'ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే కుట్ర' | Nagendra Nath Ojha comments on employment guarantee scheme | Sakshi
Sakshi News home page

'ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే కుట్ర'

Published Fri, Mar 11 2016 3:13 PM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM

Nagendra Nath Ojha comments on employment guarantee scheme

యాదగిరిగుట్ట: ప్రధాని మోదీ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే కుట్రకు పాల్పడుతున్నారని వ్యవయసాయ కార్మిక సంఘం మాజీ అధ్యక్షుడు నాగేంద్రనాథ్ ఓజా విమర్శించారు. శుక్రవారం నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో జరిగిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉపాధి హామీ పథకం కింద కూలీలకు సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలని, దినసరి కూలీగా రూ.300 చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల దగ్గర భూములను సేకరించి కార్పొరేట్ శక్తులకు అమ్ముకునే కుట్రకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement