National Rural Employment Guarantee Programme (NREGP)
-
‘ఉపాధి’లో భేష్
సాక్షి, వికారాబాద్: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఈజీఎస్)లో అత్యుత్తమ సేవలకు గాను తెలంగాణ నుంచి రెండు జిల్లాలు జాతీయ అవార్డుకు ఎంపికయ్యాయి. వివిధ కేటగిరీల్లో దేశవ్యాప్తంగా 18 జిల్లాలను కేంద్రం ఎంపిక చేయగా.. రాష్ట్రం నుంచి వికారాబాద్, కామారెడ్డి అవార్డు కైవసం చేసుకున్నాయి. ఉపాధి హామీ పనులు సమర్థంగా నిర్వహించడం, ఎక్కువ మంది కూలీలకు పని కల్పించడం తదితర అంశాల్లో అవార్డుకు ఈ జిల్లాలు ఎంపికయ్యాయి. పనులపై ప్రజెంటేషన్ ఉపాధి హామీ పథకంలో ఉత్తమ సేవలకు ఆయా జిల్లాల నుంచి అవార్డులకు జాబితా పంపాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించగా.. వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట, జనగాం, నిర్మల్ జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. జిల్లాల్లో చేసిన ఉపాధి పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని కూడా జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఈ ఏడాది మే నెలలో కలెక్టర్లు పథకం ద్వారా చెపట్టిన పనులు, లబ్ధిదారుల ప్రగతిపై ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనిపై సంతృప్తి చెందిన కేంద్రం జిల్లాలను అవార్డుకు ఎంపిక చేసింది. ఈ నెల 11న ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చేతుల మీదుగా కలెక్టర్లు అవార్డు అందుకోనున్నారు. మరింత బాధ్యతగా పని చేస్తాం జిల్లాలోని గ్రామీణాభివృద్ధి అధికారులు, ఉద్యోగుల సహకారంతో లక్ష్య సాధనలో సఫలీకృతమయ్యాం. దీంతో కేంద్రం జాతీయ స్థాయి అవార్డుకు ఎంపిక చేసింది. ఇకపై మరింత బాధ్యతగా పని చేస్తాం. – జాన్సన్, డీఆర్డీఓ, వికారాబాద్ జిల్లా -
కూలీల కష్టం నీటి పాలు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలులో చోటుచేసుకున్న అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం వివరణ కోరింది. రాష్ట్రానికిచ్చిన ఉపాధి నిధులను ఇతర పథకాలకు మళ్లించారని, గత మూడేళ్లలో రూ.9,862 కోట్లు దుర్వినియోగం చేశారని తప్పుబట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలని పేర్కొంటూ ఉపాధి హామీ అమలును పర్యవేక్షించే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ వారం క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ (నంబర్ హెచ్– 11012– 21–2018) రాశారు. నాలుగున్నరేళ్లలో రూ.20,634 కోట్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాటి నుంచి గత నాలుగున్నర ఏళ్లలో ఉపాధి పథకం అమలుకు కేంద్రం రూ. 20,634 కోట్లు ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇప్పుటి వరకు ఐదు నెలల కాలానికే రూ. 5,753 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఉపాధి హామీ పథకం అమలుకు మాత్రమే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఉపాధి హామీ కింద ఏ పనులు చేపట్టాలి? వేటిని చేపట్టకూడదనే అంశాలపై కేంద్రం స్పష్టమైన విధివిధానాలను ఖరారు చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా జీవోలతో మళ్లింపు ఉపాధి పథకం నిధులతో చేపట్టే ఏ పని అయినా కాంట్రాక్టర్ల ప్రమేయం లేకుండా కేవలం గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో చేయాలని నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. అయితే నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేకంగా జీవోలు ఇచ్చి ఉపాధి నిధులను సాగునీటి పనులకు వ్యయం చేసిందని కేంద్ర అధికారులు లేఖలో పేర్కొన్నారు. నీరు– చెట్టు పేరుతోప్రొక్లెయిన్లతో చిన్న తరహా సాగునీటి చెరువుల్లో పూడిక తీత పనులు చేపట్టి అందుకు ఉపాధి నిధులను చెల్లించారని కేంద్రం లేఖలో పేర్కొంది. మట్టినీ మింగేశారు! రూ. 9,862 కోట్ల ఉపాధి హామీ నిధులను సాగునీటి చెరువుల్లో మట్టి వెలికి తీసే పనులకు ఖర్చు పెట్టడంతో పాటు భారీ పరిమాణంలో తవ్విన మట్టిని ఎక్కడ ఉపయోగించారో వివరాలు లేకపోవడాన్ని కేంద్రం తప్పుబట్టింది. చెరువుల నుంచి వెలికి తీసిన మట్టిని కాంటాక్టర్లు రూ.వేల కోట్ల కు విక్రయించినట్లు కేంద్రం అనుమానం వ్యక్తం చేసింది. సోము వీర్రాజు లేఖతో కదలిక.. ఉపాధి హామీ పథకంతో పాటు నీరు– చెట్టు కార్యక్రమం పేరుతో భారీగా అవినీతి జరుగుతున్నట్లు బీజేపీ ఎమ్మెల్సీ సోము వ్రీరాజు గత ఆగస్టు 1వ తేదీన కేంద్రానికి ఫిర్యాదు చేశారు. కేంద్రం ఇచ్చే నిధులతో అమలయ్యే కార్యక్రమంలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించాలని ప్రధాని మోదీ, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి తోమర్కు ఆయన ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వివరాలను సేకరించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తమ దృష్టికి వచ్చిన అంశాలపై ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. -
పెదబాబు-చినబాబు.. 130 లఘు చిత్రాల విడుదల!
సాక్షి, అమరావతి: గ్రామాల్లో పేద కూలీలకు జీవనోపాధి కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం స్వలాభం కోసం ఉపయోగించుకుంటోంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఈ పథకం నిధులతో సొంత ప్రచారం చేసుకోవాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇప్పటినుంచి ఎన్నికలయ్యే దాకా దాదాపు 8 నెలలపాటు వందల సంఖ్యలో షార్ట్ఫిలింలు, పెద్దపెద్ద హోర్డింగ్లు, భారీ ఫ్లెక్సీలు, పోస్టర్లు రాష్ట్రమంతటా నిండిపోనున్నాయి. పేరుకే ప్రభుత్వ పథకాలపై ప్రచారం.. వాస్తవానికి జరిగేదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, మంత్రి నారా లోకేశ్ల భజన కీర్తనలే. వారిద్దరిని ప్రపంచంలోనే గొప్ప పరిపాలనాదక్షులుగా చిత్రీకరిస్తూ ప్రజలను మభ్యపెట్టడమే ఈ ప్రచారపర్వం అసలు ఉద్దేశం. ప్రభుత్వం మనదే.. అడిగేదెవరు? ఉపాధి హామీ పథకంలో కూలీలకు డబ్బులు చెల్లించడానికి నిధులు లేవంటూ చేతులెత్తేస్తున్న ప్రభుత్వం మరోవైపు సొంత ప్రచారం కోసం అదే పథకం నిధులను వాడుకోవాలని నిర్ణయించడం గమనార్హం. కూలీలకు దాదాపు నెల రోజులుగా డబ్బులు చెల్లించడం ప్రభుత్వం నిలిపివేసింది. రూ.542 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. కానీ, ఉపాధి హామీ పథకం నిధుల నుంచి రూ.కోట్లు ఖర్చు పెట్టి భారీ ఎన్నికల ప్రచారానికి టీడీపీ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఈ సొమ్ముతో వచ్చే ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూరేలా ప్రచారానికి రూపకల్పన చేశారు. ఉపాధి హామీ పథకం అమలు విభాగానికి మంత్రిగా నారా లోకేశ్ వ్యవహరిస్తుండడంతో ప్రభుత్వ పెద్దలు ఆదేశించడం.. ఈ పథకం నిధులను ఎన్నికల ప్రచారానికి ఖర్చు పెట్టడానికి ప్రణాళిక సిద్ధం చేయడం.. ఆ ప్రణాళికకు మంత్రి నారా లోకేశ్ ఆమోదం తెలపడం వంటివి శరవేగంగా.. కేవలం పది రోజుల్లో పూర్తయింది. ఇక రాష్ట్రమంతటా ప్రచార హోరు ఉపాధి హామీ పథకం నిధుల నుంచి రూ.కోట్ల ఖర్చుతో 130 లఘుచిత్రాలను(షార్ట్ ఫిలింలు) చిత్రీకరించి, వాటిని 8 నెలలపాటు రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లలో ప్రదర్శించాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. అలాగే రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లను హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లను నింపేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఆటో రిక్షాలకు అంటించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఫోటోలతో కూడిన 50,000 పోస్టర్లను ముద్రించనున్నారు. ఇప్పటికే స్వచ్ఛ భారత్ పథకం నుంచి దాదాపు రూ.20 కోట్లు వెచ్చించి, ఆర్టీసీ బస్సుల చుట్టూ చంద్రబాబు బొమ్మలతో కూడిన ప్రచార పోస్టర్లను అతికించాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా ఉపాధి హామీ పథకం నిధుల నుంచి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఆర్టీసీ బస్సుల చుట్టూ చంద్రబాబు బొమ్మలతో కూడిన ప్రచార పోస్టర్లను అతికించాలని ప్రణాళికలో పొందుపరిచారు. ప్రతి పట్టణంలో నాలుగు పెద్ద పెద్ద హోర్డింగ్లు, మండల కేంద్రాల్లో ఒక్కోటి చొప్పున హోర్డింగ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బకాయిలు ఎప్పుడిస్తారో? గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద కూలీలు ఉపాధి హామీ పథకంలో చేసిన పనులకు గాను కూలీ డబ్బుల కోసం చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో 660 గ్రామీణ ప్రాంత మండలాలు ఉండగా, ఇందులో 170 మండలాల్లో కూలీలకు ప్రభుత్వం రూ.కోటికి పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలోని 16 గ్రామ పంచాయతీల్లోని 13,084 కుటుంబాలకు చెందిన కూలీలు గత నాలుగు నెలలుగా ఉపాధి హామీ పథకం కింద పనులు చేశారు. ఆయా కుటుంబాలకు ప్రభుత్వం రూ.2.5 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఒక్కో కుటుంబానికి సగటున రూ.2 వేల చొప్పున ప్రభుత్వం బకాయి పడింది. అనంతపురం జిల్లా శింగనమల మండలంలోని కూలీలకు రూ. 2.36 కోట్లు, శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలోని కూలీలకు రూ. 2.26 కోట్లు, శ్రీకాకుళం జిల్లా గార్ల మండలంలోని కూలీలకు రూ.1.96 కోట్లు ప్రభుత్వం చెల్లించాలి. రాష్ట్రవ్యాప్తంగా 660 మండలాల్లోని కూలీలకు ప్రభుత్వం ఆదివారం నాటికి రూ.542.80 కోట్ల బకాయిలను చెల్లించాల్సి ఉంది. ఉపాధి నిధులు స్వాహా నిరుపేద కూలీలకు సొంత గ్రామాల్లోనే పనులు కల్పించి, వలసలకు అడ్డుకట్ట వేసేందుకు ఉపాధి హామీ పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాష్ట్ర సర్కారు దారి మళ్లించింది. రూ.5,224 కోట్ల ఉపాధి నిధులను ఖర్చు పెట్టి 19,179 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపట్టింది. మరో రూ.570 కోట్లతో మట్టి రోడ్లు నిర్మించినట్లు సమాచారం. దాదాపు రూ.6,000 కోట్ల విలువైన పనులను ఎలాంటి టెండర్లు లేకుండా అధికార తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నామినేషన్ విధానంలో కట్టబెట్టింది. ఉపాధి హామీ పథకం పనులపై సోషల్ ఆడిట్ తూతూమంత్రంగా జరుగుతోంది. ఈ పథకం నిధులను కేవలం గ్రామాల్లోనే ఖర్చు చేయాలి. పట్టణ ప్రాంతాల్లో ఖర్చు పెట్టడం నిబంధనలకు విరుద్ధమే. అయినా, టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం నిధులతో హోర్డింగ్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్లో దాదాపు రూ.814 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తన వద్దే అట్టిపెట్టుకుంది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు మళ్లించిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
పనులు చేసినా పైసల్లేవ్..!
కడప సిటీ: ఉపాధి కూలీలకు ఆరువారాలుగా కూలి డబ్బులు అందలేదు. పనులు చేసినా పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈవిషయంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని డబ్బులు అందేలా చూడాలని కోరుతున్నారు. జిల్లాలో ఉపాధి హామీ కింద రోజుకు 1.7 లక్షల పనిదినాలు నమోదవుతున్నాయి.795 గ్రామ పంచాయితీల్లో పనులు జరుగుతున్నాయి.రోజుకు సగటున రూ.170–205వరకు కూలి ఇవ్వాలి. అయితే పని చేసినా సకాలంలో డబ్బులు అందక పోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 4,88,939 మందికి..రూ.40.88 కోట్లు పెండింగ్ జిల్లాలో దాదాపు 4,88,939 మంది కూలీలకు రూ.40.88 కోట్లు రావాల్సి ఉంది. అంటే సగటున ఒక్కొక్కరికి రూ.8,000 రావాల్సి ఉంది. రెజెక్ట్ అయిన ఖాతాలకు సంబంధించి 10,914 మంది కూలీలకు గాను రూ.97.61 లక్షలు రావాల్సి ఉంది. వివిధ కారణాలతో ఖాతాల్లో డబ్బులు జమ కాని కూలీలు 13,079 మందికి 2.21 లక్షలు రావాల్సి ఉంది.ఈ పరిస్థితుల్లో కూలీలు ఉపాధి పనులకు వెళ్లడానికి ఇష్టపడటం లేదు. కూలీలకు సకాలంలో డబ్బులు రాకపోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వమే కారణమని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. దీంతో కూలీలు మండి పడుతున్నారు. ఇబ్బందులు లేకుండా చూస్తాం కూలీలకు సకా లంలో డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటాం.జూలై నెలకు సం బంధించి కొన్ని రోజుల వేతనం అందలేదని తెలిసింది.సమావేశం నిర్వహించి తగిన కారణాలను తెలుసుకుంటాం. కూలీలకు న్యాయం జరిగేలా చూస్తాం. – వై.హరిహరనాథ్, డ్వామా, పీడీ -
ఉపాధి హామీతో రైతుల ఆదాయం పెంపు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం వలన రైతుల ఆదాయాన్ని పెంచవచ్చని కేంద్ర గ్రామీణాభివృ ద్ధిశాఖ కార్యదర్శి అమర్జిత్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో ‘2022 సంవత్సరానికి రైతుల ఆదాయం రెట్టింపు’ లక్ష్యంతో వ్యవసాయం, ఉపాధి హామీ అనుసంధానం విధానాన్ని రూపొందించే అంశంపై ‘నీతి ఆయోగ్, రాష్ట్ర వ్యవసాయశాఖ’ సంయుక్తంగా నిర్వహించిన ఒక రోజు వర్క్షాపులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, వివిధ రాష్రాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ద్వారా వారి ఆదాయం పెరిగినట్లు గుర్తించామన్నారు. పంటల సాగు ఖర్చును తగ్గించటం, మెరుగైన మార్కెటింగ్ సౌకర్యం, గిడ్డంగుల నిర్మాణం ద్వారా వారి ఆదాయం పెంపొందించవచ్చని తెలిపారు. ఇన్పుట్ ఖర్చులు తగ్గించడం వలన మేలైన ఫలితాలు లభిస్తాయని, ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామంలో రైతులకు అవసరమైన ఆస్తుల కల్పనకు ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలన్నారు. కూలీల వేతనాలు స్థిరంగా ఉన్నాయి కానీ, వ్యవసాయ సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు తదితర ఖర్చులు గణనీయం గా పెరిగినట్లు సర్వేలు తెలుపుతున్నాయని తెలిపారు. ఉపాధి హామీ పథకంలో కొన్ని మార్పు లు చేయడం ద్వారా రైతులకు మేలు చేకూర్చే చర్యలు చేపట్టవచ్చన్నారు. వివిధ రాష్ట్రాలలో సమర్థవంతంగా అమలవుతున్న ఉపాధి హామీ పథకాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రైతుల ఆదాయం పెంపొందించడానికి ప్రకృతి వనరుల యాజమాన్యం, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యకరమైన రుణ సదుపాయం, పరిశోధన, మార్కెటింగ్ వ్యూహాలు తదితర తొమ్మిది అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. 98% చిన్న, సన్నకారు రైతులు: సీఎస్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆదాయం పెంపొందించడానికి అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి వివరించారు. తెలంగాణలో రైతులకు పెట్టుబడికోసం రైతుబంధు పథకం ప్రారంభించామని, సంవత్సరానికి ఎకరానికి రూ.8 వేలు ఇస్తున్నామన్నారు. ఆగస్టు 15 నుంచి రూ.5 లక్షల ఉచిత బీమాను ప్రతి రైతుకు అందిస్తున్నామన్నారు. భూసర్వే ద్వారా తెలంగాణలో 98 శాతం చిన్న, సన్నకారు రైతులు ఉన్నారని గుర్తించినట్లు తెలిపారు. రైతుల ఆదాయం పెంచడానికి, పాడి పరిశ్రమ, చేపల పెంపకం, గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. హరితహారం పథకాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తున్నందున ఉపాధి హామీలో వేతనం కింద అధిక నిధులను రాష్ట్రానికి కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. ఇన్పుట్ ఖర్చు తగ్గించి, ఉత్పత్తి పెంపొందించినప్పుడే రైతులకు ఆదాయం పెరుగుతుందన్నా రు. వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసార థి స్వాగతోపన్యాసం చేస్తూ రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి తీసుకోవలసిన చర్యలపై సలహాలు, సూచనలను వివిధ వర్గాల నుండి తీసుకోవడానికి ఈ వర్క్షాప్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి తగు సూచనలు అందించాలని ఆయన కోరారు. ఈ సదస్సులో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమా ర్, వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి దేవేశ్ చతుర్వేది, నీతి ఆయోగ్ సలహాదారు ఎ.కె.జైన్, ఎన్.ఐ.ఆర్.డి డైరెక్టర్ జనరల్ డాక్టర్ డబ్లు్య ఆర్ రెడ్డి, రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు, పాండిచ్చేరి, అండమాన్ నికోబార్ ప్రాంతాల వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, నీతి ఆయోగ్ అధికారులు, వ్యవసాయరంగ నిపుణులు, రైతుసంఘాల ప్రతినిధులు, ఎన్జీవోలు పాల్గొన్నారు. -
మరో రంగస్థలం
జిల్లాలోని కుల్లూరు పంచాయతీలో ప్రస్తుతం రంగస్థలం కథ నడుస్తోంది. పంచాయతీ ఎన్నికలు రాక ముందే అక్కడ వాతావరణం వేడెక్కింది. పంచాయతీలో ఓ ప్రజాప్రతినిధి చెప్పిందే వేదం. ఆయన చెప్పినట్లు అధికారులు, ప్రజలు వినాల్సిందే. వినకపోతే వారిపై అవినీతి, అక్రమాల పేరుతో అధికారుల చేత విచారణలు, వేదింపులకు గురి చేస్తున్నాడు. తప్పు చేయకపోయినా.. చేసినట్లు ఆధారాలు లేకపోయినా.. ఏదో ఒక విధంగా చర్యలు తీసుకునేలా అధికారులపై ఒత్తిళ్లు చేయిస్తున్నాడు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ప్రజాప్రతినిధి చెప్పినట్లు చేయడం లేదనే అక్కసుతో అతనిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఆకాశారామన్న ఫిర్యాదులు తీసుకెళ్లి జిల్లా అధికారులకు అందజేసి విచారణ పేరుతో వేదిస్తున్నారు. అధికారులు కూడా ఆకాశ రామన్న ఫిర్యాదులకు అత్యంత ప్రధాన్యం ఇచ్చి కింది స్థాయి అధికారులతో విచారణలు చేయిస్తున్నారు. విచారణలో ఎలాంటి ఆధారాలు లేదని నివేదికలు అందజేస్తే మరొక ఆకాశ రామన్న ఫిర్యాదు చేసి విచారించి చర్యలు తీసుకోమని ఒత్తిడి తెస్తున్నారు. నెల్లూరు(పొగతోట): జిల్లాలోని కలువాయి మండలంలో ఉన్న కుల్లూరు మేజర్ పంచాయతీలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి పి.వంశీకృష్ణ ఫీల్డ్ అసిస్టెంట్(ఎఫ్ఏ)గా పని చేస్తూ కూలీలకు పనులు కల్పిస్తున్నాడు. ఉపాధి హామీ పనులు కల్పించడంలో ఈ పంచాయతీ ప్రథమ స్థానంలో ఉండడంతో ఎఫ్ఏ వంశీకృష్ణ ఎంపీడీఓ చేతులమీదుగా అవార్డు కూడా అందుకున్నారు. ఉ పాధి కూలీలకు రోజుకు రూ.200లకు పైగా వేత నం మంజూరయ్యేలా పనులు చూపిస్తున్నాడు. ఎఫ్ఏ తాను చెప్పినట్లుగా నడుచుకోలేదని ప్రజా ప్రతినిధి ఆకాశ రామన్న ఫిర్యాదులు చేయడం ప్రారంభించాడు. ఇద్దరు, ముగ్గురు కూలీలను రెచ్చగొట్టి ఎఫ్ఏపై ఫిర్యాదులు చేయించాడు. కొద్ది రోజుల తరువాత ఫిర్యాదులు చేసిన కూలీలు ఎంపీడీఓ వద్దకు వచ్చి తమకు రాజకీయాలతో సంబంధం లేదని, ఎఫ్ఏ తమకు పనులు కల్పిస్తున్నాడని, అతను అక్రమాలకు పాల్పడడం లేదని తెలిపారు.\ తమకు రావాల్సిన వేతనాలు అతను తీసుకోవడం లేదని ఎంపీడీఓకు రాతపూర్వకంగా వివరించారు. అనంతరం ఆ ప్రజాప్రతినిధి కూలీలు కాకుండా పంచాయతీ పాలక సభ్యులతో ఫిర్యాదు చేయించాడు. ఫిర్యాదు అందుకున్న అధికారులు ఆగమేఘాలపై కుల్లూరులో ఈ నెల 18వ తేదీన విచారణ చేపట్టారు. విచారణ సమయంలో ఎలాంటి ఆధారాలు లభించలేదు. గతంలో ఆధారులు లేని ఫిర్యాదుకు సంబంధించి బ్యాంక్ కార్సండెంట్ నుంచి కూలీలకు ఇవ్వాల్సిన రూ.1.20 లక్షల నగదు ఎఫ్ఏ తీసుకున్నాడని అతనితో రాయించుకుని దీనిపై క్రిమినల్ కేసు పెడతామని బెదిరిస్తున్నారు. ఉపాధి పనులు చేసినందుకు బ్యాంక్ కార్సండెంట్ కూలీలకు వేతనాలు ఇవ్వాల్సిఉంది. దానితో ఎఫ్ఏకు ఎలాంటి సంబంధం ఉండదు. చేసిన పనులకు వేతనాలు ఇంత వరకు ఇవ్వలేదని కూలీలు ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. ఫిర్యాదులు చేయకుండా బ్యాంక్ కార్సండెంట్ నుంచి ఎఫ్ఏ నగదు తీసుకుపోయడంటే గుడ్డిగా ఏవిధంగా కేసు నమోదు చేసే విషయాన్ని పరిశీలిస్తే పై నుంచి ఏస్థాయిలో ఒత్తిళ్లు వచ్చాయో అర్థమవుతోంది. అవినీతిని కప్పిపెట్టి.. కుల్లూరు పంచాయతీలో రోడ్లు వేయకుండా రూ.లక్షల బిల్లులు స్వాహా చేసిన పంచాయతీ కార్యదర్శిపై ఎలాంటి విచారణ చేయలేదు. పంటకుంటల బిల్లులు మంజూరు కాగానే వాటిని పూడ్చి వేసి పంటలు సాగు చేస్తున్నా వాటిపై ఎలాంటి విచారణ చేయడం లేదు. పంచాయతీ కార్యదర్శి నిధులు స్వాహా చేశారని జిల్లా అధికారులకు నాలుగు పర్యయాలు ఫిర్యాదులు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి విచారణ చేపట్టలేదు. ఉపాధి టీఏకు రూ.3.50 లక్షల రికవరీ పడితే దానిని రూ.14 వేలకు తగ్గించారు. దీనిపై ఇంత వరకు విచారణ చేయలేదు. అధికారపార్టీ ప్రజాప్రతినిధి కావడంతో అధికారులు ఆయన చెప్పినట్లు చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోయిన ఎఫ్ఏపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేయడం చేస్తుండడం గమనార్హం. -
వ్యవసాయంతో ‘ఉపాధి’ అనుసంధానం?
సాక్షి, అమరావతి: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానించే విషయమై కేంద్రం నియమించిన ముఖ్యమంత్రుల కమిటీ ముసాయిదా నివేదికను దాదాపు సిద్ధం చేసింది.వచ్చే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోపు కేంద్రానికి సమర్పించవచ్చని తెలిసింది. కేంద్రం అమలు చేస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పథకాల్లో ఒకటైన ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేస్తే వ్యవసాయ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని ముఖ్యమంత్రుల కమిటీ అభిప్రాయపడినట్టు సమాచారం. అయితే ఈ కమిటీ చేయబోయే సిఫారసులు ఏమిటన్నది ముందే బయటకు పొక్కడంతో విమర్శలు వెల్లువెత్తాయి. వ్యవసాయ ఖర్చులు తగ్గితేనే రైతు బతికి బట్టకడతాడని కొందరు రైతులు వాదిస్తుండగా కూలీల కడుపుకొట్టి భూ స్వాములకు పెడతారా? అని వ్యవసాయ కూలి సంఘాలు మండిపడుతున్నాయి. అసలేమిటీ కమిటీ? వ్యవసాయ ఖర్చులు తగ్గించాలనే దానిపై పరిశీలించి నివేదిక సమర్పించేందుకు కేంద్రం ఏడు రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్, బిహార్, యూపీ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, మధ్యప్రదేశ్) ముఖ్యమంత్రులతో కమిటీ ఏర్పాటు చేసి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ను చైర్మన్గా నియమించింది. ఈ కమిటీ ఇటీవల ఢిల్లీలో భేటీ అయి వ్యవసాయ ఖర్చులు తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. విత్తనం మొదలుకొని పంటల ఉత్పత్తుల అమ్మకాల వరకు పథకాన్ని ఎలా వర్తింపజేయవచ్చు అనేది ప్రధానంగా చర్చించింది. సాగు ఖర్చులు తగ్గించి, నీటిని సమర్థంగా వినియోగించడం ద్వారా ఉత్పత్తిని పెంచడం, గిట్టుబాటు కల్పించడం, ప్రకృతి విపత్తులతో దెబ్బతిన్న భూముల్ని తిరిగి పునరుద్ధరించడం వంటి అంశాలను చర్చించినా ప్రధానంగా ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి ఎలా అనుసంధానం చేయాలన్న దానిపైనే దృష్టి కేంద్రీకరించినట్టు తెలిసింది. దేశంలో అమలవుతున్న అతిపెద్ద సంక్షేమ పథకమైన ఉపాధి హామీకి 2017–18లో కేంద్రం రూ.55 వేల కోట్లను కేటాయించి నైపుణ్యం లేని కూలి కింద సంతకం చేసి గుర్తింపు కార్డు పొందిన ప్రతి గ్రామీణ కార్మికునికి ఏడాదికి వంద రోజుల పని కల్పిస్తోంది. గ్రామీణ ఉపాధి, అనువైన ఆస్తుల సృష్టి అనే ఉపాధి హామీ పథకం లక్ష్యాల సాధనకు అనుగుణంగా వ్యవసాయ రంగ అవసరాలను తీర్చడం ఎలా? అనే విషయాన్ని ముఖ్యమంత్రుల కమిటీ పరిగణలోకి తీసుకుంది. కనీస వేతనాల కన్నా ఉపాధి హామీ కూలి ఎక్కువగా ఉన్నందున వ్యవసాయంతో అనుసంధానం చేస్తే ఉపయోగంగా ఉంటుందని భావిస్తోంది. భూస్వాముల ఉపాధిగా మారుస్తారా? వ్యవసాయంలో ఉపాధి హామీ నిధులు ఖర్చుకు అవకాశం ఇవ్వడాన్ని వ్యవసాయ కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే 29 రకాల పనులను వ్యవసాయంతో అనుసంధానం చేశారని, మరో 12 రకాల పనులను కొత్తగా ఆ జాబితాలో చేర్చాలని చూస్తున్నారని, అదే జరిగితే ఇది భూస్వాముల ఉపాధి హామీగా మారుతుందని వాదిస్తున్నాయి. సీఎం చంద్రబాబు ఇందుకు సుముఖత వ్యక్తం చేయడాన్ని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు సుబ్బారావు ఖండించారు. ఉపాధి హామీ పథకం ప్రారంభించిన స్ఫూర్తినే దెబ్బతీస్తారా? అని ప్రశ్నించారు. ఉపాధి పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయాల్సి వస్తే వంద రోజుల పని చట్టాన్ని 360 రోజుల పనికి పెంచాలని వ్యవసాయ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
కూలి చెల్లింపులో జాప్యం వద్దు
సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ పథకం కూలీలకు వేతనాల చెల్లింపులో జాప్యం లేకుండా చూడాలని, వీటి చెల్లింపునకే బ్యాంకులు, పోస్టాఫీసులు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఉపాధి కూలీలకు వేతనాల చెల్లింపులో జాప్యంపై బ్యాంకర్లు, తపాలా, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో జూపల్లి గురువారం సమీక్ష నిర్వహించారు. నిరుపేద కూలీలకోసం ఉపాధి హామీ పథకం చేపడుతున్నామని, కూలి చెల్లింపులో జాప్యం చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకుల ద్వారా చెల్లింపులో ఎలాంటి ఇబ్బందులు లేవని, నగదు కొరత కారణంగా పోస్టల్ చెల్లింపుల్లో తీవ్రజాప్యం జరుగుతోందని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు మంత్రికి తెలిపారు. బ్యాంకుల్లో ఖాతా తీసుకునేందుకు ఆధార్ కార్డుతోపాటు పాన్ కార్డు అడగడం వల్ల ఉపాధి కూలీలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. అలాగే మూడు నెలలపాటు ఆపరేట్ చేయకుండా ఉన్న కూలీల అకౌంట్లను తొలగించడం, జీరో బ్యాలెన్స్ అకౌంట్లను ప్రారంభించేందుకు బ్యాంకు సిబ్బంది నిరాకరించడం లాంటి కారణాలతో దాదాపు 60 శాతం చెల్లింపులను పోస్టల్ ద్వారా చేయాల్సి వస్తుందని వివరించారు. ఉపాధి కూలీలకు చెల్లింపులకోసం ఏప్రిల్, మే నెలల్లో బ్యాంకులకు రూ.360 కోట్లను, పోస్టాఫీసులకు రూ.412 కోట్లను విడుదల చేసినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు బ్యాంకులు రూ.350 కోట్ల వరకు చెల్లింపులు జరిపాయని, తపాలా శాఖ కేవలం రూ.79 కోట్లు మాత్రమే చెల్లించిందని అధికారులు వివరించారు. తపాలా శాఖ తీరుపై జూపల్లి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటినుంచి ఎలాంటి జాప్యం లేకుండా చెల్లింపులు జరపాలని పోస్ట్ మాస్టర్ జనరల్ పీవీఎస్ రెడ్డిని ఆదేశించారు. ఆర్బీఐ నుంచి నగదు విడుదల చేయకపోవడం, వారం రోజులుగా పోస్టల్ సిబ్బంది సమ్మెలో ఉండటం వల్ల చెల్లింపుల్లో జాప్యం జరిగిందని పీవీఎస్ రెడ్డి వివరించారు. నగదు కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఉపాధి నిధుల చెల్లింపు కోసమే ప్రత్యేకంగా రూ.150 కోట్లను బుధవారం విడుదల చేశామని ఆర్బీఐ డిప్యూటీ జనరల్ నాగేశ్వర్రావు తెలిపారు. -
ఉపాధిలో లోపాలెన్నో..
కడప సిటీ : ఉపాధి హామీ పథకం జిల్లాలో సక్రమంగా అమలుకు నోచుకోలేదన్న విమర్శలున్నాయి. సమస్యలను పరిష్కరించడంలో అధికారులు తీవ్ర వైఫల్యం చెందారన్న ఆరోపణలున్నాయి. మజ్జిగ పంపిణీ, కూలీలకు సౌకర్యాలు, బిల్లుల చెల్లింపు, పెండింగ్ ఖాతాల పరిష్కారాలు, సిబ్బంది సమస్యలు తదితర అంశాలు తిష్టవేసి పరిష్కారానికి నోచుకోక కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. పంపిణీ కాని మజ్జిగ :జిల్లాలో రోజుకు ఉపాధి పనులకు 1.80 లక్షల మంది కూలీలు హాజరవుతున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వేసవిలో కూలీలకు వడదెబ్బ సోకకుండా ఒక్కొక్కరికి 250ఎం.ఎల్ మజ్జిగను అందించాల్సి ఉంటుంది. ఇందుకుగానూ మేట్లకు మజ్జిగకు రూ.4లు, పంపిణీ చేసినందుకు ఒక్క రూపాయి ఇస్తారు. అయితే జిల్లాలో చాలా చోట్ల మేట్లు కూలీలకు మజ్జిగ పంపిణీ చేయకుండానే పంపిణీ చేస్తున్నట్లు నమోదు చేసుకుంటున్నారు. తమ ఖాతాలలో ఆ మొత్తాన్ని జమ చేసుకుంటున్నారు. అధికారులకు తెలిసినప్పటికీ ఈ విషయం పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. పరిష్కారంకానీ సస్పెన్షన్ ఖాతాలు :గతకొన్నేళ్లుగా ఉపాధి కూలీలకు సంబంధించి సస్పెన్షన్ ఖాతాల జాబితాలో ఉన్న వారికి ఇప్పటికీ కూలీ ల సొమ్ము అందలేదు. జిల్లా వ్యాప్తంగా ఈ ఖాతాల పరిధిలో 13,832మంది కూలీలు ఉన్నారు. దాదాపు రూ.2.26కోట్లు ఈ కూలీలకు డబ్బులు రావాల్సి ఉంది. ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాకు లింకేజీ కాకపోవడంవల్ల కూలీలకు డబ్బులు జమ కాలేదు. ఈ సమస్యను అధికారులు పరిష్కరించలేదు. ♦ కంప్యూటర్ ఆపరేటర్లు జాబ్ కార్డులు ఇచ్చేటప్పుడు వారి బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు నంబర్లు సరిగా వేస్తేనే ఖాతా నమోదవుతుంది. ఆపరేటర్ల నిర్లక్ష్యం ఉన్నా అధికారులు దగ్గరుండి చేయించకపోవడంవల్లే ఈ పరిస్థితి నెలకొంది. వాటర్ షెడ్ గ్రామాలలో అందని మజ్జిగ.. జిల్లాలో 795పంచాయతీలున్నాయి. ఇందులో 200గ్రామాలు వాటర్ షెడ్ కింద ఎంపికయ్యాయి. అయితే ఈ పథకం కింద ఎంపికైన గ్రామాలలో ఉపాధి కూలీలు మజ్జిగ పంపిణీకి నోచుకోలేదు. ఈ పథకానికి సంబంధించి ప్రత్యేక వెబ్సైట్ ఓపెన్ కాకపోవడంవల్లే ఈ పరిస్థితి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. దాదాపు 40వేల మంది కూలీలకు మజ్జిగ అందడంలేదు. సరిగా అందని బిల్లులు :జిల్లాలో గతంలో లేని విధంగా కూలీలకు బిల్లుల సమస్య వెంటాడుతోంది. 2016–17 సంవత్సరంలో మార్చి నాటికే దాదాపు రూ.60లక్షల మేర బిల్లులు రావాల్సి ఉండగా.. ఇప్పటివరకు పూర్తిస్థాయిలో బిల్లులు రాలేదు. ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధి పనులకు సంబంధించి కూలీలకు సకాలంలో కూలీ డబ్బులు అందడంలేదు. దీంతో కూలీలు పనులకు రావాలంటే మొగ్గు చూపడంలేదు. సోషల్ ఆడిట్పై విమర్శలు : ఉపాధి పనులను సక్రమంగా చేశారా.. లేక అక్రమాలకు పాల్పడ్డారా అనే విషయంపై సామాజిక తనిఖీ(సోషల్ ఆడిట్) చేయడం ఉపాధి పథకంలో ఒక నియమంగా ఉంటుంది. కానీ జిల్లాలో సోషల్ ఆడిట్పై పలు విమర్శలు వస్తున్నాయి. ♦ ముద్దనూరులో సోషల్ ఆడిట్ సక్రమంగా జరగలేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. ప్రత్యేక బృందంతో విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. అలాగే సొ మ్ము రికవరీ చేయడానికి అలసత్వం ప్రదర్శిస్తున్న ట్లు తెలుస్తోంది. కొంతమందినుంచి రికవరీ చేయకుండానే లోపాయికారి ఒప్పందం చేసుకుని అధికా రులు మళ్లీ విధులలో చేర్చుకున్నట్లు సమాచారం. ♦ ఉపాధిలో తిష్ట వేసిన సమస్యలను పరిష్కరించాలని డైరెక్టర్ రంజిత్ బాషాను ఉపాధి హామీ కూలీలు కోరుతున్నారు. ఎన్నో ఏళ్లుగా తిష్ట వేసిన సమస్యలను పరిష్కరించే దిశగా నేడు జరిగే సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. -
15 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల సస్పెన్షన్
కర్నూలు(అర్బన్) : ఉపాధి హామీ అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 15 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల(సీనియర్ మేటీలు)ను సస్పెండ్ చేసినట్లు డ్వామా పీడీ ఎం.వెంకటసుబ్బయ్య తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2018–19 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నిర్ణయించిన పనిదినాలను పూర్తి చేయడంలో ఫీల్డ్ అసిస్టెంట్లు పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై నెల రోజులు పూర్తి కావొస్తున్నా ఇంతవరకు ఆయా గ్రామ పంచాయతీల్లో ఉపాధి పనులు ప్రారంభం కాని విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోయాన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆదోని మండలం బసాపురం, చిన్నహరివాణం, ఆత్మకూరు మండలం సున్నిపెంట, చాగలమర్రి మండలం నేలంపాడు, హొళగుంద మండలం పెద్దగోనేహాల్, కోసిగి మండలం జంబులదిన్నె, మిడుతూరు మండలం కలమందలపాడు, ఓర్వకల్లు మండలం మీదివేముల, అవుకు మండలం చెర్లోపల్లి, రామాపురం, పాణ్యం మండలం కొత్తూరు, ప్యాపిలి మండలం మెట్టుపల్లి, ఎన్.రంగాపురం, పెద్దపూదిర్ల, వెల్దుర్తి మండలం అల్లుగుండు ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేశామన్నారు. -
కూలీలతో వెళ్తున్న ట్రాలీ ఆటో బోల్తా
సారంగాపూర్(జగిత్యాల): ఉపాధి హామీ కూలీలను తీసుకెళ్తున్న ట్రాలీ ఆటో బోల్తాపడిన సంఘటనలో 21 మంది గాయపడ్డారు. జగిత్యాల జిల్లా లక్ష్మీదేవిపల్లి–పెంబట్ల గ్రామాల మధ్య సోమవారం ఈ సంఘటన జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామంలోని బుడిగెజంగాలకాలనీ, బీసీ కాలనీకి చెందిన కూలీలు కొద్దిరోజులుగా ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. సోమవారం ఉదయం పెంబట్ల–రంగపేట గ్రామాల మధ్య పెద్దమ్మ ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో పనులు నిర్వహించడానికి సుమారు 35 మంది గ్రామానికి చెందిన పార్తం గంగాధర్ ట్రాలీ ఆటోలో వెళ్లారు. పనులు ముగించుకుని ట్రాలీ ఆటోలో ఇళ్లకు బయల్దేరారు. ఆటో లక్ష్మీదేవిపల్లి గ్రామం దాటగానే ఓవర్లోడ్ కారణంగా కుదుపునకు గురికావడంతో డ్రైవర్ సడెన్గా బ్రేక్వేశాడు. దీంతో వేగంగా వెళుతున్న వాహనం ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తాపడింది. ఈసంఘటనలో 21 మంది కూలీలు గాయపడ్డారు. సకాలంలో స్పందించిన పోలీసులు సంఘటన విషయం తెలుసుకున్న సారంగాపూర్ ఎస్సై రాజయ్య 10 నిమిషాల్లో తన సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. తహసీల్దార్ వసంత, ఎంపీడీవో పుల్లయ్య పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులను జగిత్యాల ఎమ్మెల్యే జీవన్రెడ్డి పరామర్శించారు. -
ఇలాగైతే ఇంటికి పంపుతా
ఆదోని: ఉపాధి హామీ పథకం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇంటికి పంపుతానని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ హెచ్చరించారు. బు«ధవారం పట్టణంలోని ఎంపీడీవో సమావేశం హాలులో ఆదోని, కౌతాళం, కోసిగి, పెద్దకడబూరు, మంత్రాలయం మండలాల ఎంపీడీఓలు, ఏపీఓలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఇంజినీరింగ్ కన్సల్టెంట్లతో సమావేశం నిర్వహించారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు ప్రగతి లేక పోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు కల్పించకపోవడంతో ఆదోని డివిజన్ పరిధిలోని మండలాల నుంచి ప్రజలు ఎక్కువగా వలసలు పోతున్నారన్నారు. పత్రికల్లో వార్తలు వస్తున్నా.. సిగ్గు అనిపించదా? బుద్ధి ఉన్నోళ్లు ఎవరైనా స్పందించకుండా ఉంటారా? అని మండి పడ్డారు. వలసల నివారణచకు చర్యలు తీసుకోకపోతే బాధ్యులను ఇంటికి పంపుతానని హెచ్చరించారు. ఐదు మండలాల్లో మార్చి చివరి లోగా 175 లక్షల పనిదినాలు కల్పించాల్సి ఉండగా 125 లక్షల పనిదినాలు మాత్రమే కల్పించారన్నారు. సీనియర్ మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు సక్రమంగా పనిచేయడం లేదని మంత్రాలయం, పెద్దకడుబూరు ఎంపీడీవోలు ఫిర్యాదు చేయగా.. పూర్తి వివరాలతో నివేదిక పంపితే చర్యలు తీసుకుంటానని కలెక్టరు చెప్పారు. ఎండలు మండుతున్నందున ఉదయం, సాయంత్రం మాత్రమే పనులు చేపట్టాలని సూచించారు. కూలీలు పని చేసే చోట తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం ఆదోని డివిజన్లో తాగు నీటి వనరులపై ఆర్డబ్ల్యూఎస్ ఈఈ రామస్వామితో చర్చించారు. వేసవిలో ఎక్కడా నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డ్వామా పీడీ వెంకటసుబ్బయ్య, ఆర్డీఓ ఓబులేసు, అదనపు పీడీ నాగేశ్వరరావు, ఏపీడీ మల్లేశ్వరి, ఏపీవోలు మన్న, మద్దిలేటి పాల్గొన్నారు. -
అవినీతిని సహించం..!
సాక్షి ప్రతినిధి, కడప : ఉపాధి హామీ పథకం జిల్లాకు వరం. నాలుగేళ్లుగా జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వలసలు నియంత్రించేందుకు ప్రతి ఒక్కరికీ పని కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. ఇందుకు తగిన కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. రోజూ లక్ష పని దినాలు నమోదయ్యేలా క్షేత్ర సిబ్బంది ని నిత్యం పర్యవేక్షిస్తున్నాం. ఈ పథకం పరిధిలో ఏ స్థాయిలో కూడా అవినీతిని సహించేది లేదు. అవినీతికి ఎవరైనా పాల్పడుతున్నట్లు తెలిస్తే నేరుగా నాకు ఫిర్యాదు చేయొచ్చు. ఎవ్వరిని వదిలిపెట్టం. కఠిన చర్యలు తీసుకుంటాం.’ అని జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) పీడీ వై హరి హరనాథ్రెడ్డి పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 270 కోట్లు ఖర్చు చేశామని ఇందులో సింహభాగం కూలీలకే చెల్లించామని ఆయన వివరించారు. జిల్లాలో ఉపాధి, వాటర్షెడ్ల పనుల నిర్వహణ, సిబ్బంది పనితీరు..అక్రమాలు.. వంటి వాటిపై ‘సాక్షి’ ఆయనతో ముఖాముఖి నిర్వహించింది. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రతి కూలీకి పనికల్పిస్తాం.. ప్రతి కూలీకి పని కల్పించడమే కర్తవ్యంగా పెట్టుకున్నాం. ఆ దిశగా క్షేత్రస్థాయి సిబ్బందిని సమాయత్తం చేస్తున్నాం. కూలీలు అడిగినా పనులు కల్పించకపోతే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించాం. ఇప్పుడిప్పుడు పని దినాల సంఖ్య పెరుగుతోంది. రోజూ 80 వేల మంది దాకా కూలీలు పనులకు వస్తున్నారు. ఈ సంఖ్యను లక్షకుపైగా పెంచాలనేది లక్ష్యం. రాజంపేట, జమ్మలమడుగు, పులివెందుల ప్రాంతాల్లో పొలం పనులు జరుగుతున్నాయి. రానున్న రెండు మూడు రోజుల్లో పని దినాల సంఖ్య లక్షకుపైగా పెరిగే అవకాశం ఉంది. అలాగే 2018–19 ఆర్థిక సంవత్సరానికి 1.30 కోట్ల పని దినాలు లక్ష్యంగా పెట్టుకున్నాం. ∙రూ.270 కోట్లు ఖర్చు చేశాం.. ఈ ఆర్థిక సంవత్సరంలో పని దినాల నమోదు లక్ష్యం 1.39 కోట్లు. ఇప్పటికే 1.08 కోట్ల పని దినాలను పూర్తి చేశాం. మిగిలిన పని దినాలను మార్చి నాటికి పూర్తి చేస్తాం. ఈ ఏడాది ఉపాధి హామీ కింద రూ.330 కోట్లు ఖర్చు చేయాలన్నది లక్ష్యం. ఇప్పటి దాకా రూ.270 కోట్లు ఖర్చు చేశాం. ఇందులో కూలీలకే రూ.157 కోట్లు చెల్లించాం. సామగ్రి కొనుగోలు కింద మరో రూ.87 కోట్లు వ్యయం చేశాం. వేతనాలకు రూ.18 కోట్లు వెచ్చించాం. ∙బాధ్యతతో పనిచేయాలి.. క్లస్టర్లో సహాయ పీడీలు విధుల పట్ల ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించరాదు. కేవలం సిబ్బందిపై కర్ర పెత్తనం చేస్తామంటే కుదరదు. సమష్టిగా పని చేస్తేనే ఫలితాలు సాధ్యం. ఇదే విషయాన్ని ప్రతి వారం సమీక్షల్లో చెబుతున్నాం. రూ.2.36 కోట్ల అవినీతి జరిగింది.. పదమూడేళ్ల కిందట ఈ పథకం మొదలైంది. మొత్తం 12 విడతల సామాజిక తనిఖీలు జరిగాయి. ఉపాధి, వాటర్షెడ్ల పనుల్లో దాదాపు రూ.9.84 కోట్ల అక్రమాలు జరిగినట్లు సామాజిక తనిఖీ బృందాలు తేల్చాయి. ఇందులో రూ.4.86 కోట్లు విచారణ తర్వాత రద్దు చేశాం. మరో రూ.2.36 కోట్ల మేర వసూలు చేశాం. ఆర్ఆర్ చట్టం కింద రూ.1.53 కోట్లు, మిగిలిన రూ.96 లక్షలు వేతనాల రికవరీ కింద వసూలు చేయాల్సి ఉంది. అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు.. ఉపాధి, వాటర్షెడ్ల పనుల్లో ఏస్థాయి అధికారైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయి. ఏ స్థాయిలో అవినీతిని సహించేది లేదు. అధికారులెవరైనా అవినీతికి పాల్పడుతున్నట్లు తెలిస్తే.. నేరుగా నాకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. అవినీతి ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. పీఓలపై పని ఒత్తిడి ఉన్నది వాస్తవమే.. ఉపాధి హామీ పథకంలో ఎంపీడీఓలే పీఓలుగా పనిచేస్తున్నారు. వీరు సరిగా పనిచేయలేదన్నది వాస్తవం కాదు. నేను వచ్చిన తర్వాత తరచూ వారితో మాట్లాడుతున్నా.. మండల కంప్యూటర్ కేంద్రాల్లో ఎంపీడీఓలు ఉండి ప్రతి లావాదేవీని వారే చేస్తున్నారు. అయితే వారు ఇతర పనుల పట్ల దృష్టి సారించడంతో పని ఒత్తిడి ఉన్న మాట వాస్తమే. అలాగని వారు ఉపాధి పనిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయడం లేదు. -
లేజీఎస్!
రాయికోడ్(అందోల్): ఈజీఎస్ (ఎంప్లాయిమెంట్ గ్యారంటీ స్కీం) పనులు జిల్లాలోని ఆయా మండలాల్లో నత్తనడకన సాగుతున్నాయి. చేసిన పనులకు సంబంధించి కూలీల వేతనాలు, మెటీరియల్ కాంపోనెంట్ నిధులు సక్రమంగా విడుదల కావడం లేదు. నాడెం కంపోస్టు పిట్స్, పాఠశాలల కిచెన్ షెడ్స్, ఇంకుడు గుంతలు, పశువుల పాకలు, సేద్యపు నీటి గుంతలు, డంపింగ్ యార్డులు తదితర పనులు మందకొడిగా సాగుతున్నాయి. 2016 నుంచి ఆయా రకాల పనులు మంజూరైనా ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదు. అధికారుల పర్యవేక్షణ లేక, గ్రామీణ ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో అవగాహన లేక, బిల్లులు సకాలంలో అందుతాయనే భరోసా లేక మంజూరైన పనులు నిదానంగా నడుస్తున్నాయి. సేద్యపు నీటి గుంతలు.. జిల్లాలో 3,031 సేద్యపు నీటి గుంతలకు 777 గుంతలే వివిధ దశల్లో పనులు కొనసాగుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే సేద్యపు నీటి గుంతలను నిర్మింపజేసి పంటల సాగులో రైతులు ఎదుర్కొనే నీటి ఇబ్బందులను తీర్చాల్సి ఉండగా పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడంలేదు. పూర్తికాని పశువుల పాకలు.. జిల్లాలోని ఆయా మండలాల్లో 558 నిర్మించాల్సి ఉండగా 55 పశువుల పాకలు మాత్రమే నిర్మాణ దశలో ఉన్నాయి. పశువుల పాకలు లేక పోషకులు తాము పోషిస్తున్న పశువులను ఆరుబయట కట్టేస్తున్నారు. ఈ దశలో పశువులు, పోషకుల ప్రయోజనం కోసం మంజూరు చేసిన పాకలు పూర్తి చేయడంలో క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు, సిబ్బందికి చిత్తశుద్ధి కొరవడిందనే ఆరోపణలు ఉన్నాయి. 306 మాత్రమే పూర్తయిన కంపోస్ట్ పిట్స్.. 1,333 నాడెం కంపోస్టు పిట్స్ మంజూరు కాగా 306 మాత్రమే ప్రారంభించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఇంకుడు గుంతలు అంతంతే.. 53,138 ఇంకుడు గుంతలు మంజూరవగా ఇప్పటివరకు 22,013 ఇంకుడుగుంతలు మాత్రమే పూర్తి చేశారు. ప్రస్తుతం ఎక్కడా ఇంకుడుగుంతల నిర్మాణం చురుగ్గా సాగుతున్న పరిస్థితులు లేవు. ఇంకుడుగుంతలు నిర్మించుకున్న వారికి సకాలంలో బిల్లులు రాకపోవడంతో ఈ పనులు చేపట్టడానికి లబ్ధిదారులు ఆసక్తి చూపడంలేదని తెలుస్తోంది. పూర్తికాని డంపింగ్ యార్డులు.. జిల్లాకు 330 డంపింగ్ యార్డులు మంజూరయ్యాయి. ఇందులో 142 డంపింగ్ యార్డులు మాత్రమే ప్రారంభమయ్యాయి. డంపింగ్ యార్డుల నిర్మాణంలో అధికారులు పెద్దగా దృష్టి సారించడం లేదనే వాదనలు వినవస్తున్నాయి. పూర్తయిన కిచెన్ షెడ్లు 128 మాత్రమే.. ఆయా మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు 539 కిచెన్ షెడ్లు మంజూరు చేయగా 128 మాత్రమే పూర్తయినట్లు ఈజీఎస్ అధికారులు వెల్లడించారు. శ్మశాన వాటికల అభివృద్ధి పనులు సైతం ఆశించిన స్థాయిలో సాగడం లేదు. వివిధ రకాల పనులు మంజూరవుతున్నా వాటిని పూర్తి చేయడంలోనే లోపాలు కనిపిస్తున్నాయి. కొరవడిన పర్యవేక్షణ.. ఈజీఎస్ పనులపై పర్యవేక్షణ లేక ఆశించిన స్థాయి లో పనుల్లో పురోగతి లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా, మండల స్థాయిలోని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణకు ప్రాధాన్యతనిచ్చి ప్రజల్లో ఈజీఎస్ పనులపై సరైన అవగాహన కల్పిస్తే ఆశిం చిన లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉంది. పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని అధికారులు చెబుతున్నా గ్రామాల్లో పనుల పురోగతి అందుకు విరుద్ధంగా ఉంది. ఇప్పటికైనా పటిష్ట ప్రణాళికలు వేసి మంజూరైన అన్నిరకాల ఈజీఎస్ పనులను పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు. -
తెలంగాణలో కేంద్ర పథకాల అమలు భేష్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రామీణాభివృద్ధి శాఖ కార్యక్రమాల అమలు బాగుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి రాంకృపాల్ యాదవ్ ప్రశంసించారు. రాష్ట్రంలో అమలవుతున్న వివిధ కేంద్ర పథకాలపై మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలసి రాజేంద్రనగర్లోని రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి సంస్థ (టీ సిపార్డ్)లో సోమవారం సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో అధికారులు వివరించారు. ఉపాధి హామీ, పీఎంజీఎస్వై, రూర్బన్, డీడీయూజీకేవై, టీఆర్ఐజీపీ, పింఛన్ల పంపిణీ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం రాంకృపాల్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణలో గ్రామీణాభివృద్ధి శాఖ కార్యక్రమాల అమలు బాగుందని, మరింత ఉత్సాహంగా పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని చెప్పారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కల మనుగడ రేటు 70 శాతం వరకు ఉండటంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనిదినాల్ని పెంచండి దేశానికే ఆదర్శంగా గ్రామీణాభివృద్ధి శాఖను తీర్చిదిద్దుతామని మంత్రి జూపల్లి అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి మరింత సహకారం అందజేయాలని కోరారు. పెద్ద ఎత్తున ఉపాధి హామీని అమలు చేస్తున్నామని, ఈ ఆర్థిక సంవత్సరంలో మొదట్లో ఇచ్చిన 8 కోట్ల పనిదినాల లక్ష్యాన్ని ఇప్పటికే అధిగమించామని తెలిపారు. ఈ లక్ష్యాన్ని 16 కోట్లకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. గతంలో నిలిచిన పనులకు సంబంధించి రూ.800 కోట్ల విలువైన రహదారుల నిర్మాణానికి పీయంజీఎస్వై–2 కింద అనుమతినివ్వాలని కోరారు. రాష్ట్రానికి మూడు విడతల్లో 16 రూర్బన్ క్లస్టర్లను మంజూరు చేశారని.. కనీసం జిల్లాకు ఒక్కటైనా ఇవ్వాలని కోరుతూ కేంద్ర మంత్రి రాంకృపాల్ యాదవ్కు జూపల్లి వినతి పత్రం అందజేశారు. ఈ సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, సెర్ప్ సీఈఓ పౌసమి బసు తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి కూలీలను పస్తులుంచుతారా?: చాడ
సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ కూలీలకు నాలుగు నెలలుగా వేతనాలివ్వడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. పండుగ పూట వారిని పస్తులు ఉంచుతారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దసరా, దీపావళి పండుగలకు కూలీ డబ్బులు ఇవ్వలేదని, సంక్రాంతికైనా వారికి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన కొత్తబావుల తవ్వకం, పూడికతీత వంటి పనులకు కూలి డబ్బులను చెల్లించకపోవడంతో కూలీలు అప్పుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
కేంద్ర పథకానికి పచ్చ రంగు
వ్యవసాయ కూలీలు పనుల సమయంలో ఖాళీగా లేకుండా, పనుల కోసం వలస పోకుండా తమ ప్రాంతాలలోనే పనులు చేసుకొని ఉండాలన్న ఉద్దేశంతో గతంలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని అమలులోకి తెచ్చింది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాలకు రాజకీయ రంగు పూసి తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటుంది. పథకాల అమల్లో లోపాలుంటే మాత్రం దాన్ని అమలు చేసే వారిపై నెడుతుంది. రామభద్రపురం: కేంద్ర పథకాలకు రాష్ట్రంలో అధికార తెలుగుదేశం ప్రభుత్వం తమ రంగు వేస్తూ ప్రయోజనం పొందేందుకు శతవిధాల ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే ఉపాధి హామీ జాబ్ కార్డులను పూర్తిగా పసుపు రంగుతో ముద్రించి జారీ చేసింది. తెలుగుదేశం ప్రచార కార్డులుగా పసుపు రంగుతో ముద్రించిన జాబ్కార్డులను ఇప్పటికే జిల్లాలోని ఏపీఓలు క్షేత్ర స్థాయి అధికారులకు అందజేశారు. వీటిని జన్మభూమి గ్రామ సభలలో ఉపాధి హామీ వేతనదారులకు అందజేస్తున్నారు. జిల్లాలో 5,03,038 జాబ్కార్డులుండగా, సుమారుగా 11 లక్షలు వేతనదారులున్నారు. వారిలో 3,50,000 పైబడి జాబ్కార్డుదారులు పనులుకు వెళ్తున్నట్టు సమాచారం. వీరికి గతంలో మాదిరిగా కాకుండా కొత్తగా పసుపు పచ్చరంగులో ఉపాది పనులకు పోతున్న వేతనదారులకు మాత్రమే ఫోటోలతో ముద్రించిన జాబ్కార్డులను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న జాబ్కార్డులు స్థానంలో కొత్త వాటికి ఆధార్ అనుసంధానం చేసి అందజేస్తున్నారు. వీటిని పుస్తక రూపంలో ముద్రించి కుటుంబంలో ఉపాధి పనులకు వెళ్తున్న వారి వివరాలను ముద్రించారు. కార్డు ఐదేళ్లు ఉపయోగపడేలా రూపొందించారు. అలాగే పనులు చేసే ముందుగా ఒక ఫోటో, 60 శాతం పనులు పూర్తి చేసిన తరువాత మరో ఫోటో తీసి జియో ట్యాగింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఉపాధి పనుల్లో అక్రమాలకు తావు లేకుండా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక నుంచి వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఈ జాబ్ కార్డులు కీలకంగా మారనున్నాయని సమాచారం. హౌసింగ్ పథకంలో ఇళ్ల నిర్మాణం, ఇంకుడు గుంతల తవ్వకం, గ్రామాల్లో సీసీ రోడ్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు, పశుగ్రాస క్షేత్రాలు నాడెఫ్ తొట్లు, చెరువులు తవ్వకం, పూడికతీత పనులు, వర్మీ కంపోస్టులు, మట్టి రోడ్ల నిర్మాణం ఇలా అన్ని పనులకు జాబ్కార్డుల అవసరం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీంతో కొత్తగా అందజేస్తున్న జాబ్కార్డులు టీడీపీ ప్రచార కార్డులుగా ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని బీజేపీ నాయకులు పెదవి విరుస్తున్నారు. సొంత పథకాలుగా ప్రచారం తగదు... రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సంక్షేమ ప«థకాలను అమలు చేస్తాయి. ఆ పథకాలను కేంద్రం ఇచ్చిన వాటా ఎంత ఉంది, రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎంత అనేది రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేయాలి. అలా కాకుండా సొంత పథకాలుగా ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉంది. –పెద్దింటి జగన్మోహనరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నిర్వీర్యం చేస్తోంది... రాష్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతీ పథకానికి 80 శాతం నిధులు ఇస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోవడం తప్ప కనీసం ఏ పథకానికి కేంద్రం ప్రభుత్వ పేరు చెప్పడం లేదు. –ఆర్.లక్ష్మణరావు, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు -
ఉపాధి సిబ్బందితో సెల్గాటం
గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ శాంసంగ్ మొబైల్ ఫోన్ల వ్యాపారం ప్రారంభించిందా? ఉపాధి హామీ పథకం సిబ్బంది వద్దంటున్నా బలవంతంగా పాత స్మార్ట్ఫోన్లను అంటగట్టే ప్రయత్నాలు ప్రారంభిం చిందా? స్మార్టు ఫోన్లు ఉన్నా మళ్లీ కొనాల్సి వస్తోందని ఉపాధి హామీ పథకం సిబ్బంది వాపోతున్నారా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఉపాధి పథకం సిబ్బంది వద్ద ఇప్పటికే స్మార్టు ఫోన్లు ఉన్నా అంతగా ఫీచర్లు లేని ఫోన్లను బలవంతంగా అంటగట్టడం ఇందుకు నిదర్శనం. సాక్షి, మచిలీప్నటం: రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభించి పదేళ్లు పూర్తయింది. పథకంలో పారదర్శకత కోసం 8 ఏళ్లుగా కూలీల హాజరు, పని కొలతల నమోదు, కూలి చెల్లింపును ఆన్లైన్లో చేపడుతున్నారు. ఇందు కోసం క్షేత్ర స్థాయి సిబ్బంది మొదలు కార్యాలయ సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ అధునాతన టెక్నాలజీతో కూడిన ఆండ్రాయిడ్ స్మార్టు ఫోన్లను వినియోగిస్తున్నారు. 2006లో పథకం ప్రారంభం సమయంలో గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి హామీ పథకం సిబ్బందికి సాధారణ ఫోన్లు ఉచితంగా అందజేసింది. ఆన్లైన్ చెల్లింపులు ప్రారంభమవడంతో నాలుగేళ్ల క్రితం రూ.6,700 విలువైన శాంసంగ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు అందజేసింది. ఫోన్ ధరలో 50 శాతం సిబ్బంది చెల్లిస్తే, మిగిలిన మొత్తం గ్రామీణాభివృద్ధి భరిస్తుందని మొదట్లో చెప్పినా ఆ మొత్తాన్ని కూడా సిబ్బంది వేతనం నుంచే వసూలు చేశారు. వద్దన్నా ఫోన్లు సెల్ఫోన్ కంపెనీల మధ్య పోటీ నేపథ్యంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, సరికొత్త ఫీచర్లతో మొబైల్ ఫోన్లు చౌకధరలకే లభిస్తున్నాయి. ఉపాధి సిబ్బంది కూడా రూ.10 వేలకు పైగా విలువైన లేటెస్ట్ మోడల్ స్మార్ట్ఫోన్లతో రోజువారీగా కూలీల హాజరు, కొలతలు, జీపీఎస్ ద్వారా క్షేత్రస్థాయి నుంచే ఎన్ఆర్ఈజీఎస్ వెబ్సైట్కు అప్లోడ్ చేస్తున్నారు. క్షేత్రస్థాయి ఫీల్డ్ అసిస్టెంట్లతో పాటు మేట్లు కూడా వీటినే వినియోగిస్తున్నారు. ఈ నేథ్యంలో ఇటీవల ఎన్ఆర్ఈజీఎస్ సరఫరా చేసే స్మార్ట్ ఫోన్లు ఎవరికి కావాలంటూ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ నుంచి ఉపాధి సిబ్బందిని అడిగారు. 80 శాతం మందికి పైగా క్షేత్రస్థాయి సిబ్బంది తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే రాష్ట్రంలోని అన్ని డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయాలకు పాతబడిన శాంసంగ్ జే2 ప్రో మొబైల్ పార్శిళ్లు వచ్చిచేరాయి. జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖలో ఏపీడీ, పీఓ, టెక్నిలక్ అసిస్టెంట్స్, సీనియర్ మేట్లు కలిపి 1035 మంది ఉన్నారు. వారందరికీ రూ.93 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు. ఇప్పటికే 80 శాతం ఫోన్లను ఎంపీడీఓ కార్యాలయాలకు సరఫరా చేశారు. కొంత మంది సిబ్బందికి సైతం పంపిణీ చేశారు. మిగిలిన వారికి రెండు మూడు రోజుల్లో అందజేయనున్నారు. సిబ్బంది అప్పుగా ఫోన్లు ఇచ్చి, నెలకు రూ.900 చొప్పున జీతంలో కోత విధించనున్నారు. పాత ఫోన్లకు అధిక ధర శ్యాంసంగ్ జే2 ప్రో మోడల్ పాతబడింది. ప్రస్తుతం సరికొత్త జే7 మోడల్ మార్కెల్లో లభిస్తోంది. ఈ ఫోన్ల కంటే ఎక్కువ ఫీచర్స్ ఉన్న వీవో, అప్పో ఫోన్లు చౌకగా లభిస్తున్నాయి. ఆ కంపెనీలతో పోల్చితే శాంసంగ్ బ్యాటరీ లైఫ్, ఫీచర్స్ కూడా తక్కువే. అమెజాన్ వంటి ఆన్లైన్ సంస్థ రూ.8,470 రూపాయలకే విక్రయిస్తున్న జే2 ప్రో ఫోన్ను రూ.9080కు అంటగడుతున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 26,786 మందికి అంటగట్టేందుకు రూ.24.32 కోట్లు వెచ్చించి ఫోన్లుకొన్నారు. ఇన్ని ఫోన్లు కొంటే ఆన్లైన్ ధరకంటే తక్కువకే రావాలి. అయితే ధర అంతకు విరుద్ధంగా ఉంది. అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల పాత్ర దాగుందని, ఇందులో భాగంగానే తమ కమీషన్ల కోసం సిబ్బందిని పావులుగా వాడుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. -
ఆత్మలకూ ‘ఉపాధి’!
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పాలనలో ఆత్మలకు ప్రాణమొస్తోంది. ప్రాణం రావడమే కాదు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నాయి. బిల్లులు కూడా తీసుకుంటున్నాయి. కావాలంటే పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం తెలికిచర్ల గ్రామానికి వెళ్లి చూడండి. ఈ గ్రామానికి చెందిన పాముల గంగరాజు 2010లో ఉపాధి హామీ పథకంలో కూలీగా నమోదు చేసుకున్నారు. గంగరాజు, భార్య చింటమ్మ పేరిట ఆ కుటుంబానికి 050681324014010959 నెంబరుతో జాబ్కార్డును ప్రభుత్వం జారీ చేసింది. గంగరాజు అనారోగ్యం పాలై 2013లో మరణించారు. అతడి మరణాన్ని ధ్రువీకరిస్తూ తెలికిచెర్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి అదే ఏడాది మరణ ధ్రువీకరణ పత్రాన్ని కూడా జారీ చేశారు. కానీ చనిపోయిన గంగరాజు ఏప్రిల్, మే, జూన్ నెలల్లో 48 రోజులు పాటు పనిచేసినట్టు ఉపాధి హామీ పథకం రికార్డులో పేర్కొన్నారు. ఆ మేరకు బిల్లులు కూడా తీసుకున్నారు. స్థానిక టీడీపీ నేతలు, అధికారులు కుమ్మక్కై గ్రామంలో ఉన్న మరో పాముల గంగ రాజు పేరిట బ్యాంకు ఖాతాలు తెరిచి, దాని ద్వారా డబ్బులు డ్రా చేశారని సమాచారం. చనిపోయిన గంగరాజు తండ్రి పేరు రాముడు అని ఉపాధి పథకం జాబ్ కార్డులో ఉండగా... డబ్బులు తీసుకున్న గంగరాజు తండ్రి పేరు నాగేశ్వరరావు కావడం గమనార్హం. అయినా అవేమీ పట్టించుకోకుండా బిల్లులు చెల్లించడం రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలు తీరుకు అద్దం పడుతోంది. రాష్ట్రమంతటా దొంగమస్టర్ల దందానే చనిపోయిన గంగరాజు పేరుతో బిల్లులు తీసుకున్నట్లే దొంగ మస్టర్ల దందా రాష్ట్రమంతటా యధేచ్చగా జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలే ఇప్పుడు పరోక్షంగా ఉపాధి హామీ పథకంలో దొంగ మస్టర్ల ప్రక్రియను ప్రోత్సహిస్తున్నారని అధికార యంత్రాంగం ఆరోపిస్తోంది. ఉపాధి హామీ పథకంలో కూలీలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో కూలీ డబ్బులు చెల్లిస్తున్న కేంద్ర ప్రభుత్వం... కూలీలు జిల్లాల వారీగా చేసిన పని విలువను బట్టి రాష్ట్రానికి మెటీరియల్ నిధులను విడుదల చేస్తోంది. పథకంలో కూలీ ద్వారా రూ.60 పని జరిగినట్టు రికార్డులు చూపితే మరో రూ.40 చొప్పున రాష్ట్రానికి 40 శాతం మెటీరియల్ నిధులు మంజూరు చేస్తోంది. ఈ 40 శాతం మెటీరియల్ నిధులతో గ్రామాల్లో పెద్ద మొత్తంలో కాంట్రాక్టు పనులు అప్పగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చంద్రబాట పథకంలో వేసే సిమెంట్ రోడ్లు నిర్మాణానికి, అంగన్వాడీ, గ్రామ పంచాయతీ, మండల పరిషత్ కార్యాలయాల నిర్మాణాలకు ఉపాధి హామీ పథకంలో కేంద్రం నుంచి అందే మెటీరియల్ నిధులే దిక్కు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంలో ఇల్లు మంజూరు చేసిన ప్రతి లబ్ధిదారుడు ఒక్కొక్కరికీ రూ. 55 వేలు ఉపాధి హామీ పథకం నిధులను చెల్లిస్తున్నారు. స్మశానాల చుట్టూ ప్రహరీ గోడ, పాఠశాలల్లో ఆటస్థలాలు, చివరకు మినీ స్టేడియాలకు ఈ రకమైన ‘ఉపాధి’ నిధులను ఖర్చు చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశించింది. దీంతో సిమెంట్ రోడ్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు అవసరమయ్యే ఉపాధి హామీ పథకం మెటీరియల్ నిధులు కేంద్రం నుంచి ఎక్కువ మొత్తంలో విడుదల కావాలంటే రాష్ట్రంలో కూలీల ద్వారా ఎక్కువ పని జరిగినట్టు రికార్డులు చూపించాలి. ఈ నేపథ్యంలో ఉపాధి పథకం 40 శాతం మెటీరియల్ నిధులను కేంద్రం నుంచి అధిక మొత్తం రాబట్టుకునేందుకు కూలీల పని కల్పనకు ప్రభుత్వం గ్రామాల్లో ఫీల్డు అసిస్టెంట్లకు టార్గెటు విధించింది. ప్రతి రోజూ ప్రతి జిల్లాకు లక్షల మంది చొప్పున కూలీలకు పని కల్పించాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో టార్గెట్లు పూర్తి చేసే ప్రక్రియ సులభమైన దొంగ మస్టర్ల నమోదు దందా ఊపందుకుంది. రెండురకాల ప్రయోజనాలతో నేతలదే హవా! గ్రామంలో ఉపాధి హామీ పథకంలో ఎక్కువ మంది పనిచేసిన దాని ప్రకారమే ఆ జిల్లా పరిధిలోని గ్రామాల్లో సిమెంట్ రోడ్లకు నిధులు కేటాయింపు ఉంటుందని ముఖ్యమంత్రి సహా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీ అంతర్గత సమావేశాల్లో ప్రచారం చేశారు. దీంతో గ్రామ స్థాయి టీడీపీ నేతలు తమ పరిధిలోని ఫీల్డు అసిస్టెంట్ల ద్వారా దొంగ మస్టర్లతో ఎక్కువ పనిచేసినట్టు చూపించే ప్రక్రియకు తెరతీశారు. తమకు అనుకూలమైన వారి పేరిట పంట కుంట (ఫామ్ ఫాండ్)లను మంజూరు చేసి, వాటిని పొక్లెయిన్ మెషీన్ల ద్వారా తవ్వించి, అదే పనిని కూలీలతో చేయించినట్టు రికార్డులు నమోదు చేయిస్తున్నారు. రూ.5 వేలు ఖర్చు పెట్టి పొక్లెయిన్ల ద్వారా చేసిన పనికి రూ. 30–40 వేల పనిని కూలీల ద్వారా చేసినట్టు చూపి సొమ్ము చేసుకుంటున్నారు. ఆ విధంగా రెండు రకాలుగా ప్రయోజనాలు పొందుతున్నారు. నెల్లూరు జిల్లాలో పోలీసు కేసు పొక్లెయిన్ల సహాయంతో తవ్విన పంట కుంటకు తమకు తెలిసిన కూలీల పేర్లతో పనిచేసినట్టు చూపి బిల్లు చేసుకోవడంపై శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇటీవల పోలీసు కేసు కూడా నమోదైంది. దుత్తలూరు మండలంలో కొందరు టీడీపీ నేతలు తమ గ్రామంలోని ఫీల్డు అసిస్టెంట్ సహాయంతో పొక్లెయిన్ల ద్వారా తవ్విన దాదాపు 10 పంట కుంటలకు కూలీల పేరుతో బిల్లు చేసుకున్నట్టు నమోదు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సోషల్ ఆడిట్లో ఈ విషయాలు వెలుగులోకి రావడంతో సిబ్బంది నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీంతో కొందరు టీడీపీ నేతలు పొక్లెయిన్ల ద్వారా తవ్విన దానికి కూలీల ద్వారా చేయించినట్టు మోసగించి తమ ద్వారా బిల్లు చేసుకున్నారంటూ సంబంధించిన సిబ్బంది మండల పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. -
కోరిక తీర్చలేదని.. కక్షగట్టారు!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఆమెకు తల్లిదండ్రుల్లేరు.. పేదరికం కారణంగా వివాహమూ కాలేదు.. చిన్న ఉద్యోగం చేసుకుంటూ పొట్టపోసుకుంటోంది. ఆమెపై ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు.. అయినా ఆ నిరుపేదరాలిపై కక్షగట్టారు. నాలుగు మెతుకులు పెడుతున్న ఆ చిన్న ఉద్యోగం నుంచి ఆమెను తొలగించారు. ఆమె చేసిన తప్పల్లా.. పై అధికారి కోరిక తీర్చకపోవడమే. దీంతో ఉపాధి కోల్పోయి వీధినపడ్డ ఆ అభాగ్యురాలు తనకు న్యాయం చేయాలంటూ ‘సాక్షి’ని ఆశ్రయించింది. ఉద్యోగమే ఆధారం: విజయనగరం జిల్లా జామి మండలం, లొట్లపల్లి గ్రామానికి చెందిన ఆమె పేరు జన్నెల వాణిశ్రీ. నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. ఐదుగురు ఆడపిల్లల్లో వాణిశ్రీ చిన్నమ్మాయి. ఇంటర్ వరకు చదివిన వాణిశ్రీ నాలుగేళ్ల పాటు కూలి పనులకెళ్లారు. 2006లో ఉపాధి హామీ పథకం రావడంతో ఫీల్డ్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరారు. అప్పటి నుంచీ మరో వ్యాపకం లేకుండా విధులకు అంకితమయ్యారు. 2008–09 సంవత్సరాల్లో తల్లిదండ్రులు కాలం చేశారు. ఒకప్పుడు కట్నం ఇవ్వలేక తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేయలేకపోయారు. ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచించే పరిస్థితిలో ఆమె జీవితం లేదు. కోరిక తీర్చు.. లేదా డబ్బులు కట్టు! ఈ నేపథ్యంలో పైఅధికారి కన్ను తనపై పడుతుందని ఆమె ఊహించలేదు. అతని బుద్ధి తెలిసి కుంగిపోయారు. డబ్బుకి పేదనైనా.. గుణానికి కాదంటూ అతని కోరికను తిరస్కరించారు. అదే ఆమె చేసిన నేరమన్నట్లు ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. ఉన్నవి, లేనివి కల్పించారు. రికార్డులు తారుమారు చేసి ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆమెను విధులకు రావొద్దన్నారు. ఆపై ఈ నెల 16వ తేదీన ఉద్యోగంలోంచి తొలగించారు. ఉద్యోగం కావాలంటే కోరిక తీర్చాలి లేదా.. రూ.30 వేలైనా ఇవ్వాలని పైఅధికారి చేసిన ప్రతిపాదన విని ఆమె కన్నీరు మున్నీరయ్యారు. న్యాయం కోసం డ్వామా పీడీకి, జిల్లా కలెక్టర్కు నేరుగా ఫిర్యాదుచేసినా ఫలితం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. విచారించాకే చర్యలు ఫిబ్రవరి నుంచి వాణిశ్రీ విధులకు హాజరు కావడం లేదు. దీనిపై విచారణ జరిపి విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఆదేశాలు జారీచేశాం. ఆమె స్థానంలో జన్మభూమి కమిటీ సూచించిన వ్యక్తిని నియమించాం. – శ్రీహరి, ఐదు మండలాల క్లస్టర్ ఏపీడీ. ఆమె మాటలు అవాస్తవం ఫీల్డ్ అసిస్టెంట్ వాణిశ్రీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. ఆమెను ఏ రకంగానూ వేధించలేదు. విధి నిర్వహణలో ఆమె చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటుంది. రికార్డులు కూడా సక్రమంగా నిర్వహించడం లేదు. ఆమెను తొలగించడానికి ఇంకా చాలా కారణాలున్నాయి. ఆమె స్థానంలో ఎవరో ఒకరిచే పనిచేయించుకోవాలి కాబట్టి వేరొకరిని నియమించుకున్నాం. – పి.కామేశ్వరరావు, ఉపాధి హామీ ఏపీవో, జామి మండలం. -
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
నెల్లూరు(పొగతోట): గూడూరు రూరల్ మండలంలోని ఉపాధిహామీ ఏపీఓ సుబ్బరాయుడిపై దాడి చేసిన అధికారపార్టీ నాయకుడి తనయుడు నాగరాజు, అతని అనుచరులను అరెస్ట్ చేయాలని మహాత్మాగాందీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉద్యోగుల సమాఖ్య(జేఏసీ) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బద్దిపూడి మధు, వల్లూరు దయానంద్ డిమాండ్ చేశారు. ఉపాధి హామీ సిబ్బందికి రక్షణ కల్పించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీఓపై అధికారపార్టీకి చెందిన వ్యక్తులు 20 మంది చుట్టుముట్టి మేము చెప్పిన పనులు చేయవా అంటూ పిడిగుద్దులు గుద్దుతూ, కాళ్ళతో తన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీఓ ప్రాణభయంతో పోలీస్స్టేషన్కు పరుగులు తీసిన పోలీసులు పట్టించుకోలేదన్నారు. ఉపా«ధి సిబ్బంది అభద్రతతో పనులు చేయలేమని తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ ఆర్.ముత్యాలరాజుకు వినతిపత్రం సమర్పించారు. జ్ఞానప్రకాష్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతి, ప్రధాని చిత్రపటాలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంచాలి రాష్ట్రపతి, ప్రధాని చిత్రపటాలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. సురేష్రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ మేరకు.. కలెక్టర్ ఆర్.ముత్యాలరాజుకు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి చిత్రపటాలను అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. న్యాయం చేయండి అల్లూరు చెరువు భూముల్లో పంటలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న యానాదులకు న్యాయం చేయాలని యానాది సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పెంచలయ్య కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు చెరువు భూముల్లో 140 యానాది కుటుంబాలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. సమ్మర్స్టోరేజ్ కోసం ఆ భూముల్లో ఐదెకరాలు మాత్రమే ప్రభుత్వం తీసుకుందన్నారు. గతంలో పంటలు సాగు చేసుకున్న యానాదులు భూముల్లోకి వెళితే ఎస్సీలు దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని కలెక్టర్ ఆర్.ముత్యాలరాజుకు వినతిపత్రం సమర్పించారు. భూస్వాముల నుంచి రక్షణ కల్పించండి.. పేద రైతులకు భూ స్వాముల నుంచి రక్షణ కల్పించేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని సీపీఐ సినియర్ నాయకులు పి.దశరథరామయ్య, వి. రామరాజు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు. నెల్లూరు రూరల్ మండలం కందమూరులో 150 ఎకరాల ప్రభుత్వ భూములను నిరుపేదలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. అయితే నెల్లూరుకు చెందిన వ్యాపారులు సాగు చేయనివ్వకుండా రైతులపై క్రిమినల్ కేసులు పెట్టారని తెలిపారు. అప్పటి కలెక్టర్ భూములను పరిశీలించి వ్యాపారులకు ఇచ్చిన పట్టాలను రద్దు చేయమని ఆదేశించినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం దొంగ పట్టాలు సృష్టించి రైతులను భూముల్లోకి దిగనివ్వకుండా అడ్డుపడుతున్నారన్నారు. భూములు సాగు చేస్తున్నా వారికి పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్.ముత్యాలరాజుకు వినతిపత్రం సమర్పించారు. సొసైటీకి ఎన్నికలు నిర్వహించాలి బ్రాహ్మణక్రాక ఫిషర్మెన్ కో–ఆపరేటివ్ సొసైటీకి ఎన్నికలు నిర్వహించేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని సొసైటీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. 1975లో జలదంకి మండలం బ్రాహ్మణక్రాక సోసైటీ రిజిస్టర్ అయిందన్నారు. ఎన్నికలు నిర్వహించకుండా జరిగినట్లు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కార్యవర్గ సభ్యుల గడువు పూర్తి అయినందున సోసైటీకి ఎన్నికలు నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతు జిల్లా కలెక్టర్ ఆర్. ముత్యాలరాజుకు వినతిపత్రం సమర్పించారు. -
నిధులు దుర్వినియోగం చేస్తే చర్యలు
బోధన్రూరల్(బోధన్): ప్రభుత్వ పథకాల అమలు, గ్రామీణ ప్రజలకు ఉపాధిహామీ కల్పనలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం, నిర్లక్ష్యానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం బోధన్ మండల పరిషత్ కార్యాలయంలో 10వ విడత మండలస్థాయి ఈజీఎస్ సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఈ తనిఖీలో మండలం లోని 32 జీపీల పరిధిలో ఉపాధిహామీ పథకంలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలు, రికార్డుల నమోదు, నిధుల వినియోగం వంటి అంశాలపై డీఆర్డీవో ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. 2016 సెప్టెంబర్ 1 నుంచి 2017 జూన్ 30 వరకు మండలంలో మొత్తం రూ. 12కోట్లకు పైగా ప్రభుత్వ నిధులు వినియోగించారని, అయితే ఇందులో సుమారు రూ. 3లక్షల వరకు నిధులు దుర్వినియోగం జరిగినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ఈ నిధులను ఫీల్డ్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్ల నుంచి రికవరీ చేపట్టామని వారు తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం గా వ్యవరించిన 70మంది మేట్లను తొలగించామని డీఆర్డీవో వెంకటేశ్వర్లు తెలిపారు. ఎంపీడీవో మల్లారెడ్డి, ఈవోపీఆర్డీ రాజేశ్వర్, ఈజీఎస్ ఏపీఓ రాజేశ్వర్, సోషల్ ఆడిట్ అధికారి చంద్రశేఖర్, ఎస్ఆర్పీపీలు రాము, రవి పాల్గొన్నారు. -
ఎవరు బాధ్యులు?
కొన్ని నిర్ణయాలు అమాయకులను బలితీసుకుంటాయి. కొందరి వేధింపులు కొన్ని బతుకులను రోడ్డున పడేస్తాయి. కొత్తవలసలో ఇటీవల చోటు చేసుకుంటున్న సంఘటనలు అక్కడి అధికారుల నిర్ణయాలను ప్రశ్నిస్తున్నాయి. నెల రోజుల క్రితం ఓ కాంట్రాక్టు బోర్ మెకానిక్ ఆత్మహత్య చేసుకోగా... తాజాగా ఉపాధిహామీ ఫీల్డు అసిస్టెంట్ కూడా ఆ బాటలోనే ప్రాణాలు తీసుకున్నాడు. ఇవి యాదృచ్ఛికమే అయినా... ఇందుకు ప్రోత్సహించిన పరిణామాలను ఉన్నతాధికారులు గుర్తించాల్సిన అవసరం ఉంది. సాక్షిప్రతినిధి, విజయనగరం: కొత్తవలస మండలం కంటకాపల్లి పంచాయతీ ఉపాధి హామీ పథకం క్షేత్రసహాయకుడైన పెదిరెడ్ల ఆనంద్ను రెండేళ్ల క్రితం సస్పెండ్ చేశారు. సోషల్ ఆడిట్లో అభ్యంతరాలు వ్యక్తం కావడంతో అప్పటి పీడీ ప్రశాంతి ఈ చర్యలు తీసుకున్నారు. అనంతర కాలంలో అతనిపై వచ్చిన ఆరోపణలు రుజువుకాకపోవడంతో తిరిగి విధుల్లోకి తీసుకోవాల్సిందిగా అక్కడి ఎంపీడీఓ పి.నారాయణరావుకు సూచించారు. కానీ ఆయన మాత్రం ఇంకా ఆనంద్ సస్పెన్షన్లోనే ఉన్నాడంటున్నారు. రెండేళ్ల నుంచి ఆనంద్ విధులు నిర్వర్తిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఆయన చేసిన సంతకాలను కంప్యూటర్ ఆపరేటర్, ఏపీఓ, ఎంపీడీఓలు ధ్రువీకరించి లక్షల రూపాయల బిల్లులు కూడా చేసేశారు. గత జూలై 15వ తేదీ వరకూ ఉపాధి పనులకు సంబంధించి ఎన్ఎంఆర్ షీట్లలో ఆనంద్ చేసిన సంతకాలు ఉన్నాయి. రెండేళ్ల క్రితమే విధులకు దూరమైన ఉద్యోగి వాటిలో ఎలా సంతకాలు చేశారన్నది జవాబు లేని ప్రశ్న. జీతం లేకున్నా... కానీ ఆయనకు రెండేళ్లుగా జీతం రావడం లేదు. ఇంతలో ఏమైందో ఏమో మూడు నెలల క్రితం నుంచే ఆనంద్ను విధులకు రానివ్వడం లేదు. రెండేళ్లుగా జీతం లేక, మూడు నెలలుగా ఉద్యోగం లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆనంద్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆనంద్ ఇచ్చిన రికార్డుల ఆధారంగా ఉపాధి హామీలో దాదాపు రూ.40 లక్షల బిల్లులు మంజూరయ్యాయి. రెండేళ్ల క్రితం సస్పెండ్ అయిన ఆనంద్ సంతకానికి ఇన్ని లక్షల రూపాయలు ఎలా విడుదలయ్యాయి. మూడు నెలల క్రితం నుంచే విధులకు హాజరుకాకపోవడం ఏమిటి ఇవన్నీ అనుమానాలు రేకెత్తిస్తున్న అంశాలే. నెల రోజుల క్రితం బోర్మెకానిక్... గ్రామీణ నీటి సరఫరా విభాగంలో(ఆర్డబ్ల్యూస్) కాంట్రాక్ట్ బోర్ మెకానిక్గా పనిచేస్తున్న మునగపాక శ్రీనివాసరావు కొత్తవలస–కె కోటపాడు రోడ్డులో ఉన్న పాత ఎంపీడీఓ కార్యాలయం సమీపంలోని ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో గత నెల 14వ తేదీన ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నిజానికి ఆయన మరణానికి కూడా అధికారులే కారణమంటున్నారు. మూడు నెలల పాటు అతనికి జీతం ఇవ్వకుండా నిలిపివేయడంతో అతను మనస్తాపం ప్రాణాలు తీసుకున్నాడన్నది ఆరోపణ. అతను మరణించిన తర్వాత కూడా ప్రాణాంతక వ్యాధివల్ల ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులతో కలిసి స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు తప్పుడు ప్రచారం చేయగా తన్నులు కూడా తిన్నారు. ఈ కేసు ఇంకా నడుస్తోంది. ఈ లోగానే ఆనంద్ ఆత్మహత్య చేసుకోవడం, ఇద్దరూ ఒకే ఎంపీడీఓ పరిధిలో పనిచేసేవారే కావడం విశేషం. -
అభివృద్ధిని అడ్డుకుంటోందని ప్రచారం చేయండి
సాక్షి, అమరావతి: రాష్ట్ర అభివృద్ధిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందంటూ విస్తృతంగా ప్రచారం చేయాలని టీడీపీ నేతలను తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇందుకు కరపత్రాలు పంపిణీ చేయాలని సూచించారు. ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం జరుగుతున్న తీరుపై బుధవారం చంద్రబాబు తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఉపాధి హామీ పనులను కార్మికులతో కాకుండా యంత్రాలతో చేయిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, అవినాశ్రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారని సీఎం వివరించారు.యంత్రాలతో చేయిస్తున్నా మన్న విషయాన్ని పక్కనపెట్టి.. వైఎస్సార్సీపీ వల్లే ఉపాధి హామీ పథకం నిధులు రాలేదని ప్రచారం చేయాలని సూచించారు. కొత్త నాయకులు వస్తారని హెచ్చరిక ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం కొన్ని నియోజకవర్గాల్లో తూతూమంత్రంగా జరగడంపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు సరిగా లేకపోతే రాజకీయ భవిష్యత్ ఉండదని, వారి స్థానంలో కొత్త నాయకులు వస్తారని హెచ్చరించారు. జిల్లా పార్టీ ఇన్చార్జ్లు అన్ని నియోజకవర్గాల్లో కార్య క్రమం ఎలా జరుగుతుందో రోజూ తెలుసు కోవాలన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు లేనిచోట నియోజకవర్గ ఇన్చార్జ్లు ఈ కార్యక్రమం నిర్వహించాలన్నారు. ఇళ్ల నిర్మాణంతో పాటు రేషన్ షాపుల్లో చక్కెర, కిరోసిన్ అందడం లేదంటూ ప్రజలు మండిపడుతున్నారని పలువురు నేతలు చెప్పగా బాబు పరిశీలిద్దామంటూ జవాబిచ్చారు. -
హమ్మయ్యా.. ఇప్పటికి బయటపడ్డాం !
♦ వాయిదా పడ్డ కేంద్ర బృందం పర్యటన ♦ ఊపిరి పీల్చుకుంటున్న ‘ఉపాధి’ సిబ్బంది ♦ రికార్డుల్లో లొసుగులతో అంతర్గత మధనం ♦ అంతర్గత ఆడిట్లో సంతృప్తికర ఫలితాలు ♦ వచ్చాయంటున్న అధికారులు రికార్డుల పరిశీలనకు కేంద్ర బృందం రానున్నదనే సమాచారంతో ఉపాధి హామీ పథకం సిబ్బందిలో గుబులు మొదలైంది. హడావుడిగా గత కొన్ని రోజులుగా రాత్రనకా, పగలనక రికార్డులు సేకరించే పనిలో పడ్డారు. సంబంధిత జిరాక్సు కాపీలకే వేల రూపాయలు ఖర్చయ్యాయంటే ఏమేరకు సిద్ధపడ్డారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు కేంద్రం బృందం పర్యటన తాత్కాలికంగా వాయిదా పడిందన్న సమాచారంతో కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు... సాక్షి, మచిలీపట్నం : ఉపాధి హామీ పథకం సిబ్బందికి కాస్త ఉపశమనం కలిగినట్లయింది. ఇప్పటి వరకు పథకంలో చేపట్టిన పనులకు సంబంధించిన రికార్డుల పరిశీలనకు ఈనెలలో రాష్ట్ర, కేంద్ర బృందాలు జిల్లాలో పర్యటించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పథకం సిబ్బంది, అధికారులు హడావుడిగా రికార్డులు సిద్ధం చేసుకున్నారు. తమ తప్పులు ఎక్కడ బహిర్గమవుతాయోనని ఆందోళన చెందిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం జిల్లాకు రాష్ట్ర బృందం మాత్రమే తనిఖీలకు వచ్చినట్లు సమచారం. కేంద్ర బృందం తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వెళ్లినట్లు తెలిసింది. దీంతో జిల్లా ఉపాధి అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కేంద్ర బృందం పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తే.. ఆ తనిఖీ ల్లో రికార్డుల నిర్వహణ, నిధుల వెచ్చింపుల్లో తేడాలు వస్తే శాఖపరమైన చర్యలకు బలవ్వాల్సిన పరిస్థితి వస్తుందని మదన పడ్డారు. అంతర్గత ఆడిట్లో సంతృప్తికర ఫలితాలు ! ఉపాధి పథకం నిధులతో జిల్లావ్యాప్తంగా అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఏటా రూ.కోట్లు వెచ్చిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలు, పంచాయతీల్లో రహదారుల నిర్మాణం, మరుగుదొడ్లు, ఎన్టీఆర్ గృహాలు తదితర వాటికి రూ.కోట్ల నిధులు మంజూరవుతున్నాయి. గత ఐదేళ్లలో జిల్లా వ్యాప్తంగా రూ.400 కోట్లతో వివిధ ప్రాంతాల్లో ఉపాధి పనులు చేపట్టినట్లు సమాచారం. కాగా ఈ పనులకు సంబంధించిన రికార్డుల నిర్వహణ గతంలో గందరగోళంగా ఉండేది. కేంద్ర బృందం జిల్లాలో పర్యటించనుందన్న ఆదేశాలతో అధికారులు రికార్డుల క్రమబద్ధీకరణకు శ్రీకారం చుట్టారు. ఒక్కో మండలంలో రూ.50 వేలు జిరాక్స్ కాపీలకే వెచ్చించారంటే ఏ మేరకు క్రమబద్ధీకరించారో అర్థం అవుతోంది. గత నెలలోనే బృందం జిల్లాకు రావాల్సి ఉండగా.. వాయిదా పడుతూ వచ్చింది. ఈనెలలో కూడా బృందం వచ్చే సూచనలు కనిపించకపోవడంతో ఉద్యోగుల్లో ఆనందం వెల్లువెత్తుతోంది. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా అధికారులు ఐదేళ్లుగా ఉపాధి పథకం నిధుల వ్యయంపై అంతర్గత ఆడిట్ నిర్వహించారు. ఆ ఆడిట్లో ఎలాంటి అవకతవకలు, నిధుల దుర్వినియోగం బహిర్గతం కాలేదని డ్వామా పీడీ రాజగోపాల్ తెలిపారు. తాను బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎలాంటి అవకతవకలకు ఆస్కారం ఇవ్వలేదన్నారు. రికార్డుల నిర్వహణ సైతం పక్కాగా చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే అంతర్గత ఆడిట్లో సైతం ఎలాంటి తప్పులు బయటపడలేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
దసరాలోపు ఉపాధి హామీ వేతనాలు
► గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి సాక్షి, న్యూఢిల్లీ: ఉపాధి హామీ పథకంకింద కూలీ లకు వేతన బకాయిలను దసరా లోపు చెల్లించేందుకు చర్యలు చేపట్టినట్టు తెలంగాణ గ్రామీణాభి వృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గురువారం ఇక్కడ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి అమర్జిత్ సిన్హాతో భేటీ అయిన అనం తరం కృష్ణారావు మీడియాతో మాట్లాడారు. నరేగా కింద కేంద్రం ఇవ్వాల్సిన రూ.250 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కార్యదర్శిని కోరినట్టు తెలిపారు. కేంద్రం నిధులు విడుదల చేయనం దున వేతనాలు చెల్లించడం ఇబ్బందిగా మారిందని వివరించారు. బకా యిల్లో రూ.200 కోట్లను తక్షణం విడుదల చేసేందుకు చర్యలు తీసు కుంటున్నట్టు కార్యదర్శి చెప్పారని మంత్రి వివరించారు. అలాగే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ నగేష్సింగ్తోనూ జూపల్లి భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తెజావత్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి హామీకి వెయ్యి కోట్లివ్వండి
కేంద్రానికి మంత్రి జూపల్లి లేఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి రావాల్సిన ఉపాధి హామీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్కు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. శనివారం ఈ మేరకు కేంద్ర మంత్రికి లేఖ రాశారు. రూ.500 కోట్ల వేతన, రూ.500కోట్ల మెటీరియట్ కాంపోనెంట్ నిధులను విడుదల చేయాలని కోరారు. రాష్ట్రం లో 438 మండలాలు, 8,517 గ్రామాల్లో ఉపాధి హామీ పథకాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడు గుం తలు, అంగన్వాడీ, గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలు, అంతర్గత రోడ్ల నిర్మాణం భారీ స్థాయిలో చేపడుతున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.250 కోట్ల వేతన, రూ.135 కోట్ల మెటీరియల్ కాంపో నెంట్ నిధులను కేంద్రం విడుదల చేయాల్సి ఉందని లేఖలో జూపల్లి వివరించారు. కేంద్రం నుంచి నిధుల విడుదలలో జాప్యం వల్ల ఉపాధి పనుల పురోగతికి ఆటంకం ఏర్పడు తోందన్నారు. -
కూలీలకు అందని రెక్కలకష్టం
♦ 2 నెలలుగా ‘ఉపాధి’ బిల్లుల పెండింగ్ ♦ అమలు కాని మూడు రోజుల పేమెంట్ ప్రణాళిక ♦ పస్తులుంటున్న కూలీలు ఫలితమివ్వని సర్కారు లక్ష్యం దినాం కూలికి పోవాలె.. మీరు సెప్పినట్టు పనిచేయాలె.. కాని కూలికి మాత్రం నెలల తరబడి ఆగాలె.. గిదేం పనో అర్థమైతలేదు.. రెండు నెలలైంది బిల్లులిచ్చి.. రెక్కల కష్టానికి అప్పుడే పైసలిస్తే బాగుంటది.. చేతిలో చిల్లిగవ్వలేక పస్తులుంటున్నం.. జర మా గురించి పట్టించుకోండయ్యా.. అంటూ ఏ గ్రామానికి వెళ్లినా ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలను అధికారులను ఇలావేడుకుంటున్నారు. జెడ్పీసెంటర్(మహబూబ్నగర్) : వలసల నివారణకు ప్రభుత్వం గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఉపాధి హామీ పథకం నీరుగాతోంది. అధికారులు అడిగిన వారందరికీ పని కల్పిస్తున్నా చేసిన కష్టానికి మాత్రం నిరీక్షించేలా చేస్తున్నారు. ప్రభుత్వం జూలైలో రూ.10 నిధులు విడుదల చేసినా వాటిని పంపిణీ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. రెండు నెలలనుంచి చెల్లింపులు పెండింగ్లో ఉండటంతో కూలీలు పస్తులుండాల్సి వస్తోంది. రెండు నెలలుగా పెండింగులో.. జిల్లాలో సుమారు రెండు నెలల నుంచి కూలీ డబ్బులు పెండింగ్లో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 10,767 మంది కూలీలకు రూ.10 కోట్ల డబ్బులు రావాల్సి ఉంది. 2017–18 ఆర్థిక సంవత్సరం జిల్లాలో 68 లక్షల పని దినాలు కల్పించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటిదాక 31.45 లక్షల పని దినాలను మాత్రమే కల్పించారు. జూలైలో రూ.14 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఇంకా జిల్లాకు రూ.10 కోట్ల నిధులు విడుదల కావాల్సి ఉంది. కూలి డబ్బుల చెల్లింపు క్రమాన్ని పరిశీలిస్తే 42.14 శాతం కల్పించినట్లు లెక్కలు చెబుతున్నాయి. వారం రోజులుగా కూలీలు చేసిన కష్టానికి ఆ వారం చివరి రోజు నుంచి మూడు రోజుల్లో చెల్లిం పు ఆర్డర్ను జనరేట్ చేయాలి. ఈ మేరకు చెల్లింపులు అస్సలు అమలు కావడం లేదు. పనితీరు ఇలా.. జిల్లాలో 21 మండలాలు, 485 గ్రామాలు, 1049 ఆమ్లెట్ గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 2,49,192 జాబ్కార్డులు ఉన్నాయి. 447 గ్రామాల్లో ఉపాధి పనులు జరుగుతున్నాయి. ఇప్పటిదాక 91,653 కుటుంబాలకు పని కల్పించగా ఇందులో 1,47,725 కూలీలకు పని పొందారు. వీటికి ఇçప్పటిదాక 49.16 శాతం వేతనాలను చెల్లించారు. ఇప్పటి దాక 2,06,159 లక్షల పనులు చేపట్టగా ఇందులో 54187 పనులు నిర్మాణంలో ఉన్నాయి. 1,51, 972 పనులు పూర్తి చేశారు. బడ్జెట్ బాగానే ఉన్నా.. జిల్లాలో 2017–18 ఆర్థిక సంవత్సరానికి అధికారులు 68 లక్షల పని దినాలతో లేబర్ బడ్జెట్ తయారు చేశారు. జిల్లాలో 2,49,192 బాజ్కార్డులుండగా 10,767 మంది కూలీలకు డబ్బులు రావాల్సి ఉంది. సుమారు రెండునెలల నుంచి 42.14 శాతం మాత్రమే నమోదు కావడంతో క్షేత్రస్థాయిలో ఈ పథకం అమలు లోటుపాట్లున్నట్లు స్పష్టమవుతోంది. ఏటా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా అధికారుల శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పని చేయని ఈఎంఎంఎస్ కూలీల హాజరు, పనుల నాణ్యతలో పారదర్శకత, సిబ్బందికి పని భారం తగ్గించడం కోసం ప్రభుత్వం ప్రమోగాత్మకంగా జీపీఎస్తో అనుసంధానించి అమలు చేస్తున్న ఎలక్ట్రానిక్ మాస్టర్ మెజర్మెంట్ సిష్టం (ఈఎమ్మెమ్మెఎస్) ఎగతాళికి గురయింది. దీనికోసం ప్రభుత్వం అన్ని స్థాయి ఉద్యోగులకు స్మార్ట్ఫోన్లు ఇచ్చింది. క్షేత్రసహాయకుల, సాంకేతిక సహాయకుల కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఏ రోజుకారోజు కూలీల హాజరును ఫీల్డ్ అసిస్టెంట్ వారం మొత్తం చేసిన పనికి సంబంధించి కొలతలను టెక్నికల్ అసిస్టెంబట్ ఫొటోలతో సహాయ ఇంటర్నెట్లో అప్లోడ్ చేయాలి. ఉపగ్రహ ఫొటోలు పని ప్రదేశాల వద్ద నుంచి అప్లోడ్ చేశారా.? లేదా? అనేది ఎక్కడి నుంచి పంపారో తెలిసిపోతుంది. సిబ్బంది అక్రమాలను అరికట్టడమేగాక పనితీరులో మార్పు వస్తుంది. ఈ మాస్టర్ ఎంసీపీలో వెంటనే జరరేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కూలీలకు చెల్లింపు సకాలంలో చేతికందుతాయి. నిర్లక్ష్యం వీడని సిబ్బంది కలెక్టర్ రొనాల్డ్రోస్ ఉపాధి పనులను వేగవంతం చేయడానికి తరచూ జిల్లాలో ఎక్కడో ఓ చోట సమీక్షలు, క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేస్తున్నారు. గ్రామాల్లో ప్రతి ఒక్క ఫీల్డ్ అసిస్టెంట్ కనీసం 50 మంది కూలీలకు పని కల్పించాలని ఆదేశించారు. కానీ కనీసం పది మందికి కూడా ఉపాధి లభించడంలేదు. అత్యధిక కూలీలున్న ఈ జిల్లాలోనే పథకం విజయవంతం చేయడానికి అధికార యాంత్రాంగం విఫలమవుతోంది. ఆరు నెలలుగా పనులు అతి తక్కువగా జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలో కనీసం వంద మందికి పనులు కల్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా 20 నుంచి 30 మందికి మించడంలేదు. వారికి నిర్దేశించిన లక్ష్యంలో కేవలం 17 శాతం మాత్రమే పనులు కల్పించారు. అత్యల్పంగా పని కల్పించిన 116 మంది సిబ్బంది జాబితాను తయారుచేశారు. -
‘ఉపాధి’పై ఆరా
► ఉపాధి హామీ పథకం నిధుల వ్యయంపై కేంద్రం విచారణ ► నెలల తరబడి కూలీలకు నిలిచిన చెల్లింపులు ► నిధుల వ్యయంలో అవకతవకలే కారణం ► నేడు జిల్లాకు కేంద్ర బృందం రాక ఒంగోలు సెంట్రల్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తీరుతెన్నులపై కేంద్ర ప్రభుత్వ బృందం నేడు జిల్లాలో పర్యటించి, పరిశీలించనుంది. ఇప్పటికే నిధుల విడుదలను నిలిపేసింది. ఈ పథకం కింద కేంద్రం 90 శాతం నిధులు ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 10 శాతం విడుదల చేస్తూ రాష్ట్రంలో ఉపాధి హామీ పనులను నిర్వహిస్తోంది. అయితే కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం సొంత పథకాలకు నిధులను దారి మళ్లించడం, నిధుల వినియోగానికి సంబంధించి లెక్కలు లేకుండా కనీసం పుస్తక నిర్వహణ కూడా లేకపోవడంతో నిధుల విడుదలను ఆపేసింది. దీంతో ఉపాధి హామీ పనులను ప్రత్యక్షంగా అధ్యయనం చేయడానికి కేంద్ర బృందం సోమవారం జిల్లాకు వస్తున్నట్లు సమాచారం. ఈ బృందం క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం సంతృప్తి చెందితేనే రాష్ట్రానికి, తద్వారా జిల్లాకు ఉపాధి నిధులు మంజూరవుతాయి. ఇప్పటికే జూన్ నెలలో కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో ఉపాధి పనులను పరిశీలించిన కేంద్ర బృందం నివ్వెరపోయింది. ఈ పరిశీలనలో ఎక్కడా రికార్డులు లేకపోవడం, ఒక వేళ ఉన్నా అసంపూర్తిగా ఉండటంతో ఉపాధి పనుల్లో అవకతవకలు జరుగుతున్నట్లు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చి నిధుల విడుదలను నిలిపేసింది. నేడు జిల్లాలో కేంద్ర బృందం పర్యటిస్తున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బంది ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పాత పనులకు సంబంధించి పాత తేదీలతో సెలవు రోజుల్లో కూడా సిబ్బంది పనిచేసి రికార్డులను నమోదు చేయడంలో నిమగ్నమయ్యారు. నెలన్నరకు పైగా ఉపాధి కూలీని కూడా విడుదల చేయలేదు. కూలీ కంటే మెటీరియల్ చెల్లింపులే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర పథకాలపై ప్రభావం: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి నిధులను దారి మళ్లించి తన సొంత పథకాలకు వినియోగిస్తుందనే అంశంపై ముఖ్యంగా కేంద్ర బృందం పరిశీలించనున్నట్లు సమాచారం. చంద్రన్న బాట కింద సీసీ రహదారులు, అంగన్వాడీ కేంద్రాలకు మెరుగులు, పంచాయతీ కార్యాలయాల నిర్మాణం, నీటితొట్టెలు, వర్మీ కంపోస్టు తదితర పథకాలకు ఉపాధి నిధులను వెచ్చిస్తున్నారని కొంత వరకూ గుర్తించినట్లు సమాచారం. కేంద్రం తన వాటా కింద 90 శాతం నిధులు ఉపాధి హామీకి విడుదల చేస్తున్న నేపథ్యంలో, రాష్ట్రం తన సొంత పథకాలకు వాటిని ఎలా ఖర్చుచేస్తారనే విషయంపై తీవ్ర స్థాయిలో మండిపడినట్లు సమాచారం. అంతే కాకుండా క్షేత్ర స్థాయిలో నిధులను ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసినట్లు గత పరిశీలనలో కేంద్ర బృందాలు తెలుసుకున్నాయి. నివేదిక మేరకే నిధులు: జూన్ 23 నుంచి జిల్లాలో ఉపాధి కూలీలకు వేతనం, మెటీరియల్ కాంపోనెంట్ చెల్లింపులకు సంబంధించిన బకాయిలు దాదాపు రూ.80 కోట్ల వరకూ ఉన్నట్లు సమాచారం. ఇందులో అత్యధికం కూలీల బకాయిలే ఉండటం విశేషం. మెటీరియల్ కాంపోనెంట్కు సంబంధించి ఎప్పటికప్పుడు నిధులు చెల్లిస్తున్నారు. నిలిచిపోయిన ఉపాధి కూలీ దాదాపు 9 లక్షల పని దినాలకు సంబంధించి బకాయిలు చెల్లించాలి. జిల్లాలో 7.88 లక్షల ఉపాధి కార్డులు ఉండగా వీరిలో పనిచేస్తున్న కుటుంబాలు 3.60 లక్షలు, కూలీలు 6 లక్షల మంది పనిచేస్తున్నారు. ఏ లక్ష్యంతో ఉపాధి హామీని ఏర్పాటు చేశారో ఆ లక్ష్యం ప్రస్తుతం నెరవేరడం లేదు. వర్షాభావంతో ఉపాధి పథకమే ఏకైక దిక్కుగా ఉన్న రోజుల్లో ఉపాధి చేసిన నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోవడంతో రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్న కూలీల జీవనం ప్రశ్నార్థకంగా మారింది. -
అవినీతికి అధికారం అండ
► ‘ఉపాధి’లో అంతులేని అక్రమాలు ► సిబ్బందికి అండగా విచారణాధికారి అనుకున్నదే జరిగింది. ముందుస్తు ప్రణాళిక ప్రకారం ప్రొసీడింగ్ అధికారి, విజిలెన్స్, క్వాలిటీ కంట్రోల్ అధికారులు అవినీతిపరులకు అండగా నిలిచారు. రూ.కోట్ల ప్రజా ధనాన్ని బొక్కేసిన అధికారపార్టీ నాయకులకు, ఉపాధి సిబ్బందికి హాని జరగకుండా కంటికి రెప్పులా కాపాడారు. సామాజిక తనిఖీ బృందం ఉపాధి పనుల్లో భారీగా జరిగిన అవినీతికి ఆధారాలు చూపిస్తున్నా బహిరంగ చర్చా వేదిక మీద న్యాయ నిర్ణేతలు పట్టించుకోలేదు. తమ గ్రామాల్లో ఉపాధిలో జరిగిన అవినీతి గురించి చెప్పేందుకు వచ్చిన వారు ప్రొసీడింగ్ అధికారి తీరు చూసి న్యాయం జరగదని వెనుదిరిగారు. ఇదంతా సీతారామపురం మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఉదయం 11 గంటల నుంచి ఆదివారం ఉదయం 7 గంటల వరకు నిర్వహించిన ఉపాధి హామీ పథకం బహిరంగ చర్చావేదిక వద్ద జరిగింది. ఉదయగిరి/సీతారామపురం: సీతారామపురం మండలంలో 2016 మార్చి నుంచి 2017 జూన్ వరకు జరిగిన రూ.16.77కోట్ల ఉపాధి పనులకు సంబంధించి జూలై 28 నుంచి ఆగస్టు 18 వరకు సోషల్ ఆడిట్ బృందం క్షేత్రస్థాయిలో పనులు తనిఖీ చేసి అందులో లోపాలు, అవినీతిని గుర్తించి చర్చావేదక వద్ద తమ నివేదికలు చదివి వినిపించారు. వీరు తమ క్షేత్ర పరిశీలనలో రూ.9.84కోట్లు అవినీతి జరిగినట్లు గుర్తించారు. ఇందులో యంత్రాలతో పనులు చేసి బినామీ మస్టర్లు వేసి నేతలు, సిబ్బంది రూ.కోట్లు దిగమింగారు. పనులు చేయకుండానే పెద్ద మొత్తంలో దోచేసిన వైనం గురించి వేదిక ముందుంచారు. నాయకులు, ఉపాధి సిబ్బంది, సామగ్రి సప్లయర్లు ఏ విధంగా ఉపాధి నిధులు కాజేశారో సవివరంగా తెలియజేశారు. అయినా దీంతో మాకు పని ఏముంది, న్యాయ నిర్ణేతను తాను అయినందున తాను చెప్పింది వేదం అన్నట్లుగా ప్రొసీడింగ్ అధికారి నాసర్రెడ్డి వ్యవహరించారు. రూ.కోట్లలో జరిగిన అవినీతిని భారీగా తగ్గించి రూ.87 లక్షలకు కుదించారు. ఉపాధి సిబ్బందికి, నాయకులతో కుదిరిన ఒప్పుందం మేరకు, బహిరంగ వేదిక వద్ద ముందే చెప్పిన విధంగా జరిగిన అవినీతితో నిమిత్తం లేకుండా పది శాతం మాత్రమే రికవరీకి ఆదేశాలిచ్చారు. ఊపిరి పీల్చుకున్న తెలుగు తమ్ముళ్లు, సిబ్బంది మండలంలో భారీగా జరిగిన అవినీతి ఎక్కడ బయటపడి పరువు పోతుందో అనే ఆందోళనతో ఉన్న తెలుగు తమ్ముళ్లు ప్రొసీడింగ్ అధికారి సహకారంతో ఊపిరి పీల్చుకున్నారు. సస్పెన్షన్లు తప్పవని కంగారుగా ఉన్న ఉపాధి సిబ్బందిపై కూడా సదరు అధికారి ప్రేమ చూపడంతో చిన్న చర్యలు కూడా లేకపోవడంతో ఎగిరి గంతులు వేస్తున్నారు. నియోజవర్గంలో ఇప్పటికే అధికారి పార్టీ ముఖ్య నేతలు పసుపు కుంభకోణంలో చిక్కి క్రిమినల్ కేసులు నమోదు కావడంతో పార్టీ ప్రతిష్ట, ఎమ్మెల్యే పరువు పోయింది. ఇదే తరుణంలో ఉపాధి అవినీతి బయటపడితే ప్రజల వద్ద మరింత పలచనవుతామని కంగారుపడ్డారు. దీంతో సదరు నాయకులు చర్చావేదికకు వచ్చిన అధికారులను లోబరుచుకున్నట్లు తెలుస్తోంది. అధికారులు చేసిన మేలుకు ప్రతిఫలంగా రూ.లక్షల్లో ముడుపులు ముట్టాయనే ప్రచారం సాగుతోంది. అధికారుల తీరుపై విస్మయం అవినీతికి పాల్పడిన అధికారులు, సిబ్బంది అంతు తేల్చే కలెక్టర్ ఉన్నప్పుటికీ పక్కాగా జరిగిన అవినీతిని కప్పిపుచ్చిన అధికారుల తీరుపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని నిజాయితీ అధికారులతో విచారణ చేయిస్తే అవినీతిపరుల భరతం పట్టే అవకాశం ఉంది. ఇదేమీ తీరు మండలంలో 15 నెలలకు సంబంధించి రూ. 16.77 కోట్ల ఉపాధి పనులు నిర్వహించారు. వాటిలో మెటీరియల్ పనులు రూ.7 కోట్లు, కూలీల పనులు రూ.9.75 కోట్లు జరిగాయి. జిల్లాలోనే ఎక్కువ పనులు, అవినీతి జరిగే మండలం సీతారామపురం అనే విషయం జిల్లా అధికారులకు బాగా తెలుసు. అయితే ఈ మండలంలో జరుగుతున్న అవినీతిపై మీడియా, పత్రికలు పెద్దగా ఫోకస్ చేయకపోవడంతో వాస్తవాలు వెలుగులోకి రావడం లేదు. దీంతో జిల్లా అధికారులు కూడా పెద్దగా దృష్టి సారించడం లేదు. ఇదే ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకు, ఉపాధి సిబ్బందికి, రాజకీయ నాయకులకు వరంగా మారింది. దీంతో ఇష్టారాజ్యంగా ప్రజా ధనాన్ని మింగేస్తున్నారు. ఈ పరిణామం భవిష్యత్తులో అక్రమార్కులు మరింత అవినీతికి పాల్పడేందుకు ఆస్కారం కల్పిస్తోంది. చర్చా వేదికలో ప్రొసీడింగ్ అధికారి రికవరీకి ఆదేశించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉపాధి సిబ్బంది నుంచి రూ.45.10 లక్షలు, కూలీల నుంచి రూ.4.80 లక్షలు, లబ్ధిదారుల నుంచి రూ.2.92 లక్షలు, సప్లయిదారు నుంచి రూ.9 లక్షలు, ఫారెస్ట్ అధికారులు నుంచి రూ.14.76 లక్షలు, ఇరిగేషన్ శాఖ నుంచి రూ.2.84 లక్షలు రికవరీకి ఆదేశించారు. అదేవిధంగా వివిధ పంచాయతీల్లో 42 పనులను క్వాలిటీ కంట్రోల్ అధికారులు, రెండు పనులు ఏపీడీకి పరిశీలనకు ఇచ్చారు. -
కూలీల సొమ్ము ఏమాయె !
అనంతపురం టౌన్: వలసల్ని నివారించి ఉన్న ఊరిలోనే ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకం అక్రమార్కులకు వరంగా మారుతోంది. బినామీ ఖాతాలు తెరిచి గుట్టుచప్పుడు కాకుండా నిధులు స్వాహా చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రెండున్నరేళ్ల వ్యవధిలో ఏకంగా రూ.15 కోట్లకు పైగా ఉపాధి కూలి సొమ్ము ‘సస్పెండ్’ అయింది. సుమారు 95 వేల మంది కూలీలకు ఈ డబ్బు చెల్లించాల్సి ఉందని రికార్డుల్లో ఉన్నా అసలు కథ వేరేలా ఉంది. సగానికి పైగా కూలీల సొమ్మును బోగస్ అకౌంట్లలో వేసుకునేందుకు క్షేత్రస్థాయి అధికారులు స్కెచ్ వేశారు. అయితే ‘ఆధార్’ అనుసంధానంతో ఈ వ్యూహం బెడిసికొట్టినట్లు స్పష్టమవుతోంది. సస్పెండ్లో ఉన్న సొమ్మును క్లెయిం చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడం దీనికి బలం చేకూరుస్తోంది. ∙క్లెయిం చేసుకునేందుకు వెనుకంజ గత ఏడాది డిసెంబర్ నుంచి ఆధార్ అనుసంధానమైన బ్యాంక్ ఖాతాలకు నేరుగా వేతనాలను జమ చేస్తున్నారు. పనులు చేస్తున్న కూలీలకు చెల్లించాల్సిన డబ్బు పక్కదారి పట్టకుండా తీసుకొచ్చిన ఈ విధానంతో అక్రమార్కులకు చెక్ పడగా.. నిజంగా పనులు చేసి తమ బ్యాంక్ ఖాతాకు ఆధార్ అనుసంధానం కాని కూలీలకు కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది. చాలా మంది కూలీలు తమ అవసరాల నిమిత్తం రెండు, మూడు బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు. ఎంసీసీ (మండల కంప్యూటర్ సెంటర్)ల్లో ఉపాధి కూలీకి సంబంధించి జాబ్కార్డు, ఆధార్, బ్యాంక్ ఖాతాలు ‘లింక్’ చేశారు. తద్వారానే పేమెంట్స్ జనరేట్ చేసే అవకాశం ఉంది. అయితే కూలీల ఖాతాల్లో నగదు పడాలంటే తప్పనిసరిగా బ్యాంక్లో ఆధార్ అనుసంధానం కావాలి. ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో చాలా మందికి వారాల తరబడి వేతనాలు అందడం లేదు. గడిచిన రెండున్నరేళ్ల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా 94,839 మంది కూలీలకు సంబంధించి రూ.1567.57 లక్షల వేతనం సస్పెండ్లో ఉంది. ఇందులో 90 రోజులు పైబడి 52,216 మంది కూలీలకు చెందిన రూ.867.45 లక్షలు సస్పెండ్ అయింది. ఈ సొమ్ములో సగానికి పైగా బోగస్ ఉన్నట్లు తెలుస్తోంది. దీని కారణంగానే సొమ్మును క్లెయిం చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ∙ఈ ఏడాది అదే పరిస్థితి ఈ ఏడాది ప్రారంభం నుంచి ఆధార్ అనుసంధానమైన బ్యాంక్ ఖాతాల్లోనే నగదు పడేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి జిల్లా వ్యాప్తంగా 993 పంచాయతీల్లో పనులు చేసిన 49,056 మంది కూలీలకు చెందిన రూ.865.9 లక్షలు సస్పెండ్లోకి వెళ్లింది. ఇందులో 30 రోజుల్లోగా 32,204 మంది కూలీలకు సంబంధించి రూ.4.70 కోట్లు, 30 నుంచి 60 రోజుల్లోగా 8096 మంది కూలీలకు చెందిన రూ.157.31 లక్షలు, 60 నుంచి 90 రోజుల్లోపు 4647 మంది కూలీలకు గానూ 121.65 లక్షలు సస్పెండ్ అయింది. 90 రోజులకు పైబడి 4109 మంది కూలీలకు గానూ రూ.116.95 లక్షలు సస్పెండ్ అయ్యాయి. ఇందులో ఉపాధి హామీ కింద చేసిన పనులకు సంబంధించి ఏకంగా రూ.6 కోట్లకు పైగా సస్పెండ్ అయింది. ఇందులో ఎక్కువ భాగం బ్యాంకుల్లో ‘ఆధార్’ అనుసంధానంలో జాప్యం వల్ల పడలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ నుంచి ఆధార్ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశాలు అందాయి. -
డబ్బులు ఇవ్వకుండా బీపీఎం వేధిస్తున్నాడు
► ఆగ్రహించిన ఉపాధిహామీ కూలీలు ► పోస్టాఫీసు ఎదుట ఆందోళన కామారెడ్డి రూరల్(కామారెడ్డి): రెక్కలు ముక్కలు చేసుకుని ఉపాధి కూలికి వెళ్తే తమకు సరైన గిట్టుబాటు రేటు వస్తుందని ఆశించిన ఉపాధిహామీ కూలీలకు చెదు అనుభవం ఎదురైంది. ఉపాధిహామీ పథకం కింద పనిచేసి నెలలు గడుస్తున్నా తమకు కూలి డబ్బులు సక్రమంగా అందకపోవడంతో కూలీలు నైరాశ్యం చెందారు. ప్రభుత్వం సకాలంలో ఉపాధి కూలీలకు డబ్బులు చెల్లించాలని సూచిస్తున్నా పోస్టాఫీసు సిబ్బంది తమ వ్యక్తిగత కారణాలతో కూలీలకు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్న సంఘటన మండలంలోని అడ్లూర్లో జరిగింది. ఉపాధిహామీ పథకం కింద పనిచేసిన కూలీలు గ్రామంలోని పోస్టాఫీసుకు బుధవారం ఉదయం 7 గంటలకు డబ్బుల కోసం వెళ్లారు. బీపీఎం నాయిని బాల్రాజు 15రోజులుగా కూలీలను కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. బుధవారం ఉదయం పోస్టాఫీసుకు సకాలంలో వస్తే డబ్బులు చెల్లిస్తామనడంతో కూలీలంతా ఉదయం 7నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎదుట పడిగాపులు కాశారు. అయినా బీపీఎం పోస్టాఫీస్లో ఉండడంలేదని ఆగ్రహించిన కూలీలు డబ్బులు చెల్లించకపోవడంతో ఆగ్రహానికి గురైన అక్కడే ఆందోళనకు దిగారు. కూలీలు బీపీఎంకు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించపోవడంపై తమ అసహనాన్ని ప్రదర్శించారు. డబ్బులు ఎప్పుడిస్తారో చెప్పాలని కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అందరి భాగస్వామ్యంతోనే ఉపాధి హామీ
- ఉపాధి హామీ కౌన్సిల్ సమావేశంలో మంత్రి జూపల్లి - ఉపాధి పనుల్లో దేశంలోనే తెలంగాణకు రెండో స్థానం సాక్షి, హైదరాబాద్: అందరి భాగస్వామ్యంతో ఉపాధిహామీని ముందుకు తీసుకుపోవాలని రాష్ట్ర ఉపాధిహామీ కౌన్సిల్ చైర్మన్, మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. జూపల్లి అధ్యక్షతన శనివారం రాజేంద్రనగర్లోని సిపార్డ్లో రాష్ట్ర ఉపాధిహామీ కౌన్సిల్ రెండో సమావేశం జరిగిం ది. సమావేశంలో మంత్రులు హరీశ్రావు, నాయి ని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, చందూలాల్ పాల్గొన్నారు. ఉపాధిహామీ పనుల్లో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని జూపల్లి తెలిపారు. ఈ ఆర్థిక ఏడాదిలో రూ.3 వేల కోట్ల విలువైన పనులను చేపట్టేలా టార్గెట్ పెట్టుకున్నామని, జాబ్ కార్డులున్న 60% మంది కూలీ లకు 100 రోజుల పని కల్పించే లక్ష్యంతో ముందుకు పోతున్నామన్నారు. మిషన్ కాకతీయ చెరువుల పూడికతీతను చేపడుతున్నామని, పాఠశాలల్లో మరుగుదొడ్డు, కిచెన్ షెడ్ల నిర్మాణాలు చేపడుతున్నామని అన్నారు. రూ.13 లక్షలతో పంచాయ తీ భవనాలు, రూ.10 లక్షలతో శ్మశాన వాటికలు నిర్మిస్తున్నామని చెప్పారు. 2018 అక్టోబర్ 2 నాటి కి స్వచ్ఛ తెలంగాణగా మార్చేందుకు ఇంకుడు గుంతలు, పెద్ద ఎత్తున వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. ఈ ఆర్థిక ఏడాదిలో 2.63 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 34,088 మరుగుదొడ్లను నిర్మించామని తెలిపారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి స్త్రీ నిధి బ్యాంకు ద్వారా రూ.200 కోట్లను మహిళా సంఘాలకు అడ్వాన్స్ రూపంలో అందజేస్తున్నామని వివరించారు. 1,000 మంది జనాభాకు ఇద్దరు ఉపాధి కూలీలను ఏడాది పొడవునా పారిశుధ్య కార్మికులుగా వినియోగించుకునేందుకు అవకాశమివ్వాలని ఇటీవల భోపాల్లో కేంద్ర మంత్రి తోమర్ను కోరామన్నారు. ఉపాధి హామీ సిబ్బందికి హరీశ్ ప్రశంసలు.. ఇటీవల జాతీయస్థాయిలో 5 అవార్డులు దక్కిం చుకున్న ఉపాధి హామీ సిబ్బందిని, అధికారులను హరీశ్రావు అభినందించారు. వాటర్ స్టోరేజీ పాండ్కు ప్లాస్టిక్ కవర్ బదులుగా బ్రిక్స్తో నిర్మించుకునే అవకాశమివ్వాలని కోరారు. మొక్కలకు నీరు పోసే ట్యాంకర్కు రూ.482 ఇస్తున్నారని, దీనిని పెంచాలని కోరారు. శ్మశానవాటికల కోసం సిద్దిపేటలో ఒక డిజైన్ను రూపొందించామని, దీనిని ఇతర ప్రాంతాల్లోనూ టైప్–2గా నిర్మించుకునే వెసులుబాటు ఇవ్వాలన్నారు. రోడ్డు పక్కన కూరగాయలు అమ్మే వారికోసం షెడ్డులను నిర్మించాలని సూచించారు. జిల్లా, మండల స్థాయి సమావేశాల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, టీఏ ఇవ్వాలని సభ్యులు కోరగా జూపల్లి సానుకూలంగా స్పందించారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ స్పెషల్ సీఎస్ మిశ్రా, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాశ్రాజ్, కమిషనర్ నీతూప్రసాద్, కౌన్సిల్ సభ్యులైన కరీంనగర్, వరంగల్ జెడ్పీ చైర్మన్లు తుల ఉమ పాల్గొన్నారు. -
తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం: జూపల్లి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, అందులో భాగంగా పలు అంశాల్లో జాతీయ స్థాయి అవార్డులు దక్కాయని గ్రామీ ణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జాతీయ స్థాయిలో అవార్డులు సాధిం చిన ఉపాధిహామీ, ఈజీఎంఎం, సెర్ప్ అధికారులను అభినందించారు. శనివారం గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఈ ఆర్థిక సంవత్సరం 3 నెలల్లో రూ.1,080 కోట్ల విలువైన ఉపాధి పనులు చేపట్టిందని చెప్పారు. సెర్ప్ ద్వారా మహిళా సాధికారత, ఉపాధి అవకాశాల కల్పనలోనూ జాతీయ అవార్డులు వచ్చాయన్నారు. అవార్డు పొందిన నిజామాబాద్ జిల్లా మనోహరాబాద్ సర్పంచ్ తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. సర్పంచ్ పదవిని బాధ్యతగా చేపట్టి గ్రామ సమగ్రాభివృద్ధికి కృషి చేశానన్నారు. కమిషనర్ నీతూ ప్రసాద్, సెర్ప్ సీఈఓ పౌసమిబసు పాల్గొన్నారు. -
‘ఉపాధి’లో రాష్ట్రానికి ఐదు అవార్డులు
ఢిల్లీలో ప్రదానం చేసిన కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సాక్షి, న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణకు పలు అవా ర్డులు దక్కాయి. కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణా భివృద్ధి శాఖ 2015–16 సంవత్సరానికిగాను ప్రకటించిన అవార్డుల్లో ఉపాధి హామీ పథకం అమలు లో పారదర్శకత–జవాబుదారీతనం, అత్యధిక పని దినాలు, సకాలంలో వేతనాల చెల్లింపు, పోస్టాఫీసు ల ద్వారా కూలీలకు డబ్బు అందించడం వంటి విభాగాల్లో తెలంగాణకు ఐదు అవార్డులు దక్కాయి. సోమవారం ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ఈ అవార్డులను ప్రదానం చేశారు. పారదర్శకత– జవాబుదారీతనం, జియోట్యాగింగ్ అమలు విభాగాల్లో లభించిన అవార్డులను రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్రాజ్, కమిషనర్ నీతూప్రసాద్ కుమారి అందుకున్నారు. అత్యధిక పనిదినాలు పూర్తి చేసిన జిల్లాల విభాగంలో వరంగల్ రూరల్ జిల్లా అవార్డు దక్కించుకుంది. గ్రామాల్లో ఎక్కువరోజులు పని కల్పించిన పంచాయతీ కేటగిరీలో నిజామాబాద్ జిల్లా మనోహరాబాద్ పంచాయతీ అవార్డు సాధిం చింది. సర్పంచ్ తిరుపతి రెడ్డి ఈ అవార్డు అందుకున్నారు. కూలీలకు సకాలంలో డబ్బులు పంపిణీ చేసిన పోస్టాఫీసు విభాగంలో నిజామాబాద్ జిల్లా ఇందల్వాయ్ బ్రాంచ్ పోస్టుమాస్టర్ అబ్దుల్ సత్తార్ అవార్డు అందుకున్నారు. ఉత్తమ జాతీయ వనరుల సంస్థ, జాతీయ గ్రామీణ ఉపాధి మిషన్ అవార్డును సెర్ప్ సీఈవో పొసుమి బసు అందుకున్నారు. -
నగదు రాక.. దారి తెలీక..
► ‘ఉపాధి’ కూలీల ఖాతాల స్తంభన ► ఐసీఐసీఐ బ్యాంకుల నుంచి అందని కూలీ ► దిక్కుతోచని స్థితిలో దాదాపు 3 లక్షల మంది ► పట్టించుకోని అధికారులు ఉదయగిరి: ఉపాధి హామీ చట్టం ప్రకారం కూలీ పని చేసిన 15 రోజుల్లో నగదు వారి ఖాతాల్లో జమచేయాలి. కాస్త అటోఇటో నగదు కూలీల ఖాతాల్లో జమవుతున్నప్పటికీ, ఇప్పుడా నగదు తీసుకునే అవకాశం లేకుండా ఐసీఐసీఐ బ్యాంకు అధికారులు వాటిని బ్లాక్ చేశారు. దీంతో రెండు నెలలనుంచి పేదల డొక్కలు ఎండుతున్నాయి. వీరి ఖాతాలు ఎందుకు స్తంభింపజేశారో ఎవరూ చేప్పడం లేదు. కూలీల కష్టం గురించి అధికారులకు తెలిపినా సమస్య పరిష్కారం కావడం లేదు. మరోవైపు జిల్లా అధికారులు కూలీల సంఖ్యను పెంచాలని విపరీతంగా ఒత్తిడి తెస్తున్నారే తప్ప వారి ఖాతాల్లో పడిన నగదు డ్రా చేసుకునే అవకాశాన్ని ఆపివేసిన ఐసీఐసీఐ బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా పలువురు కూలీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 5.42 లక్షల జాబ్కార్డులున్నాయి. వీటి పరిధిలో 12.8 లక్షల మంది ఉపాధి కూలీలు నమోదై ఉన్నారు. వీరిలో సుమారు ఐదు లక్షల మంది కూలీలు పనులు చేసినట్లు రికార్డులు చూపుతున్నాయి. వీరిలో 3.50 లక్షల వరకు ఐసీఐసీఐ బ్యాంకులో ఖాతాలు కలిగి ఉన్నారు. ఈ ఖాతాలలో జమయిన ఉపాధి కూలీ నగదును డ్రా కాకుండా చేయడంతో ఉపాధి కూలీలకు సమస్య తలెత్తింది. ఆ బ్యాంకు బిజినెస్ కరస్పాండెంట్లు కూడా సేవలందించడంలో పూర్తిగా విఫలమయ్యారు. స్థానికంగా ఉండే వీరి స్వైపింగ్ మిషన్లలో కూలీలు నగదు డ్రా చేయకుండా ఖాతాలు లాక్ చేయడంతో ఉపాధి కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ బ్యాంకు జిల్లా కేంద్రంలో మాత్రమే ఉండటంతో వ్యక్తిగతంగా అక్కడికి వెళ్లి కూలీలు తమ నగదు డ్రా చేసుకునే పరిస్థితి లేదు. కూలీలకు అందని నగదు ఈ పథకం ప్రారంభంలో ఉపాధి కూలీల నగదును పొదుపు గ్రామసమాఖ్యల ద్వారా పంపిణీ చేసేవారు. ఇందులో ఉన్న ఇబ్బందులను తొలగించేందుకు పోస్టాఫీసుల ద్వారా కూలీలకు నగదు పంపిణీ చేశారు. ఆ తర్వాత ఐసీఐసీఐ బ్యాంకు ద్వారా ఉపాధి కూలీల నగదును పంపిణీ చేశారు. ఆ తర్వాత మరలా పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేపట్టారు. గతేడాది ఆగస్టు నుంచి పోస్టాఫీసుల నుంచి కాకుండా బ్యాంకు ఖాతాల ద్వారా ఉపాధి నగదును పంపిణీచేయాలని నిర్ణయించి ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అయితే చాలామంది ఖాతాలు ఐసీఐసీఐ బ్యాంకులో ఉన్నందున ఆ ఖాతాల్లోనే ఆర్నెల్ల నుంచి నగదు జమవుతూ ఉంది. ఈ నగదును ఉపాధి కూలీలు స్థానికంగా ఉన్న బ్యాంకుల బిజినెస్ కరస్పాండెంట్ల స్వైపింగ్ మిషన్ల ద్వారా తీసుకుంటున్నారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఐసీఐసీఐ బ్యాంకులో పడిన ఉపాధి కూలీల నగదు డ్రా కాకుండా ఆ బ్యాంకు అధికారులు స్తంభింపచేశారు. దీంతో ఉపాధి కూలీలు ఆ నగదు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. ఐసీఐసీఐ బ్యాంకే ఖాతాల ఏర్పాటు: సాధారణంగా ఒక బ్యాంకులో ఖాతా ఓపెన్ చేయాలంటే ఆ ఖాతాదారుడి రెండు అడ్రస్ ప్రూఫ్లు, ఆధార్ తప్పనిసరి. కానీ స్థానిక ఉపాధి సిబ్బంది ద్వారా కూలీల ప్రమేయం లేకుండానే ఆధార్ నంబర్లు సేకరించిన ఐసీఐసీఐ సిబ్బంది వారి పేరిట ఖాతాలు తెరిచారు. అయితే చాలామంది ఉపాధికూలీలు తమ నగదును స్థానిక బ్యాంకులో జమచేయాలని బ్యాంకు ఖాతానంబర్లు ఇచ్చినప్పటికీ వాటిలో జమకావడం లేదు. ఐసీఐసీఐ బ్యాంకులోనే జమవుతున్నాయి. ఇపుడు వారు డబ్బు డ్రా చేసుకునే అవకాశం లేకుండా పోవడంతో తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. సమస్యకు త్వరలో పరిష్కారం: ఈ సమస్య మా దృష్టికి వచ్చింది. ఈ విషయమై ఇప్పటికే జిల్లా అధికారులకు తెలియచేశాము. జిల్లా అధికారులు ఆ బ్యాంకు అధికారులతో మాట్లాడి సమస్యను త్వరలో పరిష్కరిస్తారు. ప్రతి ఉపాధి కూలీ నగదు వారు కోరుకున్న బ్యాంకులో జమయ్యే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. త్వరలో ఈ సమస్య పరిష్కారమవుతుంది. –నాగేశ్వరరావు, ఏపీవో -
బతికితేనే భవిత !
హరితహారం లక్ష్యం ►నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు ►ఉపాధి హామీ నిధులు వెచ్చించాలని ప్రభుత్వ నిర్ణయం ►తాగునీటి మాదిరిగా ట్యాంకర్లతో నీళ్లు సరఫరా ►ట్రిప్పుకు రూ.480, ఉపాధి కూలీకి రూ.150 చెల్లింపు ►ఈ ఏడాది జిల్లాలో 1.83 కోట్ల మొక్కలు.. ►మొక్కలకు కంచెగా సర్కారు తుమ్మ ఏర్పాటు ►చర్యలు తీసుకుంటున్న అధికార యంత్రాంగం ►గతేడాది 50 శాతం కూడా బతకలేదు నిజామాబాద్ : నాటిన మొక్కలు ఏనుకుంటేనే.. ‘హరితహారం’ లక్ష్యం నెరవేరుతుంది. లక్షల్లో మొక్కలు నాటడం.. ఆ తర్వాత వాటిని పట్టించుకోకపోవడంతో అవి ఎండిపోవడం సాధారణంగా జరుగుతున్న తంతు.. జిల్లాలో కమ్యూనిటీ ప్లాంటేషన్, బ్లాక్ ప్లాంటేషన్ కింద నాటిన మొక్కల్లో కనీసం 50 శాతం కూడా బతకలేదు. ఈ సమస్యను అధిగమించే చర్యలపై జిల్లా అధికార యంత్రాగం ఈ ఏడాది దృష్టి సారించింది. ఈసారి నాటిన ప్రతి మొక్కను రక్షించుకునేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. వంద శాతం బతికించుకునేందుకు (సర్వైవల్) కోసం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఉపాధి హామీ నిధులను వినియోగించుకోవాలని భావిస్తోంది. వర్షాకాలం తర్వాత మొక్కలు బతకాలంటే కనీసం వారానికి ఒకసారైనా నీళ్లు అవసరం ఉంటుంది. తాగునీటి కోసం మాదిరిగానే ట్యాంకర్ల ద్వారా మొక్కలకు నీటిని పోసేందుకు ముందస్తు ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఆయా గ్రామాల్లో 400 మొక్కలకు ట్యాంకర్ ద్వారా నీళ్లు పోస్తే ఒక్కో ట్రిప్పుకు రూ.480 చొప్పున చెల్లించాలని నిర్ణయించారు. అలాగే నీళ్లు పోసిన వారికి ఉపాధి హామీ కింద రోజుకు రూ.150 వరకు కూలీ డబ్బులు చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది ఈ విధానం అమలులో ఉన్నప్పటికీ ఆశించిన మేర కు చర్యలు చేపట్టలేదు. చాలా చోట్ల మొక్కలు ఎండిపోయాయి. దీంతో రూ.కోట్లు వెచ్చించి చేపట్టిన హరితహారం కార్యక్రమం అనుకున్న మేర కు లక్ష్యాన్ని చేరలేకపోయింది. గత ఏడాది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో 3.61 కోట్ల మొక్కలు నాటారు. నిజామాబాద్ పరి« దిలో సుమా రు 1.92 కోట్ల మొక్కలు పెట్టినట్లు అటవీశాఖ అధికారుల రికార్డులు చెబుతున్నాయి. ఇందులో సుమారు 69 శాతం మొక్కలు బతి కినట్లు ఆ శాఖ రికార్డుల్లో పేర్కొన్నారు. కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా నాటిన మొక్కలు 60 శాతం మాత్రమే బతికాయని భావిస్తున్నారు. అలాగే బ్లాక్ ప్లాంటేషన్ మొక్కల సర్వైవల్ కూడా అంతే ఉంది. మొత్తం మీద సగటున 69 శాతం మొక్కలు బతికినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. అవగాహనపై దృష్టి.. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 1.83 కోట్ల మొక్కల నాటాలని జిల్లా అధికార యంత్రాంగం లక్ష్యంగా నిర్ణయించింది. నాటిన మొక్కలను కాపాడుకునేందుకు ఉచితంగా పనిచేయాల్సిన అవసరం లేదని, ప్రతి పనికి ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారులు భావిస్తున్నారు. ఉపాధి హామీ పథకం కింద ఈ మొక్కల సంరక్షణ చర్యలు చేపట్టే అంశాన్ని అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలకు అవగాహన కల్పించాలని భావిస్తున్నారు. నాటిన మొక్కలను పశువులు మేయకుండా రక్షించుకునేందుకు సర్కారు తుమ్మను కంచెగా నాటాలని భావిస్తున్నారు. హరితహారం కార్యక్రమం ప్రారంభం కాకముందే గ్రామాల్లో తుమ్మ కంపను అందుబాటులో ఉంచేందుకు ఉపాధి హామీ మేట్లు, కూలీలను సమాయత్తం చేయాలని నిర్ణయించారు. సంరక్షణ చర్యలపై దృష్టి పెట్టాం హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాము. ఇందుకోసం ముందస్తుగా ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకుంటున్నాము. ఉపాధిహామీ పథకం కింద ఈ సంరక్షణ చర్యలు చేపట్టే అంశంపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని భావిస్తున్నాము.– ప్రసాద్, జిల్లా అటవీశాఖాధికారి -
పొట్ట నింపని ‘ఉపాధి’
► పనులు చేసినా గిట్టుబాటుకాని కూలి ►సగటు వేతనం రూ.116 మాత్రమే ►ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి.. ►కొన్ని చోట్ల రోజు కూలి రూ.50 లోపే! ►వలసలే శరణ్యమంటున్న కూలీలు కరువు కోరల్లో చిక్కుకున్న ‘అనంత’లో కూలీలకు ఆసరాగా నిలవాల్సిన ఉపాధి హామీ పథకం వారి కడుపు మాడుస్తోంది. మండే ఎండల్లో.. కాలే కడుపులతో పనులు చేయాల్సిన దారుణ పరిస్థితి ఉంది. గట్టిపడిన నేలలో చేతులు బొబ్బలు ఎక్కేలా పని చేస్తున్నా గిట్టుబాటు కూలి అందడం లేదు. ప్రభుత్వం కనీస వేతనం రూ.194 ఇస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. కొందరు కూలీలకు వారం రోజులు పని చేసినా రూ.500 కూడా రావడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం 30 శాతం అలవెన్స్గా ఇస్తున్నా కూలీల జీవనోపాధి కష్టంగా మారుతోంది. అందువల్లే వలసలు అనివార్యంగా మారాయి. – అనంతపురం టౌన్ అనంతపురం టౌన్: జిల్లాలో 7,77,830 జాబ్కార్డులు జారీ చేశారు. 48,243 శ్రమశక్తి సంఘాల్లో 7,68,709 మంది కూలీలు ఉన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా రోజుకు 2 లక్షల మంది వరకు ఉపాధి పనులకు వెళ్తున్నారు. అయితే కూలి మాత్రం గిట్టుబాటు కావడం లేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు 3.13 లక్షల మందికి ఉపాధి కల్పించారు. మామూలు రోజుల్లో చేసినట్లుగా వేసవిలో ఉపాధి పనులను కూలీలు చేయలేరు. ఎండవేడిమికి కూలి గిట్టుబాటు కాక పూటగడవని పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం వేసవిలో అదనపు కూలిని ముందుగానే ప్రకటించింది. ఉపాధి కింద రోజువారీ వేతనం రూ.194 ఉండగా అదనపు కూలి కింద ఈ ఏడాది ఫిబ్రవరిలో 20 శాతం, మార్చిలో 25 శాతం, ఏప్రిల్/మే నెలల్లో 30 శాతం అందించారు. ఇక జూన్లో 20 శాతం అందించనున్నారు. అంటే ఒక్క రోజు కూలి కింద రూ. 235 నుంచి రూ.280 వరకు రావాల్సి ఉంది. అయితే చాలా గ్రామాల్లో గిట్టుబాటు కూలి అందడం లేదు. గుమ్మఘట్ట మండలం కలుగోడులో ఈనెల 1వ తేదీ(గురువారం) ఏకంగా ఉపాధి పనులనే బహిష్కరించారు. ఇక్కడ సగటున రోజు కూలి రూ.50లోపే వస్తోంది. ఉపాధి హామీ పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చూసుకున్నా సగటు వేతనం రూ.116 మాత్రమే ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉపాధి పనులకు కోసం వలస బాట పట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే కదిరి, పుట్టపర్తి, రాయదుర్గం, కళ్యాణదుర్గం, హిందూపురం, గుంతకల్లు, తాడిపత్రి తదితర నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున బెంగళూరు, తమిళనాడు, తెలంగాణకు వలస వెళ్లారు. గత ఏడాది అధికారులు కేవలం సేద్యపు కుంటలతోనే నెట్టుకు వచ్చారు. ఈ ఏడాది ఇతర పనులు కూడా కల్పిస్తామని చెబుతున్నా కూలి గిట్టుబాటు కావడం లేదు. ప్రధానంగా క్షేత్రస్థాయిలో కొలతల విషయంలో అధికారుల నిర్లక్ష్యం కూడా ఉన్నట్లు కూలీలు ఆరోపిస్తున్నారు. చేతులు బొబ్బలెక్కుతున్నాయ్ డగౌట్ పాండ్స్ పనులు చేస్తున్నాం. పైన ఒక అడుగు వరకు మెత్తగా వచ్చినా ఆ తర్వాత గునపం దింపాలంటే కష్టమే. చేతులు బొబ్బలెక్కుతున్నాయి. పోనీ చేసిన కష్టానికి ప్రతిఫలం ఉంటుందా అంటే అదీ లేదు. ఆరు రోజులకు గాను రూ.300లోపే కూలి పడింది. పేరుకే వేసవి అలవెన్సులు. మా కష్టానికి తగ్గ గిట్టుబాటు కూలి రావడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే పనులకు వెళ్లేది లేదు. వలసలే శరణ్యం. – తిప్పేస్వామి, ఉపాధి కూలీ, కలుగోడు ఆరు రోజులు చేస్తే రూ.280 ఎంపీటీసీ సభ్యురాలిగా ఉన్నా... అందరితో కలిసి ఉపాధి పనులకు వెళ్తున్నా. చాలా మంది కూలీలు ఆరు రోజులు పనులు చేస్తే రూ.260 నుంచి రూ.280లోపే పడింది. రోజుకు సగటున రూ.50 లోపు కూలి వస్తే ఎలా బతకాలి? ప్రభుత్వం చెప్పేదొకటి.. ఇక్కడ జరుగుతుందొకటి. ఈ విషయంపై అధికారులతో చర్చించినా ఫలితం లేదు. అందుకే గురువారం (ఈనెల 1న) అందరం కలిసి ఉపాధి పనులను బహిష్కరించాం. గిట్టుబాటు కూలి, మెత్తటి నేలలో పనులిస్తేనే ఉపాధికి వెళ్తాం. – టి.సుకన్య, కలుగోడు ఎంపీటీసీ సభ్యురాలు, గుమ్మఘట్ట మండలం -
వంద రోజుల ఉపాధి కల్పనే లక్ష్యం
- గ్రామీణాభివృద్ధికి జతగా సెర్ప్ సిబ్బంది - ఉపాధిహామీ కమిటీల ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ పేదలకు వందరోజుల ఉపాధి కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామాల్లో వ్యవసాయ పనులు ముగియ డంతో ఖాళీగా ఉన్న కూలీలందరినీ ఉపాధి హామీ వైపు మళ్లించేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కూలీలకు ఉపాధిహామీ పథకం పట్ల అవగాహన కల్పించడం, వారికి అవసరమైన జాబ్ కార్డులను ఇప్పించడం, కూలీల డిమాండ్ మేరకు ఉపాధి పనులను సిద్ధం చేయడం.. తదితర కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఉపాధిహామీ సిబ్బందితో పాటు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సిబ్బంది సేవలను కూడా వినియోగించు కోవాలని నిర్ణయించింది. అంతేకాకుండా ఉపాధిహామీ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 18,405 గ్రామ సమాఖ్యల సహాయకులను, 3,209 మంది కమ్యూనిటీ కోఆర్డినేటర్లను, 45.65 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలను భాగస్వాములను చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ స్థాయిలో సమష్టిగా.. ఉపాధిహామీ పనులు కల్పించే నిమిత్తం జాబ్ కార్డులు ఇప్పించేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందితో సెర్ప్ సిబ్బంది కలసి పని చేయాలని ప్రభుత్వం సూచించింది. పనుల డిమాం డ్ను సృష్టించే విధంగా కూలీలను, ఎస్ఎస్ఎస్, ఎస్హెచ్జీ గ్రూపులను ప్రోత్స హించాలని ఆదేశిం చింది. గ్రామంలో రోజు వారీ ఉపాధిహామీ పనులను పర్యవేక్షిం చేందుకు గ్రామస్థాయిలో ఐదుగురు సభ్యుల తో కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభు త్వం సూచించింది. లేబర్ బడ్జెట్ రూప కల్పనలో గ్రామ సమాఖ్యలు కీలక పాత్ర పోషించాలని ఆదేశించింది. గ్రామాలలో లేబర్ బడ్జెట్ పురోగతిని మండల సమాఖ్యలు సమీక్షించాలని, మండల స్థాయిలో పనిచేసే ఏపీఎంలు, కమ్యూనిటీ కోఆర్డి నేటర్లు ఆయా పనులను పర్యవేక్షించాలని సర్కారు సూచించింది. -
ఉద్యమంలా ‘ఉపాధి హామీ’
► 18న ప్రతి మండలంలో ఉపాధి పనులపై సమావేశం ► మంత్రి జూపల్లి వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధి హామీ కార్యక్రమాన్ని ఉద్యమంలా ముందుకు తీసు కెళ్లాలని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించా రు. ఉపాధిహామీ పనుల పురోగతిని జిల్లా, మండల స్థాయి అధికారులతో శనివారం ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించా రు. రాజకీయాలకతీతంగా ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు, సెర్ప్ ఉద్యోగులు, వీవోఏల సేవలను కూడా ఉపాధి హామీ పథ కం అమలులో వినియోగించుకోవాలని అధి కారులకు మంత్రి సూచించారు. ఈ నెల 18న ప్రతి మండల కేంద్రంలో ఉపాధి పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలన్నారు. వచ్చే వారంలో ఉపాధి పనులపై చర్చించేందుకు పంచాయతీ, మండల, జిల్లాపరిషత్ సర్వ సభ్య సమావేశాలు ఏర్పాటు చేయాలని, ఖాళీ గా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను వెంటనే భర్తీ చేసేలా చర్యలు తీసు కోవాలని కమిషనర్ నీతూకుమారి ప్రసాద్ను ఆదేశించారు. జూన్ నెలాఖరులోగా సుమారు 75 రోజులు పెద్ద ఎత్తున ఉపాధి పనులు చేపట్టాలని జూపల్లి అధికారులకు సూచించా రు. జాబ్ కార్డులున్నవారిలో కనీసం 60 శాతం మంది కూలీలకు 100 రోజుల ఉపాధి కల్పించే లక్ష్యంతో పనిచేయాలన్నారు. చెరువు పూడికతీతపనులను ప్రారంభించని అధికారు లపై చర్యలు తీసుకుంటామన్నారు. అలంపూర్కు వరం తుమ్మిళ్ల ప్రాజెక్ట్ తుమ్మిళ్ల ఎత్తిపోతల ప్రాజెక్ట్కు కేబినెట్ ఆమో దం తెలపడంతో గద్వాల జిల్లా అలంపూర్ రైతాంగానికి మంచి రోజులు వచ్చాయని జూపల్లి అన్నారు. సచివాలయంలో మంత్రి మాట్లాడుతూ దశాబ్దాలుగా రాజోలిబండ డైవర్షన్ స్కీమ్(ఆర్డీఎస్)కు చుక్కనీరు కూడా రాకపోవడంతో ఆ ప్రాంత రైతాంగం కుదేలైందన్నారు. ఈ నేపథ్యంలో తుమ్మిళ్ల ఎత్తిపోతలకు మొదటి విడతగా రూ.397 కోట్లు, రెండో విడతలో రూ.386కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని, 2018 చివరి నాటికి ప్రాజెక్ట్ను పూర్తి చేస్తామన్నారు. వేసవిలోగా వంతెనల నిర్మాణం పీఎంజీఎస్వై, నాబార్డ్ నిధులతో చేపట్టిన వంతెనలు, రహదారుల నిర్మాణ పనులను వేసవిలోగా పూర్తి చేయాలని జూపల్లి అధికారులను ఆదేశించారు. రహ దారి, వంతెనల నిర్మాణ పనుల పురోగతిపై పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో శనివారం మంత్రి సమీక్షిం చారు. నిర్మాణ పనులు నత్తనడకన సాగ డంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిపాలనా అనుమతులు వచ్చిన వారం రోజుల్లోపే అంచనాలు, డిజైనింగ్ పూర్తి చేయాలని, నెల రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని, టెండర్ ప్రక్రియ ముగిసిన 15 రోజుల్లో కాంట్రాక్టర్కు వర్క్ ఆర్డర్ ఇవ్వాలని సూచించారు. కాంగ్రెస్ నేతలవే కాపీ బతుకులు: జూపల్లి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతుల కోసం సీఎం కేసీఆర్ తీసుకున్న ఉచిత ఎరువుల పంపిణీ నిర్ణయం విప్లవాత్మ కమైందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. దేశ చరిత్రలో ఏ ప్రధాని, సీఎం తీసుకోని ఇలాంటి నిర్ణయాన్ని విపక్షాలు స్వాగతించాల్సిందిపోయి మతిభ్రమించే లా మాట్లాడుతున్నాయన్నారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ నారాయణ రెడ్డితో కలసి శనివారం ఆయన టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మా ట్లాడారు. ఉచిత ఎరువుల పంపిణీ ఎన్ని కల కోసం తీసుకున్న నిర్ణయం కాదని, ఎన్నికల కోసమే పథకాలు తెచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. కాంగ్రెస్ వాళ్లను కాపీ కొట్టాల్సిన ఖర్మ తమకు పట్టలేదని, అసలైన కాపీ బతుకులు కాంగ్రెస్ నేతలవే నన్నారు. విపక్ష నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని గువ్వల హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మాయమవడం ఖాయ మని నారాయణరెడ్డి అన్నారు. -
పనులు సరే.. వేతనాలు ఎప్పుడు?
► ఆరు నెలలుగా ఉపాధి వేతనాలు లేవు ► నియోజకవర్గంలో ఉపాధి వేతనదారుల అగచాట్లు ► సమాధానం చెప్పని అధికారులు.... పాలకొండ రూరల్: రెక్కాడితేగాని డొక్కాడని వేతనదారులకు ఉపాధి సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో వందలాది వేతనదారులు ఉసూరుమంటున్నారు. దాదాపు 5 నెలలుగా తమ వేతనాలు అందటం లేదని వాపోతున్నారు. 2016 డిశంబర్ నుండి ప్రస్తుత వేసవి వరకు దాదాపు వేతనాలు అందటం లేదని చెబుతున్నారు. వేసవిలో ఎండలో మండిపోతూ రెక్కలు ముక్కలు చేసుకుని జాతీయ ఉపాధిహామీ పనులు చేస్తున్నా అధికారులు స్పందించకపోవటంపై విమర్శలు గుప్పిస్తున్నారు. లక్షల్లో బకాయిలు...: పాలకొండ నియోజకవర్గంలో ఉపాధి వేతనాలు లక్షల్లో బకాయిలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 45 శాతం ఉపాధి పనులపై ఆధారపడుతున్నారు. ఒక్కో మండలంలో 4 నుండి 5వేల మందికి జాబ్కార్డులు ఉండగా మొత్తంగా 4 మండలాల్లో సుమారు మండలానికి వంద వంతున చెరువులు, కాలువలు, రహదారుల పనులు జరుగుతున్నాయి. వీటి సంబంధించి వేతనాలు లేవు. దీనికితోడు ఇటీవల రోడ్ల ప్రక్కన వేసిన మొక్కలకు, వాటికి అమర్చిన ట్రీ గార్డులకు, నిత్యం అందించిన నీటి వసతులకు సంబంధించిన వేతనాలు అందించకపోవటంతో లక్షల్లో వేతనాలు బకాయిలు ఉన్నాయి. పాలకొండ మండలంలో 5 వేల మంది వేతనదారులకు 38 పనులకు సంబంధించి రూ.63 లక్షలు, ఏజెన్సీ సీతంపేటలో రూ.19 లక్షల 5వేలు, భామినిలో రూ.11లక్షల 50 వేలు, వీరఘట్టంలో దాదాపు రూ.11 లక్షలవరకు బకాయిలు ఉన్నట్లు వేతనదారులు చెబుతున్నారు. వేతనాలకోసం సీఎఫ్ల వద్ద వేతనదారులు ప్రస్తావిస్తే వారు సరైన సమాధానం చెప్పకపోగా కసురు కోవటంతో మండల ఉపాధి కార్యాలయాల చుట్టూ వేతనదారులు తిరుగుతున్నారు. గతంలో ఇచ్చిన స్లిప్లు కూడా ఇవ్వకపోవటంతో తాము 5 నెలలు ఎంతపని చేశామో, ఎంత వేతనం వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని పలువురు చెబుతున్నారు. మరికొన్ని చోట్ల పనులు నిలిపేశారు. నగదు లావాదేవీల్లో..: గత కొద్ది రోజులుగా ట్రజరీ, బ్యాంకుల ద్వారా నగదు లావాదేవీలు సక్రమంగా జరగకపోవటం, ప్రభుత్వం వీరిని పట్టించుకోకపోవటంతో దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇదే సమస్య నెలకొంది. ఉపాధి వేతనాల నగదు రాష్ట్ర వ్యాప్తంగా విడుదల కాలేదని, పోస్టల్, బ్యాంకులకు జమ చేసినప్పటికీ సాంకేతిక సమస్యల కారణంగా వేతనదారుల ఖాతాలకు జమకాలేదని ఉపాధి అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా తాము కష్టిస్తున్న పనికి వేతనాలు తక్షణం చెల్లించాలని, తమ సమస్యలు గుర్తించాలని వేతనదారులు కోరుతున్నారు. –ఐదు నెలలుగా: ఐదు నెలలుగా వేతనాలు లేవు. బతకటం ఎలా. సీఫ్కు అడిగితే కసురుకుంటుంది. తినడానికి తిండి లేని పరిస్థితి. పిల్లలకు ఫీజులు చెల్లించలేకపోతున్నాం. నరకం చూస్తున్నాం. అధికారులు స్పందించాలి. ---వావిలపిల్లి సూరమ్మ, అట్టలి,పాలకొండ మండలం... –వలసపోవాలి: కష్టపడుతున్నా వేతనం లేదు. ఉపాధిపనులు నమ్ముకుని బతుకుతున్నాం. ఇన్నాళ్లు వేనాలు చెల్లించకపోతే కుటుంబాలను ఎలా నెట్టుకొస్తాం. అధికారులు స్పందించుట లేదు. వేతనాల కోసం మండల కేంద్రాల్లో బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ---పార్వతి, ఉపాధి వేతనదారు. పాలకొండ మండలం... పట్టించుకోవటం లేదు: అసలే దివ్యాంగుడిని. అటుపై ఉపాధి పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నాను. గడిచిన ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. నాబాధ చెప్పుకోలేను. మూగవాడిని కావడంతో ఇబ్బంది పడుతున్నాను. --- జగన్, దివ్యాంగ వేతనదారు. -
జీర్ణం.. జీర్ణం.. ‘ఉపాధి’ జీర్ణం
ఉపాధి హామీ పథకం నిధులు కైంకర్యం - ఫామ్ పాండ్స్ తవ్వకం పేరిట రాష్ట్రంలో భారీగా అవినీతి - వాటాలు పంచుకున్న ప్రభుత్వ పెద్దలు, టీడీపీ అగ్రనేతలు - ఒక్క ఏడాదిలోనే దాదాపు రూ.1,000 కోట్లు స్వాహా - తవ్వేది ఒక కుంట.. రికార్డుల్లో 10 కుంటలుగా నమోదు - యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన... టీడీపీ నేతలే కాంట్రాక్టర్లు - ప్రకాశం జిల్లా కంభాలపాడులో ‘సాక్షి’ పరిశీలనలో అక్రమాలు బహిర్గతం సాక్షి, అమరావతి: గ్రామాల్లో పేద కూలీలకు పనులు కల్పించాలనే సదాశయంతో కేంద్రం ఇస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ అగ్రనేతలు ఆరగిస్తున్నారు. ఫామ్ పాండ్స్(పంట కుంటలు) తవ్వకం పేరిట కేవలం ఒక్క ఏడాదిలోనే దాదాపు రూ.వెయ్యి కోట్లు మింగేశారు. ఈ పనులను గ్రామస్థాయిలో టీడీపీ నాయకులకు కట్టబెట్టి, మీకింత మాకింత అంటూ వాటాలు పంచేసుకున్నారు. ఫామ్ పాండ్స్ తవ్వకం ముసుగులో భారీ ఎత్తున సాగుతున్న ఈ అవినీతి బాగోతం ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో బట్టబయలైంది. పేద కుటుంబాలకు వారి సొంత గ్రామాల్లో పనులు కల్పించడానికి ఉపాధి హామీ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఫామ్ పాండ్స్ నిర్మాణానికి నిధులిస్తోంది. 2016 ఏప్రిల్ నుంచి 2017 మార్చి మధ్య కాలంలో కేంద్రం ఇచ్చిన ఉపాధి హామీ పథకం నిధులతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి 5,45,625 పంట కుంటలు తవ్వగా, ఇందులో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 3,11,161 కుంటలు తవ్వినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం. ఇందుకోసం రూ.965.64 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపుతోంది. రాష్ట్రంలో మరో 1,04,000 పంట కుంటలు నిర్మాణంలో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఫామ్పాండ్స్ తవ్వకాల్లో లెక్కలేనన్ని అక్రమాలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ పెద్దల సహకారంతో ఈ పనులను దక్కించుకున్న అధికార పార్టీ నాయకులు నిబంధనలను యథేచ్ఛగా తుంగలో తొక్కారు. ఒక కుంట తవ్వి, పదికుంటలు తవ్వినట్లు రికార్డుల్లో రాసేశారు. ఈ మేరకు బిల్లులు సమర్పించి, ప్రభుత్వం నుంచి డబ్బులు నొక్కేశారు. పెద్దలకు వాటాలు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. మచ్చుకు ఒక గ్రామాన్ని ‘సాక్షి’ పరిశీలించింది. అధికార పార్టీ నాయకుల అవినీతి, అక్రమాలు బహిర్గతమయ్యాయి. ఒక్క ఏడాదే రూ.1.51 కోట్ల చెల్లింపులు ప్రకాశం జిల్లా పొదిలి మండలం కంభాలపాడులో పంట కుంటల తవ్వకం పనులను ‘సాక్షి’ పరిశీలించింది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ప్రకాశం జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ఫామ్పాండ్స్ తవ్విన మొదటి ఐదు గ్రామ పంచాయతీల్లో కంభాలపాడు ఒకటి. అందుకే ఈ గ్రామాన్ని ‘సాక్షి’ పరిశీలనకు ఎంచుకుంది. ఉపాధి హామీ పథకం మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు 11 ఏళ్లలో ఈ గ్రామంలో ఈ పథకం కింద కూలీలకు రూ.3.79 కోట్లు చెల్లించగా, అందులో రూ.1.51 కోట్లు ఈ ఒక్క ఏడాదే పంటల కుంటల కోసం చెల్లించారు. రికార్డులు తప్పుల తడకలు కంభాలపాడులో మొత్తం 322 పంట కుంటల పనులు చేపట్టారు. ఒక్క ఏడాదిలోనే 278 కుంటల తవ్వకం పూర్తి చేసినట్టు రికార్డులో పేర్కొన్నారు. గ్రామంలో పంటకుంటలు ఎక్కడ తవ్వాలనే వివరాలు కూడా నమోదు చేసుకోకుండా పనులు మంజూరు చేశారు. వాటిని పూర్తి చేశారు, బిల్లులు కూడా చెల్లించారు. కానీ క్షేత్రస్థాయిలో ఈ మేరకు పంట కుంటలు కనిపించడం లేదు. నిబంధనల ప్రకారం ఒక కుంట తవ్వకానికి అనుమతి ఇచ్చేటప్పుడు దాన్ని ఏ రైతు పొలంలో తవ్వుతారన్న వివరాలను స్పష్టంగా పేర్కొనాలి. సంబంధిత రైతు ఉపాధి హామీ పథకంలో కూలీగా నమోదు చేసుకుని ఉండాలి. రైతు పొలం సర్వేనంబరు, కూలీ కార్డుసంఖ్య తెలపాలి. పొలాల్లో కాకుండా బహిరంగ ప్రదేశాల్లో పనులకు అనుమతిచ్చినా, సంబంధిత ప్రాంతం గురించి స్పష్టమైన వివరాలతోపాటు సర్వే నంబరును నమోదు చేయాలి. కంభాలపాడులో 240 పంట కుంటలను ఏయే రైతుల పొలాల్లో తవ్వారన్న వివరాలను ప్రభుత్వ రికార్డుల్లో పొందుపరచలేదు. రికార్డుల్లో 83 మంది రైతుల పేర్లను నమోదు చేసినప్పటికీ, వారి ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు సంఖ్య స్థానంలో దొంగ నంబర్లు నమోదు చేశారు. 147 పంట కుంటలను ఏ సర్వే నంబరులో తవ్వారన్న వివరాల్లేవు. దొంగ జాబ్కార్డు నంబర్లు నమోదు కంభాలపాడులో పంట కుంటలను ఎక్కడ తవ్వారని స్థానిక అధికారులను అడిగితే వాగుల వైపే చూపిస్తున్నారు. మొదట గ్రామంలోని చిన్న ఊట్ల వాగు ప్రాంతంలో 78, ఎర్రవంక వాగులో 70, పల్లెకంటి వాగులో 73 పంట కుంటలను తవ్వినట్టు చెప్పారు. ‘సాక్షి’ పరిశీలనలో చిన్న ఊట్ల వాగు, వాగుకు ఇరుపక్కల రైతుల పొలాల్లో కేవలం 28 పంట కుంటలు మాత్రమే కనిపించాయి. గ్రామంలో మొత్తం 13 కిలోమీటర్ల పరిధిలో ఉండే మూడు వాగుల్లో 211 కుంటలు తవ్వారా? అని అధికారుల వద్ద ఆరా తీస్తే.. తాము మొదట ఇచ్చిన సమాచారం తప్పుగా వచ్చిందంటూ కొత్తగా మరొక పేర్ల జాబితాను అందజేశారు. రెండో జాబితాలో పెద్ద ఊట్ల వాగులో 48, ఎర్రవంక వాగులో 14తోపాటు ఒక్కొక్క రైతు పేరుతో నాలుగైదు కుంటలను తవ్వినట్లు పేర్కొన్నారు. విజయవాడలోని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో ఉన్న జాబితాకు, స్థానిక అధికారులిచ్చిన రెండు జాబితాలకు పొంతనలేదు. కమిష నర్ కార్యాలయంలోని జాబితాలో దొంగ జాబ్కార్డు నంబ ర్లు నమోదు చేయడం గమనార్హం. కూలీ జాబ్ కార్డులో ఉండే 18 అంకెల సంఖ్యను నమోదు చేయాల్సి ఉండగా, 9 అంకెల సంఖ్యలను మాత్రమే నమోదు చేశారు. పనులన్నీ టీడీపీ నేతల పరం రాష్ట్రంలో కొన్ని నెలలుగా ఉపాధి హామీ పథకంలో కేవలం పంట కుంటల తవ్వకం పనులకే ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తోంది. ఈ పథకానికి కేంద్రం ఇచ్చే నిధులతో కాంట్రాక్టర్ల ద్వారా పనులు చేయించకూడదని నిబంధనలు న్నా గ్రామస్థాయిలో అధికార పార్టీ నేతలు, వారి అనుచరులే ఈ పనులు దక్కించుకుంటున్నారు. యంత్రాల వాడకం... కూలీల పేరుతో బిల్లులు ఉపాధి హామీ పథకం పనుల్లో యంత్రాల వాడకంపై నిషేధం ఉంది. అయినా పంట కుంటలను యంత్రాలతో తవ్వి కూలీల పేరుతో బిల్లులు చేసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ పథకంలో పని చేసిన కూలీలకు రోజుకు రూ.129 చొప్పున కూలీ పడుతుండగా, కంభాలపాడులో కూలీలకు రోజుకు రూ.188 చొప్పున చెల్లింపులు జరిపినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. పంటకుంట చుట్టూ రాళ్లతో రివిట్మెంట్ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ‘సాక్షి’ బృందం పరిశీలించిన ఏ ఒక్క కుంటకూ రాళ్లతో రివిట్మెంట్ చేసిన దాఖలాలు లేవు. బోర్డులు పెట్టలేదు.. బిల్లులు తీసుకున్నారు ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనుల వివరాలతో పని ప్రాంతంలో తప్పనిసరిగా బోర్డులు ఏర్పాటు చేయాలి. కంభాలపాడులో కేవలం ఒక్కచోట మాత్రమే బోర్డును ఏర్పాటు చేసినప్పటికీ, చిన్న ఊట్ల వాగుపై తవ్విన పంటకుంటకు పెద్ద ఊట్ల వాగులో తవ్వకానికి అనుమతిచ్చిన బోర్డును ఉంచారు. మిగిలిన చోట్ల ఎక్కడా బోర్డులు లేవు. ఏడాది కిందట పూర్తయిన వాటి వద్ద సైతం బోర్డులు ఏర్పాటు చేయలేదు. బోర్డుల ఖర్చు పేరిట రూ.500 చొప్పున బిల్లులు మాత్రం తీసుకున్నారు. బోర్డుల గురించి అధికారులను అడిగితే.. ఆర్డర్ ఇచ్చామని బదులిచ్చారు. అక్రమాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే బోర్డులు ఏర్పాటు చేయలేదని గ్రామస్థులు చెబుతున్నారు. కంభాలపాడులో స్థానిక టీడీపీ నేత అండదండలతోనే పంటకుంటల తవ్వకంలో అవినీతి చోటు చేసుకుందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. -
ఏం జరుగుతోంది..?
► ఉపాధిహామీ సిబ్బంది పనితీరుపై మంత్రి రామన్న అసహనం ► మొక్కలు తక్కువ ఉన్నా కాపాడలేకపోతున్నాం ► నాన్ సీఆర్ఎఫ్ బిల్లుల పెండింగ్పై అసంతృప్తి ► పథకాల అమలు తీరుపై మంత్రి సమీక్ష ఆదిలాబాద్ అర్బన్: రైతులు కంపోస్టు ఎరువు కోసం ఉపయోగించే గుంతలకు ఇంతవరకు బిల్లులు ఇవ్వలేదని, ఉపాధి హామీ పథకంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అసహనం వ్యక్తం చేశారు. పని చేయని ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్లను తొలగించాలని ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వేసవిలో ఎదురవుతున్న తాగునీటి ఇబ్బందులు, ఉపాధి హామీ పనులు, హరితహారంపై సమీక్షించారు. కలెక్టర్ జ్యోతిబ్ధు ప్రకాశ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉపాధి హామీ, ఆర్డబ్ల్యూఎస్, అటవీశాఖ, అధికారులు పాల్గొన్నారు. ఉపాధి హామీపై సమీక్ష సందర్భంగా మంత్రి రామన్న మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ పనుల్లో ఆదిలాబాద్ వెనుకబడి ఉందని అన్నారు. రెండు వేల మంది మాత్రమే పనులు చేస్తున్నారని అధికారులు తెలుపగా.. అవగాహన కల్పించి మరిన్ని పనులు కల్పించాలని సూచించారు. వేసవిలో పనులు చేస్తున్న కూలీలకు అదనంగా డబ్బులు వస్తాయన్న విషయం తెలుపాలని, గ్రామాల్లోని వీఆర్ఏల సహకారం తీసుకోవాలని అన్నారు. మొక్కలు కాపాడలేకపోతున్నాం.. జిల్లాలో గత రెండేళ్ల క్రితం రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు తక్కువగా ఉన్న కూడా వాటిని కాపాడలేకపోతున్నామని మంత్రి రామన్న అన్నారు. వేసవి దృష్ట్యా అగ్గి తగిలి అనేక చెట్లు కాలిపోయాయని పేర్కొన్నారు. ఈ విషయం సంబంధిత అధికారులకు ఇంత వరకు కూడా తెలియదని అన్నారు. అటవీ ప్రాంతంలో అగ్గి తగిలి చెట్లు కాలిపోతున్నాయని, ఇందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామస్థాయిలో పని చేసే అధికారులు, సిబ్బంది పైస్థాయి అధికారులకు ఎలా, ఏం తెలియజేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. ఎంపీడీవోలకు వారి కింది స్థాయి సిబ్బంది రోజువారీ నివేదికలు ఇవ్వరా.. అని ప్రశ్నించారు. జైనథ్ మండలంలో రోడ్డు గుండా నాటిన మొక్కలు కాలిపోయాయని మంత్రి ప్రస్తావించారు. జిల్లాలో తక్కువ కిలోమీటర్ల మేర చెట్లు నాటిన వాటిని కాపాడలేకపోతున్నామని, వేసవి కాలంలో జరిగే అగ్ని ప్రమాదాల వల్ల చెట్లు కాలిపోకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఫారెస్ట్ నర్సరీల్లో పనులు చేస్తున్న కూలీలకు ఇంకా వేతనాలు రాలేదని మంత్రి దృష్టికి తీసుకురాగా, అక్కడ కమిషనరేట్లో పంపామని చెబుతారు.. ఇక్కడికేమో రాలేదు.. ఆ విషయం ఓసారి పరిశీలించి తెలుపాలని చెప్పారు. తాగునీటి ఇబ్బందులు రావొద్దు తాగునీటి సరఫరాపై మంత్రి అధికారులతో సమీక్షించారు. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ రవాణా ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారో తెలుసుకున్నారు. వీఆర్ఏలు, మండల అధికారులు గ్రామాలకు వెళ్లి ఉపాధి హామీ, తాగునీరు, హరితహారంపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. పెన్గంగ నుంచి జైనథ్, బేల మండలాలకు తాగునీరు అందించే పైప్లైన్కు విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. సాత్నాల పైప్లైన్ను ఎందుకు ప్రారంభించడం లేదని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. జిల్లాలో వేసవిలో తాగునీటి ఇబ్బందుల రావొద్దని ఆదేశింంచారు. గతేడాదిలో జరిగిన నాన్ సీఆర్ఎఫ్ పనులు పూర్తయ్యాయి, కానీ ఇంత వరకు బిల్లులు ఇవ్వకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జేసీ కృష్ణారెడ్డి, ఐఎఫ్ఎస్ ఎస్కె.గుప్తా, డీఆర్డీవో రాజేశ్వర్, తహశీల్దార్లు, ఎంపీడీఓలు, అధికారులు పాల్గొన్నారు. -
పోస్టాఫీసుల ద్వారానే ‘ఆసరా’ పింఛన్లు
లబ్ధిదారులకు సక్రమంగా చేరేలా సర్కారు చర్యలు: జూపల్లి సాక్షి, హైదరాబాద్: ఈ నెల నుంచి ‘ఆసరా’ పింఛన్లను పోస్టాఫీసుల ద్వారానే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. శనివారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం 2,551 గ్రామాల లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా పింఛన్ల పంపిణీ జరుగుతోందని, మండలంలో ఉండే ఒక బ్యాంక్ వద్దకే అన్ని గ్రామాల నుంచి లబ్ధిదారులు రావడం ఇబ్బందికరంగా మారిందన్నారు. ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పోస్టాఫీసు ఉన్న ప్రతి గ్రామంలోనూ బయోమెట్రిక్ విధానంతో పింఛన్లను అందించాలని నిర్ణయించామన్నారు. పంచాయతీలకు సమీపంలో తండాల్లోని లబ్ధిదారులు కూడా వారి ఇంటివద్దనే పింఛన్ సొమ్ము అందుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గతంలో.. వేలి ముద్రలు సరిపోలని వారికి పంచాయతీ కార్యదర్శి ద్వారా పింఛన్ సొమ్మును అందజేశామని, అందులోనూ అవకతవకలు జరుగుతున్నందున, ఐరిస్ విధా నాన్ని అమలు చేయాలని భావిస్తున్నామన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గం గోపులాపూర్లో ఓ వృద్ధురాలికి గత 4 నెలలుగా పింఛన్ సొమ్ము ఇవ్వకుండా, అక్రమాలకు పాల్పడుతున్న పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసినట్లు మంత్రి జూపల్లి పేర్కొన్నారు. అత్యధికంగా ఉపాధిహామీ పనులు 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఉపాధిహామీ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా రూ. 2,618 కోట్ల పనులు జరిగాయని, గత 10 సంవత్సరాలతో పోల్చితే అత్యధికంగా ఉపాధిహామీ నిధులు ఖర్చు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. పదేళ్లలో దాదాపు రూ.3,827 కోట్లు ఖర్చు చేయక పోవడంతో ఆ నిధులు మురిగి పోయాయన్నారు. 2017–18లో సుమారు రూ. వెయ్యికోట్ల మేర సిమెంట్ రహదారుల నిర్మాణానికి వెచ్చించాలని ప్లాన్ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో పనికోరిన ప్రతి ఒక్కరికి ఆన్లైన్ ద్వారానే జాబ్ కార్డు మంజూరు చేసి, ప్రతి కుటుంబానికి 100 రోజుల పాటు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి జూపల్లి చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు బాలరాజు, రామ్మోహన్రెడ్డి, రవికుమార్, మహబూబ్నగర్ జెడ్పీ చైర్మన్ భాస్కర్ తదితరులున్నారు. -
మరమ్మతులతో సరిపెడుతున్నారు!
- ఉపాధిహామీ కింద సీసీరోడ్ల నిర్మాణంలో కొన్నిచోట్ల అవకతవకలు - గ్రామీణాభివృద్ధి శాఖకు ఫిర్యాదులు సాక్షి, హైదరాబాద్: ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన సిమెంట్ రహదారుల నిర్మాణ పనుల్లో పెద్ద ఎత్తున అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని గ్రామీణాభి వృద్ధి శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఇంతకు మునుపే వివిధ ప్రభుత్వ పథకాల కింద వేసిన సీసీరోడ్లనే తాజాగా కొద్దిపాటి మరమ్మతులు చేసి, కొత్త సిమెంట్ రోడ్ల మాదిరిగా చిత్రీకరిస్తున్నట్లు ఉన్నతాధి కారుల పరిశీలనలో తేలింది. ఉపాధిహామీ పథకంలో మెటీరియల్ కాంపొనెంట్ నిధులను ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఖర్చు చేయాల్సి ఉన్నందున, గత నెలరోజు లుగా గ్రామాల్లో హడావిడి వాతావరణం నెలకొంది. కొన్ని జిల్లాల్లో సిమెంట్ రహదారుల నిర్మాణానికి అవసరమైన ఇసుక అందుబాటులో లేకపోవడం, కొన్ని ప్రాంతాల్లో నిర్మాణ పనులు చేసేందుకు అవసరమైన మేస్త్రీలు దొరకకపోవడంతో ఆశించిన స్థాయిలో పనులు ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. రూ.300 కోట్లకు మించే పరిస్థితి లేదు... ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి కేవలం 7,564 పనులు మాత్రమే కొనసాగుతున్నాయని, వీటికి రూ.259.09కోట్లు మాత్రమే ఖర్చయిందని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తమ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు. కొన్ని జిల్లాల్లో ఇంటర్నెట్ సమస్యల కారణంగా పనుల వివరాలను నమోదు చేయలేదని, మొత్తంగా రూ.300 కోట్లకు మించి సీసీ రోడ్లకు ఖర్చయ్యే పరిస్థితి కనిపించడం లేదని తెలుస్తోంది. దీంతో ఆయా గ్రామాల్లో పాత సిమెంట్ రోడ్లనే కొత్త రహదారులుగా చూపి సొమ్ము చేసుకునేందుకు అక్రమార్కులు ప్రయత్నిస్తున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు తమ గ్రామాల్లో కొత్త సీసీరోడ్లు వేసినట్లు రికార్డుల్లో నమోదు చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నారని తెలుస్తోంది. కొన్ని జిల్లాల్లోనైతే ఏకంగా ఎమ్మెల్యేలు, మంత్రులు తమ అనుయూయులకు సీసీరోడ్ల బిల్లులు ఇప్పించాలని జిల్లా కలెక్టర్లపై ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. పూర్తి చేసిన వాటికే బిల్లులు.. మార్చి 31లోగా సీసీరోడ్లు నిర్మించకుండా బిల్లులు పొందేందుకు అస్కారం లేదని, పూర్తిచేసిన రహదారులకు మాత్రమే బిల్లులు మంజూరవుతాయని ఉన్నతాధికారులు అంటున్నారు. నిర్మించిన ప్రతి సీసీరోడ్ను తప్పనిసరిగా జియోట్యాగింగ్ చేస్తున్నామని, ఆయా రహదారుల వద్ద ఉపాధిహామీ నిధులతో నిర్మించిన రహదారిగా శిలాఫలకాలు ఏర్పాటు చేయనున్నామని అధికారులు చెబుతున్నారు. -
31 లోగా సిమెంట్ రోడ్లు పూర్తి చేయాలి
అధికారులతో జూపల్లి సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లో మంజూరైన సిమెంట్ రహదారుల నిర్మాణ పనులను మార్చి 31లోగా పూర్తి చేయాలని అధికా రులను పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. ఉపాధి హామీ కింద జరుగు తున్న సీసీ రోడ్ల నిర్మాణ పనుల పురోగ తిపై మంగళవారం ఆయన సమీక్షించారు. కేంద్రం నుంచి వచ్చే ప్రతి రూపాయిని వృథా కాకుండా సద్వినియోగం చేయాలని సూచించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం లోనూ పెద్దెత్తున ఉపాధి పనులు చేపట్టేం దుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా అధికారులు సమాయత్తం కావాలన్నారు. ప్రపంచవ్యా ప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మంత్రి జూపల్లి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో నడవాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిం చారు. పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. -
‘ఉపాధి’ నిధులతో ‘వైకుంఠధామాలు’
తొలి విడతలో 500 గ్రామాల్లో ఏర్పాటుకు తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళికలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో వైకుంఠధామాల(శ్మశానవాటిక)ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకుగాను ఉపాధిహామీ పథకం నిధులు వెచ్చించాలని నిర్ణయిచింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు తొలి విడతలో 500 గ్రామాల్లో వైకుంఠ థామాల ఏర్పాటుకు గ్రామీణాబివృద్ధి శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో మొత్తంగా తొలివిడతలో మెటీరియల్ కాంపొనెంట్ కింద రూ.50 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఎంపిక చేసిన గ్రామాల్లో వైకుంఠధామాల ఏర్పాటు నిమిత్తం మార్గదర్శకాలను సూచిస్తూ అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులకు కమిషనర్ నీతూకుమారి ప్రసాద్ సర్క్యులర్ జారీ చేశారు. ఉపాధిహామీ చట్టంలో గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన కింద ఈ పనులను చేపట్టేందుకు వెసులుబాటు ఉందని ఆమె పేర్కొన్నారు.వైకుంఠధామాలకు ఒక్కో గ్రామానికి రూ.10 లక్షలు ఖర్చవుతుందని అధికారులు అంచనావేశారు. అయితే, ఆయా గ్రామాల్లో జనాభాను బట్టి అంచనాల్లో కొంత మేరకు హెచ్చుతగ్గులు ఉండే వచ్చు. ఏదేని గ్రామంలో దాతలు ముందుకు వచ్చినట్లయితే, వైకుంఠ ధామం ఏర్పాటుకు రూ.5 లక్షలు లేదా వ్యయంలో 25 శాతం (ఏది ఎక్కువైతే అది) ఇచ్చినవారి పెద్దల లేదా తల్లిదండ్రుల స్మారకంగా పేరును పెట్టనున్నారు. వైకుంఠ ధామం ఎలాగంటే.. ఒక్కో వైకుంఠధామంలో రెండు దహన వేదికలు, ఒక స్టోర్రూమ్, సందర్శకులకు షెడ్, రెండు మరుగుదొడ్లు, సింటెక్స్ ఓవర్హెడ్ ట్యాంక్, సోలార్లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. దీంతోపాటు భూమి అభివృద్ధి, హద్దుల ఏర్పాటు పనులను ఉపాధిహామీ కింద వేరుగా చేపట్టనున్నారు. నీటి సరఫరా, ప్రహరీ, ఇతర పనులను గ్రామ పంచాయతీ లేదా ఇతర నిధులతో పూర్తి చేయాలని కమిషనర్ సూచించారు. స్థలం ఎంపిక నిమిత్తం రెవెన్యూ అధికారుల సహకారం తీసుకోవాలని, గ్రామసభ ఆమోదం లభించాక పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో అంచనాలను సిద్ధం చేయించాలని ఉపాధిహామీ సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు. -
మడిపల్లి గ్రామానికి కామెర్లు
⇒ ఇప్పటికే ఇద్దరు యువకులు మృతి ⇒ ఆస్పత్రిలో మరో 60 మంది బాధితులు హసన్పర్తి: వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తి మండలం మడిపల్లి గ్రామం పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధికి గురైన ఇద్దరు యువకులు ఆస్పత్రిలో బుధవారం వేకువజామున మృతిచెందారు. ఒకరు వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రిలో ప్రాణాలు వదలగా, మరొకరు హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో మృతిచెందాడు. గ్రామానికి చెందిన ఉపాధి హామీ పథకం కంప్యూటర్ ఆపరేటర్ కాందారి సురేందర్(30) మూడు రోజుల క్రితం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బుధవారం చనిపోయాడు. కామెర్ల వ్యాధి సోకడం వల్ల కిడ్నీ, కాలేయం దెబ్బతిని మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఇదే ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ బొనగాని శ్రీమంత్ (18) వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. ఆస్పత్రిలో మరో 60 మంది మడిపల్లిలో కామెర్ల వ్యాధి సోకి మరో 60 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని స్థానికులు తెలిపారు. మరికొంత మంది ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే ఆర్థిక స్తోమత లేక స్థానికంగా వైద్యం చేయిం చుకుంటున్నారని గ్రామస్తులు చెప్పారు. అర్బన్ జిల్లా జాయింట్ కలెక్టర్ దయానంద్ బుధవారం గ్రామాన్ని సందర్శించారు. పారి శుద్ధ్యం, తాగునీటి వ్యవస్థను పరిశీలించారు. కామెర్ల వ్యాధితో బాధపడుతున్న వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. -
ఆత్మహత్యలపై దద్దరిల్లిన పార్లమెంటు
అన్నదాతలకు సాయం అందలేదన్న విపక్షాలు ⇒ సంక్షేమ పథకాలకు నిధులు తగ్గించారని ధ్వజం న్యూఢిల్లీ: రైతుల ఆత్మహత్యలు, ఉపాధి హామీ పథకం, నోట్ల రద్దు తదితర అంశాలపై పార్లమెంటు ఉభయ సభలు సోమవారం విపక్ష, అధికార పక్షాల వాగ్యుద్ధంతో దద్దరిల్లాయి. పేదలకు ఉద్దేశించిన సంక్షేమ పథకాల నిధులకు ప్రభుత్వంకోత పెట్టిందని విపక్షాలు మండిపడ్డాయి. నోట్ల రద్దుతో ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశాయి. గ్రామీణ ఉపాధి హామీకి పెంచిన రూ. వెయ్యి కోట్ల నిధులు ఏ మూలకూ సరిపోవని లోక్సభలో కాంగ్రెస్ ఆరోపించింది. నిధుల కోసం అనుబంధ డిమాండ్లపై జరిగిన చర్చలో కేసీ వేణుగోపాల్ (కాంగ్రెస్) మాట్లాడుతూ.. ఉపాధి పథకాన్ని ప్రశంసించిన ప్రధాని మోదీ దానికి కేవలం ఒక శాతం నిధులే పెంచారన్నారు. సాయం అందక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, తమిళనాడులో చనిపోయిన రైతుల పుర్రెలతో జంతర్మంతర్ వద్ద నిరసనలు తెలుపుతున్నారని వెల్లడించారు. గోవాలో బీజేపీకి తగినంత బలం లేకపోయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనైతికమని మండిపడ్డారు. పుర్రెల వార్త అబద్ధమని అన్నాడీఎంకే పేర్కొనగా.. కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే జోక్యం చేసుకుని, దేశవ్యాప్తంగా రైతులు కష్టాలుపడుతున్నారన్నారు. స్థూల దేశీయోత్పత్తి రేటును నోట్ల రద్దు దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ సభ్యుడు కిరీట్ సోమయ్య కల్పించుకుంటూ.. నోట్ల రద్దును ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ యూపీలో విలువ కోల్పోయిందన్నారు. దేశం నాశనం కావడం లేదని, మోదీకి అడ్డుపడుతున్న వాళ్లే నాశనం అవుతున్నారన్నారు. రాజ్యసభలో.. రైతు రుణాలను రద్దుచేస్తామన్న బీజేపీ ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకోకపోవడంతో ఒక్క మహారాష్ట్రలోనే 117 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని రాజ్యసభలో కాంగ్రెస్ ఆరోపించింది. జీరో అవర్లో ప్రమోద్తివారీ ఈ అంశాన్ని లేవనెత్తారు. కరువు పరిస్థితుల వల్ల రైతులు చనిపోవడం లేదని, పంటకు గిట్టుబాటు ధరలేక చనిపోతున్నారని అన్నారు. నోట్ల రద్దుకుS ప్రజల నుంచి భారీ మద్దతు లభించిందని, ఆర్థిక వ్యవస్థలో 33.7 శాతంగా ఉన్న బ్లాక్ మార్కెట్కు భారీ దెబ్బ తగిలిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ మేఘ్వాల్ చెప్పారు. డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా ప్రాజెక్టులతో పేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు. చార్జీలను ఉపసంహరించాలి: ఠాకూర్ వినియోగదారుల లావాదేవీలపై చార్జీలు విధించాలన్న బ్యాంకుల ప్రతిపాదనను, క్రెడిట్ కార్డులపై 3% పన్ను ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ లోక్సభలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజ్యసభలో సీపీఎం తదితర విపక్షాలు కూడా ఇదే డిమాండ్చేశాయి. మంత్రుల గైర్హాజరుపై అన్సారీ అసంతృప్తి రాజ్యసభలో ప్రశోత్తరాల సమయంలో జవాబులు చెప్పాల్సిన విద్యుత్, పర్యావరణ, నౌకాయాన శాఖల మంత్రులు లేకపోవడంపై చైర్మన్ అన్సారీ అసంతృప్తి వ్యక్తం చేశారు. -
‘ఉపాధి’ యాతన
నెలన్నరగా వేతనాల చెల్లింపులు నిలిపివేసిన రాష్ట్ర ప్రభుత్వం ⇒ కూలీలకు చెల్లించాల్సిన బకాయిలు రూ.310.58 కోట్లు ⇒ కాంట్రాక్టర్లకు మాత్రం రూ.877.52 కోట్లు విడుదల ⇒ కేంద్ర నిధులను ఇతర అవసరాలకు మళ్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ⇒ డబ్బులు రాక, తిండి దొరక్క అవస్థల పాలవుతున్న కూలీలు ⇒ పనుల కోసం పక్క రాష్ట్రాలకు వలసబాట పడుతున్న కూలీలు సాక్షి, అమరావతి: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం.. కరువు కోరల్లో చిక్కి వలసబాట పడుతున్న ప్రజలకు సొంత ఊళ్లలోనే పనులు కల్పించేందుకు ప్రవేశపెట్టిన ఈ స్కీమ్కు సాక్షాత్తూ ప్రభుత్వమే తూట్లు పొడుస్తోంది. కూలీలకు ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లిస్తేనే వారి కడుపుల్లోకి నాలుగు మెతుకులు వెళ్లే పరిస్థితి. అలాంటిది నెలన్నర రోజులుగా ప్రభుత్వం కూలి డబ్బులు చెల్లించకుండా నిలిపివేసింది. దీంతో నిరుపేద కూలీలు పస్తులతో అల్లాడిపోతున్నారు. ఉపాధి హామీ పథకాన్ని నమ్ముకోలేక పనుల కోసం పక్క రాష్ట్రాలకు సైతం వలస వెళ్తున్నారు. ప్రభుత్వం సకాలంలో డబ్బులు ఇవ్వకపోతే ఎలా బతకాలని కూలీలు ప్రశ్నిస్తున్నారు. కూలీలకు చెల్లించడానికి డబ్బుల్లేవంటున్న ప్రభుత్వం ఇదే పథకం కింద మెటీరియల్ పనులు చేసే కాంట్రాక్టర్లకు మాత్రం బకాయిల చెల్లింపునకు రూ.877.55 కోట్లు విడుదల చేయడం గమనార్హం. నిలిచిపోయిన చెల్లింపులు రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద పనులు చేసిన వారికి ఫిబ్రవరి రెండో తేదీ నుంచి చెల్లింపులు నిలిచిపోయాయి. ఈ నెలన్నర రోజులకు కూలీలకు రూ.310 కోట్లు చెల్లించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వ ఇస్తున్న నిధులను రాష్ట్ర సర్కారు ఇతర అవసరాలకు మళ్లిస్తోంది. ఉపాధి హామీ పథకంలోనే మెటీరియల్ పనులు చేసే కాంట్రాక్టర్లకు మాత్రమే డబ్బులు చెల్లిస్తూ కూలీలకు మాత్రం మొండిచేయి చూపుతోంది. ఫిబ్రవరి, మార్చిలో ప్రభుత్వం రూ.877.55 కోట్లు విడుదల చేసింది. అయితే, కూలీలకు పైసా కూడా ఇవ్వకుండా మొత్తం నిధులను ఉపాధి హామీ పథకంలో చేపట్టే సిమెంట్ రోడ్డు పనులు చేసిన కాంట్రాక్టర్ల బకాయిలకే చెల్లించారు. ఫిబ్రవరి 2వ తేదీ తర్వాత ఆ నెలలో పని చేసిన 13,99,331 కూలీలకు రూ.160.56 కోట్లు, మార్చిలో 17వ తేదీ నాటికి 14,96,161 మందికి రూ.150.02 కోట్ల మేర వేతన బకాయిలు చెల్లించాల్సి ఉంది. కాంట్రాక్టర్ల కోసం ఎనిమిది సార్లు నిధులు ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే మెటీరియల్ (కాంట్రాక్టు) పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.877.55 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి 21 నుంచి మార్చి 17వ తేదీ మధ్య ఆర్థిక శాఖ ఎనిమిది విడతల్లో నిధులిచ్చింది. ఈ మేరకు జీవోలు కూడా జారీ చేసింది. తొమ్మిది నెలలైనా కూలి డబ్బులు రాలేదు ‘‘మా ఇంట్లో నలుగురం ఫారంపాండ్ గుంతలు తవ్వే పని చేశాం. పనులు పూర్తయి తొమ్మిది నెలలైనా ఇంకా డబ్బులు రాలేదు. నెలల తరబడి కూలి డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి?’’ – సుంకమ్మ, ఉపాధి కూలీ,ఉప్పర్లపల్లి, కర్నూలు జిల్లా డబ్బులు రాక ఇబ్బందులు పడుతున్నాం ‘‘ఉపాధి హామీ పథకంలో పనులు చేసిన మాకు కూలీ డబ్బులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. నిన్నమొన్నటి వరకూ పనులు ప్రారంభించలేదు. నెల రోజులుగా అడపాదడపా మాత్రమే పనులు దొరుకుతున్నాయి. వీటికి కూడా డబ్బులు ఇవ్వడం లేదు. ఒక్కోసారి కనీస వేతనం రోజుకు రూ.60 కూడా రావట్లేదు’’ – బి.వెంకటమ్మ, ఉపాధి హామీ పథకం కూలీ, అమరాం గ్రామం, రాజాం మండలం, శ్రీకాకుళం జిల్లా ఎప్పటికైనా డబ్బులు ఇస్తారని వెళ్తున్నాం ‘‘నెలల తరబడి కూలీ డబ్బులు ఇవ్వకపోవడంతో వేరే పనులకు వెళ్లిపోవాలని అనుకున్నాం. స్థానికంగా వ్యవసాయ పనులు కూడా లేకపోవడంతో ఎప్పటికైనా డబ్బులు ఇస్తారు కదా అనే ఆశతో భారంగానే రోజూ ఉపాధి పనులకు వెళ్తున్నాం. పనులకు వెళ్లకపోతే జాబ్కార్డులు రద్దు అవుతాయని అంటున్నారు. అందుకే తప్పనిసరై వెళ్లాల్సి వస్తోంది’’ – కలికోట పార్వతి, ఉపాధి కూలీ, మామిడిపల్లి గ్రామం, సాలూరు మండలం, విజయనగరం జిల్లా డబ్బులు ఇవ్వకపోతే వలస వెళ్లాల్సిందే.. ‘‘ఉపాధి హామీ పథకం కింద పది వారాలుగా పనులు చేసినా వేతనాలు అందలేదు. వారానికొకసారైనా డబ్బులు అందకపోతే బతుకు వెళ్లదీయడం కష్టంగా మారుతోంది. కూలీ సొమ్ము ఎప్పటికప్పుడు చెల్లించకపోతే మూటాముల్లె సర్దుకొని వలసవెళ్లక తప్పదు. బ్యాంకు ఖాతాలతో అంతా గందరగోళంగా ఉంది. పోస్టాఫీస్కు వెళితే బ్యాంక్లో పడతాయని, మా వద్దకు రావొద్దని చెబుతున్నారు. బ్యాంకుకు వెళితే డబ్బులు లేవంటున్నారు. తిరగలేక చస్తున్నాం’’ – మల్లపురెడ్డి వెంకట్లు, ఉపాధి కూలీ, వల్లూరు గ్రామం, నెల్లిమర్ల మండలం, విజయనగరం జిల్లా కూలీ డబ్బులు రాకపోతే ఎట్లా బతకాలి? ‘‘డిసెంబర్ నుంచి తొమ్మిది వారాలు ఫారంపాండ్ గుంతలు తవ్వే పనికిపోయాం. ఇంతవరకు ఒక్క రూపాయి కూలీ డబ్బులు కూడా ఇవ్వలేదు. తొమ్మిది వారాలుగా కూలీ డబ్బులు రాకపోతే మేము ఎట్లా బతకాలి? ప్రభుత్వం వెంటనే మాకు కూలీ డబ్బులు చెల్లించి ఆదుకోవాలి’’ – పెద్ద రంగన్న, ఉపాధి కూలీ, ఉప్పర్లపల్లి, కర్నూలు జిల్లా -
అంత ‘ఉపాధి’ ఎలా సాధ్యం!
- రాష్ట్ర బడ్జెట్లో ఉపాధిహామీకి రూ.3 వేల కోట్లు కేటాయింపు - 30 వేల కోట్ల పనిదినాలు కల్పించడంపై సందేహాలు సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలుపై సర్కారు అంచనాలకు, ఆచరణకు భారీ వ్యత్యాసం కని పిస్తోంది. రానున్న ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఉపాధి హామీ అమలు నిమిత్తం తాజా బడ్జెట్లో రూ.3 వేల కోట్లు కేటాయిం చిన సంగతి తెలిసిందే. ఈ మొత్తంలో రూ.253.98 కోట్లు నిర్వహణ పద్దుగాను, రూ.2,746.02 కోట్లు ప్రగతి పద్దుగానూ ప్రభుత్వం చూపింది. ప్రగతి పద్దుగా చూపిన మొత్తాన్ని ప్రభుత్వం మెటీరియల్ కాంపొ నెంట్ కింద పేర్కొనడంపై సిబ్బందిని విస్మ యానికి గురి చేసింది. ఉపాధిహామీ కూలీలకు వేతనంగా ఇచ్చిన మొత్తంలో 40 శాతం దాకా మెటీరియల్ కాంపొనెంట్ కింద ఖర్చు చేసేందుకు వీలుకానుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో రూ.2,746.02 కోట్ల మొత్తాన్ని మెటీరియల్ కాంపొనెంట్గా ఖర్చు చేయడంతో నిర్దేశిత నిష్పత్తి మేరకు వేతన కాంపొనెంట్ కింద రూ.4,119.03 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన సగటు వేతనం రూ.138 ప్రకారం వచ్చే ఏడాది రూ.4,119 కోట్ల వేతన కాంపొనెంట్ను ఖర్చు చేసేందుకు దాదాపు 30 కోట్ల పనిదినాలను కూలీలకు కల్పిం చాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వమిచ్చిన మెటీరియల్ కాంపొనెంట్కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం వేతన కాంపొనెంట్ ఇచ్చేందుకు అంగీకరించినప్పటికీ, 30 కోట్ల పనిది నాలను జనరేట్ చేయడం ఎలా సాధ్యమనే ప్రశ్న వివిధ స్థాయిల్లో వ్యక్తమవుతోంది. ఇది లా ఉంటే.. గత మూడేళ్లలో రాష్ట్రంలో ఉపా ధిహామీ కింద కూలీలకు 14 కోట్లకు మించి పనిదినాలు కల్పించలేని పరిస్థితి ఉండగా, వచ్చే ఏడాది 30 కోట్ల పనిదినాల కల్పనకు సర్కారు అంచనా వేయడం గమనార్హం. సర్కారు బడ్జెట్లో పేర్కొన్న అంచనాలు బాగా నే ఉన్నా, ఆచరణలో 30 కోట్ల పనిదినాలను కల్పించడం ఎంతవరకు సాధ్యమని పలు జిల్లాల గ్రామీణాభివృద్ధి అధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ పనులకు వచ్చిన కూలీలకు ప్రభుత్వం సకాలంలో వేతనాలు ఇవ్వనందున, ఈ ఏడాది పనులకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గిందని డీఆర్డీవోలు చెబుతున్నారు. ఊహా జనితమైన అంచనాలతో ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని పలువురు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఆరోపిస్తున్నారు. -
ఉపాధిలో అంతులేని అవినీతి
రూ.2 కోట్లకుపైగా అక్రమాలు జరిగినట్టు తనిఖీల్లో గుర్తింపు దుత్తలూరు మండలంలో జరిగిన ఉపాధి హామీ పనుల్లో అవినీతికి అంతులేదు. కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని రాజకీయ నేతలు, అధికారులు, సిబ్బంది బొక్కేశారు. నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలతో పనులు చేసి బినామీ మస్టర్లు వేసి కూలీల సొమ్ములను స్వాహా చేశారు. ఉదయగిరి: జిల్లాలో ఏ మండలంలో జరగని విధంగా దుత్తలూరు మండలంలో రూ.11కోట్లకు పైగా పనులు ఏడాది కాలంలో చేశారు. ఈ పథకం ప్రారంభించిన 2007 నుంచి ఈ ఆడిట్ను మినహాయిస్తే ఎప్పుడూ రూ.5 కోట్లకు మించి పనులు జరగలేదు. ఈ ఒక్క ఉదాహరణ చాలు అవినీతి బాగోతాన్ని తేటతెల్లం చేస్తోంది. ఈ అంశాలన్నింటినీ బలపరుస్తూ పదిరోజుల నుంచి జరిగిన సామాజిక క్షేత్ర స్థాయి తనిఖీల్లో గుర్తించిన అవినీతి అక్షరాలా రూ.2కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. అయితే వాస్తవంగా ఈ అవినీతి అక్రమాలు రూ.3 కోట్లకు పైగానే ఉంటాయని అంచనా. ఈ అవినీతికి మూలకారుకులైన ఉపాధి సిబ్బంది, అధికారులను రక్షించే బాధ్యతను కొంతమంది అధికార పార్టీ నేతలు తీసుకోవడంతో అక్రమార్కులపై ఏ మేరకు చర్యలు ఉంటాయో బహిరంగ చర్చావేదిక పూర్తి అయ్యేంత వరకు వేచి చూడాలి. కనిపించని అభివృద్ధి మండలంలో 2016 జనవరి నుంచి డిసెంబరు వరకు కేవలం కూలీల పేరుతో జరిగిన ఖర్చు రూ.7.83 కోట్లుకాగా, సామగ్రి కోసం ఖర్చు చేసిన మొత్తం రూ.3.71కోట్లు. మొత్తంగా ఏడాది కాలంలో ఈ పథకంలో ఖర్చు చేసిన నిధులు రూ.11.53 కోట్లు. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసినా గ్రామాల్లో అభివృద్ధి నామామాత్రమే. కూలీల చేత చేయించాల్సిన పనులను యంత్రాలతో చేయించి, బినామీ మస్టర్లు ద్వారా నేతలు స్వాహా చేశారు. కొన్ని గ్రామాల్లో అధికార అండదండలతో కూలీలను బెదిరించి వారి పేర్లతో మస్టర్లు వేసి అరకొరగా ఇచ్చి వారిచేతనే పోస్టాఫీసు, బ్యాంకుల ద్వారా నగదు డ్రా చేసి దిగమింగారు. దీంతో నిధులు అయితే మంచినీళ్లు మాదిరే ఖర్చు అయినా అభివృద్ధి కనిపించలేదు. పనులు చేయకుండానే నిధులు స్వాహా ఈ పథకంలో ఇంతవరకు జరిగిన క్షేత్ర స్థాయి తని ఖీల్లో పనుల కొలతల్లో తేడాలు, నాసిరకంగా పనులు, యంత్రాలతో పనులు చేయడంలాంటి అంశాలు మా త్రమే గుర్తించారు. వీటిపై రికవరీ పెట్టారు. కానీ ఈ మండలంలో పనులు చేయకుండానే నిధులు కాజేశారు. ముఖ్యంగా పంట సంజీవని పేరుతో ఫాంపాండ్స్ తీయకుండానే తీసినట్లు రికార్డుల్లో నమోదు చేసి నిధులు మింగారు. కొన్ని చోట్ల పనులను యంత్రాలతో చేయించారు. పనులు మంజూరు అయిన ప్రాంతా నికి గుంటలు ఉన్న ప్రాంతానికి సంబంధమే లేదు. నిబంధలకు విరుద్ధంగా చెరువులు, వాగులు, వంకలు, ప్రభుత్వ పోరంబోకు భూముల్లో గుంటలు తీశారు. వీటి ద్వారా రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ అవకతవకలు భైరవరం, బ్రహ్మశ్వేరం, ఏరుకొల్లు, రాచవారిపల్లి, నందిపాడు, నర్రవాడ, బోడవారిపల్లి, బండకిందపల్లి, దుత్తలూరు పంచాయతీల్లో చోటుచేసుకున్నాయి. సిబ్బంది చేతివాటం ఈ అవినీతి వ్యవహారంలో సిబ్బంది పెద్ద మొత్తంలో మింగేశారు. ఓ టీఏ ఏకంగా రూ.50 లక్షలు సంపాదిం చినట్లు చర్చించుకుంటున్నారు. మెటీరియల్ పనుల్లో జరిగిన అక్రమాలకు ఇప్పుటికే ఈసీ, ఏపీఓ, ఒక టీఏ ను సస్పెండ్ చేశారు. సామగ్రి పనులకు సంబం ధించి పే ఆర్డర్ ఇచ్చే కీలక స్థానంలో ఉన్న ఏంపీడీఓకు పాత్ర ఉన్నా అ«ధికారులు అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా జిల్లా అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఆ ఎంపీడీఓ అవినీతి గురించి ప్రశ్నించే వారిపై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేయ డం విశేషం. పాపంపల్లిలో నాబార్డు ద్వారా జరిగిన కుంటలను మళ్లీ చూపి ఉపాధి నిధులు స్వాహా చేసిన ట్లు ఆడిట్ బృందాలు గుర్తించాయి. రాచవారిపల్లెలో ఓ చెక్డ్యామ్కు పునాదులు లేకుండానే పైపైనే పనులు చేసి నిధులు దిగమింగినట్లు తనిఖీల్లో గుర్తించారు. దు త్తలూరులో సుమారు 30, భైరవరంలో 10, నందిపాడులో 9,పాపంపల్లిలో 4, బ్రహ్మేశ్వరంలో 15 గుంటలు తీయకుండానే నిధులు స్వాహా చేసినట్లు ఆడిట్ అధికారులు గుర్తించిట్లు విశ్వసనీయ సమాచారం. నేడు బహిరంగ చర్చావేదిక ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సామాజిక తనిఖీ బృందాలు గ్రామసభలు జరపలేదు. పైగా మండల కేంద్రంలో నిర్వహించాల్సిన బహిరంగ చర్చావేదికను జిల్లా కేంద్రంలోని డ్వామా కార్యాలయంలో సోమవారం నిర్వహిస్తారు. ఈ వేదిక సాక్షిగా అడిట్ బృందం బయటపెట్టే అవినీతిని కప్పెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ వేదికకు డ్వామా పీడీ హరిత వస్తే ఇబ్బందులు తప్పవని గ్రహించిన ఉపాధి అధికారులు ఆమెను రాకుండా చేసే ప్రయత్నాలు సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ అవినీతిలో భాగస్వాములున్నవారిపై చర్యలు ఉంటా యా! లేక తేలిపోతాయా! తేలాలంటే సోమవారం సాయంత్రం వరకు వేచి చూడక తప్పదు. -
ఉపాధి కూలీల వేతనం పెంపు
ఏపీ, తెలంగాణల్లో రూ.3 పెరిగిన కూలీ సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ‘ఉపాధి హామీ’ కూలీలకు చెల్లించే వేతనాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఈ పెంపు రాష్ట్రాల వారీగా వేర్వేరుగా ఉంది. ఏపీ, తెలంగాణల్లో కూలీలకు ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో రోజుకు గరిష్టంగా రూ.194 వేతనంగా చెల్లిస్తుండగా, ఆ మొత్తాన్ని రూ.197కు పెంచుతూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఈ వేతనాలు అమల్లోకి రానున్నాయి. -
ఇదేం న్యాయం?
♦ ఉమ్మడి జిల్లా పరిధిలో రూ.85.31కోట్లతో సీసీ రోడ్లు ♦ పంచాయతీ తీర్మానాలు లేకుండానే ఎంపీ, ఎమ్మెల్యేల సిఫారసులు ♦ పనులు తమకే అప్పగించాలంటున్న సర్పంచులు ♦ రోడ్ల నిర్మాణానికి మార్చి 31వరకే గడువు ఆదిలాబాద్ కల్చరల్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎన్ ఆర్ఈజీఎస్ 20:80 అభివృద్ధి పనులు అభాసుపాలవుతున్నాయి. సర్పంచ్ తీర్మానం లేకుండానే కార్యకర్తల పేరుతో ప్రజాప్రతినిధులు పనులు చేసి సర్పంచులకు మొండిచేయి చూపిస్తున్నారు. కొన్ని గ్రామపంచాయతీల్లో ఎంపీ, ఎమ్మెల్యేలు 20 శాతం నిధులు కేటాయించి తమకు అనుకూలమైన కార్యకర్త పేరును పంచాయతీ ఇంజినీర్లకు సిఫారసు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. గ్రామపంచాయతీలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు ఈ పనులు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నా ప్రజాప్రతినిధులు సిఫారసులతో నిరాశ చెందుతున్నారు. అభివృద్ధి పనులు 20 శాతం వెచ్చించి ఇష్టారాజ్యంగా కొందరు ప్రజాప్రతినిధులు వ్యవహరించడంపై ప్రజాగ్రహం కనిపిస్తోంది. ఇది గ్రామ పంచాయతీలో ప్రతిపక్ష సర్పంచులు ఉన్న ప్రాంతంలో ఈ సిఫారసుల తంతు ఎక్కువగా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. నిధులు సమకూరేదిలా.. 20:80 పథకంలో 20శాతం స్థానిక పంచాయతీ, ఎమ్మెల్యేలు, ఎంపీ నిధుల నుంచి గ్రామపంచాయతీలకు నిధులు కేటాయించగా కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధిహామీ పథకం నుంచి 80 శాతం నిధులు గ్రామాభివృద్ధి, సీసీ రోడ్ల నిర్మాణానికి వెచ్చిస్తోంది. నిజానికి 20 శాతం గ్రామపంచాయతీలు, ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో చెల్లించి 80 శాతం నిధులు సమకూర్చుకునేందుకు గ్రామపంచాయతీల తీర్మానాన్ని తీసుకోలేదు. 20శాతం నిధులు చెల్లించడానికి ముందుకు వచ్చినా స్థానిక ప్రజాప్రతినిధులే చెల్లిస్తున్నారని, గ్రామ పంచాయతీలకు సంబంధం లేకుండా సంబంధిత ప్రజాప్రతినిధులకు అనుకూలంగా ఉన్న ఏరియాలో పనులు చే పడుతున్నారు. ఉపాధిహామీ పథకం నిబంధనల ప్రకా రం ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వా ల్సి ఉండగా ఆ పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదని ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. గ్రామసభల ద్వారా పంపిన పనులను పక్కన పెట్టినట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో కేటాయించిన నిధులు.. పనులు ఉపాధిహామీ పథకంలోని 20:80 ప్రకారం ఉమ్మడి జిల్లాలో రూ.85.31కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 875 సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.23 కోట్లు, కుమురం భీం జిల్లాలో 471 పనులకుగాను రూ.19.57 కోట్లు, నిర్మల్ జిల్లాలో 444 పనులకు రూ.20.33 కోట్లు, మంచిర్యాలలో 530 పనులకు రూ.22.41 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. కాగా ఇందులో కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.68 కోట్ల 24 లక్షల 80 వేలు సమకూర్చగా, ఎంపీ, ఎమ్మెల్యే, జీపీల నిధులు రూ.17 కోట్ల 6 లక్షల 20 వేలు 20 శాతం కింద జమ చేయాల్సి ఉంది. సర్పంచులకు మొండిచేయి ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో అభివృద్ధి నిర్మాణ పనులు నిర్వహించాల్సిన ఈ పనుల్లో కొందరు సర్పంచులకు మొండిచేయి చూపుతున్నారు. 20శాతం నిధులు వెచ్చించిన ఎమ్మెల్యే, ఎంపీలను తమకు అనుకూలంగా కార్యకర్తల పేర్లను అధికారులకు సిఫారసు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో గ్రామ పంచాయతీ తీర్మానించే సర్పంచ్, వార్డు మెంబర్ల పరిస్థితి అయోమయంలో పడింది. కొందరు సర్పంచులు ఈ తీర్మానానికి అంగీకరించలేని పరిస్థితులు కనిపించగా, తాము సిఫారసు చేసిన వ్యక్తిని పనులు చేయనీయని పక్షంలో 20 శాతం నిధులను చెల్లించమనే పరోక్ష సంకేతాలు ఇస్తున్నట్లు సమాచారం. దీంతో సర్పంచులు కార్యకర్తలు, ప్రజాప్రతినిధుల విధి విధానాలను వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ముంచుకొస్తున్న గడువు ప్రభుత్వం నిర్వహించే 20 : 80 పనులకు గడ్డుకాలం ఉన్నట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితం ఇచ్చిన ఉత్తర్వులతో ఇప్పటివరకు ఒకటి రెండు పనులు మినహా ఎక్కడా ప్రారంభం కాలేదు. మార్చి 31లోపు ఈపనులు చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కానీ సర్పంచులు ఇంకా పనులు ప్రారంభించలేదు. గడువు ముగుస్తుందని వేగవంతంగా పనులు చేస్తే నాణ్యత లోపాలు ఏర్పడే అవకాశాలున్నట్లుగా ప్రజలు భావిస్తున్నారు. -
పాలెం ప్రాజెక్టు సమీపంలో ల్యాండ్మైన్
► గుర్తించిన ‘ఉపాధి’ కూలీలు ► పోలీసులకు సమాచారం వెంకటాపురం (భద్రాచలం): జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండల పరిధి మల్లాపురం సమీప పాలెం ప్రాజెక్టు వద్ద శనివారం ల్యాండ్మైన్ బయటపడింది. అటవీ ప్రాంతంలో కందకాలు తవ్వేందుకు ఉపాధి హామీ కూలీలు ఉదయం పనులు చేపట్టారు. కొందరు కూలీలు కొప్పుగుట్ట సమీప అటవీప్రాంతంలో మూత్రవిసర్జనకు వెళ్లగా... కాళ్లకు కరెంట్ వైర్లు తగలడంతో వాటిని పరిశీలించారు. వైర్లు రోడ్డు మీద తవ్విన గుంత వరకు ఉండడాన్ని గమనించి భయంతో అదే ప్రాంతంలో పనిచేస్తున్న మిగతా కూలీలకు విషయం చెప్పారు. వారు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని ల్యాండ్మైన్ గా గుర్తించారు. బాంబు స్క్వాడ్ను రప్పించి తనిఖీలు చేయించనున్నారు. -
ఊరు పొమ్మంది ..ఊళ్లకు తాళం
⇒ కరువుదెబ్బకు పల్లెలు వదిలి నగరాలకు వలస ⇒ తంబళ్లపల్లె నియోజకవర్గంలో దీన పరిస్థితులు ⇒ పల్లెల్లో నిర్మానుష్యం.. తాళం పడిన ఇళ్లే దర్శనం ⇒ అపహాస్యం చేస్తున్న ఉపాధి హామీ పథకం తంబళ్లపల్లె నియోజకవర్గంలో పల్లెలకు పల్లెలే వలసబాట పడుతున్నాయి. ఒకప్పుడు బాగాబతికిన కుటుంబాలు కూడా బతుకుదెరువు కోసం మూటాముల్లె సర్దుకుని నగరాలకు వెళ్లిపోతున్నాయి. 2015 నవంబర్లో కురిసిన వర్షానికి పంటలు పండి కళకళలాడిన పొలాలు ఇప్పుడు ఎడారిని తలపిస్తున్నాయి. నిశ్శబ్ద వాతావరణం కనిపిస్తున్న పల్లెలు కన్నీటి కథలే చెబుతున్నాయి. వర్షాభావంతో భూగర్భ జలాలు పడిపోయాయి. పంటలసాగు పూర్తిగా కనుమరుగైపోయింది. రైతులు, కూలీలకు పనిలేకుండాపోయింది. కష్టం చేయలేని ముసలివారిని, కడుపున పుట్టిన చిన్నపిల్లలను ఇంటికి కాపలాపెట్టి ఊరుగాని ఊరు వెళ్లిపోతున్నారు. అష్టకష్టాలు పడుతూ జీవితాల్ని నెట్టుకొస్తున్నారు. బి.కొత్తకోట: నియోజకవర్గంలోని బి.కొత్తకోట, కురబలకోట, పెద్దతిప్పసముద్రం, పెద్దమండ్యం, తంబళ్లపల్లె, ములకలచెరువు మండలాల్లో కరువు కరాళనృత్యం చేస్తోంది. చేసేదానికి పనిలేక పొట్టచేతబట్టుకుని పలువురు వలసబాటపడుతున్నారు. ఒకప్పుడు బాగాబతికిన కుటుంబాలూ దినసరి కూలీలుగా చేరేందుకు పట్టణాలకు వెళ్లిపోతున్నాయి. ఇళ్లకు ముసలివారు కాపలాదారులవుతున్నారు. బెంగళూరు, కేరళ, గోవా, తిరుపతి, హైదరాబాద్, ముంబై నగరాలకు వెళ్లిపోతున్నారు. భవన నిర్మాణ పనుల్లో కూలీలుగా, ఫ్యాక్టరీలు, ఏటీఎం కేంద్రాల్లో వాచ్మెన్లుగా కాలం వెళ్లదీస్తున్నారు. రోడ్లమీద పానీపూరి అమ్ముకుంటూ కొందరు, ఫుట్పాత్ వ్యాపారం చేసుకుంటూ మరికొందరు నెట్టుకొస్తున్నారు. గ్రామాలు ‘ఖాళీ’ బీరంగి, మొటుకు, బడికాయలపల్లె, గుమ్మసముద్రం, బురకాయలకోట, మద్దినాయునిపల్లె, చౌడసముద్రం, సోంపల్లె, నాయునిచెరువుపల్లె, గూడుపల్లె, కాలువపల్లె, రామానాయక్ తాండా, బండకింద తాండా, కుడుమువారిపల్లె, వడ్డివంకతాండా, మందలవారిపల్లె, ముదివేడు, కనసానివారిపల్లె, సిద్దారెడ్డిగారిపల్లె, తుమ్మచెట్లపల్లె, భద్రయ్యగారిపల్లె, గుట్టమీద సాయిబులపల్లె, పట్టెంవాండ్లపల్లె, మడుమూరు, సంపతికోట, దేవప్పకోట, బురుజుపల్లె, కాట్నగల్లు, బూచి పల్లె, మద్దయ్యగారిపల్లె, తుమ్మరకుంట, కందుకూరు, టీ.సదుం, గోపిదిన్నె, కన్నెమడుగు, ఎర్రసానిపల్లె, కోటకొండ, కోటాల, ఆర్ఎన్తాండా, తంబళ్లపల్లె, దిన్నిమీదపల్లె పంచాయతీల్లో అధిక కుటుంబాలు వలసలు వెళ్లాయి. 47కు 32 కుటుంబాలు వలస కురబలకోట మండలంలోని తుమ్మచెట్లపల్లెలో 47 కుటుంబాలున్నాయి. ఇక్కడి జనాభా 282 మంది. 32 కుటుంబాలు వలస వెళ్లాయి. ఈ కుటుంబాలకు చెందిన వ్యక్తులు బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో కూలి పనులు చేస్తున్నారు. కేబుల్ వేసేందుకు గుంతలు తవ్వడం వీరి పని. వలస వెళ్లిన కుటుంబాలకు చెందిన పిల్లలు ఇళ్లవద్దే ఉంటున్నారు. పెద్దలకు డబ్బులు చేతికందాక ఇంటికి వచ్చి కొన్నిరోజులుండి మళ్లీ పనుల కోసం వలసలు వెళ్తారు. ఏడాదిగా ఉపాధి జాడలేదు ఈ పల్లెల్లో జాబ్కార్డులు 132 ఉన్నాయి. ఇక్కడ ఏడాదిగా ఉపాధి జాడలేదు పెద్దమండ్యం మండలం సీ.గొల్లపల్లె పంచాయతీకి చెందిన కుడుములవారిపల్లెలో 54 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇందులో 11 కుటుంబాలు పూర్తిగా పల్లె వదిలి బెంగళూరుకు వలస వెళ్లాయి. ఇళ్లకు తాళాలు వేయడంతో గృహాలకు ఆలనాపాలనా లేక దుస్థితికి చేరాయి. ఈ పల్లెలో 96 జాబ్కార్డులు, 140 మంది కూలీలు ఉన్నారు. ఏడాదిగా ఒక్క ఉపాధి పనినీ మంజూరు కాలేదు. ఇక్కడ క్షేత్ర సహాయకుడి పోస్టు ఖాళీగా ఉన్నా అధికారులు పట్టించుకోలేదు. కుటుంబాలకు కుటుంబాలే వలసలు వెళ్తున్నాయి. బి.కొత్తకోటలో మరీ అధ్వానం తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో జాబ్కార్డులు కలిగిన కూలీలు 62,461 మంది ఉన్నారు. వీరిలో అధికారులు ఉపాధి పనులు కల్పిస్తున్నది 15,749 మంది కూలీలకు మాత్రమే. ఇందులోనూ ఈ ఆర్థిక సంవత్సరంలో అత్యంత దారుణంగా పనులు కల్పించింది బి.కొత్తకోట మండలంలోనే. ఇక్కడ 11,759 జాబ్కార్డులు కలిగిన కూలీలుంటే పనులు చేస్తున్నది 2,027 మంది కూలీలే. చేసేదానికి పనిలేక నగరాలకు వలసలు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కూలీలుగా మార్చేసింది పెద్దతిప్పసముద్రం పాత మండలం వీధికి చెందిన బడికాయలపల్లె ఖాదర్సాబ్(70)కు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. వ్యవసాయమే ఆధారం. నాలుగు ఎకరాల పొలం ఉంది. సేద్యం చేసేందుకు మూడు బోర్లు వేయించాడు. చుక్కనీరు పడకపోగా అప్పులు మిగిలాయి. చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి. బతుకుదెరువు కరువైంది. ఇద్దరు కొడుకులు బెంగళూరుకు వలసవెళ్లారు. పెద్ద కొడుకు మహబూబ్పీర్ తోపుడు బండిపై టీ అమ్ముతున్నాడు. చిన్నకొడుకు షఫీసాబ్ భవన నిర్మాణ కార్మికుడిగా ఉన్నాడు. వీరి సంపాదనతోనే కుటుంబం గడిచే పరిస్థితి. షఫీసాబ్ ముగ్గురు కుమార్తెలు, కుమారుడు, భార్య పీటీఎంలోనే ఉంటున్నారు. షఫీసాబ్ కూలి చేస్తే వచ్చే మొత్తంలో ఖర్చులు పోగా మిగిలిన సొమ్ము ఇంటికి పంపిస్తున్నాడు. భర్త బెంగళూరు వెళ్లడంతో ఇక్కడ బిడ్డల ఆలనాపాలనా చూసుకోవడం కష్టంగా ఉందని భార్య షాహీనా ఆవేదన వ్యక్తం చేస్తోంది. -
ఊపందుకున్న ‘ఉపాధి’
⇒ ఉపాధి పనుల్లో రోజుకు ఏడు లక్షల మంది కూలీలు! ⇒ ఇక కనిష్ట కూలీ రూ.130, గరిష్టం రూ.310 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు ఊపందుకున్నాయి. జనవరిలో ఉపాధి పనులకు లక్ష మంది లోపే హాజరు కాగా, ఫిబ్రవరి నుంచి ఆ సంఖ్య క్రమేపీ పెరుగుతూ వస్తోంది. గత వారంలోనైతే రోజుకు సగటున 5.78 లక్షల మంది చొప్పున కూలీలు ఉపాధి పనుల్లో పాల్గొన్నారు. ఇక తాజాగా శుక్రవారం నాడైతే ఏకంగా 6.99 లక్షల మంది కూలీలు పనులకు రావడం విశేషం! గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు బాగా తగ్గడం, ప్రభుత్వం 20 శాతం నుంచి 35 శాతం దాకా సమ్మర్ అలవెన్స్ పెంచడంతో జాబ్ కార్డులున్న కూలీలంతా ఉపాధి పనుల వైపే మొగ్గుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉపాధి కూలీలకు రూరల్ స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లను కూడా ప్రభుత్వం తాజాగా సవరించింది. దాదాపు 21 విభాగాల్లో వివిధ రకాల పనులకు రేట్లను 28 శాతం దాకా పెంచుతూ శనివారం ఉత్తర్వులిచ్చింది. ఉపాధి హామీ కింద గ్రామీణాభివృద్ధి శాఖ ప్రస్తుతం కూలీలకు చెల్లిస్తున్న రోజువారీ వేతన సగటు రూ.137 కాగా, తాజా పెంపుదలతో పూర్తిస్థాయిలో రోజువారీ వేతనం (రూ.194) అందే అవకాశం ఏర్పడిందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఉపాధిహామీ కూలీలందరికీ తాజా ఉత్తర్వుల మేరకు పెరిగిన వేతనాలందేలా చర్యలు చేపట్టాలని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ను ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలోని 8,182 గ్రామాలలో ఉపాధి పనులు జరుగుతుండగా, పని కోరిన కూలీలందరికీ ఉపాధి కల్పించే నిమిత్తం రూ.14 వేల కోట్ల విలువైన 11లక్షల పనులను గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సిద్ధం చేశారు. సవరించిన రూరల్ స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్లు ► కొండ ప్రాంతాలు, పల్లపు ప్రాంతాల్లో భూమి తవ్వకం, భూమిని చదును చేసే పనులకు ప్రస్తుతం క్యూబిక్ మీటరుకు రూ.114 ఇస్తుండగా రూ.145.82కు పెంచారు ► చెక్డ్యామ్లు, చిన్న కుంటల్లో పూడికతీత పనులకు కూలీ రూ.114 నుంచి 130కి పెంపు ► సరిహద్దు కందకాలు, కరకట్టల పనులకు కూలీ క్యూబిక్ మీటరుకు రూ.157.39 నుంచి రూ.173.13కు పెంచారు ► ఫీడర్ ఛానళ్లలో పూడికతీత, అప్రోచ్ రోడ్ల నిర్మాణం, ఇందిరమ్మ కాలనీల్లో నీరు నిలిచే ప్రాంతాలను పూడ్చడం, మురికి కాల్వల నిర్మాణం తదితర పనుల్లో క్యూబిక్ మీటరుకు రూ.114 నుంచి రూ.145.82కు పెంచారు ► వ్యవసాయ కుంటలు, బావులు, నీటి సంరక్షణ కందకాల తవ్వకం, డంపింగ్ యార్డులలో పనులకు రూ.194 నుంచి రూ.246.30కు పెంచారు ► గరప నేలల్లో పనులకు క్యూబిక్ మీటరుకు రూ.140.6 నుంచి రూ.180కి పెంచారు ► పలు పనులకు క్యూబిక్ మీటర్కు కనిష్టంగా రూ.130, గరిష్టంగా రూ.310 అందనుంది -
కేంద్రం ఇవ్వదు.. రాష్ట్రం అడగదు
ఉపాధిహామీకి నిధుల కొరత సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధిహామీ పథకం అమలు పరిస్థితి దయనీయంగా మారింది. ఉపాధి పనులు చేసిన కూలీలకు వేత నాలిచ్చేందుకూ నిధుల కొరత ఏర్పడింది. నిన్నమొన్నటివరకు కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించింది. దీంతో కూలీలకు వేతనా లను తామే నేరుగా చెల్లిస్తామని ప్రకటించిన కేంద్రం.. పక్షం రోజులుగా వేతన చెల్లింపుల ను నిలిపివేసింది. దీంతో రాష్ట్రంలో ఉపాధి కూలీలకు సుమారు రూ.40 కోట్ల మేర వేతన చెల్లింపులు ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఆగిన వేతన చెల్లింపులు... గత నెల 1 నుంచి ఉపాధి పనులు చేసిన కూలీలకు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ మేనేజ్ మెంట్ సిస్టమ్ (ఎన్ఈఎఫ్ఎంఎస్) ద్వారా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి నేరుగా వేతనాలు అందుతున్నాయని.. ఉన్నట్టుండి జనవరి 20 నుంచి చెల్లింపులు నిలిచిపోయా యని క్షేత్ర స్థాయి సిబ్బంది చెబుతున్నారు. ఉపాధిహామీకి కేటాయించిన నిధులను ఉత్తరాది రాష్ట్రాలు ఎప్పటికప్పుడు ఎగరేసు కు పోతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తు న్నాయి. నిధుల విషయమై ఉత్తరాది రాష్ట్రాల నేతలు బలమైన లాబీయింగ్ చేస్తున్నారని, తెలంగాణతో సహా దక్షిణాది రాష్ట్రాల నేతలు పట్టించుకోక పోవడంవల్లనే నిధులు రావడం లేదని సర్పంచుల సంఘాలు అంటున్నాయి. మరోవైపు వేతన కాంపోనెంట్ పెరిగితేనే మెటీరియల్ కాంపోనెంట్ కింద నిధులు మంజూరు కానున్నాయి. గ్రామాలలో రూ. 600 కోట్ల ఉపాధిహామీ మెటీరియల్ కాంపో నెంట్ నిధులతో సిమెంట్ రహదారులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం.. వేతన కాంపోనెంట్ను పెంచేందుకు అవసర మైన నిధులను కేటాయించడంలేదు. ‘ఉపాధి’ కూలీల అవస్థలు... అటు కేంద్రం నిధులివ్వక.. ఇటు రాష్ట్రం పట్టించుకోక వేతనం కోసం ఉపాధి కూలీలు నానా అవస్థలు పడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉపాధి కూలీల సంఖ్య తగ్గిపోయే ప్రమాదముంది. ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగా చూపి.. కేంద్రం ఉపాధిహామీ నిధుల్లో మరింత కోత పెట్టే ప్రమాదం ఏర్పడనుంది. కేంద్రం సకాలంలో నిధులివ్వకపోయినా కూలీలకు వేతన చెల్లిం పులు ఆగకుండా రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణా భివృద్ధి శాఖకు రివాల్వింగ్ ఫండ్ను అందిస్తే మేలని సర్పంచులు సూచిస్తున్నారు. -
తెలంగాణపై బడ్జెట్ ఎఫెక్ట్...
‘ఉపాధి’కి ఊతం ‘ఉపాధి’వేతన చెల్లింపులకు రూ.3,500 కోట్లు మంజూరయ్యే అవకాశం సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ పథకానికి కేంద్రం తాజా బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం రాష్ట్రంలో ఉపాధి పనులకు మరింత ఉత్సాహాన్నిచ్చేలా ఉంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.48వేల కోట్లను కేంద్రం ప్రతిపాదించింది. గతేడాది కన్నా రూ.10 వేల కోట్లు అధికంగా కేటాయించడం పట్ల గ్రామీణాభివృద్ధి శాఖ హర్షం వ్యక్తం చేస్తోంది. తాజా కేటాయింపుల నేపథ్యంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి హామీ పనులు చేపట్టేందుకు వీలు కలుగుతుందని ఆ శాఖ సిబ్బంది చెబుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ కూలీల వేతనాలకు రూ.2,300 కోట్లు ఖర్చు చేస్తుండగా, వచ్చే ఏడాది రూ.3 వేల కోట్ల నుంచి రూ3,500 కోట్ల దాకా పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉపాధి పనులను అధికంగా చేసే రాష్ట్రాల్లో దేశంలోనే తెలంగాణ 5వ స్థానంలో ఉన్నందున కేటాయింపులు అధికంగా రావొచ్చని చెబుతున్నారు. పనిదినాలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఉపాధి హామీ పనుల్లో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం సూచించడం గమనార్హం. నీటి సంరక్షణపైనే ఫోకస్! వచ్చే ఆర్థిక సంవత్సరంలో నీటి సంరక్షణపై ప్రధానంగా దృష్టి సారించి ఉపాధి హామీ పనులు చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. వ్యవసాయ కుంటలు, కాంటూర్ ట్యాంక్స్, చెరువుల పూడికతీత.. తదితర నీటి సంరక్షణ చర్యలు చేపట్టనుంది. శాశ్వత ఆస్తుల కల్పనలో భాగంగా అంగన్ వాడీ, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం, సిమెంట్రోడ్డు, పాఠశాలల్లో కిచెన్ షెడ్స్, మరుగుదొడ్ల నిర్మాణ పనులకు అధిక ప్రాధాన్యం ఇవ్వనుంది. – బి.సైదులు, జాయింట్ కమిషనర్ (ఉపాధిహామీ) సాగు ప్రాజెక్టుల రుణాలకు వెసులుబాటు కార్పస్ ఫండ్ పెంపుతో తగిన స్థాయిలో రుణాలు అందే అవకాశం సాక్షి, హైదరాబాద్: కేంద్రం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ సాగునీటి ప్రాజెక్టులకు చేయూత నిచ్చేలా ఉందని నీటి పారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. నాబార్డు కింద ఏర్పాటు చేసిన కార్పస్ ఫండ్ను రూ.20 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్లకు పెంచనుండడంతో ఆ మేరకు రాష్ట్రాలకు రుణ వెసులుబాటు కలుగుతుందని పేర్కొంటున్నాయి. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్వై) కింద కేంద్రం గుర్తించిన 11 తెలంగాణ ప్రాజెక్టుల కోసం తగినన్ని రుణాలు తెచ్చుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని చెబుతున్నాయి. వాస్తవానికి సాగునీటి ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయడం కోసం కేంద్రం గతేడాదే దీర్ఘకాలిక సాగునీటి నిధి (ఎల్టీఐఎఫ్) కింద రూ.20 వేల కోట్లతో కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేసింది. కానీ దేవాదుల, రాజీవ్ భీమా, ఎస్ఆర్ఎస్పీ రెండోదశ, నీల్వాయి, ర్యాలివాగు, మత్తడి వాగు, పాలెం వాగు, కొమ్రం భీమ్, జగన్నాథపూర్, పెద్దవాగు, గొల్లవాగు, వరద కాలువలకు ఎలాంటి రుణాలూ దక్కలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టులను కాళేశ్వరం కార్పొరేషన్ పరిధిలోకి తెచ్చింది. ఈ కార్పొరేషన్ కు ఎఫ్ఆర్బీఎం పరిమితితో సంబంధం లేకుండా రూ.7,900 కోట్లు రుణాలు ఇవ్వాలని కోరగా.. నాబార్డు అంగీకరించింది కూడా. తాజాగా కార్పస్ ఫండ్ను పెంచడంతో కాళేశ్వరం కార్పొరేషన్ కింద రుణాలు తీసుకునే వెసులుబాటు దొరకనుంది. పీఎంకేఎస్వై కమిటీలో మంత్రి హరీశ్రావు సభ్యుడిగా ఉండటం సైతం రాష్ట్రానికి కలిసిరానుంది. హైదరాబాద్ ఐఐటీకి 75 కోట్లు గిరిజన వర్సిటీకి రూ.10 కోట్లు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని ఐఐటీకి ఎంప్లాయి అసిస్టెన్స్ ప్రోగ్రాం కింద రూ. 75 కోట్లు కేంద్రం బడ్జెట్లో ప్రత్యేకంగా కేటాయించింది. విభజన చట్టం హామీలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న ట్రైబల్ యూనివర్సిటీ కోసం రూ. 10 కోట్లు కేటాయించింది. ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ బ్లాక్లకు (ఈబీబీ) కేటాయించే ఇన్నోవేషన్ ఫండ్ ద్వారా రాష్ట్రంలోని 317 ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ మండలాలకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. జాతీయ స్థాయి పోటీ పరీక్షల నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎ్ టీఏ) ఏర్పాటు చేస్తామని బడ్జెట్లో ప్రకటించారు. దేశ వ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలను కూడా జేఈఈ మెయిన్ పరీక్ష ద్వారా చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్ పరీక్షను కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారానే నిర్వహించనున్నారు. గర్భిణులకు రూ.15 వేల ప్రోత్సాహకం రాష్ట్ర ప్రభుత్వం యోచన.. కేంద్ర బడ్జెట్లో రూ.6 వేలు కేటాయింపు సాక్షి, హైదరాబాద్: గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పు చేయించుకుంటే రూ.15 వేలు ప్రోత్సా హకం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు రూపొందిస్తున్నాయి. బుధవారం కేంద్రం తన బడ్జెట్లో గర్భిణులకు రూ. 6 వేలు కేటాయించింది. అంటే కేంద్రం నుంచి రూ.6వేలు వస్తే... రాష్ట్రం రూ.9 వేలు కేటాయిస్తే సరిపోతుంది. గర్భిణులకు ఇంత భారీగా ప్రోత్సాహకం అందించే రాష్ట్రం మనదే కానుండటం గమనార్హం. ఇప్పటి వరకు రాష్ట్రంలో గర్భిణులకు రూ. వెయ్యి ప్రోత్సాహకంగా ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా 347 డెలివరీ పాయింట్లు... రాష్ట్రంలో గుర్తించిన 347 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల లో ప్రత్యేకంగా కాన్పు కోసం డెలివరీ పాయింట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిని 24 గంటలూ పనిచేసే ఆసుపత్రులుగా తీర్చిదిద్దుతారు. ముగ్గురు వైద్యులు, ఆరుగురు నర్సులు, ప్రత్యేక డెలివరీ గదులను అందుబాటులోకి తీసుకొస్తారు. తద్వారా గర్భిణులను ప్రభుత్వాసుపత్రులకు వచ్చేలా కృషి చేయాలని నిర్ణయించారు. ఉపకారానికి చేయూత ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమానికి నిధులు సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్డెట్లో విద్యార్థులకు ఉపకారవేతనాలు ఇవ్వనున్నట్లు ప్రకటిం చారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన పాఠశాల (ప్రీమెట్రిక్) విద్యార్థులకు సైతం ఉపకార వేతనాలు అందనున్నాయి. మోదీ ప్రభుత్వం తొలిసారిగా గిరిజన పాఠశాల విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇస్తోంది. ఇందులో భాగంగా 2017–18 వార్షిక బడ్జెట్లో నిధుల కేటాయింపులను రెట్టింపు చేసింది. ఉపకార వేతనాల కింద మైనార్టీ సంక్షేమానికి రూ.1500 కోట్లు, ఎస్సీ సంక్షేమం కింద రూ.3,397 కోట్లు, బీసీ విద్యార్థుల కోసం 1,027 కోట్లు, గిరిజన సంక్షేమం కింద రూ.1,612.07 కోట్లు కేటాయించారు. ఈ క్రమంలో బీసీ విద్యార్థులకు పరిమిత సంఖ్యలోనే విద్యార్థులకు ఉపకారవేతనాలు దక్కనున్నాయి. -
‘ఉపాధి’ నిధులతో పాఠశాలల్లో మౌలిక వసతులు
11 వేల వంటగదులు, 7 వేల మరుగుదొడ్ల నిర్మాణం: నీతూ ప్రసాద్ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతుల కల్పనకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం నుంచి నిధులు వెచ్చించాలని సర్కారు నిర్ణయించింది. 30 జిల్లాల్లోని (హైదరాబాద్ మినహా) ప్రభుత్వ పాఠశాలన్నింటిలో 11,080 వంట గదులు, 7,080 మరుగుదొడ్లు అవసరమన్న ప్రతిపాద నలకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు శనివారం అన్ని జిల్లాల గ్రామీణాభివృద్ధి అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆ శాఖ కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్ వెల్లడించారు. వీటితో పాటు నీటి వసతి కోసం బోరు, మోటర్లు ఏర్పాటు చేయాలన్నారు. అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ, గ్రామపంచాయతీ భవనాలను నెలలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గ్రామీణా భివృద్ధి శాఖలో సిబ్బంది కొరత ఉందని పలువురు తెలుపగా, దీనిపై త్వరలోనే చర్యలు తీసుకుంటానన్నారు. -
కూలీల సంఖ్య పెంచకుంటే చర్యలు
► రోజూ 50వేల మందికి ‘ఉపాధి’ కల్పించాలి ►26న మలవిసర్జన రహిత జిల్లాగా ప్రకటన ► నగదు రహిత గ్రామాలుగా 61 ఎంపిక ► వీడియోకాన్ఫరెరన్స్ లో జేసీ యాస్మిన్ బాషా సాక్షి, సిరిసిల్ల : ఉపాధిహామీ ద్వారా చేపట్టే పనుల్లో కూలీల సంఖ్య పెంచకపోతే ఏపీవోలపై చర్యలు తీసుకుంటామని జేసీ షేక్ యాస్మిన్ బాషా హెచ్చరించా రు. సోమవారం మండల అధికారులతో సిరిసిల్ల నుంచి ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రోజూ 50 వేల మందికి పైగా కూలీలకు పని కల్పించాలని ఎంపీడీవోలను ఆదేశించారు. ప్రతీగ్రామంలో ఉపాధి పనులు చేపట్టాలన్నారు. ఈనెల 26వ తేదీ నాటికి జిల్లాను వందశా తం బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా ప్రకటించనున్నట్లు తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసినప్పుడే ఇది సాధ్యమని అన్నారు. కేంద్ర బృందం మూడుసార్లు జిల్లాలో పర్యటించి నిర్ధారించుకున్నాకే ఓడీఎఫ్గా ప్రకటిస్తుందన్నారు. వంద శాతం నగదు రహిత లావాదేవీలకు 61 గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ గ్రామాల్లోని ప్రజలందరితో బ్యాంక్ ఖాతాలు తెరిపించాలన్నారు. హరితహారంలో నర్సరీల పెంపకంపై దృష్టి పెట్టాలన్నారు. గ్రామపంచాయతీలకు జాతీయ ఆరోగ్య మిషన్ కింద రూ.10 వేలు మంజూరు చేశామని, వీటిని వినియోగించి పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు వంద శాతం ఉపయోగంలో ఉండాలన్నారు. డీఆర్డీవో పీడీ ఎన్ .హన్మంతరావు, డీడబ్ల్యూవో సరస్వతి, డీఎంహెచ్వో ఆర్.రమేశ్, అధికారులు పాల్గొన్నారు. -
‘ఉపాధి’ నిధుల్లో సర్కారుకు చుక్కెదురు
కూలీల ఖాతాల్లోకి నేరుగా రూ.200 కోట్లకు పైగా నిధులు జమ సాక్షి, హైదరాబాద్: కేంద్రం ఇచ్చే ఉపాధిహామీ పథకం నిధులను తాత్కాలికంగా ఇతరత్రా పథకాలు, కార్యక్రమాల కోసం మళ్లించేందుకు అలవాటుపడ్డ రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ మేనేజ్మెంట్ సిస్టమ్(ఎన్ఈఎఫ్ఎంసీ)ను అమలు చేస్తూ కేంద్రం తాజాగా విడుదల చేసిన ఈ నిధుల్లో రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్ల మేరకు నిధులు నేరుగా కూలీల ఖాతాల్లో జమ కానున్నాయి. దీంతో అత్యవసర పరిస్థితులున్నప్పటికీ ఇతరత్రా పథకాలు, కార్యక్రమాలకు మళ్లించే పరిస్థితి లేకుండా పోయిందని ఆర్థిక శాఖ తలపట్టుకుంటోంది. రాష్ట్రంలో దాదాపు 40లక్షల మందికిపైగా ఉన్న ఉపాధి హామీ కూలీలకు ఏటా రూ.1,300 కోట్ల నుంచి రూ.1,500 కోట్ల మేరకు కేంద్రం నుంచి నిధులు విడుదలవుతున్నాయి. ఇప్పటివరకు ఇవి నేరుగా ప్రభుత్వ కన్సాలిడేట్ ఫండ్లో జమయ్యేవి. అయితే ఈ ఏడాది ప్రారంభంలో రైతుల రుణమాఫీ, ఆసరా ఫించన్లు, ఇతర ప్రాజెక్టులకు చెల్లింపులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి నిధులను దారి మళ్లించింది. దీంతో దాదాపు 9లక్షల మంది కూలీలకు నెలపాటు చెల్లింపులు ఆగిపోయాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు కేంద్రం ఎన్ఈఎఫ్ఎంసీను అమల్లోకి తెచ్చింది. నేరుగా కూలీల ఖాతాల్లోకి మస్టర్ రోల్ ప్రకారం నిధులను 48గంటల్లో చెల్లించాలని నిర్ణయించింది. ఎన్ఈఎఫ్ఎంసీ వివరాల నమోదు బాధ్యతను గ్రామీణాభి వృద్ధి శాఖకు అప్పగించింది. ఈ పరిస్థితి గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఎంసీ నమోదు చేసే సమయంలో రాష్ట్ర సంచితనిధి ఖాతా నంబర్ను ఎంట్రీ చేయాలని అధికారుల ను ఆదేశించింది. వీటిని కొన్ని జిల్లాల అధికారులు అనుసరించగా కొందరు కేంద్రం నిర్దేశించినట్లుగా కూలీల ఖాతా నంబర్లు ఇచ్చారు. దీంతో ఈ నెలారంభం నుంచే కూలీల ఖాతాల్లో డబ్బులు జమవుతున్నాయి. మరికొన్ని నిధులు రాష్ట్ర సంచిత నిధిలో జమయ్యాయి. ఈ ఏడాది దాదాపు రూ.200కోట్లకుపైగా కూలీల ఖాతాలకు, మిగతాది రాష్ట్ర ఖజానాలో జమవుతుందని అంచనా వేస్తున్నారు. -
గ్రామీణాభివృద్ధికి మరిన్ని నిధుల్విండి
కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ను కోరిన మంత్రి జూపల్లి సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో గ్రామీ ణాభివృద్ధికి కేంద్రం నుంచి అందు తున్న సాయాన్ని పెంచాలని కేం ద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ను మంత్రి జూపల్లి కృష్ణారావు కోరా రు. సోమవారం మంత్రి జూపల్లి, ఎంపీలు జితేందర్రెడ్డి, బీబీ పాటిల్, పంచాయతీ రాజ్ శాఖ కమిషన్ నీతూప్రసాద్.. కేంద్ర మంత్రిని ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కలసి వివిధ అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు. తెలంగాణలో లక్ష్యానికి మించి ఉపాధి హామీ పనులు జరుగు తున్నం దున ఈ ఆర్థిక సంవత్సరానికి పని దినాలు పెంచాలని కోరారు. రూర్బన్ పథకం కింద తెలంగాణకు అదనపు క్లస్టర్లను మంజూరు చేయాలని, మహిళా సంఘాల వడ్డీ రాయితీ బకాయిలు విడుదల చేయాలని కోరారు. -
పని చేస్తేనే ఉపాధి కార్డులు
జిల్లాలో మొత్తం జాబ్కార్డులు3.32 లక్షలు • వినియోగంలో ఉన్నవి 1.28 లక్షలు • ప్రభుత్వ నిర్ణయంతో రద్దయ్యేవి సుమారు 2 లక్షలు • 15 రోజుల్లో కొత్త కార్డులు ఖమ్మం మయూరిసెంటర్ : ఉపాధి హామీ పథకంలో ఇక నుంచి పనిచేసే వారికే జాబ్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పనిచేయని వారి కార్డులను తొలగించనుంది. అర్హులందరికీ పని కల్పించేందుకు ఈ ప్రక్రియ చేపట్టినట్లు ప్రభుత్వం చెబుతోంది. సుమారు పదిహేను రోజుల్లో కొత్త కార్డులు ఇవ్వనుంది. జాబ్కార్డు పొందినవారిలో సగం మంది పనులకు హాజరుకావడం లేదు. ఈ క్రమంలో పనిచేసేవారికే జాబ్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి 3.32 లక్షల జాబ్కార్డులు ఉన్నాయి. వీటిలో 1.28 లక్షల కార్డులు మాత్రమే అత్యధిక పనులు చేసిన జాబితాలో ఉన్నాయి. మొత్తం 7.75 లక్షల మంది కూలీలుగా నమోదు చేసుకోగా 2.28 లక్షల మంది మాత్రమే ఉపాధి పనికి హాజరవుతున్నారు. దీంతో ఉపాధి పనిని వినియోగించుకునేవారికి కార్డులు అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. సుమారు 2 లక్షల కార్డులు రద్దు కానున్నాయి. పథకాల కోసమే కార్డులు ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకునేందుకే జిల్లాలో జాబ్ కార్డులను ఉపయోగించుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాల్లో రాయితీ కల్పిస్తుండడంతో పాటు టాయిలెట్ల నిర్మాణం, ఇంకుడు గుంటలు, పొలంలో నాటేందుకు టేకు మొక్కలు వంటివి కార్డుదారులకు అందిస్తున్నారు. దీంతో చాలా మంది వీటికోసం కార్డులు తీసుకొని ప్రభుత్వం కల్పిస్తున్న పనికి వెళ్ళడం లేదు. కొందరు ఒకరిపై కార్డు తీసుకొని ఇంకొకరు పనికి వెళ్తున్నారు. వీటన్నింటికి చెక్పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయంతీసుకుంది. ప్రస్తుతం కొనసాగుతున్న కార్డులను రద్దు చేసి ప్రభుత్వం నూతన కార్డులు ఇవ్వనుంది. మూడు రకాలుగా ఆదివాసీలకు గ్రీన్కార్డు, వికలాంగులకు లైట్బ్లూ, సాధారాణ కూలీలకు బ్లూ కార్డులు ఇవ్వనుంది. ప్రభుత్వం కల్పిస్తున్న పని రోజుల్లో సగానికి పైగా పని దినాలు ఉపయోగించుకుంటేనే కార్డులు ఇవ్వనున్నారు. జాబ్కార్డులు రాగానే పనులు ప్రారంభించేందుకు యంత్రాం గం ప్రణాళికలు రూపొందించింది. అర్హులకు మాత్రమే కార్డులు ఉపాధి పథకాన్ని వినియోగించుకుని పని చేసే కూలీలకు మాత్రమే జాబ్కార్డులు అంది స్తాం. 2015–16 సంవత్సరంలో 45 లక్షల పనిదినాలకు 43.5 లక్షల పని దినాల పని జరిగింది. ప్రతి కూలికీ వంద రోజుల పని కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. పని చేయని వారి కార్డులను రద్దు చేస్తాం. – మురళీధర్రావు, డీఆర్డీఓ పని చేసేవారికి ఇస్తేనే ప్రయోజనం పని చేసేవారికే జాబ్కార్డు విధానం మంచిది. ఈ నిర్ణయంతో అర్హులకు కార్డుతో పాటు 100 రోజుల పని లభిస్తుంది. కూలీలు కూడా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వినియోగించుకొని అవకాశం ఉంటుంది. నూతన విధానాలతో అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చు. – మరికంటి నరేష్, ఉపాధి మేట్ -
అక్రమార్కులకు ఉపాధి
పెద్ద మొత్తంలో నిధులు జేబుల్లోకి చోద్యం చూస్తున్న అధికారులు ఈ చిత్రంలో కనిపిస్తున్న చెక్డ్యాం వరికుంటపాడు మండలం యర్రంరెడ్డిపల్లి చెరువు పైభాగాన తారురోడ్డు సమీపంలో నిర్మించింది. దీని నిర్మాణంలో నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలు పాటించలేదు. చెరువుకు నీరు వచ్చే వరవకు చెరువుకు అతి తక్కువ సమీపంలో దీనిని నిర్మించారు. రూ.10 లక్షల అంచనా వ్యయంతో దీని నిర్మాణం చేపట్టారు. ఇక్కడ అవసరం లేకపోయినా కేవలం కాంట్రాక్టరుకు లబ్ధి చేకూర్చేందుకే ఈ పనిని ప్రతిపాదించారు. దీని నిర్మాణంలో వాడిన ఇసుకలో అధిక శాతం మట్టి ఉంది. ఇసుక, సిమెంటు, కంకర నిష్పత్తిలో కూడా నాణ్యతా ప్రమాణాలు పాటించలేదు. పైన ప్లాస్టరింగ్, తుదిమెరుగులు దిద్దడంతో చూసేందుకు చాలా చక్కగా ఉన్నా కొద్ది కాలానికే నిర్మాణం దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది. ఉపాధిహామీ పథకం కొంతమంది అక్రమార్కులకు కల్పతరువుగా మారింది. అన్ని పనులకు ఉపాధి పథకాన్ని లింకు చేయడంతో దుర్వినియోగానికి అవకాశం ఏర్పడింది. ఈ పథకంలో నిధులు ఇబ్బడిముబ్బడిగా ఉండటంతో తక్కువ వ్యయం అయ్యే పనులకు కూడా కొంతమంది ఎక్కువ మొత్తంలో ఎస్టిమేషన్లు వేసుకుని నిధులు ఆరగిస్తున్నారు. ఉదయగిరి: ఉపాధి హామీ పనులను పర్యవేక్షించాల్సిన క్వాలిటీ కంట్రోల్, మండల, జిల్లాస్థాయి అధికారుల పర్యవేక్షణ పూర్తిగా వదిలివేయడంతో సప్లయర్ ముసుగులో ఉన్న కాంట్రాక్టర్లు అందినకాడికి దోచుకుంటున్నారు. జిల్లాలో ఉపాధి నిధులతో చెక్డ్యాంలు, ఫైబర్ చెక్డ్యాంలు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సిమెంటురోడ్లు, నాడెప్, ఇంకుడుగుంతలు, ఫాంపాండ్ల నిర్మాణ పనుల్లో అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఈ నిధుల దోపిడీలో ఎక్కువ భాగస్వామ్యం అధికార పార్టీ నేతలదే కావడం విశేషం. జిల్లాలో సాయిల్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద 91 పనులు మంజూరయ్యాయి. ఇంతవరకు వీటి నిర్మాణం కోసం రూ.70 లక్షలు వినియోగించారు. ఈ పనులు ఎక్కువగా అధికార పార్టీ సర్పంచ్లు, వారు లేనిచోట ఆ పార్టీ నేతలు చేపట్టారు. జరిగిన పనులు పరిశీలిస్తే..ఇవి ఒకట్రెండు ఏళ్లకంటే ఎక్కువ మన్నే పరిస్థితి కనిపించలేదు. అధిక ఎస్టిమేషన్లతో నిధులు దోచుకుంటున్నారు. జిల్లాలో చెక్డ్యాంల నిర్మాణం కోసం రూ.184 కోట్లు వెచ్చించాలని నిర్ణయించారు. ఈ నిధులతో 29,500 చెక్డ్యాంలకు ప్రతిపాలనా ఆమోదం లభించింది. ఉదయగిరి, ఆత్మకూరు, కావలి వెంకటగిరి, గూడూరు నియోజకవర్గాల్లో చెక్డ్యాంల నిర్మాణాలకు రూ.50 కోట్లు ఖర్చు చేశారు. వీటిలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గంలో వీటి నిర్మాణంలో జరుగుతున్న అవినీతి, అధిక స్థాయిలో ఉందని విమర్శలున్నాయి. జిల్లాలో ఏ నియోజకవర్గంలో లేనివిధంగా ఉదయగిరి ప్రాంతంలో జరుగుతున్న ఫైబర్ చెక్డ్యాంల నిర్మాణాల్లో కూడా అవినీతి స్థాయి ఎక్కువగా ఉంది. వీటి నిర్మాణంలోనూ, నాణ్యతా ప్రమాణాల్లోనూ, డిజైన్లలోనూ, ప్రతిపాదనల రూపకల్పనలోనూ అవినీతి చోటుచేసుకున్నదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత మేకపాటి చంద్రశేఖర్రెడ్డి బహిరంగంగా విమర్శిస్తున్నారు. వీటి టెండర్ల వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు పాత్రపై కూడా విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. సిమెంటు రోడ్ల నిర్మాణంలోనూ ఇదే తీరు గ్రామీణ ప్రాంత ప్రజల్లో అంతర్గత రోడ్ల నిర్మాణానికి చేపట్టిన సిమెంటురోడ్లకు 50 శాతం నిధులు ఉపాధిహామీ నుంచి ఉపయోగిస్తున్నారు. రోడ్లు నాసిరకంగా ఉండటంతో వెంటనే పగుళ్లిస్తున్నాయి. జిల్లాలో గతేడాది 400 కి.మీ. మేర రోడ్డు నిర్మాణాల కోసం రూ.203 కోట్లు వెచ్చించారు. ఈ ఏడాది 271 కి.మీ. సిమెంటురోడ్లు వేసేందుకు రూ.36.15 కోట్లు ఖర్చు చేస్తున్నారు. సప్లయర్ పేరుతో దోపిడీ గ్రామాల్లో నూరు శాతం మరుగుదొడ్లు, ఇంకుడుగుంతల నిర్మాణాలు పూర్తిచేసేందుకు అధికార పార్టీ నేతలకు పనులు అప్పగించారు. వీరికి ముందుగా కొంత అడ్వాన్సు నగదు కూడా ఇస్తున్నారు. మరుగుదొడ్ల నిర్మాణంలో పనులు నాసిరకంగా జరుగుతున్నాయనే విమర్శలున్నాయి. తూతూమంత్రంగా ఇంకుడుగుంతల పనులు చేసి నిధులు స్వాహా చేస్తున్నారు. వర్మీకంపోస్టు నిర్మాణాల్లోనూ ఇదేరకౖ మెన దోపిడీ సాగుతోంది. ఫిర్యాదుచేస్తే స్పందిస్తాం ఉపాధిహామీ నిధులతో మెటీరియల్ పనుల్లో అవినీతి జరిగితే ఫిర్యాదు చేస్తే పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. అవినీతికి పాల్పడిన కొంతమంది సిబ్బందిపై ఇప్పటికే వేటు వేశాం. హరిత, డ్వామా పీడీ -
బావుల తవ్వకాలు.. నవ్వుల పాలు!
ఇందూరు : నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో కలిపి మూడేళ్లలో 420 నూతన బావుల తవ్వకానికి రూ.8.70 కోట్లు మంజూరయ్యాయి. కానీ.. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాల్లో ఒక్క బావి మాత్రమే తవ్వకం పూర్తయింది.70 నూతన బావుల తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఇంకా 349 బావుల తవ్వకం ప్రారంభించలేదు. కామారెడ్డి జిల్లాలో ఏడాదికి 60 చొప్పున బావులు మంజూరైనా ఇప్పటివరకు ఒక్కటి మాత్రమే పూర్తయింది. అలాగే నిజామాబాద్ జిల్లాలో ఏడాదికి 80 నూతన బావుల తవ్వకం కోసం నిధులు ఖర్చుకాలేదు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించి ఆదేశాలు జారీ చేస్తున్నా.. క్షేత్ర స్థాయిలో బావుల తవ్వకం, సేంద్రియ ఎరువుల తయారీ, రైతుల జల సౌధలు(ఫారం ఫాండ్స్), పశువుల పాకలు మొదలైనవి రైతులకు ఉపయోగపడే పనులు ముందుకు సాగడం లేదు. ఒక్క బావిలో పూడిక తీయలేదు.. ఉమ్మడి జిల్లాల్లో 30 శాతం పంటలకు నీటి సరఫరా బావుల ద్వారానే కొనసాగుతోంది. 2014–15 సంవత్సరంలో కొత్త బావుల తవ్వకానికి, పూడిక తీతకు నూతన మార్గదర్శకాలు రూపొందించిన అధికారులు అటకెక్కించారు. అలాగే ఆ ఏడాది తవ్విన బావులకు సకాలంలో కూలీ డబ్బులు ఇవ్వకపోవడంతోపాటు బావుల తవ్వకం ద్వారా కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించడంలో విఫలమవుతున్నారు. తద్వారా రైతులు ఆసక్తి చూపడం లేదు. అలాగే ఉమ్మడి జిల్లాల్లో మూడు దశాబ్దాలలో తవ్విన పాత బావులు 49,500 వరకు ఉన్నాయి. అధికారులు రైతులకు అవగాహన కల్పించి గత వేసవిలో పూడికతీత పనులు చేయించి ఉంటే.. ఈ ఏడాది సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలకు బావుల్లోకి నీళ్లు చేరి భూగర్భ జలాలు బాగా పెరిగి వ్యవసాయానికి లాభసాటిగా ఉండేది. అధికారుల పనితీరు కారణంగా ఈ ఏడాది ఉమ్మడి జిల్లాల్లోని 49 మండలాల్లో ఒక్క బావిలో కూడా పూడికతీత పనులు చేపట్టకపోవడం గమనార్హం. మూడేళ్లుగా వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు బావుల తవ్వకం కంటే గొట్టపు బావుల తవ్వకానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. బోరు బావుల వద్ద ఇంకుడు గుంతలు తీయించడం, పారే నీటిని నిలువరించేందుకు వీలుగా అడ్డంగా రాతికట్టు కట్టించడం వంటివి చేపడితే బాగుండేది. వర్షం నీటి సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇచ్చి నీటి నిల్వ కుంటలు, పాత బావుల్లో పూడికతీత పనులు చేపడితే సమృద్ధిగా నీటి సంరక్షణ జరిగేది. ప్రమాదకర బావులను పూడ్చడం లేదు.. జిల్లాలో చాలా గ్రామాల్లో ఇంటికి ఆనుకుని, రోడ్ల పక్కన, వ్యవసాయ గట్ల పక్కన వృధాగా ఉండి ప్రమాదకంగా ఉన్న బావులను పూడ్చడానికి ఉపాధిహామీ పథకం ద్వారా అవకాశం ఉంది. ప్రమాదకర బావుల వల్ల చాలా మందితోపాటు పశువులు కూడా పడి మృతి చెందిన సంఘటనలున్నాయి. ఇలాంటి బావులను పూడ్చివేయడం రైతులకు, స్థానికులకు ఆర్థికంగా ఇబ్బందే. ముఖ్యంగా జక్రాన్పల్లి, ఆర్మూర్, గాంధారి, జుక్కల్ మండలాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. కావునా.. ఉపాధిహామీ పథకం కింద పాడుబడ్డ పాత బావులను పూడ్చి వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంపీడీఓల సహాయంతో గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులతో ఇలాంటి బావులను గుర్తించి పూడ్చివేయిస్తే బాగుంటుంది. -
‘ఉపాధి’ పనులకూ జియో ట్యాగింగ్
► పల్లెల్లో కొనసాగుతున్న పనులు ► సాంకేతిక లోపాలతో సిబ్బందికి ఇబ్బంది గంభీరావుపేట : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో చేపట్టిన పనుల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం జియోట్యాగింగ్ను ప్రవేశపెట్టింది. 2006 నుంచి పనులు పూర్తయి లబ్ధిదారులకు బిల్లులు అందిన అంశాలనే ట్యాగ్ చేస్తున్నారు. ప్రగతిలో ఉన్న పనులను ట్యాగ్ చేయరు. ఇంకుడుగుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, కుంటలు, కాలువలు, పూడికతీత, అడ్డుకట్టలు తదితర పనుల్లో పూర్తయిన పనులను సిబ్బంది ట్యాగింగ్ చేస్తున్నారు. ట్యాగింగ్ చేయడం ఇలా.. ఎన్ ఆర్ఈజీఎస్ ద్వారా రూపొందించిన ప్రత్యేకమైన ‘భువన్ యాప్’ను ఓపెన్ చేసుకొని పూర్తయిన పనుల రెండు ఫోటోలు తీసుకోవాలి. వాటిని ఆన్ లైన్ లో పొందుపర్చాలి. జియోట్యాగింగ్ వల్ల ఎక్కడి పనులనైనా ఆన్ లైన్ లో చూసుకోవచ్చు. జిల్లాలో ట్యాగింగ్ వివరాలు జిల్లా వ్యాప్తంగా 32,453 పూర్తయిన పనులను జియోట్యాగింగ్కు టార్గెట్ చేశారు. ఇందులో ఇప్పటికీ 17,189 పనుల వివరాలను అధికారులు ట్యాగ్ చేశారు. సాంకేతిక లోపాలు జియోట్యాగింగ్ చేసే సమయంలో నెట్కనెక్ట్ కాకుండా క్షేత్రస్థాయిలో ఈజీఎస్ సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. పనులు జరిగిన గ్రామీణ ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఈసమస్య మరింత ఎక్కువవుతోంది. ఆన్ లైన్ లో వివరాలను పంపించడానికి కూడా కష్టంగా మారుతోంది. నెట్వర్క్ సమస్యలున్నాయి ఈజీఎస్ పనుల ట్యాగింగ్ విషయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నం. పల్లెల్లో నెట్వర్క్ లేక ట్యాగింగ్ చేయడంలో కాస్త జాప్యం జరుగుతోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలంలో వందశాతం ట్యాగింగ్ కోసం కృషి చేస్తున్నం. –సాయిక్రిష్ణ, టెక్నికల్ అసిస్టెంట్, గంభీరావుపేట రాష్ట్రంలో 8వ స్థానం ఈజీఎస్ జియోట్యాగింగ్ విషయంలో జిల్లా రాష్ట్రంలో 8వ స్థానంలో ఉంది. ఇప్పటికీ 53శాతం ట్యాగింగ్ పూర్తయ్యిం ది. పనులు వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించాం. సాంకేతిక లోపా లు తలెత్తడంతో రాత్రింబవళ్లు సిబ్బంది కృషి చేస్తున్నారు. –హన్మంతరావు,డీఆర్డీవో, రాజన్న సిరిసిల్ల జిల్లా -
అక్రమార్కుల ‘ఉపాధి’ రూ.28 కోట్లు..!
ఏళ్లు గడుస్తున్నా రికవరీ చేయని అధికారులు నోటీసులు, మెమోలు ‘మామూలే..’ మూలన పడ్డ ఫైళ్లు.. అధికారులపై చర్యలు శూన్యం దర్జాగా విధులు నిర్వర్తిస్తున్న అక్రమార్కులు సమాచార హక్కు చట్టంతో వెలుగులోకి.. ఆదిలాబాద్ కల్చరల్ : గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం అక్రమార్కుల పాలిట వరంగా మారింది. అందిన కాడికి అధికారులు దండుకోవడంతో అభాసుపాలవుతోంది. గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు చేసే చిన్నపాటి పొరపాట్లకు సస్పెండ్ చేస్తూ తొలగించే అధికారులు.. నిధులు కాజేసి, లెక్క చూపని అధికారులపై చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. ఏ ఒక్కరిపైనా చర్యలు తీసుకోకపోగా.. షోకాజు నోటీసులతో అధికార యంత్రాం గం సరిపెడుతోంది. రికవరీ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారు. ఆదిలాబాద్కు చెందిన ఆర్టీఐ యాక్టు వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఠాకూర్ జోగేందర్సింగ్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థకు ఆర్టీఐ యాక్టు ద్వారా దరఖాస్తు చేసుకోగా.. గత ఏడాది నవంబర్లో వివరాలు వెల్లడించా రు. అక్రమార్కుల వివరాలు ఇందులో ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో అధికారులు అక్రమాలకు పాల్పడి రూ.28 కోట్లు దుర్వినియోగం చేశారు. ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉందనే విమర్శలున్నాయి. చేయని పనులు చేసినట్లుగా, మట్టి, మొరం రోడ్లు వేసినట్లుగా, పనులు చేయకుండా చేసినట్లుగా, చెరువుల్లో మట్టితీత.. వంటి పలు రకాల పనులు చేయించినట్లు మస్టర్లు రికార్డు చేసి రూ.కోట్లలో ఉపాధి నిధుల ు దుర్వినియోగం చేసినట్లు తేలింది. ఈ విషయం సామాజిక తనిఖీ బృందాల పరిశీలనలో వెల్లడైంది. ఎవరెంత దుర్వినియోగం చేశారంటే.. : నిధులు దుర్వినియోగం చేసిన వారిలో ఉమ్మడి జిల్లాలోని ఎంపీడీవోలు, పంచాయతీరాజ్ ఏఈఈలు, ట్రైబ ల్వెల్పేర్ ఏఈలు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 14 మంది ఎంపీడీవోలు మొ త్తం రూ.కోటీ 9 లక్షల 31,593 దుర్వినియోగం చేసినట్లు సామాజిక తనిఖీ లో తేలింది. పంచాయతీ రాజ్ ఏఈఈలు 40 మంది రూ.కోటి 8 లక్షల 16,102 దుర్వినియోగం చేయగా.. రికార్డులు కూ డా అప్పగించని నిధులు రూ.10 కోట్ల 7 లక్షల 74,584 దుర్వినియోగం చేశారు. మొత్తం రూ.11కోట్ల 15 లక్షల 90,686 పంచాయతీరాజ్ ఏఈఈలు 40 మంది స్వాహా చేశారు. ట్రైబల్ వెల్పేర్ ఏఈలు 17 మంది రూ.14 లక్షల 49,861 తప్పుడు లెక్కలతో కాజేసినట్లు సామాజిక తనిఖీలో తేలింది. రికార్డులు కూడా అందించకుండా రూ.16 కోట్ల 33 లక్షల 58,947.. మొత్తం రూ. 16 కోట్ల 48 లక్షల 08,808 అక్రమాలకు గురైనట్లు సామాజిక తనిఖీ బృం దం తేల్చింది. ఉమ్మడి జిల్లా లో ఎంపీడీవోలు, పీఆర్ ఏఈఈలు, టీడబ్ల్యూఏఈలు కలిసి మొత్తం రూ.28 కోట్ల 73 లక్షల 31,087 దుర్వినియోగం చేశారు. ఉన్నతాధికారుల హస్తం ఉండడంతోనే రికవరీ చేయడం లేదనే ఆరోపణలున్నాయి. అక్రమాలకు పాల్పడిన కొందరు విధుల్లోనే ఉన్నారు. రూ.కోట్లల్లోనే అవినీతి..: కుభీర్ ఎంపీడీవో సత్యనారాయణ రూ. 95,09, 752 దుర్వినియోగం చేశారు. 2010లో పంచాయతీ రాజ్ కమిషనర్ చార్జి మెమో జారీ చేశారు. పలుమార్లు చార్జి మెమోలు అందించినా ఇప్పటి వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోగా రికవరీ కూడా చేయడం లేదు. ఉట్నూర్కు చెందిన ఎంపీడీవో చందర్ 9 లక్షల నిధులకు లెక్కలు చూపలే దు. మిగతా ఎంపీడీవోలు లక్షల్లో నిధులను జేబుల్లో వేసుకున్నారనే ఆరోపణలున్నాయి. తాండూరు పీఆర్ ఏఈఈ రూ.10,51,905, కెరమెరి ఏఈఈ రూ.18,51,717, ఉట్నూర్కు చెందిన ఏఈఈ రూ.17,12,428, జైనథ్ ఏఈ ఈ రూ.7,55,357, తాండూరుకు చెందిన ఏఈఈ రూ.5,61,987 నిధులు దుర్వినియోగం చేశారు. తాంసి ఏఈఈ రూ.94 లక్షల 63,531, భీమిని ఏఈఈ రూ.2 కోట్ల 75 లక్షల 86,110, ఆదిలాబాద్ ఏఈఈ రూ.కోటీ 3 లక్షల 49,200, దహెగాం ఏఈఈ 90 లక్షల 94,476 నిధులకు లెక్కలు చూపలేదు. వీరితోపాటు వాంకిడి, జన్నారం, తదితర మండలాల పీఆర్ ఏఈఈ, ఏటీడబ్ల్యూ ఏఈలు, ఎంపీడీవోలు నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలింది. -
అవినీతి రహదారి
సాక్షి ప్రతినిధి – నెల్లూరు : దళిత వాడలకు మౌళిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం విడుదల చేసిన ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను అధికార పార్టీ నేతలు, అధికారులు కలిపి కొల్లగొట్టేందుకు పథకం రచించారు. రూ.40 కోట్ల పనులకు 10 నుంచి 15 శాతం దాకా తక్కువ తో టెండర్లు దాఖలయ్యే అవకాశం ఉన్నా, అంతా కూడబలుక్కుని 1.45 శాతానికి లోపే సింగిల్ టెండర్లు దాఖలయ్యేలా రాజకీయం నడిపారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి రూ.4 నుంచి రూ.4.5 కోట్ల నష్టం వాటిల్లనుంది. ఎస్సీ సబ్ప్లాన్ నిధులను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దళిత వాడలకు రోడ్డు సౌకర్యాలు మెరుగు పరచడానికి పంచాయతీరాజ్ శాఖ అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. గత ఏడాది జూన్ నెలాఖరులో ఆన్లైన్ ద్వారా ఈ పనులకు టెండర్లు పిలిచారు. నిబంధనల ప్రకారం టెండర్ల దాఖలుకు గడువు ముగిసిన చివరి రోజే టెక్నికల్ బిడ్ తెరవాల్సి వుంది. అయితే ఏ పని ఎవరికి దక్కాలనే విషయం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజక వర్గ ఇన్చార్జ్లు అధికారులకు ముందే ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఎలా మార్చుకున్నా, రూల్స్ ఎలా ఉన్నా తాము చెప్పిన వారికే పనులు దక్కాలని గట్టిగా చెప్పారు. అధికారులు ఇదే అదనుగా తీసుకుని స్వామి కార్యంతో పాటు స్వకార్యం కూడా నెరవేర్చుకునేలా టెండర్లలో రింగ్ లీడర్ల పాత్ర పోషించారు. పోటీకి వస్తారని ఊహించిన కాంట్రాక్టర్లకు అధికారులే ఫోన్లు చేసి ఇది ఫలానా నాయకుడికి కేటాయించిన పననీ, పోటీగా టెండర్ దక్కించుకున్నా పని ఎలా చేయగలుగుతారని పరోక్షంగా బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మధ్యస్థాలను ఖాతరు చేయకుండా కొన్ని పనులకు ఎక్కువ మంది కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేశారు. ఈ విషయం తెలిసి అధికారులు కంగుతిన్నారు. ఏదో ఒక కారణం చూపి తమకు గిట్టని వారిని అనర్హులుగా చేయడానికి ఉపాయాలు వెదికారు. ఇందుకోసం అనేక రాయబారాలు నడిపి నెలన్నర తర్వాత టెక్నికల్ బిడ్ తెరిచారు. ఇందులో కూడా అర్హులైన వారిని తప్పించడానికి వారితో రాజీ బేరాలు మాట్లాడినట్లు కాంట్రాక్టర్లు బహిరంగంగానే చెబుతున్నారు. వీటికి తలవంచని కాంట్రాక్టర్లను తప్పించడం కోసం æ మరో నెల పాటు ప్రైస్ బిడ్ తెరవకుండా రాజకీయం నడిపారు. కాంట్రాక్టర్ ఆన్లైన్లో ఈ ఏంఐ చెల్లించకుండా డీడీ తీశారని, తాను చేస్తున్న ఇతర పనుల వివరాలు పొందుపరచలేదని, డిక్లరేషన్ లేదనే రకరకాల కారణాలతో చాలా మందిని తప్పించారు. అన్నీ సెటిల్మెంట్ లెస్లే ► ఎస్సీ సబ్ప్లాన్ నిధుల కింద పిలిచిన ఈ పనుల్లో కాంట్రాక్టర్ లాభం కూడా కలిపి పనుల అంచనా రూపొందిస్తారు. అందువల్ల ఈ పనులకు ఎక్కువతో టెండర్లు దాఖలు చేయడానికి వీలులేదు. దీంతో గతంలో ఈ తరహా పనులకు 10 నుంచి 15 శాతం తక్కువతో టెండర్లు దాఖలయ్యేవి. అయితే అధికారులు ఈ సారి మాత్రం కాంట్రాక్టర్లతో కూడబలుక్కుని ప్రతి పనికీ 1.45 శాతం లోపే తక్కువతో సింగిల్ టెండర్లే నిలిచేలా మంత్రాంగం చేశారు. నిబంధనల ప్రకారం సింగిల్ టెండర్ నిలిస్తే తిరిగి టెండర్లు పిలవాలనే నిబంధనలను ఈ పనుల వ్యవహారంలో అటకెక్కించారు. ► సింగిల్ టెండర్ను ఆమోదింపచేసే ఉద్దేశంతో పంచాయతీ రాజ్ శాఖలోని జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పనులు చూస్తున్న చీఫ్ ఇంజనీర్కు ఫైలు పంపారు. తక్కువ ధరతో టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు టీడీపీ ఇన్చార్జ్లు చెప్పిన వారు కాకపోతే ఆ పనులు రద్దు చేయాలని సీఈకి సిఫారసు చేశారు. తమను అనర్హులుగా చూపి టెండర్లు రద్దు చేయడానికి అధికారులు చేసిన ప్రయత్నాలపై ఇద్దరు కాంట్రాక్టర్లు కోర్టును ఆశ్రయించారు. ఈ టెండర్ల వ్యవహారంపై కొందరు కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కు ఫిర్యాదు చేశారు. ప్రతి పనికీ 1.45 శాతంలోపే తక్కువతో టెండర్లు దాఖలైన వ్యవహారం చూసి విజిలెన్స్ అధికారులు ఆశ్చర్య పోతున్నారు. ఇవీ పనులు ► విడవలూరు మండలం చౌకచర్ల నుంచి దంపూరు మీదుగా రామతీర్థం వరకు రోడ్డు నిర్మాణం. అంచనా వ్యయం రూ.2 కోట్లు. 27–6–2016న టెండర్లు పిలిచారు. 19–9–2016న టెక్నికల్ బిడ్ తెరిచారు. 14–10–2016వ తేదీ ప్రైస్ బిడ్ తెరిచారు. 1.45 శాతం తక్కువతో సింగిల్ టెండర్ దాఖలైన భవాని కన్స్ట్రక్షన్స్కు పని అప్పగించేలా ప్రతిపాదన చేశారు. ► సైదాపురం మండలం అన్నమరాజుపల్లి నుంచి వేముల చేడు దాకా మెటల్ రోడ్డు నిర్మాణానికి రూ.1.66 కోట్లతో 27–6–2016వ తేదీ టెండర్లు పిలిచారు. 12–8–2016వ తేదీ టెక్నికల్ బిడ్డు, 7–10–2016న ప్రైస్ బిడ్ తెరిచారు. 0.1 శాతం తక్కువతో సింగిల్ టెండర్ దాఖలు చేసిన వి.పి.రెడ్డికి పని అప్పగించడానికి ప్రతిపాదనలు పంపారు. ► డక్కిలి మండలం దగ్గవోలు ఆర్ అండ్ బీ రోడ్డు నుంచి పాతనలపాడు ఎస్సీ కాలనీ దాకా రోడ్డు నిర్మాణానికి రూ 1.89 కోట్లతో 27–6–2016వ తేదీ టెండర్లు పిలిచారు. 12–8–2016వ తేదీ టెక్నికల్ బిడ్, 3–10–2016వ తేదీ ప్రైస్ బిడ్ తెరిచారు. 0.45 శాతం తక్కువతో టెండర్ దాఖలు చేసిన వి.పి.రెడ్డికి పని అప్పగించడానికి ప్రతిపాదించారు. ► ఏర్పేడు– గూడూరు ఆర్ అండ్బీ రోడ్డు నుంచి నాయుడుపేట మాటుమడుగు మీదుగా రాపూరు రోడ్డు వరకు రూ.3.40 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి 27–6–2016న టెండర్లు పిలిచారు. 12–8–2016న టెక్నికల్ బిడ్, 7–10–2016న ప్రైస్ బిడ్ తెరిచారు. 1.17 శాతం తక్కువతో సింగిల్ టెండర్ దాఖలు చేసిన ఎస్ ఎస్ ఆర్ కన్స్ట్రక్షన్స్కు పని అప్పగించడానికి ప్రతిపాదించారు. ► గూడూరు ప్యాకేజీ కింద గొల్లపాలెం పంచాయతీ రాజ్ రోడ్డు నుంచి కోటిగుంటకు బీటీ సర్ఫేస్ రోడ్డు నిర్మాణానికి రూ.34 లక్షలు, నిడిగుర్తి నుంచి చిన్నతోట ఆర్ అండ్బీ రోడ్డు దాకా బీటీ సర్ఫేస్ రోడ్డు నిర్మాణానికి రూ 1.03 కోట్లతో 27–6–2016వ తేదీ టెండర్లు పిలిచారు. 7–9–2016న టెక్నికల్ బిడ్, 7–10–2016వ తేదీ ప్రైస్ బిడ్ తెరిచారు. 0.63 శాతం తక్కువతో సింగిల్ టెండర్ దాఖలైన ఎం.సెంథిల్ కుమార్ అనే కాంట్రాక్టరుకు ఈ పని అప్పగించే ఆలోచనతో సీఈకి ప్రతిపాదనలు పంపారు. -
జియో ట్యాగింగ్లో గీసుకొండ స్టేట్ ఫస్ట్
ద్వితీయ స్థానంలో సంగెం మండలం ఉద్యోగులను అభినందించిన కలెక్టర్ గీసుకొండ : ఉపాధి హామీ పథకంలో నాణ్యత, పారదర్శకతను చాటుతూ అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రతీ పనిని ‘భువన్’ యాప్ ద్వారా జియో ట్యాగింగ్ చేసే ప్రక్రియ చేపడుతున్న విషయం విదితమే. ఈ మేరకు వరంగల్ రూరల్ జిల్లాలోని గీసుకొండ మండలం రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. మొత్తం 107.55 శాతం పనులను జియో ట్యాగ్ చేసి ప్రథమ స్థానంలో నిలవగా సంగెం మండలం 102.15 శాతంతో ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ మేరకు హన్మకొండలో శనివారం జరిగిన సమావేశంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్.. గీసుకొండ మండల అధికారులు, సిబ్బందిని అభినందించారని ఎంపీడీఓ వీరమల్ల సాయిచరణ్ తెలిపారు. ఉద్యోగుల కృషితోనే ఈ ఘనత సాధ్యమైందని ఎంపీడీఓ పేర్కొన్నారు. -
ఉపాధిహామీ నిధులతో స్వచ్ఛభారత్ పనులు
మంత్రి జూపల్లి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్వచ్ఛభారత్ మిషన్ కింద చేపట్టిన పనులకు ఉపాధిహామీ నిధులను వినియోగించుకోవాలని పంచాయ తీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు సూచించారు. ము ఖ్యంగా 2018 అక్టోబర్ 2 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 100 శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు. ఇందుకు అవలంభించాల్సిన కార్యాచరణపై సోమవా రం గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో ఆయన సమీక్షించారు. మరుగుదొడ్ల నిర్మా ణంపై గ్రామీణులను చైతన్యం చేయడంతో పాటు, వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. రెం డేళ్లలో అన్ని గ్రామాల్లో వంద శాతం మరుగు దొడ్ల నిర్మాణం చేపట్టేం దుకు కార్యాచరణ రూ పొందించాలని అధికారులను ఆదేశించారు. ఎంప్లారుుమెంట్ జనరేషన్ అండ్ మార్కె టింగ్ మిషన్ ద్వారా పెద్దఎత్తున యువతకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టడం పైనా ఆ విభాగం అధికారులతో మంత్రి సమీక్షిం చారు. ప్రతి జిల్లాలోనూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచిం చారు. ఆదేశించారు. -
‘ఉపాధి’ బకాయిలను చెల్లించాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ బకారుు లను వెంటనే చెల్లిం చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ఉపాధి కూలీ లు చేసిన పనులకు సంబంధించి రూ.200 కోట్లు పైబడి ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉందన్నారు. దీంతో కూలీలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాత బకారుులు రాక, పెద్ద నోట్ల రద్దుతో పనులు దొరక్క కూలీలు ఇక్కట్లకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఉపాధి కూలీలకు నేరుగా వేతనాలు!
వారి ఖాతాల్లోనే జమ చేయనున్న కేంద్రం సామగ్రి ఖర్చు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లింపు సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు ఇకపై వేతన ఇబ్బందులు తొలగిపోనున్నాయి. డిసెంబర్ 1 నుంచి ఈ పథకం కింద పనులు చేసిన కూలీలకు వేతనాల సొమ్మును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని కేంద్రం నిర్ణరుుంచిం ది. కేంద్రం నుంచి ఉపాధి సొమ్ము రాష్ట్ర ఖజానాకు జమ కావడం, ఆ సొమ్మును వెంటనే గ్రామీణాభివృద్ధి శాఖకు బదిలీ చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇతర పనులకు మళ్లించడం వంటివాటితో కూలీలకు సకాలంలో వేతనాలు అందడం లేదు. దీంతో ఉపాధి కూలీలు పనులు మానేయడం, వలస పోయిన దుస్థితి ఏర్పడడంతోపాటు కొన్నిసార్లు ఉపాధి నిధులను విడుదల చేరుుంచడానికి రాష్ట్ర గవర్నర్ స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది కూడా. ఇలా రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా తాము అప్రదిష్ట పాలుకావాల్సి వస్తోందని భావించిన కేంద్రం... నేరుగా కూలీల ఖాతాల్లో వేతనాలు జమ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఎన్ఈఎఫ్ఎంఎస్ ద్వారా.. ఉపాధి కూలీలకు రోజు వారీ వేతనాలను చెల్లించేందుకు ‘నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ మేనేజ్మెంట్ సిస్టమ్’ను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూపొందించింది. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉపాధి పనులు చేసిన కూలీల పేరు, ఆధార్, జాబ్కార్డ్ నంబర్, చెల్లించాల్సిన వేతనం తదితర వివరాలను ‘తెలంగాణ పేమెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్(టీపీఎంఎస్)’ద్వారా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కేంద్రానికి పంపుతారు. ఆ వివరాలను ఎన్ ఈఎఫ్ఎంఎస్కు అనుసంధానించి, కూలీ లకు వేతనాలు చెల్లిస్తారు. దీనికి సంబంధిం చి రంగారెడ్డి జిల్లాలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు సత్ఫలితాలు ఇవ్వడంతో.. రాష్ట్రమంతటా అమలు చేయాలని నిర్ణరుుంచారు. దీంతో ఉపాధి కూలీలకు ఇకపై వేతన సమస్యలు ఉండవని ఉపాధి హామీ పథకం సిబ్బంది, అధికారులు పేర్కొంటున్నారు. రూ.202 కోట్లు విడుదల రాష్ట్రంలో డిసెంబర్ నెలాఖరు వరకు ఉపాధి హామీ పనుల చెల్లింపుల కోసం మూడో విడత కింద కేంద్రం రూ.202 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఉప కార్యదర్శి ఏకే సంబ్లీ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ మొత్తం సొమ్ములో రూ.152.23 కోట్లను వేతన చెల్లింపులకు, రూ.50 కోట్లను మెటీరియల్ కాంపొనెంట్ కింద అవసరమైన సామగ్రికి వినియోగించుకోవాలని అందులో పేర్కొన్నారు. కూలీల కు వేతన చెల్లింపులను ఎన్ఈఎఫ్ఎంఎస్ ద్వారా నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తామని.. మెటీరియల్ కాంపొనెంట్ సొమ్మును త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని స్పష్టం చేశారు. -
ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్పై ‘దేశం’ నేతల దాడి
► దాడిలో కానిస్టేబుల్ కూడా.. ► అడ్డుకున్న వారిపై దుర్భాషలు ► ఫిర్యాదు చేసిన ఫీల్డ్ అసిస్టెంట్ లావేరు : ఉపాధి హామీ పథకంలో కొత్తకోట పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్గా పని చేస్తున్న రొక్కం అనిల్కుమార్పై అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకులు మేడబోరుున శ్రీరాంమూర్తి, రొక్కం సాంబమూర్తి, మేడబోరుున సంపత్కుమార్, టీడీపీ నేత కుమారుడైన పోలీస్ కానిస్టేబుల్ రొక్కం దినేష్కుమార్ శుక్రవారం దాడి చేసి గాయపరిచారు. అడ్డుకున్న కూలీలను దుర్భాషలాడారు. దీంతో అనిల్కుమార్ తనపై దాడి చేసిన వారిపై ఎస్ఐ రామారావుకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధి కూలీలు తెలిపిన వివరాలు... కొత్తకోట గ్రామంలో అక్కురోడ్డు నుంచి లచ్చిరాజు చెరువు వరకు కొత్తగా మట్టి రోడ్డు వేయడం కోసం 2015-16లో పంచాయతీ తీర్మానం చేస్తూ ఉపాధి నిధులు మంజూరు చేశారు. అప్పట్లో పనులు కొంత మేరకు చేసి మధ్యలో నిలిపివేశారు. గ్రామానికి చెందిన ఎస్సీ ఉపాధి కూలీలు తమ వంద రోజుల పని దినాలు పూర్తి కాకపోవడంతో ఉపాధి పనులు కల్పించాలని ఇటీవల ఉపాధి అధికారులను కోరారు.దీంతో ఫీల్డ్ అసిస్టెంట్ అనిల్కుమార్ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆ కూలీలతో నిలిచిన పనులను గురువారం తిరిగి చేపట్టారు. శుక్రవారం కూడా పనులు చేసేందుకు వెళ్లగా గ్రామానికి చెందిన తెలుగుదేశం నేతలు మేడబోరుున శ్రీరాంమూర్తి, రొక్కం సాంబమూర్తి, మేడబోరుున సంపత్కుమార్, సాంబమూర్తి కుమారుడు అరుున హైదరాబాద్లో కానిస్టేబుల్గా పని చేస్తున్న రొక్కం దినేష్కుమార్ పనులు వద్దకు వచ్చి జిరారుుతీ భూముల్లో రోడ్డు వేస్తున్నారని పనులు నిలుపుదల చేయాలని కూలీలు, ఫీల్డ్ అసిస్టెంట్తో వాగ్వివాదానికి దిగారు. జిరారుుతీ భూముల్లో పనులు చేయడం లేదని పీల్డ్ అసిస్టెంట్ చెప్పినా వారు వినిపించుకోలేదు. దీంతో పనులను నిలుపుదల చేసి ఫీల్డ్ అసిస్టెంట్ అనిల్కుమార్ కూలీల వద్ద మస్టర్లు వివరాలు నమోదు చేసుకుంటుండగా కానిస్టేబుల్ దినేష్కుమార్ తొలుత వచ్చి ఫీల్డ్ అసిస్టెంట్ కడుపులో కాలితో తన్నాడు. తరువాత మిగతా ముగ్గురు నాయకులు అతనిపై దాడికి పాల్పడి కొట్టారు. వెంటనే అక్కడ ఉన్న కూలీలు అడ్డుకోగా వారిని కానిస్టేబుల్, టీడీపీ నాయకులు తిడుతూ నానా దుర్భాషలాడారు. విషయం కొత్తకోటలో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబ సభ్యులుకు, వైఎస్సార్ సీపీ సాంసృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు రొక్కం బాలక్రిష్ణలకు తెలియడంతో వారు తన అనూయులతో ఘటనా స్థలానికి వచ్చారు. దీంతో తెలుగుదేశం, వైఎస్సార్సీపీ నేతల మధ్య కొంతసేపు ఘర్షణ నెలకొంది. ఎస్ఐకు ఫిర్యాదు పీల్డ్ అసిస్టెంట్పై దాడి జరిగిన విషయం తెలుసుకొని లావేరు ఎస్ఐ సీహెచ్ రామారావు, హెచ్సీ రాంబాబు, ఉపాధి హామీ పథకం లావేరు మండల ఏపీవో శ్రీనివాసులనాయుడు, టీఏ రవి కొత్తకోట గ్రామానికి వెళ్లారు. కానిస్టేబుల్, టీడీపీ నాయకులు చేసిన దాడి గురించి ఫీల్డ్ అసిస్టెంట్ అనిల్కుమార్తో పాటు ఎస్సీ కూలీలు టి దుర్గాభవానీ, యాగాటి రమణమ్మ, చిన్నమ్మడు, లింగాల లక్ష్మి, కె.బోడమ్మలు పాటు పలువురు ఎస్ఐ రామరావుకు వివరించారు. దాడికి పాల్పడిన టీడీపీ నాయకులకు చెందిన జిరారుుతీ భూములు లేవని, సంబంధం లేకపోరుునా టీడీపీ నాయకులు, కానిస్టేబుల్ జోక్యం చేసుకున్నారని ఫీల్డ్ అసిస్టెంట్ చెప్పారు. దాడికి పాల్పడిన కానిస్టేబుల్పై, టీడీపీ నాయకులపైన చర్యలు తీసుకోవాలని వారంతా డిమాండ్ చేశారు. -
ఉపాధి కూలీలకు కొత్త జాబ్ కార్డులు
జనవరి నుంచి కార్డుల పంపిణీకి సన్నాహాలు సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈ జీఎస్) కూలీలకు కొత్త జాబ్ కార్డులు ఇవ్వాలని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణ రుుంచింది. నిబంధనల ప్రకారం ప్రతి ఐదేళ్లకో మారు కొత్త జాబ్కార్డు లను అందజేయాల్సి ఉన్నందున వచ్చే ఏడాది జనవరి నుంచి వీటిని పంపిణీ చేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అన్ని గ్రామాల్లోనూ గ్రామసభలు ఏర్పాటుచేసి ప్రజాప్రతినిధుల చేతులమీదుగా అందజేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 56.39 లక్షల కుటుంబాలకు జాబ్ కార్డులుండగా, 1.28 కోట్ల మంది కూలీలుగా నమోదు చేసుకున్నారు. మూడేళ్ల లో ఉపాధి పనులకు వచ్చేవారి జాబితాలను పరిశీలిస్తే 24 లక్షల కుటుంబాలకు చెందిన 40.92 లక్షల మంది మాత్రమే ఈ పథకాన్ని వినియోగించుకుంటు న్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, ఉద్యాన పంటలకు సబ్సిడీ తదితర పథకాల కోసమే ఎక్కువమంది జాబ్కార్డులు తీసుకున్నట్లు తేలింది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉపాధి పనులు జరుగుతున్నా సగటు పనిదినాలు మాత్రం తక్కువగా కనిపిస్తున్నారుు. ఈ నేపథ్యంలో వాస్తవంగా ఉపాధి పనులకు వచ్చేవారికి మాత్రమే కొత్తకార్డులను అందజేయాలని ఉన్నతాధికారులు నిర్ణరుుంచారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లోనూ తనిఖీలు చేయాలని ఆయా జిల్లాల గ్రామీణాభివృద్ధి అధికారులను ఆ శాఖ కమిషనర్ ఆదేశించారు. మూడేళ్లలో ఒక్కరోజైనా పనికి రాకుంటే కార్డ్ కట్! ఇప్పటికే కార్డులు పొంది మూడేళ్లలో ఒక్కరోజు కూడా ఉపాధి పనులకు వెళ్లని కుటుంబాలను కొత్త కార్డుల జాబితాలో నుంచి తొలగించాలని నిర్ణరుుంచారు. తాత్కాలిక వలసల కారణంగా ఒకేపేరుతో పలుచోట్ల జాబ్కార్డులు పొందినవారి పేర్లను కూడా ప్రస్తుతముంటున్న జిల్లాలో మినహా మిగతా చోట్ల తొలగించను న్నారు. ప్రస్తుతం పనులకు వస్తున్న వారితోపాటు కొత్తగా 18 ఏళ్లు నిండిన పేద యువతీ, యువకులకు, ఆయా గ్రామాలకు కొత్తగా వచ్చిన కోడళ్లకు, శాశ్వతంగా వలస వచ్చిన కుటుంబాలకు కొత్తకార్డులను జారీ చేయనున్నారు. అర్హులైన కూలీలందరికీ జాబ్కార్డులిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. -
ఇకపై బ్యాంక్ ఖాతాల్లో..?
► వేతనాలు తీసుకోనున్న ఉపాధి వేతనదారులు ► ప్రతి ఒక్కరికీ ఖాతాలు తప్పనిసరి ► పోస్టాఫీస్ సేవలు బంద్ ఖాతా తప్పనిసరి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వేతనదారులందరూ బ్యాంకు ఖాతాలు కలిగి ఉండాలి. ఇకపై వేతనదాలు బ్యాంకు ఖాతాలకు జమ అవుతారుు. ప్రస్తుతం 143 పంచాయతీల్లో ఈ విధానం అమలవుతోంది. -పి.ప్రశాంతి, డ్వామా పీడీ, విజయనగరం విజయనగరం పూల్బాగ్: ఉపాధి హామీ పథకం వేతనాల చెల్లింపుల్లో మళ్లీ మార్పు చోటుచేసుకుంది. ఇంతవరకు పోస్టాఫీసుల్లో వేతనాలు తీసుకునేవారు. ఇకపై ఆ విధానానికి స్వస్తి పలికి కొత్త విధానానికి నాంది పలకనున్నారు. వేతనదారుల సొమ్మును బ్యాంకు ఖాతాల్లో జమ చేయడానికి సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వేతనదారుల ఖాతాల్లో కూలి డబ్బులు జమ చేసేందుకు కార్యచరణ రూపొందిస్తున్నారు. గతంలోనే ఈ ఆదేశాలు జారీ అరుునప్పటికీ పూర్తి స్థారుులో జిల్లాలో అమలు కాలేదు. వేతనదారులందరికీ బ్యాంకు ఖాతాలు లేకపోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దశల వారీగా అమలు చేసేందుకు జిల్లా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే జిల్లాలోని 921 పంచాయతీలకు గాను 143 పంచాయతీల్లో ప్రస్తుతం బ్యాంకుల ద్వారా సొమ్మును జమ చేస్తున్నారు. విడతల వారీగా 921 పంచాయతీల్లోనూ ఈ విధానం అమలు చేయనున్నారు. ప్రస్తుతం ఖాతాదారులందరి చేతా బ్యాంకు ఖాతాలు తెరిపించే పనిలో ఉపాధి సిబ్బంది ఉన్నారు. మొదటి విడతలో 143 గ్రామాల్లో రెండో విడతలో 300.. మూడో విడతలో 478 గ్రామాల్లోని వేతనదారులకు బ్యాంకుల ద్వారా వేతనాలు చెల్లించనున్నారు. -
కాలువ పారేదెలా?
► అధ్వానంగా ఎస్సారెస్పీ ఉపకాలువలు ► నిలువెత్తు చెట్లు..నిండిన పూడిక ► చి‘వరి’కి నీరందడం అనుమానమే నిండా పూడిక. . నిలువెత్తు పెరిగిన చెట్లతో ఎస్సారెస్పీ ఉపకాలువలు అధ్వానంగా మారారుు. చుక్క నీరు ముందుకుసాగని దుస్థితి. ఎల్ఎండీ నిండా నీరున్నా చి‘వరి’కి నీరందడం అనుమానమే. కాకతీయ ఉపకాలువలు గండ్లు పడి, డీపీలు పాడరుు మరమ్మతుకు నోచుకోవడం లేదు. డిసెంబర్ మొదటి వారంలోనే ఎస్సారెస్పీ అధికారులు నీటి విడుదలకు ప్రణాళికలు రూపొందించారు. అరుుతే ఈలోపే ఉపకాలువలను మరమ్మతు చేస్తే తప్ప ఆయకట్టు చివరి భూములకు నీరందే పరిస్థితి కనిపించడం లేదు. - మానకొండూర్ 5 లక్షల ఎకరాలకు సాగునీరు దిగువ మానేరు పరిధిలోని కాకతీయకాలువ ద్వారా 5 లక్షల ఎకరాలకుపైగా సాగు నీరందించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. కరీంనగర్, వరంగల్రూరల్, వరంగల్అర్బన్, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల పరిధిలోని 71 డిస్ట్రిబ్యూటరీ కాలువల ద్వారా సాగునీరందించనున్నారు. గతంలోనే ప్రభుత్వం ప్రధాన కాలువను రూ.1.30కోట్లతో ఆధునికీకరించింది. కాలువ సామర్థ్యాన్ని సైతం అధికారులు ఇప్పటికే పరీక్షించారు. కానీ సమస్య ఉపకాలువల వద్ద ఉంది. అధ్వానంగా ఉపకాలువలు ఉపకాలువల పరిస్థితి అధ్వానంగా ఉంది. ప్రధాన కాలువను మరమ్మతు చేసిన ప్రభుత్వం ఉపకాలువలపై దృష్టిసారించలేదు. సెప్టెంబర్లో ప్రధాన కాలువకు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు మానకొండూర్ మండల పరిధిలోని దేవంపల్లి వద్ద ఉన్న డీబీఎం6 ఉపకాలువ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఎక్కువ మొత్తంలో నీరు విడుదల చేశారు. నీటి సామర్థ్యం పెంచడంతో ఉపకాలువకు కేవలం కిలోమీటరు దూరంలోనే గండిపడింది. దీంతో నీరంతా వృథాగా పోరుుంది. చెత్తాచెదారం ఉపకాలువలు చెత్తచెదారంతో ఉన్నారుు. గతంలోనే ఉపాధిహామీ ద్వారా కాకతీయ ఉపకాలువల్లో పూడికను, చెట్లను తొలగించారు. అరుుతే ఈ పనులు కొన్ని ఉపకాలువలకే మంజూరుకావడంతో చాలా కాలువల్లో నిలువెత్తు పెరిగిన చెట్లు దర్శనమిస్తున్నారుు. వీటిని తొలగించకపోతే ఆయకట్టు సగం భూములకు సైతం నీరందే పరిస్థితి లేదని రైతులు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కాలువలను బాగు చేయాలని కోరుతున్నారు. పెరిగిన కాలువ సామర్థ్యం కాకతీయ కాలువను ఆధునికీకరణ చేపట్టి నీటి సామర్థ్యాన్ని పెంచారు. గతంలో రెండు వేల క్యూసెక్కులు సాగునీరు వదిలిన అధికారులు, గత సెప్టెంబర్లో ఐదు వేల క్యూసెక్కులు వరకు విడుదల చేసి కాలువ సామర్థ్యాన్ని పరీక్షించారు. ప్రధాన కాలువ సామర్థ్యం పెరిగినా ఆ స్థారుులో బలంగా ఉపకాలువలు లేవని రైతులు, అధికారులు అభిప్రాయపడుతున్నారు. కలెక్టర్ దృష్టికి ఉపకాలువల దుస్థితి ఉపకాలువ పరిస్థితిని కలెక్టర్ దృష్టికి ఎస్సారెస్పీ అధికారులు తీసుకెళ్లినట్లు తెలిసింది. ఉపకాలువలను బాగు చేసేందుకు నిధులు అవసరమని వి న్నవించినట్లు ఎస్సారెస్పీకి చెందిన ఓ అధికారి తెలిపారు. కాలువలు ఎప్పు డు బాగుపడతాయో వేచిచూడాల్సిందే. -
జిల్లాకు అదనపు ‘ఉపాధి’
∙50 పని దినాలు పెంచుతూ ఆదేశాలు ∙ఇప్పటికే వలసబాట పట్టిన గ్రామీణులు ∙సాఫ్ట్వేర్ వస్తేనే పనుల కల్పన అనంతపురం టౌన్ : కరువు జిల్లాలో వలసల నివారణకు ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద ప్రస్తుతం కల్పిస్తున్న పనులతో పా టు మరో 50 దినాలను అదనంగా కల్పిస్తోంది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖకు ఆదేశాలు జారీ చేసింది. అయితే అదనపు పనులకు సంబంధించి నూతన సాఫ్ట్వేర్ ఇంకా అందాల్సి ఉంది. వలస బాటలో గ్రామీణులు : జిల్లాలో ఈ ఏడాది కనీవినీ రీతిలో కరువు కారణంగా గ్రామీణులు వలసబాట పట్టారు. వర్షాభావం కారణంగా ఖరీఫ్లో 6 లక్షల హె క్టార్లకు పైగా వేరుశనగ దెబ్బతింది. రబీలోనూ 1.50 లక్షల హెక్టార్లలో సాగులోకి రావాల్సిన పంటలు కూడా పత్తాలేకుండాపోయాయి. ఫలితంగా వ్యవసాయ కూలీలు పనులులేక వలసబాట పడుతు న్నారు.కొందరు బెంగళూరు, చెన్నై ప్రాం తాలకు వలసవెళ్లిపోవడంతో కొన్ని గ్రా మాల్లో వెలవెలబోతున్నాయి. రాయదు ర్గ, కళ్యాణదుర్గం, కదిరి, మడకశిర, పెనుకొండ నియోజకవర్గాల్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఇప్పటికే వంద రోజుల పనిదినాలు పూర్తి చేసుకున్న జాబ్కార్డు దారులు గ్రామాల్లోఖాళీగా ఉంటున్నారు. 63 మండలాల్లో అదనపు పనులు వర్షపాతాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 241 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. మన జిల్లా వరకు 63 మండలాలనూ కరువు మండలాలుగా పది రోజుల కిందట ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లోనూ అదనపు పనులు కల్పించనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ 5వ తేదీ వరకు 2,48, 428 కుటుంబాలకు గాను 4,31,677 మందికి ఉపాధి పనులు కల్పించారు. 22,802 కుటుంబాలు వంద రోజుల పని దినాలు పూర్తి చేసుకున్నారు. ప్రభుత్వ తాజా ఆదేశాలతో ఈ కుటుంబాలకు కూడా పనిదినాలు కల్పిస్తారు. సాఫ్ట్వేర్ వస్తేనే పనులు ఈ ఏడాది ఇప్పటికే కోటి 26 లక్షలకు పై గా పనిదినాలు క ల్పించాం. కరువు మండలాలుగా ప్రకటించడంతో 50 పని దినాలను అదనంగా ఇవ్వాలని సర్క్యులర్ వచ్చింది. సాఫ్ట్వేర్ రాగానే పనులు కల్పిస్తాం. ప నులు కావాల్సిన వారు అధికారులను సంప్రదించొచ్చు. – నాగభూషణం, డ్వామా పీడీ -
‘ఉపాధి హామీ’ని నీరుగార్చే యత్నాలు: చాడ
సాక్షి, హైదరాబాద్: కమ్యూనిస్టు పార్టీలు, ప్రజాసంఘాలు పోరాడి సాధించుకున్న గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిధుల కొరతతో నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. కేంద్రం ఈ చట్టాన్ని బలోపేతం చేసి రూ.10 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ర్ట సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలపై హింస పెరుగుతున్నా, ఈ ఘటనలను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నా, ఈ ఏడాది 1,983 కేసులు నమోదైనా, నివారించడంలో అధికార యంత్రాంగం, ప్రభుత్వం విఫలమవుతున్నాయని విమర్శించారు. మహిళా సమాఖ్య అధ్యక్షురాలు పోటు కళావతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉస్తేల సృజన, ఎన్.జ్యోతి, ఎం.నళిని, ఎస్.ఛాయాదేవి, సదాలక్ష్మి పాల్గొన్నారు. -
ద్వంద్వ నీతి
అధికారులపై చర్యలకు తాత్సారం నోటీసులు, చార్జెస్ పేరుతో దాటవేత విమర్శలకు దారి తీస్తున్న అధికారుల తీరు సాక్షి, నిజామాబాద్ :‘ఉపాధి’ అక్రమాలపై చర్యల విషయంలో ఆ శాఖ ఉన్నతాధికారుల తీరు విమర్శలకు దారితీస్తోంది. క్షేత్రస్థాయిలో పనిచేసే కాంట్రాక్టు సిబ్బందిపై వేటు వేస్తున్న అధికారులు.. రూ.లక్షల్లో అక్రమాలకు పాల్పడిన రెగ్యులర్ అధికారులపై చర్యలు తీసుకోవడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 13 మంది ఎంపీడీవోలు రూ.లక్షల్లో ఉపాధి హామీ నిధులు కాజేసినట్లు సామాజిక తనిఖీల్లో తేలింది. అలాగే 20 మంది పంచాయతీరాజ్ ఏఈలు సైతం భారీ ఎత్తున దిగమింగినట్లు ప్రాథమికంగా వెలుగుచూసింది. మరో తొమ్మిది మంది నీటి పారుదల శాఖ ఏఈల అక్రమాలు సైతం వెలుగులోకి వచ్చాయి. ఉపాధి హామీ పనుల్లో అక్రమాలకు పాల్పడ్డారనే కారణంగా గ్రామ స్థాయిలో పనిచేసే 96 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించిన అధికారులు, ఒక్క ఎంపీడీవోపైన గానీ, ఏఈలపైన గానీ చర్యలు తీసుకున్న దాఖలాల్లేకపోవడం గమనార్హం. నోటీసుల పేరుతో ఏళ్ల తరబడి జాప్యం జరుగుతుండటంతో విమర్శలు వస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద కూలీల వలసలను నివారించేందుకు ప్రభుత్వం ఉపాధి హామీ పథకం అమలు చేస్తోంది. ఇందుకోసం ఏటా రూ. వందల కోట్లు ఖర్చు చేస్తోంది. భారీ వ్యయంతో చేపట్టిన పనుల తీరుపై సామాజిక తనిఖీలు చేపడుతోంది. పనుల నాణ్యత, అవకతవకలు, పనుల పురోగతి వంటివి క్షేత్ర స్థాయిలో తెలుసుకునేందుకు ఆయా మండలాల్లో ప్రజావేదికను ఏర్పాటు చేసి, కూలీలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా పది విడతల్లో సామాజిక తనిఖీలు జరిగాయి. సుమారు 314 ప్రజావేదికలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో జరిగిన పనులు, కూలీలకు అందిన డబ్బులు, మెటీరియల్ కాంపోనెంట్, ఇలా వివిధ అంశాలపై ఈ వేదికపై పరిశీలిస్తారు. సామాజిక తనిఖీల్లో భారీగా అవకతవకలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకు సుమారు రూ.4.20 కోట్ల ఉపాధి హామీ నిధులు దుర్వినియోగం అయినట్లు తనిఖీల్లో తేలింది. ఈ మొత్తాన్ని రికవరీ చేయడంలో సంబంధిత అధికారులు మీన మేషాలు లెక్కిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు కేవలం రూ.1.87 కోట్లు మాత్రమే రికవరీ చేయగలిగారు. అంటే పక్కదారి పట్టిన సొమ్ములో కనీసం 50 శాతం కూడా రికవరీ కాలేదు. మిగిలిన రూ.2.33 కోట్లు పక్కదారి పట్టిన సోమ్మును అక్రమార్కుల నుంచి వసూలు చేయాల్సి ఉంది. ఈ అక్రమాలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 1,297 మందిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందులో 96 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారు. అలాగే 26 మంది టెక్నికల్ అసిస్టెంట్లను, ఐదుగురు ఏపీఓలపై సస్పెన్షన్ వేటు వేశారు. 1,163 మేట్లు, ఇతర గ్రామీణ స్థాయిలో పనిచేసే కింది స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకున్న అధికారులు, ఒక్క రెగ్యులర్ అధికారిపై కూడా చర్యలు లేకపోవడం గమనార్హం. నోటీసులు, ఆర్టికల్ ఆఫ్ ఛార్జెస్ ఇలా జాప్యం జరుగుతుండటం గమనార్హం.