పీసీసీ మాజీ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నేత డి.శ్రీనివాస్ శుక్రవారం యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశం అయ్యారు. కాంగ్రెస్ కోర్ కమిటీ ఈ సాయంత్రం భేటీ కానున్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజనపై ఆంటోనీ కమిటీ నేడు తన నివేదినను కాంగ్రెస్ కోర్ కమిటీకి సమర్పించనుంది. ఆంటోనీ కమిటీ నివేదికపై కోర్ కమిటీలో చర్చ జరగనున్న నేపథ్యంలో డీఎస్.... పార్టీ అధినేత్రిని కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది.
Sep 13 2013 11:21 AM | Updated on Mar 22 2024 11:31 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement