ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఛత్తీస్గఢ్ చేరుకున్నారు. రాజధాని నయా రాయ్పూర్ నిర్మాణాన్ని పరిశీలించేందుకు చంద్రబాబు ఇక్కడి వచ్చారు. ఆయన వెంట మంత్రులు, అధికారులు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్తో చంద్రబాబు సమావేశమవుతారు. ఏపిలో రాజధాని నిర్మాణం కోసం దేశవిదేశాలలో పలు పట్టణాలను పరిశీలిస్తున్న నేపధ్యంలో మంత్రుల బృందం నయా రాయ్పూర్ను సందర్శించనుంది.