడు కంపెనీలకు ఈ ప్రయోగాత్మక ఔషధాన్ని తయారు చేసి విక్రయించే అధికారం లభించింది. మిగతా రెండు కంపెనీలు హెటిరో, సిప్లా. (కరోనా కీలక మందు : అమెరికా అద్భుత డీల్) కాగా గిలియడ్ సైన్సెస్ యాంటీ-వైరల్ డ్రగ్ రెమ్డెసివిర్ మార్కెటింగ్కు సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ అనుమతి ఇచ్చింది. దీంతో రెమ్డెసివిర్ను తయారు చేసి పంపిణీ చేయడానికి మైలాన్తో పాటు సిప్లా, జూబిలెంట్ లైఫ్ సైన్సెస్, హెటిరో, బీఆర్డీ అనే ఐదు ఫార్మా సంస్థలతో గిలియడ్ నాన్-ఎక్స్క్లూజివ్ స్వచ్ఛంద లైసెన్సింగ్ ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. -
కొత్త ఏడాదిలో పేటీఎంకు భారీ ఊరట
సాక్షి, న్యూడిల్లీ: 2019 కొత్త ఏడాది ఆరంభంలో పేమెంట్ సేవల సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు భారీ ఊరట లభించింది. గత ఏడాది నిలిచిపోయిన బిజినెస్ను పునఃప్రారంభించుకునేందుకు రిజర్వ్బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈవాలెట్లను తెరుచుకునేందుకు, కొత్త కొస్టమర్ల నమోదుకు అనుతినిచ్చింది. దీంతో తన బ్యాంకింగ్ సేవలను మరింత మెరుగుపరచడానికి సంబంధిత వినియోగదారుల కేవైసీ ప్రాసెస్ను ప్రారంభించాలని యోచిస్తోంది. వన్9 కమ్యూనికేషన్స్, విజయ్శేఖర్ శర్మ సహ యాజమాన్యంలోని పేటీఎం బ్యాంకులో కెవైసీ నిబంధనలు ఉల్లంఘనల ఆరోపణలతో గత ఏడాది జూన్లో కొత్త కస్టమర్లను నమోదును ఆర్బీఐ నిలిపివేసింది. అలాగే బ్యాంక్ సీఈవో రేణు సత్తిని తొలగించి, కొత్త సీఈవో, ఎండీగా సతీష్ గుప్తాను నియమించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దాదాపు 32 సంవత్సరాల అనుభవం కలిగిన సతీష్ గుప్తా ఒక అనుభవజ్ఞుడైన బ్యాంకరు. నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తో చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. కాగా పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో సుమారు 42 మిలియన్ల ఖాతాలుండగా, 2019 చివరి నాటికి100మిలియన్ల వినియోగదారులను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
బ్యాంకు సీఈవోకు ఎక్స్టెన్షన్ : షేరు ఢమాల్
సాక్షి, ముంబై: ప్రముఖ ప్రయివేటు బ్యాంకు ఎస్ బ్యాంకు షేరు భారీ పతనాన్ని నమోదు చేసింది. శుక్రవారం 7శాతం వరకూ నష్టపోయి 8వారాల కనిష్టానికి చేరుకుంది. సీఈవో రాణా కపూర్ పదవిలో కొనసాగేందుకు ఆర్బీఐ ప్రస్తుతానికి అనుమతించినట్లు వార్తలు వెలువడినప్పటికీ ఎస్బ్యాంక్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకోవడం గమనార్హం. ఆరంభంలోనే 5శాతం నష్టంతో టాప్ విన్నర్గా నిలిచింది. అమ్మకాలు మరింత పెరగడంతో ఎస్బ్యాంకు షేరు 7శాతం వరకూ రూ.338.00ల స్థాయికి పతనమైంది. అనంతరం కొద్దిగా కోలుకుని 6శాతం నష్టాలకు పరిమితమైంది. ముఖ్యంగా బ్యాంకు సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్గా రాణా కపూర్ పదవీకాలాన్ని మరో మూడేళ్లు పొడిగించేందుకు ఆర్బీఐ అనుమతి లభించినట్టు ఎస్ బ్యాంకు తెలిపింది. తదుపరి నోటీస్ ఇచ్చేటంతవరకూ రాణా కపూర్ను సీఈవో, ఎండీగా కొనసాగనున్నారని గురువారం మార్కెట్ ముగింపు అనంతరం స్టాక్ఎక్చ్సేంజ్లకు సమాచారం ఇచ్చింది. అయితే విశ్లేషకులు మాత్రం సీవోఈ పునర్నిమాయకం చుట్టూ వివాదాలున్నట్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఎస్ బ్యాంకు వ్యవస్థాపక సీఈవోగా రాణా కపూర్ 2004 నుంచీ కొనసాగుతున్నారు. సీఈవోగా ఆయన పదవీ కాలం నేటితో(ఆగస్టు 31) ముగియనుంది. ఈ ఏడాది జూన్లో యస్ బ్యాంక్ వాటాదారులు మరో మూడేళ్లపాటు కపూర్ పదవిలో కొనసాగేందుకు అనుమతించారు. -
లోకసభకు సప్లిమెంటరీ డిమాండ్ గ్రాంట్
సాక్షి, న్యూఢిల్లీ: రెండవ సప్లిమెంటరీ డిమాండ్ (ఆఫ్ గ్రాంట్)ను బీజేపీ ప్రభుత్వం సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. రూ. 33,380 కోట్లు నికర వ్యయానికి గాను పార్లమెంటు ఆమోదం కోసం సభ ముందు వచ్చింది. మార్చి, 2018 నాటికి కొత్త ఆర్థిక సంవత్సరంలో అదనపు వ్యయం కేటాయింపుల ఆమోదం కోసం పార్లమెంటు దిగువ సభముందు ఉంచింది. ఈ మేరకు గ్రాంట్ను కోరుతూ రెండవ సప్లిమెంటరీ డిమాండ్ (ఆఫ్ గ్రాంట్)ను ప్రవేశపెట్టారు. రూ. 33,380 కోట్ల వ్యయానికి అనుమతిని కోరినట్టు ఆర్థికమంత్రిత్వ శాఖ వెల్లడించింది. -
టాటా సన్స్ ప్రైవేటీకరణకు ఇన్వెస్టర్ల ఆమోదం
సాక్షి, ముంబై: టాటా గ్రూపు సంస్థల ప్రమోటర్ టాటాసన్స్..పబ్లిక్ లిమిటెడ్ కంపెనీనుంచి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా అవతరించేందుకు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గురువారం జరిగిన ఏజీఎంలో ఇన్వెస్టర్లు ఆమోదం తెలిపారు. టాటా సన్స్ వాటాదారుల సర్వ సభ్య సమావేశం (ఏజీఎం) లో ఈ మేరకు ఆమోదం లభించిందని తెలిపింది. అన్ని తీర్మానాలకు మెజారీటీ వాటాదారులు ఆమోదం తెలిపారని టాటా సన్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది. దీనికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదం లభిస్తే టాటా సన్స్ ప్రైవేటీకరణ ప్రక్రియ ముగిసినట్టే. మరోవైపు టాటా సన్స్ ప్రయివేటీకరణకు వ్యతిరేకిస్తూ టాటాసన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ పెట్టుకున్న పిటీషన్ను ఎన్సీఎల్ఏటీ తిరస్కరించింది. అయితే మిస్త్రీ సంస్థలకు కనీస వాటాదారుల ప్రమాణాల నుంచి మినహాయింపు ఇచ్చింది. ముంబై ఉన్సీఎల్ఏటీలో దరఖాస్తు చేసుకునేందుకు అనుమతినిచ్చింది. దీన్ని మిస్త్రీ స్వాగతించారు. కార్పొరేట్ గవర్నెన్స్ గరిష్ట ప్రమాణాలను కొనసాగించాలని, టాటా గ్రూపులో పారదర్శకత కాపాడాలని డిమాండ్ చేశారు. కాగా గత ఏడాది అక్టోబరు 24న అనూహ్యంగా టాటా సన్స్ చైర్మన్గా మిస్త్రీని పదవిని తొలగించింది. అలాగే ఫిబ్రవరి 6, 2017 న హోల్డింగ్ కంపెనీ బోర్డు డైరెక్టర్గా కూడా తొలగించిన సంగతి తెలిసిందే. -
ఇన్ఫోసిస్ ఎండీగా ప్రవీణ్ రావు కొనసాగుతారా?
న్యూఢిల్లీ: భారతీయ రెండవ అతిపెద్ద సాఫ్టవేర్ సేవల సంస్థ ఇన్ఫోసిస్ మధ్యంతర సీఈవో, ఎండీయుఎన్ ప్రవీణ్ రావును కొత్త మేనేజింగ్ డైరక్టర్గా నియమించేందుకు యోచిస్తోంది. ఆయన్ను ఈ పదవిలో కొనసాగించేందుకు షేర్హోల్డర్స్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తోంది. ఇటీవల సీఈవో, ఎండీగా ఉన్న విశాల్సిక్కా రాజీనామాతో కొత్త సీఎండీ ఎంపికకోసం ఇన్ఫోసిస్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు ప్రవీణ్ రావును తిరిగిఎన్నుకునేందుకు వాటాదారుల అనుమతి కోసం చూస్తోంది. ప్రవీణ్ కనీసం అయిదేళ్ల పాటు లేదా, కొత్త సీఈవో ఎంపిక చేసే దాకా మధ్యంతర సీఈవో అండ్ ఎండీ పదవిలో కొనసాగుతారని ఇన్ఫోసిస్ పోస్టల్ బ్యాలెట్ లో ప్రకటించింది. దీంతో సెప్టెంబరు 8 నుండి అక్టోబరు 7 వరకు పోస్టల్ బ్యాలట్పై వాటాదారులు ఓటు వేయాల్సి ఉంటుంది. అక్టోబర్ 9న గానీ, అంతుకుముందుగానీ ఫలితాలు ప్రకటించనుంది. దీంతోపాటుగా ఇన్ఫీ బోర్డులోకి ఇండిపెండెంట్ డైరెక్టర్ గా డి సుందరం నియామకంపై కూడా వాటాదారుల అనుమతిని కోరుతోంది. మరోవైపు విశాల్ సిక్కా స్థానాన్ని భర్తీ చేయడంలో పంచ శోధన ఈగోన్ జహేందర్ సహాయాన్ని అర్థించింది ఇన్ఫోసిస్. ఇన్ఫోసిస్లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అయిన రావు ఆగష్టు 18 న తాత్కాలిక సీఈవో , మేనేజింగ్ డైరెక్టర్గా నియమితుడయ్యారు. అలాగే ఇన్ఫోసిస్ ఎనిమిది సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్ నీలేకని నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా ఎంపికయ్యారు. అప్పటి చీఫ్ విశాల్ సికా సహ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణ మూర్తి తదితర వ్యవస్థాపకుల ఆరోపణల నేపథ్యంలో రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
అరబిందోకు యుఎస్ఎఫ్డీఏ బూస్ట్
న్యూఢిల్లీ: అమెరికాకు ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్డీఏ) అందించిన కిక్తో పార్మా కంపెనీ అరబిందో ఫార్మాకు స్టాక్మార్కెట్లో మంచి బూస్ట్ లభించింది. అమెరికా మార్కెట్లలో సవెల్మర్ కార్బొనేట్ మాత్రలను విడుదల చేసేందుకు తుది ఆమోదం లభించింది. కీలకమైన జనరిక్ డ్రగ్కు అనుమతి లభించడంతో బుధివారంనాటి మార్కెట్లో 8 శాతం ఎగిసి భారీ లాభాలను సాధించింది. మార్కెట్ ఆరంభంలోనే అరబిందో ఫార్మా కంపెనీ షేర్లు 8 శాతం పెరిగాయి. ఈ జంప్తో షేరు ఎనిమిది నెలల గరిష్టాన్ని తాకింది. ఎన్ఎస్ఇలో కంపెనీ షేర్లు 8.22 శాతం పెరిగి 794.70 కి చేరుకున్నాయి. వాల్యూమ్ విషయంలో, కంపెనీలో 4.63 లక్షల షేర్లను బిఎస్ఇలో వర్తకం చేశాయి, ఉదయం ట్రేడింగ్ సెషన్లో ఎన్ఎస్ఈ వద్ద 81 లక్షల షేర్లు చేతులుమారాయి. కిడ్నీల పనితీరును దెబ్బతీసే తీవ్ర వ్యాధుల చికిత్సకు సెవిలామిర్ ట్యాబ్లెట్ల విక్రయానికి తుది ఆమోదం లభించిందని కంపెనీ తెలిపింది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యుఎస్ఎఫ్డిఎ) నుంచి సవెల్మర్ కార్బొనేట్ టాబ్లెట్లను 800 మి.గ్రా. తయారీకి తుది ఆమోదం లభించిందని బీఎస్ఈ ఫైలింగ్లో అరబిందో ఫార్మా పేర్కొంది. డయాలిసిస్పై దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి రోగులలో సీరం ఫాస్ఫరస్ నియంత్రణ కోసం ఈ మాత్రలు ఉపయోపడనున్నాయి. కాగా ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో హైదరాబాద్ ఫార్మా సంస్థ అరబిందో కౌంటర్ జోరందుకోవడంతో పాటు ఇతర లుపిన్, క్యాడిల్లా హెల్త్కేర్, దివీస్లాంటి ఫార్మా షేర్లు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. -
యాంటీ-కొలెస్టరాల్ డ్రగ్పై సన్ ఫార్మాకు అనుమతి
న్యూఢిల్లీ: దేశీ హెల్త్కేర్ దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ పూర్తిగా యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అమెరికా హెల్త్ రెగ్యులేటర్ నుంచి యాంటీ-కొలెస్టరాల్ డ్రగ్ జెనెరిక్ వెర్షన్ టాబ్లెట్ కు ఆమోదం పొందింది. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేందుకు ఉపయోగించే జెటియా జెనెరిక్ వెర్షన్ ఎజిటిమీబీ మాత్రలకు యూఎస్ఎఫ్డీఏ అనుమతి లభించింది. రక్తంలో కొలెస్టరాల్ స్థాయిలను తగ్గించేందుకు వినియోగించే జెటియా ట్యాబ్లెట్లను అమెరికా మార్కెట్లో విక్రయించేందుకు తాజాగా అనుమతి లభించినట్లు కంపెనీ పేర్కొంది. సన్ ఫార్మా బిఎస్ఇ ఫైలింగ్ లోతెలిపింది. 10 మి.గ్రా. మాత్రలకు తుది ఆమోదం పొందినట్టు చెప్పింది. దీంతో సన్ ఫార్మా స్యూటికల్ ఇండస్ట్రీస్ స్టాక్ బిఎస్ఇలో 1.19 శాతం పెరిగింది. -
బిహార్ లిక్కర్ కంపెనీలకు ఊరట
న్యూఢిల్లీ: బిహార్ మద్యం తయారీదారులకు సుప్రీకోర్టు ఊరటనిచ్చింది. పాత నిల్వలను క్లియర్ చేసుకోవడానికి సంబంధించిన గడువును పొడిగిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. తమ స్టాక్లను రాష్ట్రం వెలుపల విక్రయించటానికి బీహార్లో మద్యం తయారీదారులకు, అమ్మకందారులకు అవకాశాన్నిచ్చింది. జులూ 31 వరకు సమయాన్ని మంజూరు చేసింది. ప్రస్తుత గడువును మరికొంత కాలం పొడిగించాల్సిందిగా పెట్టుకున్న పిటీషన్ను కోర్టు ఆమోదించింది. గిడ్డంగుల్లో పడివున్న ముడి పదార్థం సహా, పాత మద్యం స్టాక్స్ పారవేసేందుకు సమయం పొడిగించాలంటూ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అల్కహాలిక్ బెవరేజె కంపనీలు పెట్టుకున్న అర్జీపై జస్టిస్ ఎ.కె.సిక్రి నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ ఈ గడువును మంజూరు చేసింది. కాగా గత ఏడాది ఏప్రిల్ 1న నుంచి నితీష్ కుమార్ ప్రభుత్వం మద్యంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో విధించిన నిషేధం దృష్ట్యా వారు భారీ ఆర్ధిక నష్టాన్ని ఎదుర్కొంటున్నట్లు భారతీయ మద్య పానీయాల కంపెనీలు వాదించాయి. తమ దగ్గర సుమారు రూ. 200 కోట్ల విలువైన మద్యం ఉందని కాన్ఫెడరేషన్ నివేదించింది. ఈ నిల్వ ఉన్న మద్యాన్ని రాష్ట్రం వెలుపల విక్రయాలకు మే31 వరకు ఉన్నగడువును పొడిగించాల్సిందిగా కొంతమంది లిక్కర్ తయారీదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. -
'స్నాప్డీల్-ఫ్లిప్కార్ట్' డీల్కు నెక్సస్ ఓకే
ముంబై: అతిపెద్ద ఈ -కామర్స్ విలీనానికి సిద్ధమైన జపనీస్ బ్యాంకింగ్ దిగ్గజం సాఫ్ట్ బ్యాంక్ కీలకమైన అనుమతి సాధించింది. సాఫ్ట్బ్యాంక్ కో ఇన్వెస్టర్ నెక్సస్ వెంచర్ పార్టనర్స్ (ఎన్వీపీ) ఈ మెగాడీల్కు ఒకే చెప్పింది. ఈ విక్రయ ప్రణాళికతో ముందుకు వెళ్లడానికి ఎన్వీపీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవలే మరో ఫౌండర్ కలారీ అనుమతిని సాధించిన సాఫ్ట్ బ్యాంక్, స్నాప్డీల్ లో అతి పెద్దవాటాదారుగా ఈ అమ్మక ఒప్పందానికి మరింత చేరువైంది. ఆన్లైన్ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఈ వారంలో ఈ ఒప్పందంపై సంతకం చేసే అవకాశంది. అనంతరం వెంటనే ఈ డీల్ అమల్లోకిరానుంది. అయితే దీనిపై అధికారికంగా ఫ్లిప్కార్ట్, సాఫ్ట్బ్యాంక్ స్పందించాల్సిఉంది. తాజా నివేదికల ప్రకారం ఈ మెగాడీల్ ద్వారా స్నాప్డీల్ ఫౌండర్స్కు 25 మిలియన్ డాలర్లు దక్కనున్నాయి. మరోవైపు కొత్త సంస్థలో ఎన్వీపీ 100 మిలియన్ల డాలర్ల వాటా, కలారీకి సుమారు 70-80 మిలియన్ డాలర్లు దక్కనున్నాయి. కాగా 2016-17లో స్నాప్ డీల్ పెట్టుబడుల కారణంగా 1 బిలియన్ డాలర్లు(రూ.6,500కోట్లు) నష్టపోయినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. రెగ్యులేటరీ ఫైలింగ్స్ ప్రకారం, సాఫ్ట్బ్యాంక్ ప్రస్తుతం స్నాప్ డీల్లో 30 శాతం వాటా, నెక్సస్ సుమారు 10 శాతం వాటాను,కలారి 8 శాతం వాటాను కలిగి ఉంది. భారత ఈ కామర్స్ రంగంలో ఇది మెగాడీల్గా నిలవనుందని ,తీవ్రమైన పోటీ ఉండనుందని మార్కెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. అలాగే భారత ఈ కామర్స్ రంగంపై పట్టుబిగించేందుకు భారీ పెట్టుబడులతో పావులు కదుపుతున్న అమెరికా ఈ కామర్స్ దిగ్గజం, ప్రధాన ప్రత్యర్థి అమెజాన్కు ఫ్లిప్కార్ట్ గట్టిషాక్ ఇవ్వడం ఖాయమంటున్నారు. -
డిష్మ్యాన్ ఫార్మాకు యూఎస్ఎఫ్డీఏ బూస్ట్
న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం డిష్మ్యాన్ ఫార్మాకు అమెరికా డ్రగ్ రెగ్యులేటరీ యూఎస్ఎఫ్డీఏ బూస్ట్ ఇచ్చింది. కంపెనీకి చెందిన టెసారో మందుకు అనుమతిని మంజూరు చేసింది. కేన్సర్ చికిత్సకు వినియోగించే టెసారో జేజులా క్యాప్సూల్స్ విక్రయానికి యూఎస్ఎఫ్డీఏ అనుమతి లభించినట్లు మార్కెట్ ఫైలింగ్ లో వెల్లడించింది. కంపెనీ భాగస్వామ్య సంస్థ టెసారో ఔషధానికి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆల్ టైం హైని తాకింది. మంగళవారం నాటి మార్కెట్లో డిష్మ్యాన్ ఫార్మా కౌంటర్ 20శాతం దూసుకెళ్లి అప్పర్ సర్య్కూట్ని తాకింది. అమెరికా మార్కెట్లో ఈ ఔషధాన్ని విక్రయించే టెసారో అండాశయ క్యాన్సర్ ఔషధానికి యూఎస్ఎఫ్డీఏ అనుమతి లభించింది. క్యాన్సర్ నిరోధానికి సంబంధించి పరఫరా చేసే రెండు కంపెనీలలో ఒకటిగా డిష్మ్యాన్ నిలుస్తుందని ఎనలిస్టుల అంచనా. ఈ డీల్ కంపెనీకి చాలా లాభదాయకంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. సుమారు 40-80 మిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని భావిస్తున్నట్లు డోలట్ కాపిటల్ చెప్పింది. ఇప్పుటివరకు అందుబాటులో ఉన్న పార్ప్(పీఏఆర్పీ) నిరోధకంలో మొట్టమొదటి డ్రగ్ మంచి సామర్ధ్యాన్ని కలిగి ఉందని చెప్పారు. ఈ మందు క్యాన్సర్ సెల్స్ను చంపేసి, పార్ప్ అనే ప్రొటీన్ ను గణనీయంగా నిరోధిస్తుందట. తద్వారా డ్యామేజ్ అయిన డీఎన్ఏ పునరుద్ధరణుకు సాయం పడుతుంది. కాగా ఈ డ్రగ్ ఏప్రిల్ లో లాంచ్ కానుంది. -
ఆర్కాం-ఎయిర్సెల్ విలీనానికి సెబీ గ్రీన్ సిగ్నల్
ముంబై: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్కామ్) , ఎయిర్ సెల్విలీనానికి సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైర్లెస్ బిజినెస్ను విడదీసేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి లభించినట్లు ఆర్కాం తెలిపింది. ఈ మేరకు పథకం యొక్క ఆమోదం కోసం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముంబై బెంచ్ లో ఒక అప్లికేషన్ దాఖలు చేసినట్టు చెప్పింది. ప్రతిపాదిత బదలాయింపు ఇతర అవసరమైన ఆమోదం పొందాల్సి ఉందని ఆర్కాం పేర్కొంది. వైర్లెస్ బిజినెస్ను విడదీసి తద్వారా ఎయిర్సెల్ లిమిటెడ్, డిష్నెట్ వైర్లెస్ లిమిటెడ్లో విలీనం చేసేందుకు ప్రణాళికలు వేసింది. ఈ విలీనం ప్రకారం ఏర్పడే కొత్త సంస్థలో ఆర్కాం, ఎయిర్ సెల్ సమ భాగస్వామ్యాన్ని కలిగి ఉంటాయి. అలాగే దాదాపు 28,000 కోట్ల రుణాన్ని కూడా ఆర్ కామ్, ఎయిర్సెల్ చెరి సగం భరించాలి. ఇండియాలో వినియోగదారుల పరంగా టాప్-3 టెలికం సంస్థగా ఆవిర్భవించాలన్న యోచనలో ఆర్కాం ఈ విలీనానికి శ్రీకారం చుట్టింది. -
అరబిందో హెచ్ఐవీ-1 డ్రగ్ కు తాత్కాలిక అనుమతి
ముంబై: డ్రగ్ మేజర్ అరబిందో ఫార్మాకు హెచ్ఐవీ చికిత్స లో ఉపయోగించే మందుకు తాత్కాలిక అనుమతి లభించింది. 'డొల్యూట్గ్రేవిర్ 50 ఎంజీ' పేరుతో ఉత్పత్తి అవుతున్న తమ ఔషధానికి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ ఎడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ) టెంటేవివ్ అప్రూవల్ లభించి నట్లు అరబిందో ఫార్మా బీఎస్ ఈ ఫైలింగ్ లో పేర్కొంది. అనుమతి పొందిన ఈ ఏఎన్డీఏ... హెచ్ఐవీ-1 చికిత్సకు వినియోగించే టివికే ఔషధానికి సమానస్థాయిదని కంపెనీ పేర్కొంది. ఇతర వైరల్ ఏజెంట్లతో దీన్ని వాడతారని తెలిపింది. వివ్ హెల్త్కేర్తో 92 లైసెన్స్ డ్ దేశాల్లో ఈ డ్రగ్ ను సరఫరా చేసేందుకు గాను 2014 లో లైసెన్సింగ్ ఒప్పందంపై సంతకాలు చేసినట్టు అరబిందో తెలిపింది. దీనికి స్థానిక రెగ్యులేటరీ అనుమతి అవసరం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో అరబిందో షేర్లు దాదాపు 5 శాతం లాభపడ్డాయి. -
యాపిల్ రీటైల్ స్టోర్లకు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: వాల్డ్ వైడ్ ఫేమస్ యాపిల్ ఫోన్లకు భారతదేశంలో కష్టాలు ఇక తగ్గనున్నట్టే కనిపిస్తోంది. ఇక స్వదేశీ స్టోర్లలో త్వరలోనే ఈ క్రేజీ ఫోన్లు లభ్యం కానున్నాయి. యాపిల్ సీఈవో టిమ్ కుక్ భారత పర్యటన నేపథ్యంలో ఈ ముఖ్యమైన పరిణామం చేసుకుంది. పూర్తిగా సొంతమైన రీటైల్ స్టోర్ల ఏర్పాటుకోసం యాపిల్ పెట్టుకున్న ప్రతిపాదనకు కండిషన్లతో కూడిన ఆమోదం లభించింది. ఈ మేరకు ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డ్ (ఎఫ్ఐపీబీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పూర్తిగా సొంతమైన రీటైల్ స్టోర్ల ఏర్పాటుకోసం చేసిన ఆపిల్ ప్రతిపాదనను అంగీకరించిన విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు కచ్చితమైన షరతులతో ఆమోదం తెలిపింది. ఈ వార్తలను ప్రభుత్వ అధికారి ఒకరు మీడియాకు ధృవీకరించారు. లోకల్ సోర్సింగ్ సంస్థలకు 30 శాతం భాగస్వామ్యం కల్పించాలనే షరతు పెట్టిందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దీనికి సంబంధించిన ప్రకటన మరో రెండు రోజుల్లో వెలువడనుందని కూడా ఆయన ధృవీకరించారు. ప్రస్తుత డీఐపీనీ నియమాల ప్రకారం సింగిల్ బ్రాండ్ రిటైలింగ్ కోసం, స్థానిక ఉత్పత్తులకు 30 శాతం చోటు కల్పించాలనే నిబంధన ఉంది. అలాగు మల్టీ బ్రాండ్ రిటైల్ రంగంలో 51 శాతం, ప్రత్యేక పరిస్థితుల్లో కనీసం 30 శాతం భాగస్వామ్యం కల్పించాల్సి ఉంటుంది. వరకు అనుమతి ఉంది. ఈ మేరకు యాపిల్ మినహాయింపు నిచ్చిన ప్యానెల్ యాపిల్ స్టోర్ల ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. కాగా గత వారం ఆపిల్ ను ఇండియాలో ముందుకు తీసుకుపోవడమే లక్ష్యం ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇండియాలో పర్యటించారు. భారత్లో దీర్ఘకాలంపాటు వ్యాపార కార్యకలాపాలను కొనసాగించాలనుకుంటున్నామనీ, వచ్చే వెయ్యేండ్లపాటు సంస్థ సేవలందించనున్నామని ప్రకటించారు. రిటైల్ విక్రయాల విషయంలో యాపిల్కు మెరుగైన భవిష్యత్ ఉందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
జల్లికట్టుకు కేంద్ర సర్కారు ఓకే!
-
కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
-
పోలీసుల నిర్ణయాన్ని తోసిపుచ్చిన హైకోర్టు