ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన దళితులపై టీడీపీ నాయకులు దాడి చేశారు.
ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన దళితులపై టీడీపీ నాయకులు దాడి చేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో సోమవారం చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఎంఆర్పీఎస్, బీఎస్పీ, బాస్ సంస్థ నాయకులు టీడీపీ నాయకుల తీరును నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. సీఎం చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు దళితులపై వివక్ష చూపుతున్నారని వారు మండిపడ్డారు.