రాష్ట్రంలో మైనారిటీల సంఖ్య ఎక్కువగా ఉండగా, వారికి హాస్టళ్లు తక్కువగా ఉన్నాయని సీఎం అన్నారు. ‘‘రాష్ట్రంలో 3,000 హాస్టళ్లుండగా మైనారిటీ విద్యార్థులకు 21 మాత్రమే ఉన్నాయి. అందుకే ప్రతి జిల్లాలో మైనారిటీ విద్యార్థులకు ఒక రెసిడెన్షియల్ పాఠశాల, హాస్టల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. మైనారిటీ బాలికలు మధ్యలోనే చదువు ఆపేస్తున్నారు. ప్రత్యేక వసతి, సదుపాయాలు కల్పిస్తే పై చదువులు చదువుతారు’’ అని చెప్పారు. దళిత అమ్మాయిల కోసం కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక హాస్టల్ ఏర్పాటు చేయాలన్నారు.