technical education
-
‘సెట్’ దరఖాస్తులపై తర్జన భర్జన!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష దరఖాస్తుల స్వీకరణ తేదీలను ఖరారు చేసేందుకు ఈఏపీ సెట్ కమిటీ గురువారం భేటీ అవుతోంది. ఇప్పటికే ఉమ్మడి ప్రవేశ పరీక్ష తేదీలను సాంకేతిక విద్య మండలి వెల్లడించింది. ఏప్రిల్ 29 నుంచి మే 5వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. అయితే, దరఖాస్తుల స్వీకరణ, సమగ్ర సమాచార బులిటెన్ ఇప్పటివరకూ విడుదల చేయలేదు. వీటిని ఫైనల్ చేసేందుకు సెట్ కమిటీ సమావేశమవుతోంది. దీనికన్నా ముందు ఇంటర్ బోర్డ్ అధికారులతో జేఎన్టీయూహెచ్ అధికారులు చర్చలు జరిపారు. ఇంటర్ హాల్ టిక్కెట్ల తేదీలను ఈఏపీ సెట్ దరఖాస్తులకు ప్రామాణికంగా తీసుకుంటారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉమ్మడి ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. వారి హాల్ టికెట్లను ఆన్లైన్లో ఉంచాల్సి ఉంది. ఈఏపీ సెట్కు దరఖాస్తు చేసే విద్యార్థి సమాచారం మొత్తం ఇంటర్ హాల్ టికెట్ అనుసంధానంతోనే సాఫ్ట్వేర్ రూపొందిస్తుంది. ఇంటర్ పరీక్షలు మార్చి 5వ తేదీ నుంచి జరుగుతాయి. పరీక్ష ఫీజు గడువును దఫదఫాలుగా పొడిగిస్తూ వచ్చారు. దీంతో హాల్ టికెట్లను ఆన్లైన్ ద్వారా ఇంకా విడుదల చేయలేదు. దీనిపై స్పష్టత ఇవ్వాలని, దీని ఆధారంగానే ఈఏపీ సెట్కు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తామని సెట్ కన్వీనర్ ఇంటర్ అధికారులకు లేఖ రాశారు. హాల్ టికెట్లపై ఇంటర్ బోర్డ్ గురువారం స్పష్టత ఇస్తుందని ఆశిస్తున్నారు. కొత్త సీట్ల పంచాయితీ ఇంజనీరింగ్లో గత ఏడాది కొత్త సీట్ల పెంపునకు కొన్ని ప్రైవేటు కాలేజీలకు కోర్టు అనుమతించింది. అప్పటికే ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ పూర్తవటంతో కోర్టు అనుమతితో పెరిగిన 6 వేల సీట్లకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఈఏపీ సెట్ తర్వాత కౌన్సెలింగ్ జాబితాలో ఆ ఆరు వేల సీట్లు చేర్చడమా? లేదా? అనే అంశంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో బుధవారం సమావేశమయ్యారు. సీట్ల పెంపు వల్ల ఇబ్బందులు, ఇతర బ్రాంచీల్లో సీట్ల తగ్గింపు వల్ల సమస్యలను ఆమెకు వివరించారు. ఈ అంశంపై త్వరలో ఉన్నతాధికారులతో సీఎస్ భేటీ అవుతున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. పెంచిన 6 వేల సీట్లు కంప్యూటర్ సైన్స్ బ్రాంచీలోనే ఉన్నాయి. కన్వీనర్ కోటా కింద 70 శాతం సీట్లు భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ సీట్లకు ఎంపికైన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలి. అలా ఇవ్వాలంటే ప్రభుత్వం ముందుగా ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేయాలి. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. సీట్ల పెంపును వ్యతిరేకిస్తూ ప్రభుత్వం గత ఏడాది కోర్టును కూడా ఆశ్రయించింది. మరోవైపు సీట్ల పెంపునకు అనుమతించవద్దని అఖిల భారత సాంకేతిక విద్య మండలికి సర్కారు లేఖ రాసింది. ఈ పరిస్థితుల్లో కొత్త సీట్లపై స్పష్టత వస్తేనే కౌన్సెలింగ్ షెడ్యూల్ను ప్రకటించాలని సెట్ కమిటీ భావిస్తోంది. -
ఇష్టారాజ్యంగా 'సర్దుబాటు'
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యలో ఉపాధ్యాయుల సర్దుబాటు పేరుతో ఇష్టానుసారంగా బదిలీలు చేపట్టి బోధనను నిర్వీర్యం చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు ఇదే విధానాన్ని సాంకేతిక విద్యలోనూ అమలు చేసింది. సర్దుబాటు బదిలీల పేరుతో లెక్చరర్లను ఏకంగా రీజియన్లు దాటించేసింది. దీంతో దాదాపు 20 రోజులైనా లెక్చరర్లు.. తాము బదిలీ అయిన స్థానాలకు వెళ్లకపోవడంతో పాలిటెక్నిక్ కాలేజీల్లో బోధన కుంటుబడింది. జోన్ స్థాయిలో చేపట్టాల్సిన సర్దుబాటు బదిలీలను ఏకంగా రీజియన్లను దాటించేయడంతో పలువురు లెక్చరర్లు సాంకేతిక విద్య ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేయగా.. మరికొందరు హైకోర్టును ఆశ్రయించినట్టు తెలిసింది.అక్టోబర్లో చేపట్టాల్సిన సర్దుబాటు ప్రక్రియను డిసెంబర్లో చేపట్టడమే కాకుండా.. సాంకేతిక విద్య డైరెక్టరేట్ చేపట్టిన సర్దుబాటు బదిలీలు సైతం సక్రమంగా లేకపోవడంతో లెక్చరర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 200 మంది లెక్చరర్లను బదిలీ చేయగా.. సగం మందికి పైగా పోస్టుల్లో చేరకపోవడం గమనార్హం. ఫిర్యాదు చేసిన వారికి బెదిరింపులు! పాలిటెక్నికల్ కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్ల కాలపరిమితి అక్టోబర్తో ముగిసింది. అలాగే గతంలో ఇచి్చన డిప్యుటేషన్లు కూడా పూర్తయ్యాయి. నవంబర్లో తరగతులు ప్రారంభమయ్యేలోగా సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేయాలి. అంటే సర్దుబాటు బదిలీలు అక్టోబర్లోనే చేపట్టాలి. కానీ సాంకేతిక విద్య డైరెక్టరేట్ అధికారులు ఈ నెల మొదట్లో పాలిటెక్నిక్ కాలేజీల ప్రిన్సిపాల్స్పై తాము చెప్పిన విధంగా వర్క్లోడ్ నివేదిక తెప్పించుకున్నారు.వెంటనే 2వ తేదీన ఆఘమేఘాలపై దాదాపు 200 మందిని సర్దుబాటు బదిలీ చేశారు. ఈ పోస్టులను జోన్ స్థాయిలోనే సర్దుబాటు చేయాలి. కానీ రీజియన్లను మార్చేయడంపై లెక్చరర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర వర్సిటీ రీజియన్లోని తిరుపతి జిల్లా చంద్రగిరి పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేస్తున్న ఓ లెక్చరర్ను.. ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్లోని విజయనగరం జిల్లా చీపురుపల్లి పాలిటెక్నిక్ కాలేజీకి, మరొకరిని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కాలేజీకి బదిలీ చేశారు. వెంటనే విధుల్లో చేరాలని వారిని ఆదేశించారు. అయితే, 60 కి.మీ పరిధిలో చేపట్టాల్సిన సర్దుబాటును ఏకంగా 900 కి.మీ దూరానికి చేయడంతో బాధితులు తమ పోస్టుల్లో చేరకుండా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం తెలిసిన సాంకేతిక విద్య డైరెక్టరేట్ సిబ్బంది.. ఫిర్యాదు చేసిన వారిని బెదిరించినట్లు సమాచారం. దీంతో కొందరు బాధిత లెక్చరర్లు హైకోర్టును ఆశ్రయించినట్టు తెలిసింది. కాంట్రాక్టు లెక్చరర్ల పరిస్థితి మరీ ఘోరంప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల పరిస్థితిని మరీ దారుణంగా మార్చేశారు. వీరికి వారంలో రెండు, మూడు రోజులు ఒక కాలేజీ చొప్పున విధులు వేస్తుండడం గమనార్హం. ఇలా వారంలో రెండు, మూడు కాలేజీలు మారుస్తుండడంతో వారు ఏ కాలేజీలో పనిచేస్తున్నారో తెలియని దుస్థితి నెలకొంది. వీరిని కూడా గుంటూరు నుంచి పాడేరుకు, చీపురుపల్లికి బదిలీ చేయడం విమర్శలకు దారి తీసింది. ఈ ప్రక్రియతో అకడమిక్ పరంగా తీవ్ర ఇబ్బందులు తలెత్తాయని లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైలెవల్ కమిటీ చేపట్టాల్సిన సర్దుబాటు బదిలీలను.. కిందిస్థాయి సిబ్బందే నివేదిక తయారు చేయడం, దాన్నే డైరెక్టర్ ఆమోదించడంతో సమస్యలు వచ్చాయని సమాచారం. -
కోర్ గ్రూపులకు కష్టకాలం
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్లో సివిల్, మెకాని కల్, ఎలక్ట్రికల్ బ్రాంచీలకు ఆదరణ కరువవుతోంది. గత నాలుగేళ్లలో ఈ గ్రూపుల్లో 10 వేల సీట్లు తగ్గిపోగా, ఈ ఏడాది (2024–25) మరో 6 వేల సీట్లు కనుమరుగయ్యాయి. డిమాండ్ లేని బ్రాంచీల్లో సీట్లు తగ్గించి, ఆదరణ ఉన్న బ్రాంచీల్లో పెంచుకునేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అనుమతించడంతో అన్ని కాలేజీలూ ఇదే బాట పడుతున్నాయి. కోర్ గ్రూపుల్లో సీట్లు తగ్గించుకుని కంప్యూటర్ కోర్సు ల్లో పెంచుకుంటున్నాయి. కేవలం నాలుగేళ్లలోనే కంప్యూటర్ కోర్సుల్లో 11 వేల సీట్లు పెరిగాయి. ఈ పరిస్థితి జిల్లాల్లోని ఇంజనీరింగ్ కాలే జీల మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. కంప్యూటర్ కోర్సుల నిర్వహణ ఆ కాలేజీలకు కష్టమ వుతోంది. మౌలిక వసతుల కల్ప న, నాణ్యమైన ఫ్యాకల్టీ సమకూర్చుకోవడం కత్తిమీద సాములా మారింది. దీంతో పలు జిల్లాల్లో 2014–24 మధ్య 90కిపైగా కాలేజీలు మూతపడ్డాయి. ఒక్క వరంగల్ జిల్లాలోనే నాలుగేళ్లలో 8 కాలేజీలు కనుమ రుగయ్యాయి. ఆదిలాబా ద్లో మూడు కాలేజీలుంటే ఇప్పుడు ఒక్కటీ లేదు. నిజామాబాద్లో గతంలో ఆరు ఉంటే ఇప్పుడు నాలుగున్నాయి. ఎక్కువ మంది విద్యార్థులు ఇంజనీ రింగ్ విద్య కోసం రాజధానినే ఎంచుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 175 ఇంజనీరింగ్ కాలేజీలుంటే, 109 కాలేజీలు మేడ్చల్–మల్కా జిగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మేడ్చల్లో 45, రంగారెడ్డిలో 44, హైదరాబాద్లో 20 కాలేజీలున్నాయి. మార్చేస్తున్న పోటీ ఇంజనీరింగ్ తర్వాత కన్పించేవన్నీ సాఫ్ట్వేర్ ఉద్యో గాలే. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ కోర్సులు చేసినా ఉపాధి కోసం వెతుక్కోవాల్సింది ఐటీ సెక్టార్లోనే. దీనివల్లే విద్యార్థులు కంప్యూటర్ కోర్సుల్లో చేరేందుకే ఇష్టపడుతున్నారు. రాష్ట్రంలో ఏటా లక్ష మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు తయారవుతుండగా, 70 శాతం కంప్యూటర్ సైన్స్ నేపథ్యంతోనే వస్తున్నారు. వీరిలో కేవలం 10 శాతం మందికి కూడా స్కిల్స్ ఉద్యోగాలు దొరకట్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో సీఎస్ఈ చేసినా బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండటం లేదని పారిశ్రామిక వేత్తలు అంటున్నారు. ఇంజనీరింగ్తోపాటు ఏదో ఒక కొత్త కోర్సు నేర్చుకోవాల్సిన పరిస్థితి. మరోవైపు ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుతూనే పార్ట్టైం ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ అవకాశాలన్నీ హైదరాబాద్లో ఉంటేనే సాధ్యమని విద్యార్థులు భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు లేకపోవడంతో ఇంటర్న్షిప్, ప్రాజెక్టు వర్క్ లాంటివీ సాధ్యం కావట్లేదు. ఆ కోర్సుల జాడెక్కడ?గత ఐదేళ్లల్లో సివిల్, మెకానికల్, ఈఈఈ వంటి కోర్ గ్రూపుల్లో ప్రవేశాలు భారీగా తగ్గాయి. ఈ బ్రాంచీల్లో సీట్లను కాలేజీలు తగ్గిస్తున్నాయి. 2020 సంవత్సరంలో ఈ గ్రూపుల్లో కన్వీనర్ కోటా కింద 40,355 సీట్లుంటే, 2024 నాటికి ఇవి 30,900కు పడిపోయాయి. ఉన్న సీట్లలోనూ ప్రవేశాలు 50 శాతం మించడం లేదు. కానీ సీఎస్ఈ, ఐటీ సహా కంప్యూటర్ బ్రాంచీల్లో చేరేందుకు విద్యార్థులు పోటీ పడుతున్నారు. కాలేజీలు కూడా ఈ గ్రూపుల్లో సీట్లు పెంచుకునేందుకు బారులు తీరుతున్నాయి. 2020లో కంప్యూటర్ బ్రాంచీల్లో 58,633 సీట్లుంటే, 2024 నాటికి 67,248 సీట్లయ్యాయి. 65.13 శాతం నుంచి 76.46 శాతం సీట్లు ఈ గ్రూపుల్లో పెరిగాయి. ఇతర కోర్ గ్రూపుల్లో మాత్రం 2020–24 మధ్య 37.87 శాతం ఉన్న సీట్లు 23.54 శాతానికి పడిపోయాయి. -
21, 22 తేదీల్లో ఇంజనీరింగ్ సీట్ల మార్పిడి
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీ సీట్ల మార్పిడి (స్లైడింగ్)కి ఈ నెల 21, 22 తేదీల్లో అవకా శం కల్పించాలని సాంకేతిక విద్య విభాగం నిర్ణయించింది. స్లైడింగ్ ప్రక్రియను ప్రతీ ఏటా కాలేజీలే చేపట్టేవి. ఈసారి సాంకేతిక విద్య కమిషనరేట్ దీన్ని నిర్వహిస్తోంది.స్లైడింగ్ పేరుతో ప్రైవేటు కాలేజీలు కొన్నేళ్ళుగా సాగిస్తున్న సీట్ల వ్యాపారానికి చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. తుది విడత సీట్లను సోమవారం కేటాయించారు. ఇంకా 5,039 సీట్లు మిగిలిపోయాయి. స్లైడింగ్ తర్వాత మిగిలిపోయే సీట్లను కలుపుకుని స్పాట్ అడ్మిషన్లు చేపట్టాలని నిర్ణయించారు. మొత్తం మీద ఈ నెలాఖరుకు కౌన్సెలింగ్ ముగించుకుని ఇంజనీరింగ్ క్లాసులు మొదలు పెట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.స్లైడింగ్కు 3 వేల సీట్లుజాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు వచ్చిన వాళ్ళు రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు వదులుకుంటారు. అలాగే తుది దశ కౌన్సెలింగ్లో కన్వీనర్ కోటా కింద ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు వచ్చిన విద్యార్థులు ప్రైవేటు కాలేజీల్లో సీట్లు వదులుకుంటారు. ఈ రకంగా తుది దశ కౌన్సెలింగ్ నాటికి ప్రతీ ఏటా దాదాపు 3 వేల మంది స్లైడింగ్ ద్వారా సీట్లు మారుతుంటారు. కాలేజీలో తుది దశ కౌన్సెలింగ్లో సీట్లు వచ్చిన వాళ్ళు ఈ నెల 17 నాటికి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఇలా చేయని పక్షంలో ఆ సీటును ఖాళీ అయినట్టుగా ప్రకటిస్తారు. విద్యార్థులు సీట్లు రద్దు చేసుకున్నా వాటినీ ప్రకటించాల్సి ఉంటుంది. అప్పటికే ఆ కాలేజీలో చేరిన విద్యార్థులు నచ్చిన బ్రాంచీలో ఖాళీలుంటే స్లైడింగ్కు దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో ప్రైవేటు కాలేజీలు ర్యాంకర్ల చేత తొలి దశలోనే కౌన్సెలింగ్లో పాల్గొనేలా చేసేవి. తుది దశ ముగిసిన తర్వాత సీటు రద్దు చేసుకునేలా చేసేవి. ఈ సీటును స్లైడింగ్ ప్రక్రియలో ఎక్కువ రేటు పెట్టి ఇతర బ్రాంచీల్లో ఉన్నవారికి అమ్ముకునేవి. ఇప్పుడు ప్రభుత్వమే స్లైడింగ్ చేపట్టడం వల్ల ఆ అవకాశం ఉండే వీల్లేదు.స్పాట్లో కంప్యూటర్ సీట్లు కష్టమేఈ ఏడాది కంప్యూటర్, అనుబంధ బ్రాంచీల్లో సీట్లు పెద్ద ఎత్తున భర్తీ అయ్యాయి. స్పాట్ అడ్మి షన్లలో ఈ సీట్లు పొందే అవకాశాలు తక్కువనే అధికారులు అంటున్నారు. గత ఏడాది సీట్లు పెద్ద ఎత్తున మిగిలిపోయాయి. జేఈఈ కౌన్సెలింగ్ ఇప్పటికే ముగిసింది. దీంతో జాతీయ కాలేజీ ల్లో సీట్లు వచ్చిన విద్యార్థులు రాష్ట్ర కాలేజీల్లో మొదటి, రెండో దశ కౌన్సెలింగ్ తర్వాత మళ్ళీ రాష్ట్ర కాలేజీలకు దరఖాస్తు చేయలేదు. గత ఏడాది అన్ని బ్రాంచీల్లో కలిపి తుది దశ కౌన్సెలింగ్ తర్వాత 19,154 సీట్లు మిగిలిపోయాయి. ఈ ఏడాది మాత్రం 5,039 సీట్లు మాత్రమే మిగిలా యి. కంప్యూటర్ సైన్స్ బ్రాంచీల్లో 2023లో తుది దశ కౌన్సెలింగ్లో 5,723 సీట్లు మిగిలితే... ఈ ఏడాది తుది దశ కౌన్సెలింగ్ నాటికి కేవలం 1,225 సీట్లు మిగిలాయి. ఇవి కూడా మారు మూల ప్రాంతాల కాలేజీల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎక్కువగా ఆశించే కంప్యూటర్ సైన్స్ బ్రాంచీల్లో స్పాట్ అడ్మిషన్లలో పెద్దగా సీట్లు వచ్చే అవకాశం కన్పించడం లేదు. -
కంప్యూటర్ కోర్సుల్లో 98 శాతం భర్తీ
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ మూడో విడత సీట్ల కేటాయింపును సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన సోమవారం విడుదల చేశారు. కొత్తగా 9,881 మందికి సీట్లు కేటాయించారు. బ్రాంచీలు, కాలేజీలు మార్పు కోరిన 16,981 మందికి సీట్లు కేటాయించారు. కౌన్సెలింగ్లో 175 కాలేజీలు పాల్గొన్నాయి. కన్వినర్ కోటా కింద మొత్తం 86,943 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మూడో దశతో కలిపి 81,904 (92.40 శాతం) సీట్లు కేటాయించారు. ఇంకా 5,039 సీట్లు మిగిలిపోయాయి. గతంలో సీట్లు పొందిన విద్యార్థులు బ్రాంచీలు, కాలేజీల మార్పిడి కోసం ఆప్షన్లు ఇచ్చారు. కొత్తగా మరికొంతమంది ఇచ్చినవి కలుపుకుని మొత్తం 23,98,863 ఆప్షన్లు అందినట్టు అధికారులు వెల్లడించారు. ఈడబ్ల్యూఎస్ కోటా కింద 6,460 సీట్లు కేటాయించారు. ఆరు యూనివర్సిటీలు, 84 ప్రైవేటు కాలేజీలు కలిపి మొత్తం 90 కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 15లోగా ఫీజు చెల్లించాలని, సంబంధిత కాలేజీల్లో 13 నుంచి 17వ తేదీ వరకూ సెల్ఫ్ రిపోరి్టంగ్ చేయాలని అధికారులు సూచించారు. ఈ నెలాఖరులోగా క్లాసులు మొదలు వాస్తవానికి మూడోదశ సీట్ల కేటాయింపు ఈ నెల 13న చేపట్టాలని నిర్ణయించారు. కానీ సీట్ల పెంపు, అదనపు సీట్ల కేటాయింపు, సీట్ల మదింపునకు సంబంధించిన ప్రైవేటు కాలేజీల పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో కొత్త సీట్లు రావని తెలియడంతో, త్వరగా కౌన్సెలింగ్ ప్రక్రియను ముగించి, ఇంజనీరింగ్ క్లాసులను ఈ నెలాఖరులో మొదలు పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు యాజమాన్య కోటా సీట్ల భర్తీని ఆయా కాలేజీలు వెల్లడించాలని ఆదేశించారు. దీంతో కన్వీనర్ కోటా కింద సీట్లు రాని విద్యార్థులు మిగిలిపోయే యాజమాన్య కోటా సీట్లకు ప్రయత్నించే వీలుంటుందని అధికారులు భావిస్తున్నారు. 98 శాతం కంప్యూటర్ కోర్సుల్లోనే.. ఇప్పటి వరకూ జరిగిన కౌన్సెలింగ్లో ఎక్కువ శాతం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇతర అనుబంధ కోర్సుల్లోనే అత్యధికంగా సీట్లు భర్తీ అయ్యాయి. ప్రైవేటు కాలేజీలు సివిల్, మెకానికల్, ఎలక్రి్టకల్ వంటి బ్రాంచీల్లో సీట్లు తగ్గించాయి. దీంతో ఈ బ్రాంచీల్లో సీట్లు తగ్గాయి. ఐటీ, ఐవోటీ బ్రాంచీల్లో మార్పిడికి అనుమతించారు. దీనికి తోడు కొన్ని సీఎస్ఈ, అనుబంధ కోర్సుల్లో స్వల్పంగా సీట్లు పెరిగాయి. ఈ బ్రాంచీల్లో 61,587 సీట్లు అందుబాటులో ఉంటే, 60,362 సీట్లు భర్తీ అయ్యాయి. కేవలం 1,225 సీట్లు మాత్రమే మిగిలిపోయాయి. 98.01 శాతం సీట్లు కంప్యూటర్ కోర్సుల్లో భర్తీ అయినట్టు అధికారులు ప్రకటించారు. ఈసీఈలో 94.38 శాతం, ఈఈఈలో 76.38 శాతం, సివిల్ ఇంజనీరింగ్లో 80.16 శాతం, మెకానికల్ ఇంజనీరింగ్లో 72.38 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. సివిల్, మెకానికల్ సహా అనుబంధ కోర్సుల్లో 7,458 సీట్లు ఉంటే, 5,782 సీట్లు భర్తీ అయ్యాయి. 1,676 సీట్లు మిగిలిపోయాయి. ఎలక్ట్రానిక్స్, ఎలక్రి్టకల్ కోర్సుల్లో 16,692 సీట్లు ఉంటే, 14,907 సీట్లు భర్తీ అయ్యాయి. 1,785 సీట్లు మిగిలిపోయాయి. -
జేఈఈ మెయిన్కు రికార్డు స్థాయిలో హాజరు
సాక్షి, అమరావతి: జాతీయ సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షకు రికార్డు స్థాయిలో అభ్యర్థులు హాజరయ్యారు. జనవరి 24 నుంచి ఈ నెల 1 వరకు జరిగిన జేఈఈ తొలి సెషన్ పేపర్–1 (బీఈ/బీటెక్) పరీక్ష 95.80 శాతం, పేపర్–2 (బీఆర్క్/బీప్లానింగ్) పరీక్ష 75 శాతం మంది రాయడం విశేషం. చరిత్రలో ఎన్నడూ లేనంతంగా ఈసారి జేఈఈ మెయిన్కు 12,31,874 మంది దరఖాస్తు చేశారు. ఇందులో 8,24,945 మంది పురుషులు, 4,06,920 మంది మహిళలు, 9 మంది థర్డ్ జెండర్ ఉన్నారు. గత రెండేళ్లతో పోలిస్తే ఈ సంఖ్య 27 శాతం ఎక్కువ. తాజాగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో అత్యధికంగా 12,25,529 మంది పరీక్షకు హాజరయ్యారు. 291 ప్రాంతాల్లో 544 పరీక్ష కేంద్రాలు.. ఈ ఏడాది జేఈఈ మెయిన్కు అత్యధికంగా దరఖాస్తులు రావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పరీక్ష కేంద్రాలు పెంచింది. సెషన్–1 కోసం 291 ప్రాంతాల్లో 544 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో 21 పరీక్ష కేంద్రాలు విదేశాల్లో ఉండటం విశేషం. దోహా, దుబాయ్, ఖాట్మండు, మస్కట్, రియాద్, షార్జా, సింగపూర్, కువైట్ సిటీ, కౌలాలంపూర్, లాగోస్/అబుజా, కొలంబో, జకార్తా, మాస్కో, ఒట్టావా, పోర్ట్లూయిస్, బ్యాంకాక్, వాషింగ్టన్ డీసీతో పాటు ఈ ఏడాది తొలిసారిగా అబుదాబి, హాంకాంగ్, ఓస్లో నగరాల్లో జేఈఈ మెయిన్ పరీక్షను నిర్వహించారు. రెండో సెషన్ తేదీల్లో మార్పు.. జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షల షెడ్యూల్ను ఎన్టీఏ మార్పు చేసింది. తొలుత ఏప్రిల్ 1 నుంచి 15 మధ్యలో పరీక్షలు నిర్వహించాలని భావించినప్పటికీ వాటిని ఏప్రిల్ 4 నుంచి 15 మధ్యలోకి మార్చింది. మార్చి 2 అర్దరాత్రి 11.50 గంటల వరకు సెషన్–2 కోసం దరఖాస్తులు స్వీకరించనుంది. గతంలోనే రెండు సెషన్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇప్పుడు రెండో సెషన్కు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అభ్యర్థి సెషన్లో ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్టీఏ హెచ్చరించింది. రెండు సెషన్లలో రాస్తే.. ఎందులో అత్యధిక స్కోర్ వస్తుందో దాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. జేఈఈ మెయిన్లో ప్రతిభ, రిజర్వేషన్లు ఆధారంగా టాప్ 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్డ్కు ఎంపిక చేస్తారు. వీరు పోగా మిగిలిన విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్ఐటీ (ప్రభుత్వ నిధులతో పనిచేసే సాంకేతిక విద్యా సంస్థలు)ల్లో సీట్లను భర్తీ చేస్తారు. -
వారెక్కాల్సిన రైలు జీవిత కాలం లేటు!
ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థలో జరిగిన ఆర్థిక అవకతవ కలు జాతీయ స్థాయి వార్తల్లో చర్చనీయాంశం అయ్యింది. ఈ సంస్థ పనిలో లొసుగుల విషయం అటుంచితే, దీని స్థాపనకు ముందు మూడు దశాబ్దాల కాలం పాటు కుంటుకుంటూ సాగి... గిడసబారిన బడుగు బలహీన నిమ్న వర్గాల యువత ఉపాధి దీన చరిత్రను చూడాల్సి ఉంది. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో 1985లో ఇండియాలో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఏర్పడింది. ఇది జరిగాక, విద్యను ఉపాధి కేంద్రిత దృష్టితో చూడడం మొదలయింది. అంతకు ముందు అది– ‘జ్ఞానం’ కేంద్రంగా ఉండేది. ఈ శాఖ ఏర్పడిన తర్వాత మానవీయ శాస్త్రాల నుండి వాణిజ్య, శాస్త్ర– సాంకేతిక విద్య వరకు అన్నింటినీ ఒక గొడుగు కింది చేర్చి చూడడం మొదలయింది. అలా తొలి మానవ వనరుల శాఖ మంత్రి పీవీ నర సింహారావు ఆ తర్వాత ప్రధానమంత్రి అయ్యాక, 1991లో మొదలైన ఆర్థిక సంస్కరణలలో మన– ‘మానవ వనరుల’ దృష్టికి ద్రవరూపం ఏర్పడి, అది అన్ని అభివృద్ధి – సంక్షేమ పార్శ్వాల్లోకి ప్రవహించడం మొదలయింది. చివరిగా అప్పటి ప్రధాని మన్మోహన్ ‘సీఐఐ’ వంటి వేదికల మీద ఉపాధి అవ కాశాల కల్పన పెంచమని పారిశ్రామిక వేత్తలను కోరడం ఈ మొత్తం పరిణామాలకు ముగింపుగా చూడాల్సి ఉంటుంది. ఈ కాలంలోనే పట్టణాభివృద్ధి, విద్యుత్తు, కమ్యూని కేషన్స్, పారిశ్రామిక, ఇరిగేషన్ రంగాల్లో ‘ఇంజనీరింగ్’ విద్య అవసరం బాగా పెరిగింది. దాంతో మానవ వనరుల అవసరాన్ని ‘డిమాండ్ – సప్లయ్’ దృష్టితో చూడడం మొదలయింది. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు, వనరుల సహకారంతో ప్రయివేట్ రంగంలో ఇంజనీరింగ్ కాలేజీలు మొదలై అవి లాభసాటి వ్యాపారంగా మారడంతో మన (ఉమ్మడి) రాష్ట్రంలో ఆ కోర్సుల్లోకి ప్రవేశం ఖరీదు అయ్యింది. దాంతో 2000 నాటికి ఇంజనీరింగ్ కాలేజీల ‘గ్రేడింగ్’ను బట్టి ఎంపిక చేసుకున్న వాటిలో తల్లితండ్రులు తమ పిల్లల్ని చేర్చడం మొదలయింది. ఆ దశలో స్థోమతు లేని పిల్లలకు 2004 తర్వాత వైఎస్సార్ ప్రభుత్వంలో– ‘ఫీజ్ రీయింబర్స్మెంట్’ పథకం అందు బాటులోకి వచ్చాక; పెద్ద ఎత్తున అన్ని ఆర్థిక స్థాయుల్లోని పిల్లలు వీటిలో చదివి దేశ విదేశాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలు పొందారు. ఎప్పుడైతే సాంకేతిక విద్య ‘మార్కెట్’ ప్రతిపాదికగా మారిందో, అప్పుడు వీరి ఉపాధి అవకాశాలు ‘ఫస్ట్–కమ్ –ఫస్ట్’ వడ్డనగా తయారైంది. అప్పటికే ఇంజనీరింగ్ డిగ్రీ మాత్రమే చాలదు ఎంబీఏ ఉండాలనీ, ఎమ్టెక్ తప్పనిసరి అనీ, కాదు అమెరికాలో ఎమ్ఎస్ ఉండాలి అనే భిన్న ధోర ణులు సాంకేతిక విద్య మార్కెట్లో వ్యాపించాయి. చివరికి ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నప్పటికీ పలు స్థాయుల్లో జరిగే ‘ఎలిజిబి లిటీ టెస్ట్’ పాసైతేనే ఉద్యోగం అనే పరిస్థితి దాపురించింది. ఫలితంగా ఆలస్యంగా ఇందులోకి వచ్చిన అంతంత మాత్రపు చదువులున్న తల్లిదండ్రులకు వారి పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. అప్పటికే ‘హ్యుమానిటీస్’ డిగ్రీలకు ఉద్యోగ మార్గాలు మూసుకు పోయాయి. ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియం చదువు పునాది లేకపోవడం, కమ్యూనికేషన్ స్కిల్స్ కరవు కావడం, గ్రామీణ నేపథ్యం,వంటివి వీరి ఉపాధికి అవరోధాలు అయ్యాయి. 2007లో శేఖర్ కమ్ముల తీసిన ‘హేపీ డేస్’ సినిమాలో ‘కేంపస్ సెల క్షన్స్’లో ఉత్తరాంధ్ర గ్రామీణ విద్యార్థి పడిన పాట్లు ఈ పరిస్థితికి అద్దం పట్టాయి. డిగ్రీ ‘సర్టిఫికెట్’ ఉండికూడా కేవలం ‘స్కిల్స్’ లేక కుటుంబ పోషణార్థం‘మార్కెటింగ్ ఎగిక్యూటివ్’, ’రియల్ ఎస్టేట్ ప్రమోటర్’ వంటి దుఃస్థితిలో వీరు ఉండిపోయారు. ఇటువంటి ఉపాధి దుఃస్థితి నేపథ్యంలో 2014లో రాష్ట్ర విభ జన జరిగాక, టీడీపీ ఏపీలో తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇటువంటి చర్యను సంక్షేమం అనుకుందో లేదా అభి వృద్ధి అనుకుందో తెలియదు గానీ; పైన చెప్పుకున్న దయ నీయ స్థితిలో ఉంటూ ఉపాధి వెతుక్కుంటున్న యువత కోసం ‘ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ ఏర్పాటు చేసింది. చివరికి 2014–19 మధ్య ఈ కార్పొరేషన్ నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలు వచ్చాయి. అయితే కాలం ఎవరి కోసం ఆగదు కనుక ‘ఫస్ట్–కమ్–ఫస్ట్’ అనేది అన్ని కాలాల్లోనూ ఉంటుంది. ఈ జూలై రెండో వారంలో జరిగిన యూనివర్సిటీ వైస్–ఛాన్సలర్ల సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ – సాంకేతిక విద్యా రంగంలో నూతన పోకడలతో (ఎమర్జింగ్ టెక్నాల జీస్) సిలబస్లను రూపొందించాలని కోరారు. ప్రపంచం ఇలా ముందుకు పోతుంటే, కేవలం ‘స్కిల్స్’ లేక మిగిలిపోతున్న పిల్లలు భవిష్యత్తు ఒక జీవిత కాలం లేటు కావడం అనేది, ఇప్పటికైనా ఈ ‘స్కిల్’ కుంభకోణం ఉదంతంలో మనకు కనిపిస్తుందా? జాన్సన్ చోరగుడి వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
దివ్యాంగ విద్యార్థులకు సాంకేతిక బోధన నైపుణ్యం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థులకు సాంకేతిక విద్యా బోధన అందించేందుకు దేశంలోనే తొలిసారిగా ఫస్ట్ ఇన్క్లూజివ్ డిజిటల్ ఫెస్టివల్ నిర్వహిస్తుందని సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు అన్నారు. పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు సకల సౌకర్యాలతో డిజిటల్ విద్యను అందిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర సమగ్ర శిక్ష, రూరల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ (ఆర్డీటీ అనంతపురం) సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం అనంతపురం ఆర్డీటీ ఆడిటోరియంలో జరిగిన ‘ఫస్ట్ ఇన్క్లూజివ్ డిజిటల్ ఫెస్టివల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమలోని ఆరు జిల్లాల (అనంతపురం, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, కడప) నుంచి 300 మంది దివ్యాంగ, సాధారణ విద్యార్థులతో కలిపి విజువల్ కోడింగ్, ఆక్సిస్బల్ కోడింగ్, రోబోటిక్, వెబ్ డిజైన్, యానిమేషన్ గేమ్స్ డెవలప్మెంట్ వంటి 100 డిజిటల్ నైపుణ్యాల ప్రాజెక్టులను ప్రదర్శించి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు సాధించడం అభినందనీయమన్నారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ వీసీ ప్రొఫె సర్ ఎం.రామకృష్ణారెడ్డి, ఆర్డీటీ డైరెక్టర్ దశరథ్, చక్షుమతి ఫౌండేషన్ ప్రతినిధి రామ్కమల్, సైబర్ స్క్వేర్ సీఈవో ఎన్.పి.హరిష్, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు ఏపీ ప్రతినిధి పాల్గొన్నారు. -
ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు అర్హుల జాబితా విడుదల
సాక్షి, అమరావతి/నూజివీడు/వేంపల్లె: ట్రిపుల్ ఐటీల్లో అత్యున్నత ప్రమాణాలతో సాంకేతిక విద్యను అందిస్తున్నామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలో నూజివీడు, ఆర్కే వ్యాలీ(ఇడుపులపాయ), ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్లలో ఉన్న 4,400 సీట్లకు ఈ ఏడాది 38,355 మంది దరఖాస్తు చేశారన్నారు. వీరిలో ప్రభుత్వ పాఠశాలల నుంచి 23,628(83శాతం) మంది, ప్రైవేటు పాఠశాలల నుంచి 14,727(17 శాతం) మంది విద్యార్థులు ఉన్నారని చెప్పారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా కౌన్సెలింగ్కు ఎంపిక చేశామన్నారు. 2023–24 విద్యా సంవత్సరానికి ఆర్జీయూకేటీలో కౌన్సెలింగ్కు అర్హత సాధించినవారి జాబితాను గురువారం మంత్రి బొత్స విజయవాడలో విడుదల చేశారు. కౌన్సెలింగ్కు ఎంపికైన టాప్–20లో ప్రభుత్వ విద్యార్థులే ఉన్నారని వెల్లడించారు. పదో తరగతిలో 600కి 599 మార్కులు వచ్చిన విద్యార్థి సైతం ట్రిపుల్ ఐటీలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడం గర్వకారణమన్నారు. కౌన్సెలింగ్కు ఎంపికైన జనరల్ విద్యార్థుల కటాఫ్ మార్కులు 583గా ఉన్నట్టు చెప్పారు. ట్రిపుల్ ఐటీల్లో ఇప్పటికే పీజీ కోర్సులను అందుబాటులోకి తెచ్చామని గుర్తుచేశారు. వచ్చే ఏడాది నుంచి పీహెచ్డీ కోర్సులనూ ప్రవేశ పెడుతున్నామని వెల్లడించారు. కాగా, ఈ నెల 20, 21 తేదీల్లో నూజివీడు క్యాంపస్లో, 21, 22 తేదీల్లో ఆర్కే వ్యాలీ (ఇడుపులపాయ)లో, ఒంగోలు క్యాంపస్కు సంబంధించి 24, 25 తేదీల్లో ఆర్కే వ్యాలీలో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. శ్రీకాకుళం క్యాంపస్లో 24, 25 తేదీల్లో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. మొత్తం అర్హుల్లో 3,345 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, 695 మంది ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులున్నారని చెప్పారు. ఆగస్టు మొదటి వారంలో తరగతులు ప్రారంభమవుతాయన్నారు. కార్య క్రమంలో చాన్సలర్ ప్రొఫెసర్ కేసీ రెడ్డి, వైస్ చాన్స లర్ ప్రొఫెసర్ ఎం.విజయ్కుమార్ పాల్గొన్నారు. -
దేశాభివృద్ధిలో సాంకేతిక విద్య కీలకం
సాక్షి, అమరావతి: దేశాభివృద్ధిలో సాంకేతిక విద్య కీలక భూమిక పోషిస్తోందని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) చైర్మన్ టీజీ సీతారామ్ అన్నారు. ఈ క్రమంలోనే సాంకేతికతతో కూడిన పరిపాలన అందించడం ద్వారా ప్రజల జీవన శైలిలో సమూల మార్పులు తీసుకురావచ్చన్నారు. ప్రైవేటు ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పాలిటెక్నిక్ కళాశాలల యాజమాన్యాల సంఘం(అపెక్మా) సమావేశం శుక్రవారం విజయవాడలో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీతారామ్ మాట్లాడుతూ.. 2047 నాటికి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తవుతోందన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వచ్చే 25 ఏళ్లను అమృత కాలంగా పరిగణించి కీలక సంస్కరణల దిశగా ప్రణాళిక రూపొందించిందన్నారు. 50 కోట్లకు పైగా యువ శక్తితో భారత్ ప్రపంచంలో బలమైన దేశంగా ఉందన్నారు. కళాశాలల యాజమాన్యాలు సాంకేతిక విద్యలో విద్యార్థులకు లెర్నింగ్ ఔట్కమ్స్ను మెరుగుపర్చాలని కోరారు. ఇందుకు నైపుణ్యాభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా సమీకృత, మల్టీడిసిప్లినరీ కోర్సులను కచ్చితంగా ప్రవేశపెట్టాలని సూచించారు. ఇప్పటికే ఏఐసీటీఈ గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం మాతృభాషలోనూ సాంకేతిక విద్యను అందిస్తోందని గుర్తు చేశారు. కళాశాలల్లో ఇన్టేక్, అక్రెడిటేషన్ల జారీల విషయంలో రాధాకృష్ణన్ కమిటీ సమగ్ర అధ్యయనం చేస్తోందన్నారు. కళాశాలలకు అనుమతుల ప్రక్రియను సైతం సులభతరం చేస్తున్నామని తెలిపారు. ఏటా నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్)లో ప్రతి కళాశాల భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఏపీలో యువతకు మెండుగా ఉపాధి అవకాశాలు.. సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ గతిశక్తి కార్యక్రమంలో కీలకంగా మారనుందని సీతారామ్ తెలిపారు. ఇక్కడ లాజిస్టిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రొడక్షన్ తదితర రంగాల్లో యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో అత్యధికంగా ఏపీ విద్యార్థులే ఉండటం తెలుగు వారి విద్యా ప్రతిభకు నిదర్శనమన్నారు. కంప్యూటర్ సైన్స్ ఒక్కటే సాంకేతిక విద్య కాదని తెలిపారు. అనేక కోర్ బ్రాంచ్లు, ఇతర రంగాల్లోని అవకాశాల గురించి విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. త్వరలో 1,500కు పైగా కంపెనీలతో కలిసి ప్లేస్మెంట్ పోర్టల్ను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు సైతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.. గత మూడేళ్లలో ఉన్నత విద్యలో ఏపీ ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని గుర్తు చేశారు. విద్యార్థులకు ప్రపంచ స్థాయి కంపెనీల్లో సర్టిఫికేషన్లు అందించడం ద్వారా నైపుణ్య సామర్థ్యాలను పెంపొందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సాంకేతిక విద్య డైరెక్టర్ నాగరాణి, అపెక్మా చైర్మన్ చొప్పా గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డిగ్రీ చేస్తే జాక్పాట్.. ఐటీ కంపెనీల క్యూ...
సాక్షి, హైదరాబాద్: డిగ్రీనా... అనే చులకన భావం ఇక నుంచి ఉండదంతే. దేశవ్యాప్తంగా డిగ్రీ కోర్సులకు భవిష్యత్లో డిమాండ్ పెరగబోతోంది. ఇంతకాలం కొనసాగిన సంప్రదాయ కోర్సుల్లో అనేక మార్పులు తెస్తున్నారు. సాంకేతిక విద్యకు తీసిపోని రీతిలో సాన పడుతున్నారు. దేశ, విదేశాల్లో ఉపాధి అవకాశాలుండేలా తీర్చి దిద్దుతున్నారు. అనేక కొత్త కోర్సుల మేళవింపు, కంప్యూటర్ అప్లికేషన్ల గుభాళింపు డిగ్రీ కోర్సుల తీరు తెన్నులనే మార్చబోతోంది. హానర్స్ కోర్సులకు ప్రాధాన్యం తెలంగాణ సహా దేశంలో అన్ని రాష్ట్రాలూ మూడేళ్ళ డిగ్రీ కోర్సుల స్థానంలో నాలుగేళ్ళ హానర్స్ కోర్సులకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) రూపొందించింది. ఈ ఏడాది నుంచే తెలంగాణలో నాలుగేళ్ళ బీఎస్సీ (హానర్స్) కంప్యూటర్స్ను 50కి పైగా కాలేజీల్లో అందుబాటులోకి తెస్తున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి అతి ముఖ్యమైన అంశాలు హానర్స్లో చోటు చేసుకోబోతున్నాయి. నూతన జాతీయ విద్యావిధానం–2020కి అనుగుణంగా ఎగ్జిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. నాలుగేళ్ళు చదివితే హానర్స్ డిగ్రీ ఇస్తారు. మూడేళ్ళకే మానుకుంటే సాధారణ డిగ్రీ సర్టిఫికెట్ ఇస్తారు. దీంతో పాటు ఏ తరహా డిగ్రీ చేసినా, ఇష్టమైన ఓ సబ్జెక్టును చేసే సరికొత్త విధానం అందుబాటులోకి తెచ్చారు. అంటే బీఏ కోర్సు చేస్తున్న విద్యార్థి కూడా కంప్యూటర్ కోర్సుకు సంబంధించిన ఓ సబ్జెక్టు చేసే వీలుంది. వాణిజ్య విప్లవంలో డిగ్రీకి ప్రాధాన్యత గత దశాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా ఈ–కామర్స్ రాజ్యమేలుతోంది. దీంతో కామర్స్ డిగ్రీ నేపథ్యం ఉన్న వారికి మంచి డిమాండ్ వచ్చింది. కంప్యూటర్స్ పరిజ్ఞానంతో కూడిన అనలిస్టులు, అకౌంటెంట్లకు మంచి వేతనాలతో కూడిన ఉపాధి లభిస్తోంది. ఈ కారణంగా డిగ్రీ కోర్సుల్లో కామర్స్ను ఎంచుకునే వారి సంఖ్య 36 శాతం నుంచి 41 శాతానికి పెరిగింది. బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ)లో చేరికలు కూడా ఆరేళ్ళల్లోనే ఏడు రెట్లు పెరిగాయి. బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ)లో ప్రవేశాలు 9 రెట్లు పెరిగాయి. దీంతో బీకాం కోర్సులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. బీకాం జనరల్తో పాటు, కంప్యూటర్స్, టాక్సేషన్, హానర్స్, బిజినెస్ అనలిటిక్స్ వంటి కొత్త స్పెషలైజేషన్ను తీసుకొచ్చారు. బీమా, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెరగడం, జీఎస్టీ తీసుకురావడంతో టాక్స్ నిపుణుల అవసరం రెట్టింపయింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఈ–కామర్స్, రిటైల్ సంస్థల పెరుగుదల కూడా కలిసివచ్చింది. పెరుగుతున్న క్యాంపస్ రిక్రూట్మెంట్స్ కేవలం ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్ళే ఐటీ కంపెనీలు ఇప్పుడు నాణ్యమైన విద్యను అందించే డిగ్రీ కాలేజీల్లోనూ నియామకాలు చేపడుతున్నాయి. నాన్–ఇంజనీరింగ్గా పిలిచే డిగ్రీ విద్యార్థులను గత రెండేళ్ళుగా పెద్ద ఎత్తున తమ కంపెనీల్లో చేర్చుకుంటున్నాయి. రాష్ట్రంలో 110 వరకూ ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీలున్నాయి. ఇందులో హైదరాబాద్లోనే దాదాపు 300 కాలేజీలున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం దాదాపు వంద కాలేజీల్లో క్యాంపస్ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు. ఫార్మా, బ్యాంకింగ్, రిటైల్, మార్కెటింగ్ కంపెనీలతో పాటు టీసీఎస్, కాగ్నిజెంట్, విప్రో, సీజీఎల్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు క్యాంపస్ రిక్రూట్మెంట్ కోసం వస్తున్నాయి. ప్రతీ ఏటా ఈ కంపెనీలు 10 నుంచి 20 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. రూ. 3 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకూ వార్షిక వేతనం ఇస్తున్నాయి. -
పేద పిల్లలకు ట్యాబ్లిస్తే భరించలేరా? ‘ఈనాడుకు ఎందుకీ కడుపుమంటా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న పేద విద్యార్థులకు అందిస్తున్న ట్యాబ్లపై ‘ఈనాడు’, తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారంపై పాఠశాల విద్యాశాఖ తీవ్రంగా మండిపడింది. పేద పిల్లలకు కార్పొరేట్ పాఠశాలలతో సమానంగా సాంకేతిక విద్యను ట్యాబ్ల ద్వారా అందిస్తుంటే భరించలేక అవి అడ్డుకుంటున్నాయని ఆక్షేపించింది. వాళ్లు సాంకేతిక విద్య ద్వారా రాణిస్తే మీకు కడుపుమంటా అని ప్రశ్నించింది. వాస్తవాలను కప్పిపుచ్చి అసత్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేలా కథనాలు రాయడం, ఆరోపణలు చేయడాన్ని ఖండించింది. పనికిమాలిన తప్పుడు అంశాలతో దుష్ప్రచారం చేస్తున్నారంటూ వాస్తవాలు ఏమిటో ప్రజల ముందుంచింది. విద్యార్థులకు పంపిణీ చేసిన ట్యాబ్లకు సంబంధించి ‘8.7 అంగుళాల తెరపై వివాదాలు’ అంటూ ‘ఈనాడు’లో వచ్చిన కథనం, ‘సీఎం జగన్కు రూ.221 కోట్ల కానుక’ అంటూ తెలుగుదేశం చేసిన ఆరోపణలను కొట్టిపారేసింది. అంతేకాక.. టెండర్ల ప్రక్రియలో ఎవరైనా పాల్గొనే అవకాశమున్నప్పటికీ మీరెందుకు పాల్గొనలేదని విద్యాశాఖ వాటిని సూటిగా ప్రశ్నించింది. నిజానికి.. ప్రభుత్వం ఇస్తున్న ట్యాబ్లకు మూడేళ్ల వారంటీతోపాటు పలు ఫీచర్లు ఉన్నాయని తెలిపింది. అలాగే, టెండర్లలో శాంసంగ్ పాల్గొని ఎల్–1గా నిలిచింది కాబట్టి టెండర్ను ఆ సంస్థకు అప్పగించామని స్పష్టంచేసింది. ఇక వచ్చే ఏడాది కూడా ఐదు లక్షలకు పైగా ట్యాబ్లు అవసరమవుతాయని.. ఇవే స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఉన్న ట్యాబ్లను మూడేళ్ల వారంటీతో రూ.12వేలకు ఈనాడు, తెలుగుదేశం పార్టీలు ఇస్తే కాంట్రాక్టును వారికే ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున విద్యాశాఖ సవాల్ చేసింది. రివర్స్ టెండరింగ్తో రూ.187 కోట్లు ఆదా ఇక ట్యాబ్లకు నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో నాలుగు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పాల్గొన్నాయి. రివర్స్ టెండరింగ్తో ప్రభుత్వం రూ.187 కోట్లు ఆదా చేసింది. నిజానికి.. ప్రభుత్వం కొనుగోలు చేసిన ట్యాబ్లలోని స్పెసిఫికేషన్లు, అదనపు సదుపాయాలు అమెజాన్ లాంటి సంస్థలు అందించే ట్యాబ్లలో లేవు. రూ.12,843 ధరతో ప్రభుత్వం కొనుగోలు చేసిన ఈ ట్యాబ్లలోని స్పెసిఫికేషన్లు, అదనపు సదుపాయాలతో అమెజాన్ లాంటి సంస్థలు ఇచ్చే ట్యాబ్ ధర రూ.3,603 ఎక్కువగా (22 శాతం) ఉంది. అలాగే, ప్రభుత్వం కొనుగోలు చేసిన ధరలోనే మండల పాయింట్ల వరకు వాటిని చేర్చేందుకు అయ్యే ఖర్చు కూడా కలిపి ఉంది. ఆరోపణ–1: 8వ తరగతి విద్యార్థులకు అందించిన పీసీ ట్యాబ్ ఖరీదు రూ.11,999. ఆన్లైన్లో ఇదే పరికరాన్ని బల్క్గా కొనుగోలుచేస్తే రూ.9వేలే. ఈ లెక్కన ట్యాబ్ల పంపిణీలో రూ.221 కోట్లు స్వాహా చేశారు. వాస్తవం ఇదీ: ఈ ఆరోపణ నిజం కాదు. ఆన్లైన్ పోర్టళ్లు కూడా బల్క్లో నేరుగా ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్ (ఓఈఎం) నుంచి కొనుగోలుచేసి తక్కువ మార్జిన్కు అమ్ముతుంటాయి. అందువల్ల ఆన్లైన్ ధరలు తక్కువగా ఉంటాయనడం నిజంకాదు. అంతేకాక.. రాష్ట్ర ప్రభుత్వం ఈ పీసీ ట్యాబ్లను అదనపు ఫీచర్లు ఇతర ఐటెమ్లతో కలిపి కొనుగోలు చేసింది. ఇవేవీ ఆన్లైన్ కొనుగోళ్లలో కవర్ కావు. ఆయా వస్తువులు మార్కెట్ ధరకన్నా ఎంతో తక్కువకు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఆ వివరాలు.. ఆరోపణ–2: ట్యాబ్ డిస్ప్లే సైజు శ్యామ్సంగ్ కంపెనీకి తగ్గట్లుగా 8.7 అంగుళాల సైజును టెండర్లలో పెట్టారు. 8 అంగుళాలు ఆపైన డిస్ప్లే సైజు ఉండాలనేలా నిబంధనను మార్పు చేయాలని ఇతర కంపెనీలు కోరినా పట్టించుకోలేదు. వారిని పోటీ నుంచి తప్పించేందుకే ఇలా చేశారు. వాస్తవం ఇదీ: ఈ ఆరోపణ కూడా నిజం కాదు. టెండర్ డాక్యుమెంటు పత్రాల్లో స్పెసిఫికేషన్లలో డిస్ప్లే సైజు 8.7 అంగుళాలు లేదా ఆపై, 1,280 800 రిజల్యూషన్లో, టచ్స్క్రీన్ ఉండాలని పేర్కొన్నారు. ఏ ట్యాబ్ అయినా 8.7 అంగుళాల స్క్రీన్సైజు లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నవి ఆమోదయోగ్యమని స్పష్టంగా ఉంది. ఒరిజినల్ ఎక్విప్మెంటు మాన్యుఫాక్చరర్ల నుంచి 10 అంగుళాల పీసీ ట్యాబ్కు కూడా బిడ్లు స్వీకరించారు. బిడ్ల ఇవాల్యుయేషన్లో టెండర్ కండిషన్లను అనుసరించి ఉన్న వాటిని ఆమోదించారు.. అని పాఠశాల విద్యాశాఖ స్పష్టంచేసింది. -
Natural Skills: సహజ నైపుణ్యాన్ని ఉపయోగించుకోవాలి
ఈ మధ్యన ఒకటి–రెండు సందర్భాలలో మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న ఒకరిద్దరు చురుకైన విద్యార్థులను కలవడం సంభవించింది. వాళ్లతో మాటా–మాటా కలిపి, వారి–వారి ప్రొఫెషనల్ విద్యాభ్యాసంలో భాగంగా ఏం నేర్చుకుంటున్నారూ, అధ్యాపకులు ఏం నేర్పిస్తున్నారనీ ప్రశ్నిస్తే, వారిదగ్గర నుండి ఆశించిన సమాధానం రాలేదు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి అయిన తరువాత ఏరకమైన మెషిన్లమీద పనిచేస్తావని ప్రశ్నిస్తే తెలియదని అమాయకంగా వచ్చింది జవాబు. కంప్యూటర్ ఇంజనీరింగ్ తరువాత సరాసరి ఏదైనా ప్రోగ్రామింగ్ చేయగలరా అంటే దానికీ జవాబు లేదు. సివిల్ ఇంజనీరింగ్ తరువాత ఎలాంటి ప్రాజెక్టులలో పనిచేయాలని అనుకుంటున్నావని అడిగితే అసలే అర్థం కాలేదు. అందరూ విద్యార్థులూ ఇలాగేనా అంటే కావచ్చు, కాకపోవచ్చు. స్వతహాగా తెలివైన కొందరి విషయంలో మినహాయింపు ఉండవచ్చు. ఇంజనీరింగ్ లాంటి ప్రొఫెషనల్ కోర్సులన్నీ ఇటీవల కాలంలో ‘నాలెడ్జ్ బేస్డ్’ (అంతంత మాత్రమే) తప్ప ‘స్కిల్ బేస్డ్’ కాకపోవడమే బహుశా దీనికి కారణం కావచ్చు. ఇదిలా ఉంటే ఎలాంటి ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకుండా రకరకాల వృత్తి నిపుణులు మన దేశంలో, రాష్ట్రంలో కోకొల్లలు. వారంతా స్వయంశక్తితో వారి వారి వృత్తుల్లో ఎలా ప్రావీణ్యం సంపాందించుకున్నారో అనేది కోటి రూకల ప్రశ్న. వారిలో గ్రామీణ వృత్తులు మొదలుకుని, పట్టణాలలో, నగరాలలో పనిచేస్తున్న వాహనాలు, ఎయిర్ కండీషన్లు వంటి వాటిని బాగుచేసే మెకానిక్కులు చాలామందే ఉన్నారు. వీరు రిపేర్లు చేయడానికి వచ్చేటప్పుడు తమ వెంట ఒక జూనియర్ కుర్రవాడిని తీసుకు వస్తారు. అతడు కొంతకాలానికి సీనియర్ అయిపోతాడు. అందుకే ఇటువంటివారు నేర్చుకున్న విద్య భావితరాలవారికి అందుబాటులోకి తీసుకువచ్చే విధానం ప్రవేశపెట్టాలి. వీరికి సంబంధిత విద్యార్హతలు లేకపోయినా ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకు ప్రాక్టికల్స్ చెప్పేటప్పుడు ఉపయోగించుకునే విధానం రూపొందిస్తే మంచిదేమో! యాభై, అరవై ఏళ్ల అనుభవంతో చేస్తున్న సూచన ఇది. చేతి గడియారం పనిచేయకపోతే, కంపెనీ షోరూమ్కు పోయి ఇస్తే బాగుచేసి ఇవ్వడానికి సమయం పట్టే అవకాశాలున్నాయి కాబట్టి, ఎప్పటిలాగే, ఆలవాటున్న ఒక రిపేర్ షాప్కు పోయాను ఇటీవల. ఆ చిన్న షాప్లో ఎప్పటిలాగే ఇద్దరు నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ కూర్చున్నారు. ఆ ఇద్దరిలో సీనియర్ వ్యక్తి (బహుశా) బ్యాటరీ కొత్తది వేయాలని చెప్పి రూ. 220 అవుతుందన్నాడు. నేను సరే అనగానే ఐదు నిమిషాలలో ఆ పని కానిచ్చి నా చేతిలో పెట్టాడు. గత ఏభై ఏళ్లుగా... తన తండ్రి కాలం నుంచి అక్కడే రిపేర్లు చేస్తున్నామనీ, గడియారాలు రిపేరు చేసే విద్య ఎప్పటినుంచో తనకు వచ్చనీ, ఎలా అబ్బిందో తెలియదనీ, ఎక్కడా నేర్చుకున్నది కాదనీ అన్నాడు. ఇటీవల మనం వాడుకునే వస్తువులు చెడిపోయినప్పుడు ఎక్కువగా కంపెనీల సర్వీసింగ్ మెకానిక్లను పిలవకుండా స్వంతంగా నేర్చుకున్న పనితనంతో తక్కువ ధరకు సర్వీసు చేసి పోతున్న లోకల్ టాలెంట్లనే వినియోగదారులు ఆశ్రయించడం వీరికి ఉన్న విశ్వసనీయతను తెలియ జేస్తోంది. ఇటువంటి నేచురల్ టాలెంట్ ఉన్న వారు అన్ని రంగాల్లోనూ ఉన్నారు. మా చిన్నతనంలో ఖమ్మం పట్టణంలో మేమున్న మామిళ్ళ గూడెం బజారులో (లంబాడి) రాము అని ఆర్టీసీలో మెకానిక్గా పని చేస్తున్న వ్యక్తి ఉండేవాడు. అతడు ఏ మెకానికల్ ఇంజనీరింగ్ చదువు కోలేదు. కాని అద్భుతమైన రీతిలో మెకానిజం తెలిసిన వ్యక్తి. ఆ రోజుల్లో ఖమ్మంలో కార్లు, జీపులు బహుశా చాలా తక్కువ. వాటికి కానీ, లారీలకు కానీ ఏ విధమైన రిపేర్ కావాలన్నా రామునే దిక్కు. రాముకు సహజ సిద్ధంగా అబ్బిన విద్య అది. అప్పట్లో హైదరాబాద్లో మా బంధువు లబ్బాయి ఒకడిది అద్భుతమైన మెకానికల్ బ్రెయిన్. ఇంకా కంప్యూటర్లు ప్రాముఖ్యం చెందని రోజుల్లో సాఫ్ట్వేర్, హార్డ్వేర్లలో నైపుణ్యం సంపాదించాడు. ఎట్లా నేర్చుకున్నాడో, ఎవరికీ తెలియదు. ఇంటర్మీడియేట్ చదవడానికి ప్రయత్నం చేశాడు. కుదరలేదు. స్నేహితుల సహాయంతో అమెరికా చేరుకున్నాడు. చిన్నగా హార్డ్వేర్ మెకానిజంలో పేరు తెచ్చుకున్నాడు. ఎన్నో కంపెనీలు అప్పట్లో అతడి మీద ఆధారపడేవి. అంచెలంచెలుగా ఎదిగి ఫార్మల్ డిగ్రీలు లేకపోయినా నైపుణ్యం ప్రాతిపదికగా అక్కడ స్థిరపడిపోయాడు. అతడా విద్య ఎలా నేర్చుకున్నాడు? చాలా కాలం క్రితం ఆంధ్రాబ్యాంక్లో కొఠారి చలపతి రావు అనే ఆయన పనిచేసేవారు. అక్కడ చేరడానికి ముందర కొన్ని చిన్నచిన్న ఉద్యోగాలు కూడా చేశాడు. ఇంకా అప్పటికి కంప్యూటర్లు పూర్తి స్థాయిలో వాడకంలోకి రాలేదు. కేవలం మామూలు గ్రాడ్యుయేట్ మాత్రమే అయిన కొఠారి చలపతిరావు స్వయంగా నేర్చుకుని ఆంధ్రా బ్యాంక్ కంప్యూటర్ సిస్టం ఏర్పాటు చేశాడు. ఆయన్ని అంతా కంప్యూటర్ భీష్మ పితామహుడు అని పిల్చేవారు. ఆయన ఆ విద్య ఎలా నేర్చుకున్నాడు? వీరిలాంటి అనేకమంది సహజ నైపుణ్యం ఉన్నవారిని ప్రొఫెషనల్ కోర్సుల కాలేజీలలో క్వాలిఫికేషన్ లేకపోయినా అయినా ఉపయోగించుకోవాలి. అప్పుడే సాంకేతిక విద్య అభ్యసించే విద్యార్థులకు మంచి నైపుణ్యం అందుబాటులోకి వస్తుంది. (క్లిక్ చేయండి: గట్టివాళ్లే చట్టానికి గౌరవం) - వనం జ్వాలా నరసింహారావు చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, తెలంగాణ ప్రభుత్వం -
సాంకేతిక విద్యలోనూ మిర్రర్ ఇమేజీ పుస్తకాలు
అనంతపురం విద్య: సాంకేతిక విద్యలోనూ మిర్రర్ ఇమేజీ పుస్తకాలను అందుబాటులోకి తెస్తున్నారు. ఒకే పుస్తకంలో ఒక పేజీలో ఇంగ్లిష్, మరొక పేజీలో తెలుగు కంటెంట్ ఉంటుంది. ఇవి తెలుగు మీడియం విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉండనున్నాయి. నూతన జాతీయ విద్యావిధానం ప్రకారం సాంకేతిక విద్యా కోర్సులైన ఇంజినీరింగ్, డిప్లొమా పాఠ్య పుస్తకాలను ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకురావాలి. ఈ మేరకు ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) నిర్దేశించింది. ఇంజినీరింగ్, డిప్లొమా పుస్తకాలను తెలుగు భాషలోకి అనువదించే బాధ్యతను జేఎన్టీయూ(అనంతపురం)కు అప్పగించింది. దీంతో ఇప్పటికే మొదటి సంవత్సరం డిప్లొమా పుస్తకాలు 11, బీటెక్లో తొమ్మిది పుస్తకాలు ఇంగ్లిష్ నుంచి తెలుగులోకి తర్జుమా చేశారు. తెలుగు మీడియం విద్యార్థులకు ఇబ్బంది లేకుండా.. తెలుగు మీడియం నుంచి ఇంగ్లిష్ మీడియంలోకి వెళ్లే విద్యార్థులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 1 నుంచి 10వ తరగతి వరకు మిర్రర్ ఇమేజీ పుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది. ఇదే తరహాలోనే బీటెక్, డిప్లొమాలోనూ మిర్రర్ ఇమేజీ పుస్తకాలకు రూపకల్పన చేశారు. దీనివల్ల తెలుగు మీడియం విద్యార్థులు విషయాన్ని త్వరగా అవగాహన చేసుకునే అవకాశం ఉంటుంది. ఆత్మన్యూనతా భావం తగ్గించేలా.. తెలుగు మీడియం నుంచి ఇంగ్లిష్ మీడియంలోకి అడుగుపెట్టే విద్యార్థుల్లో ఆత్మన్యూనతా భావం ఎక్కువగా ఉంటోంది. విషయ పరిజ్ఞానంలో ఇంగ్లిష్ మీడియం వారితో పోటీపడలేమని చాలామంది అనుకుంటుంటారు. అలాంటి వారిలో ధైర్యాన్ని నింపేలా మిర్రర్ ఇమేజీ పుస్తకాలు రూపొందించాం. 2022–23 విద్యా సంవత్సరం నుంచి బీటెక్, డిప్లొమా రెండో సంవత్సరం విద్యార్థులకు సైతం తెలుగు భాషలో కంటెంట్ అందుబాటులోకి తెస్తాం. – డాక్టర్ కె.శేషమహేశ్వరమ్మ, ఏఐసీటీఈ టెక్నికల్ బుక్స్ రైటింగ్ కోఆర్డినేటర్ (రీజినల్ లాంగ్వేజెస్) (చదవండి: పల్లె జనం.. పట్టణ జపం) -
ఎంటెక్ చేశావా.. టీచింగ్ చేస్తావా?
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక విద్యలో మాస్టర్ డిగ్రీ (ఎంటెక్) పూర్తి చేసిన అభ్యర్థులకు మంచి అవకాశాలు రాబోతున్నాయి. ముఖ్యంగా బీటెక్ కంప్యూటర్ సైన్స్ సహా దాని అనుబంధ కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారికి ఉజ్వల భవిష్యత్ ఉండబోతోంది. రాష్ట్రంలో కొత్త వర్సిటీలు, సాంకేతిక కోర్సుల్లో సీట్లు పెరుగుతుండటం.. మరోవైపు కొన్నేళ్లుగా ఎంటెక్లో ప్రవేశాలు తగ్గుతుండటంతో ఇప్పటికే ఎంటెక్ చేసిన వారికి బోధన రంగంలో మున్ముందు డిమాండ్ పెరగనుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రంగంలో మరో రెండేళ్లలో వేతనాలు రెట్టింపయ్యే అవకాశముందని అంటున్నారు. కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న కొరత రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ సీట్లు గత మూడేళ్లుగా పెరుగుతున్నాయి. అదనపు సెక్షన్లు వస్తున్నాయి. దీనికి తోడు కొత్తగా ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు ప్రభుత్వం ఇటీవల అనుమతిచ్చింది. ఇవి కూడా ఎక్కువగా మార్కెట్లో డిమాండ్ ఉండే కోర్సులకే ప్రాధాన్యమిస్తున్నాయి. ఇవన్నీ ఎంటెక్ అభ్యర్థులకు కలిసి వస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే కంప్యూటర్ సైన్స్ సీట్లు పెరిగినా అధ్యాపకుల కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రభుత్వ వర్సిటీల్లోనే దాదాపు 3 వేలకుపైగా ఖాళీలున్నట్టు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. చాలా కాలేజీలు ఇతర రాష్ట్రాల నుంచి ఫ్యాకల్టీని ఆహ్వానిస్తున్నా వేతనాలు ఎక్కువగా ఇవ్వాల్సి వస్తోందని భావిస్తున్నాయి. స్థానికంగా ఎంటెక్ పూర్తి చేసిన విద్యార్థులకు రూ. 50 వేల లోపే వేతనాలు ఇవ్వడానికి ప్రైవేటు కాలేజీలు సిద్ధపడుతున్నాయి. ఇతర రాష్ట్రాల వాళ్లు రూ. లక్షకు పైగా డిమాండ్ చేస్తున్నారు. రెండేళ్లలో భారీగా అవసరం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీసీ) మార్గదర్శకాల ప్రకారం బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఇతర కంప్యూటర్ కోర్సులు బోధించేందుకు ప్రతి 20 మంది విద్యార్థులకు ఓ అధ్యాపకుడు ఉండాలి. రాష్ట్రంలో కన్వీనర్ కోటా కిందే దాదాపు 80 వేలకు పైగా బీటెక్ సీట్లున్నాయి. ఇందులో 75 శాతం కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐవోటీ, మెషీన్ లెర్నింగ్, రోబోటిక్స్ వంటి కోర్సులున్నాయి. మిగతా కోర్సుల్లో (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) సీట్లు చాలా వరకు మిగులుతున్నాయి. కంప్యూటర్ సైన్స్ కోర్సులకు బోధించడానికి 3 వేల మంది సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్లు అవసరం. ప్రస్తుతం 2 వేల మందే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో 60 మందితో సెక్షన్లు నిర్వహిస్తున్నారు. 2024–25 నాటికి పెరిగే సీట్లను బట్టి కనీసం 10 వేల మంది కంప్యూటర్ సైన్స్, కొత్త కోర్సులు బోధించే వాళ్లు కావాలి. కొత్త వర్సిటీలు వస్తే ఈ సంఖ్య మరింత పెరగనుంది. కొరత ఎందుకు? సాధారణంగా విద్యార్థులు బీటెక్ కంప్యూటర్ సైన్స్, కొత్త కోర్సులు పూర్తి చేసిన తర్వాత ఉపాధి వైపే వెళ్తున్నారు. క్యాంపస్ రిక్రూట్మెంట్లో కొంతమంది ఎంపికవుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ప్రారంభంలోనే రూ. 40 వేల నెలసరి వేతనం పొందే వీలుంది. దీంతో ఎంటెక్ చేయాలని విద్యార్థులు ఆలోచించట్లేదు. మరికొంత మంది విదేశాల్లో ఎంఎస్ కోసం వెళ్తున్నారు. ఫలితంగా ఏటా ఎంసెట్లో సీట్లు భారీగా మిగులుతున్నాయి. ప్రైవేటు కాలేజీల్లో ఫ్యాకల్టీ ఎలా ఉందో.. గుర్తింపునిచ్చే వర్సిటీలూ పట్టించుకోవట్లేదు. నాణ్యమైన అధ్యాపకులు లేరని గుర్తించినా విధిలేక అఫిలియేషన్ ఇస్తున్నారు. దీంతో ప్రైవేటు కాలేజీలు అధ్యాపకులకు వేతనాలు అరకొరగా ఇస్తున్నాయనే ఆరోపణలున్నాయి. సాఫ్ట్వేర్తో సమానంగా వేతనం ఉంటే తప్ప బోధన వైపు మళ్లే అవకాశం కనిపించట్లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మున్ముందు కొరతను ఎలా అడ్డుకుంటారనేది ప్రశ్నార్థకమే. జీతాలు పెంచితే కొంత మార్పు రావొచ్చు ఓవైపు కంప్యూటర్ కోర్సులు పెరుగుతున్నాయి. మరోవైపు సంబంధిత విభాగాల్లో ఎంటెక్ చేసేవారి సంఖ్య తక్కువగా ఉంది. ఈ తేడాను పూడ్చాలి. బీటెక్తోనే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తున్నాయి. ఎంఎస్కు విదేశాలకు వెళ్తున్నారు. బోధించేందుకు వారు ఎందుకు ఇష్టపడట్లేదో తెలుసుకోవాలి. ఆకర్షణీయమైన వేతనాలు ఇస్తే కొంత మార్పు రావొచ్చు. – ప్రొఫెసర్ వి వెంకటరమణ (ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్) -
జర్మనీతో జట్టు కట్టేలా..!
సాక్షి, అమరావతి: సాంకేతిక విద్యారంగంలో యూరప్ దేశాల్లో.. మరీముఖ్యంగా జర్మనీలోని అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఉన్నత విద్యామండలి ద్వారా ఏర్పాట్లు చేయిస్తోంది. ఇప్పటికే జర్మన్ యూనివర్సిటీతో ఉన్నత విద్యామండలి రెండు విడతల రౌండ్టేబుల్ సమావేశాలను పూర్తి చేయించింది. ‘ఇండో–యూరో సింక్రనైజేషన్’లో భాగంగా జర్మన్ వర్సిటీ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్, ఏపీ ఉన్నత విద్యామండలి సంయుక్త ఆధ్వర్యంలో ‘జర్మన్–ఏపీ ఫోరమ్ ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్’ పేరుతో వర్చువల్గా సమావేశాలు నిర్వహించిన ఉన్నత విద్యామండలి అధికారులు జర్మనీ ప్రతినిధులతో వివిధ అంశాలపై వివిధ వర్సిటీల ఉప కులపతులు, నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ అధికారులు చర్చలు జరిపించింది. తద్వారా జర్మనీలో విద్య, ఉద్యోగ అవకాశాలను మన రాష్ట్ర విద్యార్థులు దక్కించుకునేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఉద్యోగాలు దక్కించుకునేలా.. ‘ప్రీ–మాస్టర్ ఇండియా’ పేరుతో మన దేశంలో జర్మనీ ప్రారంభించనున్న కార్యక్రమం ద్వారా రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఆ దేశంలోని అవకాశాలను దక్కించుకోవడానికి వీలుపడుతుంది. ఇక్కడి విద్యార్థులు బీటెక్ ప్రోగ్రామ్లను పూర్తిచేశాక జర్మనీలో మాస్టర్ డిగ్రీని అభ్యసించడంతోపాటు నేరుగా అక్కడి కంపెనీల్లో పని చేసేందుకు వీలు కల్పిస్తారు. దీనిని ఆరు దశల్లో నిర్వహిస్తారు. జర్మనీ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు దక్కించుకోవాలంటే మన విద్యార్థులకు మంచి నైపుణ్యాలు, జర్మన్ సంస్కృతి, భాషపై కూడా అవగాహన అవసరం. ఆసక్తి గల విద్యార్థులకు ఆరు దశల కార్యక్రమంలో వీటిని నేర్పిస్తారు. ఇటువంటి అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం డ్యూయెల్ డిగ్రీ కార్యక్రమాలు నిర్వహించనుంది. కాగా, ఉన్నత విద్యామండలి అనుమతితో క్రెడిట్ ఆధారిత కోర్సుల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ (ఏపీఐటీఏ) చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా విద్యార్థులకు మల్టీ స్కిల్లింగ్ మెథడాలజీలో వివిధ నైపుణ్యాలను అలవర్చనున్నారు. కోర్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ ద్వారా విద్యార్థులు అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకొనేలా తీర్చిదిద్దనున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని వివిధ వర్సిటీల్లో ఆన్లైన్ కోర్సులను జర్మనీ వర్సిటీ అమలు చేయనుంది. అంతర్జాతీయంగా ఉద్యోగాల వెల్లువ ఆధునిక సాంకేతిక అంశాల్లో రానున్న కాలంలో 1.1 బిలియన్ ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే అవకాశమున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్న నేపథ్యంలో ఆయా అంశాల్లో విద్యార్థులను తీర్చిదిద్దేలా ప్రణాళికలను అమలు చేయనున్నారు. కాలేజీల్లో పాఠ్యాంశాల్లోని నైపుణ్యాలను క్షేత్రస్థాయిలో వాస్తవికంగా విద్యార్థులు అలవర్చుకునేలా ప్రభుత్వం జిల్లాల వారీగా 47 వేలకు పైగా సూక్ష్మ, మధ్య, భారీ పరిశ్రమలు, వాణిజ్య సంస్థలతో కాలేజీలను అనుసంధానించే కార్యక్రమం చేపట్టింది. ఆయా సంస్థల్లో ఇంటర్న్షిప్ అమలు చేయిస్తోంది. ఉపాధి ఆధారిత శిక్షణ కార్యక్రమాలు చేపట్టింది. బ్లెండెడ్ స్కిల్లింగ్ కోర్సులకు శ్రీకారం చుట్టింది. 55వేల మందికి శిక్షణ మరోవైపు ఆధునిక సాంకేతిక అంశాల్లో విద్యార్థులకు క్షేత్రస్థాయి పారిశ్రామిక అనుసంధానం ద్వారా నైపుణ్య శిక్షణ ఇప్పించడానికి ఏపీఐటీఏ ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలకు చెందిన దాదాపు 55 వేల మంది విద్యార్థులు ఏపీఐటీఏలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరికి వివిధ పారిశ్రామిక, ఐటీ సంస్థల ద్వారా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను అమలు చేయనున్నారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు జర్మనీ ప్రతినిధుల రౌండ్టేబుల్ సమావేశాల్లో చర్చకు వచ్చిన ముఖ్యమైన అంశాల్లో అంతర్జాతీయంగా నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠ్యాంశాల్లో చేపట్టాల్సిన మార్పులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనలతో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇప్పటికే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు, ప్రణాళికలు ఉండేలా చర్యలు తీసుకుంది. అంతేకాకుండా సంక్లిష్ట సమస్యల పరిష్కారంలో విద్యార్థులకు వాస్తవిక ప్రయోగాలకు అనువుగా పరిశ్రమ ఆధారిత ప్రాజెక్టులకు రూపకల్పన చేయించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్, రోబోటిక్స్, ఆటోమేషన్ తదితర ఆధునిక సాంకేతిక అంశాల్లో విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపర్చేందుకు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీ ఎస్డీసీ) ద్వారా పెద్దఎత్తున శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయించింది. ఇవి నిరంతరం కొనసాగేలా ప్రతి డివిజన్లో స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలతోపాటు ప్రత్యేకంగా స్కిల్ యూనివర్సిటీని నెలకొల్పుతోంది. 2,400 మందికి స్కిల్ డెవలప్మెంటు కార్పొరేషన్ ఇప్పటికే శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేయించింది. విద్యార్థులకు ఫలితాల ఆధారిత అభ్యాసం (అవుట్కమ్ బేస్డ్ లెర్నింగ్) ద్వారా బీటెక్ రెండో ఏడాది నుంచే ప్రభుత్వం క్రెడిట్లతో కూడిన నైపుణ్య కోర్సులను కూడా ఏర్పాటు చేయించింది. ఇందులో భాగంగా ఇంజనీరింగ్తో పాటు ఇతర కోర్సుల్లోనూ ప్రభుత్వం ఇంటర్న్షిప్ను తప్పనిసరి చేయించింది. -
పాలిసెట్లో 37,978 సీట్లు భర్తీ
సాక్షి, అమరావతి: పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ పాలిసెట్–2021 తొలివిడత అడ్మిషన్లలో 37,978 మందికి సీట్లు కేటాయించినట్లు సెట్ కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ పోలా భాస్కర్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం పాలిసెట్ సీట్ల కేటాయింపు వివరాలను విడుదల చేశారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 18లోపు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు. అదే రోజు నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి 312 మంది అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించి.. మెరిట్ జాబితాను శాప్కు పంపాల్సి ఉందన్నారు. అందువల్ల వారికి సీట్లు కేటాయించలేదని తెలిపారు. 259 కాలేజీలు.. 69,810 సీట్లు పాలిసెట్లో 64,188 మంది అర్హత సాధించగా 42,910 మంది కౌన్సెలింగ్కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. వీరిలో 41,978 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. 41,036 మంది వెబ్ ఆప్షన్లను నమోదు చేశారు. రాష్ట్రంలో 259 కాలేజీలు ఉండగా వాటిలో 69,810 సీట్లు ఉన్నాయి. తొలి విడతలో 37,978 సీట్లు భర్తీ కాగా 31,832 సీట్లు మిగిలాయి. అత్యధికంగా ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయి. సీట్ల భర్తీ ఇలా.. -
వచ్చే పదేళ్లు ‘ఇండియాస్ టెకేడ్’: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: మారుతున్న పరిస్థితుల్లో ఏర్పడే కొత్త సవాళ్లను అధిగమించేలా ఉన్నత, సాంకేతిక విద్యలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. వచ్చే దశాబ్ద కాలంలో సాంకేతిక రంగంలో పరిశోధన, అభివృద్ధికే పెద్ద పీట వేయాలన్నారు. అందుకే రానున్న పదేళ్ల కాలాన్ని ‘ఇండియాస్ టెకేడ్’ అని పిలుచుకోవచ్చునని మోదీ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో పనిచేసే వందకుపైగా ఐఐటీల డైరెక్టర్లలతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ మాట్లాడారు. విద్యారంగంలో పెట్టే ప్రతీ పైసా సామాజిక పెట్టుబడి అని అన్న ప్రధాని స్తోమత, సమానత్వం, నాణ్యత, అనుసంధానం అన్నవే ఉన్నత విద్యను ముందుకు నడిపిస్తాయన్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, రక్షణ, సైబర్ టెక్నాలజీ రంగాల్లో భవిష్యత్లో ఎదురయ్యే సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేలా దృష్టి సారించాలని ప్రధాని పిలుపునిచ్చారు. కోవిడ్ విసిరిన సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ టెక్నాలజీ సంస్థలు చేసిన పరిశోధన, అభివృద్ధిని ప్రధాని కొనియాడారు. యువ టెక్కీలు అత్యంత వేగంగా సాంకేతికంగా పరిష్కార మార్గాలు సూచించడంతో ఈ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని చెప్పారు. కృత్రిమ మేధ, స్మార్ట్ వేరబుల్స్, డిజిటల్ అసిస్టెంట్లు సామాన్య మానవుడికి చేరాలా ఉన్నత విద్యలో సాంకేతికను ప్రవేశపెట్టాలన్నారు. కృత్రిమ మేధతో కూడిన విద్యపైనే ప్రధానంగా దృష్టి సారించాలని అన్నారు. సమావేశానంతరం ప్రధాని వాటి వివరాలను ట్వీట్ చేశారు. ముప్పు తొలగిపోలేదు: ప్రధాని మోదీ కరోనా ముప్పు తొలగిపోలేదని ప్రధాని అన్నారు. కరోనా నిబంధనలు పాటించకుండా ప్రజలు గుంపులుగా తిరుగుతుండడంపై ఆందోళన వెలిబుచ్చారు. వ్యాక్సినేషన్తో పాటు కరోనాపై పోరు సాగుతోందని, ఈ సమయంలో చిన్న పొరపాటుకు పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. మంత్రివర్గ సహచరులతో సమావేశం సందర్భంగా ప్రజలు గుంపులుగా ఉన్న ఫొటోలు, వీడియోలను ఆయన ప్రస్తావించారు. చాలామంది మాస్క్ల్లేకుండా, భౌతిక దూరం పాటించకుండా కనిపిస్తున్నారని ఆ సమావేశంలో వ్యాఖ్యానించారు. సమయానికి కార్యాలయాలకు రావాలని, ప్రజలకు సేవ చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని మంత్రులకు ప్రధాని ఉద్బోధించారు. గతంలో ఆయా శాఖలు నిర్వహించిన మంత్రులను కలుసుకుని వారి అనుభవాలను తెలుసుకోవాలన్నారు. పనే ముఖ్యమని, మీడియా దృష్టిని ఆకర్షించాలనే విషవలయంలో పడవద్దని, అనవసర ప్రకటనలు చేయవద్దని మంత్రులకు సూచించారు. -
ప్రభుత్వ డిగ్రీ సీట్లూ వెలవెల!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు డిగ్రీ కాలేజీలతోపాటు వివిధ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనూ ఈసారి భారీగా సీట్లు మిగిలిపోయాయి. ఈ విద్యా సంవత్సరంలో నిర్వహించిన ప్రవేశాల కౌన్సెలింగ్ తరువాత 114 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 24,178 సీట్లను విద్యార్థులెవరూ తీసుకోలేదు. అలాగే ప్రభుత్వ అటానమస్ కాలేజీల్లో 1,268 సీట్లు, ప్రముఖ ఎయిడెడ్, ఎయిడెడ్ అటానమస్ కాలేజీల్లోనూ 5,655 సీట్లు మిగిలిపోయాయి. మరోవైపు యూనివర్సిటీ, యూనివర్సిటీ అటానమస్ కాలేజీల్లోనూ 396 సీట్లు మిగిలిపోగా ప్రైవేటు, ప్రైవేటు అటానమస్ కాలేజీల్లో ఏకంగా 1,61,469 సీట్లు మిగిలిపోయాయి. ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కులు, విద్యార్థులు ఆన్లైన్లో ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) సీట్లను కేటాయించింది. అయితే అనేక మంది విద్యార్థులు తమకు వచ్చిన మార్కుల ప్రకారం ఆప్షన్లు ఇచ్చుకోకపోవడంతో వారికి సీట్లు లభించలేదు. పలు దశల్లో నిర్వహించిన కౌన్సెలింగ్లోనూ అదే జరిగింది. దీంతో ప్రైవేటు కాలేజీలే కాదు ప్రభుత్వ కాలేజీల్లోనూ సీట్లు మిగిలిపోయాయి. స్పందించని ప్రభుత్వం.. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో వేల సంఖ్యలో సీట్లు మిగిలిపోతున్నా కళాశాల విద్యా శాఖ స్పందించడం లేదు. ప్రైవేటు కాలేజీల్లో కౌన్సెలింగ్ తరువాత మిగిలిపోయే సీట్లలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించేందుకు అనుమతి ఇస్తున్న ప్రభుత్వం... ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో మిగిలిపోయే సీట్ల భర్తీకి అనుమతించడం లేదు. దీంతో పేద విద్యార్థులు తాము కోరుకున్న డిగ్రీ కాలేజీల్లో, కోర్సుల్లో సీట్లు లభించక ఇష్టం లేకపోయినా ఏదో ఒక డిగ్రీ కాలేజీలో చేరాల్సిన పరిస్థితి వస్తోంది. సీట్లు ఖాళీగా ఉంటున్నా వాటిని విద్యార్థులకు ఇవ్వలేని దుస్థితి నెలకొంటోంది. వృత్తి, సాంకేతిక విద్యలో ఎక్కువ పోటీ... రాష్ట్రంలో వృత్తి, సాంకేతిక విద్యా కోర్సులకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. మేనేజ్మెంట్ కోటా సీట్లను లక్షల రూపాయలు వెచ్చించి కొనుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే సాంకేతిక విద్యా కోర్సుల్లోనూ ప్రైవేటు కాలేజీల్లో మిగిలిపోయిన సీట్లను యాజమాన్యాలు స్పాట్ అడ్మిషన్ల కింద భర్తీ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తోంది తప్ప ప్రభుత్వ, యూనివర్సిటీ కాలేజీల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి అనుమతించడం లేదు. దీంతో 14 యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏటా వందల సంఖ్యలో సీట్లు మిగిలిపోతున్నాయి. ఈ విద్యా సంవత్సరం ప్రవేశాల్లోనూ ఎంతో డిమాండ్ కలిగిన 300 వరకు సీట్లు మిగిలిపోయాయి. విమర్శలొస్తాయనే ‘స్పాట్’ నిర్వహించట్లేదు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలతోపాటు వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లోనూ మెరిట్ ప్రాతిపదికన సీట్లను భర్తీ చేస్తున్నందున స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తే మెరిట్ లేని వారు వచ్చే అవకాశం ఉంది. అది విద్యార్థుల మధ్య సమస్యగా మారొచ్చు. అందుకే ప్రభుత్వ కాలేజీల్లో స్పాట్కు అనుమతించడం లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. – దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి చదవండి: (పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం మండలానికో స్టడీ సెంటర్!) -
డిసెంబర్ 1 నుంచి ఇంజనీరింగ్ ఫ్రెషర్లకు కొత్త విద్యా సంవత్సరం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలలు, సాంకేతిక విద్యా సంస్థల్లో చేరే కొత్తగా చేరే విద్యార్థులకు విద్యా సంవత్సరం ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. కోవిడ్ నేపథ్యంలో ప్రవేశాల డెడ్లైన్ను పొడిగించినట్లు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు ఇంజనీరింగ్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల తుది గడువును నవంబర్ 30వ తేదీ వరకు పొడిగించామని ఏఐసీటీఈ కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. కోవిడ్ మార్గదర్శకాలను అమలు చేస్తూ ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా తరగతులను ప్రారంభించవచ్చని సూచిం చారు. కరోనా విజృంభణ కారణంగా మార్చి 16 నుంచి యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూళ్లు మూతపడిన సంగతి తెలిసిందే. వర్సిటీలు, కాలేజీల్లో ఫ్రెషర్లకు నూతన విద్యా సంవత్సరాన్ని ప్రారంభించేందుకు యూజీసీ ఇటీవల అనుమతినిచ్చింది. తరగతులు ఆలస్యంగా ప్రారంభం అవుతున్న కారణంగా 2021లో వేసవి సెలవులను భారీగా కుదిస్తామని యూజీసీ పేర్కొంది. -
‘నిట్’ ప్రవేశాలకు 75% మార్కులు అక్కర్లేదు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్), ఇతర కేంద్ర టెక్నికల్ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన అర్హత నిబంధనల్లో కొంత వెసులుబాటు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆయా విద్యా సంస్థల్లో ప్రవేశం పొందేందుకు కనీస అర్హతగా ఉన్న 12వ తరగతి బోర్డు పరీక్షలో కనీసం 75% మార్కులు పొంది ఉండాలన్న ప్రధాన నిబంధనను తొలగించింది. కరోనా మహమ్మారి కారణంగా పలు బోర్డులు పరీక్షలను పాక్షికంగా రద్దు చేసిన నేపథ్యంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ గురువారం ఈ నిర్ణయం తీసుకుంది. ‘జేఈఈ మెయిన్స్ 2020లో అర్హత సాధించిన విద్యార్థులు క్లాస్ 12 బోర్డు పరీక్షలో ఉత్తీర్ణులై ఉంటే సరిపోతుంది’ అని హెచ్చార్డీ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ ట్వీట్ చేశారు. ఈ మేరకు సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డ్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నిట్ తదితర ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ప్రవేశం పొందేందుకు ఇప్పటివరకు విద్యార్థులు జేఈఈ మెయిన్స్లో ఉత్తీర్ణులు కావడంతో పాటు, 12వ తరగతి బోర్డ్ పరీక్షలో కనీసం 75% మార్కులు కానీ, అర్హత పరీక్షలో టాప్ 20 పర్సంటైల్ ర్యాంక్ కానీ సాధించాల్సి ఉండేది. ఇప్పటివరకు రెండు సార్లు వాయిదా పడిన ఈ సంవత్సరం జేఈఈ మెయిన్స్ పరీక్షను సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. -
ఐఐటీ అకాడమీల్లో నాణ్యమైన విద్య
సాక్షి, అమరావతి: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఐఐటీ అకాడమీల్లోని విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన విద్యనందిస్తోంది. ఐఐటీ, నీట్ వంటి వృత్తి విద్యపై మక్కువతో అకాడమీ కాలేజీల్లో చేరిన విద్యార్థులకు ప్రయివేట్ కాలేజీల్లో ఇస్తున్న కోచింగ్ కంటే ఉన్నతమైన ప్రమాణాలతో శిక్షణనిస్తోంది. కరోనా నేపథ్యంలో ఇళ్లలోనే ఉన్న విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా రోజూ గురుకుల అధ్యాపకులు పాఠాలు చెబుతున్నారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు కొనివ్వడంతో విద్యార్థులందరూ ఆన్లైన్ తరగతులను అనుసరిస్తున్నారు. నిత్యం అధ్యాపకులతో మాట్లాడుతూ సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. విద్యార్థులకు కావాల్సిన మెటీరియల్ను అధ్యాపకులు ఆన్లైన్లోనే పంపుతున్నారు. దూరదర్శన్, రేడియోతో పాటు పలు యాప్ల ద్వారా గురుకుల సొసైటీ కోచింగ్ ఇస్తోంది. 3 అకాడమీలు.. 1300 మంది విద్యార్థులు ► ప్రస్తుతం 3 చోట్ల ఐఐటీ అకాడమీలున్నాయి. కృష్ణా జిల్లా ఈడుపుగల్లులోని ఐఐటీ అకాడమీలో 580 మంది, కర్నూలు జిల్లా చిన్న టేకూరు ఐఐటీలో 480, గుంటూరు జిల్లా గోరంట్ల గురుకుల ఐఐటీలో 250 మంది విద్యార్థులు ఇంటర్ చదువుతూ ఐఐటీ, నీట్ కోచింగ్ తీసుకుంటున్నారు. ► స్కూలు భవనాల సామర్థ్యాన్ని బట్టి ప్రభుత్వం సీట్లు కేటాయిస్తోంది. కనీస సౌకర్యాల్లేకుండా ఎక్కువ మందిని చేర్చుకుంటే ఇబ్బందులుంటాయని మొదట్నుంచీ భావిస్తున్న గురుకుల సొసైటీ.. అవసరం మేరకే విద్యార్థులకు అవకాశం కల్పిస్తోంది. ► ఈ అకాడమీలను నిర్వహిస్తున్న కాలేజీలకు మెరికల్లాంటి విద్యార్థులను గురుకుల సొసైటీ ఎంపిక చేసుకుంటోంది. ఏటా ప్రత్యేక పరీక్ష నిర్వహించి అత్యంత ప్రతిభావంతులను తీసుకుంటోంది. మరో 5 అకాడమీల ఏర్పాటుకు ప్రతిపాదనలు గురుకుల విద్యాలయాల సంస్థ ద్వారా కొత్తగా మరో ఐదు ఐఐటీ అకాడమీల ఏర్పాటుకు గురుకుల సొసైటీ ప్రతిపాదనలు రూపొందించింది. విశాఖలో బాలురకు ఒకటి, బాలికలకు ఒకటి, రాజమహేంద్రవరంలో బాలురకు, నెల్లూరు, తిరుపతిలో బాలికలకు ఏర్పాటు చేయనున్నారు. ఈ ఐదు ఐఐటీల ద్వారా సుమారు 3,000 మందికి ఐఐటీ, నీట్లలో కోచింగ్ ఇవ్వాలని గురుకుల సొసైటీ నిర్ణయించింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. కొత్త ఐఐటీ అకాడమీలకు అనుమతొస్తే మరింత మందికి చాన్స్ ఇటీవల జరిగిన సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ పాలక మండలి సమావేశంలో కొత్తగా ఐదు ఐఐటీ అకాడమీల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. అనుమతులు వస్తే మరింత మంది విద్యార్థులు సాంకేతిక విద్యను అభ్యసించేందుకు అవకాశం కలుగుతుంది. – కల్నల్ వి.రాములు, గురుకుల కార్యదర్శి -
కొత్త కళాశాలలకు మరో రెండేళ్లపాటు నో
సాక్షి, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా ఇంజనీరింగ్ 40 శాతానికి పైగా సీట్లు భర్తీ కావడం లేదని, అందుకే వచ్చే రెండేళ్లు కొత్తగా ఇంజనీరింగ్ కాలేజీలకు ప్రైవేటు రంగంలో అనుమతి ఇచ్చేది లేదని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి స్పష్టం చేసింది. 2020–21 విద్యా సంవత్సరంతోపాటు 2021–22, 2022–23 విద్యా సంవత్సరం వరకు కొత్త కాలేజీల లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్వోఐ) కూడా ఇవ్వబోమని తెలిపింది. గతంలో ఎల్వోఐ ఇచ్చిన వారికి మాత్రం లెటర్ ఆఫ్ అప్రూవల్ (ఎల్వోఏ) ఇస్తామంది. మరోవైపు ప్రభుత్వ రంగంలో కొత్త కళాశాలల ఏర్పాటుకు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ప్రభుత్వంతోపాటు ప్రైవేటు రంగంలో నూ కొత్త కాలేజీల ఏర్పాటుకు ఎల్వోఐ ఇస్తామని, మిగతా వాటికి ఇవ్వబోమని తేల్చేసింది. 2020–21 విద్యా సంవత్సరం కోసం జారీ చేసిన సాంకేతిక విద్యా సంస్థల అప్రూవల్ హ్యాండ్బుక్లో మార్పులు చేర్పులపై ఇటీవల ఢిల్లీ, చెన్నైలో జరిగిన కన్సల్టేషన్ సమావేశాల్లో ఈ నిర్ణయాలు తీసుకుంది. కొత్త ఫార్మసీ కాలేజీలకు కూడా వచ్చే రెండేళ్లు అనుమతి ఇవ్వమని చెప్పిం ది. 2019–20 విద్యా ఏడాదిలో దేశంలోని విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్ సీట్లు 27 లక్షలు ఉంటే అందులో 14 సీట్లు మిగిలిపోయాయని, 13 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయని పేర్కొంది. రాష్ట్రంలోనూ 217 కాలేజీల్లో 1,12,090 సీట్లకు ఏఐసీటీఈ ఆమోదం తెలుపగా, రాష్ట్రంలోని వర్సిటీలు 187 కాలేజీల్లో 93,790 సీట్ల భర్తీకి అనుబంధ గుర్తింపు ఇచ్చాయి. అందులో 62,744 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే 55.97% సీట్లు భర్తీకాగా 44.03% సీట్లు ఖాళీగానే ఉండిపోయాయి. ఫార్మసీలోనూ ఇలాంటి పరిస్థి తే నెలకొంది. మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే స్థితి ఉండటంతో ఇంజనీరింగ్, ఫార్మసీలో వచ్చే రెండేళ్లపాటు కొత్తగా ప్రైవేటు కాలేజీలకు అనుమతించబోమని స్పష్టం చేసింది. డిమాండ్ ఉండే కోర్సులకు ఓకే... మార్కెట్లో డిమాండ్ ఉన్న కొత్త కోర్సులను మాత్రం ప్రస్తుతం ఉన్న కాలేజీల్లో ప్రారంభించేందుకు అనుమతి ఇస్తామని (అదనపు ఇంటేక్) వెల్లడించింది. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభించే, మార్కెట్లో డిమాండ్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా సైన్స్, మిషన్ లెర్నింగ్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, త్రీడీ ప్రింటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులను ప్రారంభించేందుకు అదనపు ఇంటేక్ను మంజూరు చేస్తామని చెప్పింది. -
డిజిటల్ దోపిడీ
రూ.2.75 లక్షల విలువ చేసే యూనిట్లకు రూ.4.5 లక్షల బిల్లు.. రూ.3–3.5 లక్షల విలువ చేసే యూనిట్లకు రూ.6 లక్షలకు పైగా బిల్లు.. వర్చ్యువల్ క్లాస్ రూమ్, అడ్వాన్స్డ్ డిజిటల్ క్లాస్ రూమ్ పేరుతో గత ప్రభుత్వ మాయాజాలం.. జిల్లాలో 257 పాఠశాలల్లో వర్చ్యువల్ క్లాస్ రూమ్ ఎక్విప్మెంట్ యూనిట్ల సరఫరా.. ఫైబర్ నెట్ కనెక్షన్ లేక 131 పాఠశాలల్లో మాత్రమే ఇన్స్టాలైన ఎక్విప్మెంట్.. వాటిలో 92 పాఠశాలల్లోనే వర్కింగ్.. ఎక్విప్మెంట్ మొరాయింపుతో 39 పాఠశాలల్లో పనిచేయని పరిస్థితి.. అడ్వాన్స్డ్ డిజిటల్ క్లాస్ రూమ్ కింద 154 పాఠశాలలకు ఎక్విప్మెంట్ సరఫరా.. జూలైలో హడావుడిగా పాఠశాలలకు చేరవేత.. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వ ఒప్పందం.. స్టేట్ ప్రాజెక్టు ఆఫీసర్ వద్దని చెప్పినా పంపిణీ చేసిన ప్రైవేటు ఏజెన్సీ.. కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని కాజేసేందుకు ఎన్నికల ముందు.. తర్వాత కొను‘గోల్మాల్’ ఎలా సాగిందో చూశారా! ముడుపులు, కమిషన్లకు కక్కుర్తిపడి కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే కార్యక్రమాలు చేపట్టారు. కార్యరూపంలోకి వచ్చేసరికి వాటి డొల్లతనంతోపాటు అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సంస్కరణల పేరుతో గత ప్రభుత్వం చేపట్టిన చర్యల వెనక అవినీతి దాగుందని స్పష్టమవుతున్నది. శాశ్వత ప్రయోజనాలిచ్చే మౌలిక సదుపాయాల వైపు దృష్టి పెట్టకుండా సాంకేతిక బోధనాభివృద్ధి పేరుతో కాంట్రాక్టర్ల జేబులు నింపే కార్యక్రమం చేపట్టారు. వర్చ్యువల్ తరగతుల బోధన, డిజిటల్ తరగతుల బోధన పేరుతో ప్రభుత్వ నిధులను పెద్ద ఎత్తున స్వాహా చేశారు. ఒక్క జిల్లాలోనే రూ.10 కోట్ల మేర కుంభకోణం చోటు చేసుకుంది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వర్చ్యువల్ తరగతి బోధన పేరుతో గత ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసింది. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వర్చ్యువల్ క్లాస్ రూమ్ స్టూడియో నుంచి ఉపాధ్యాయుడు అందించే బోధనను ప్రత్యక్ష ప్రసారం చేసేందు కు పాఠశాలలకు ప్రత్యేక యూనిట్లను ఏర్పాటు చేసింది. వర్చ్యువల్ క్లాస్ రూమ్ బోధన కార్యక్రమాన్ని 2018 ఏప్రిల్లో తొలి విడతగా 70 పాఠశాలల్లో, 2018 ఆగస్టులో రెండో విడతగా 99 పాఠశాలల్లో, 2019 ఫిబ్రవరిలో మూడో విడతగా 88 పాఠశాలల్లో ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించి ఒక్కొక్క పాఠశాలకు రూ.4.5 లక్షల విలువైన ఎక్విప్మెం ట్ యూనిట్ను సరఫరా చేశారు. ఒక్కొక్క యూ నిట్లో ఒక పోడియం, ఒక యూపీఎస్, ఆరు యూపీఎస్ ఎక్స్టర్నల్ బ్యాటరీలు, ఒక ల్యాప్ టాప్, ఒక ప్రొజెక్టర్, ఒక టాబ్లెట్ (కార్బన్), ఒక వెబ్ కెమెరా, ఒక ఇంట్రాక్టివ్ పెన్, 40 క్లిక్కర్స్, ఒక క్లిక్కర్ రిసీవర్, ఒక 4.1 ఆడియో సిస్టమ్, ఒక ఏసీ (ఇన్వెర్టర్) ఉంటాయి. ఇవన్నీ పాఠశాలలో అమర్చి, ఇన్స్టాల్ చేస్తేనే జిల్లా కేంద్రంలో ఉన్న వరŠుచ్యవల్ కాస్ రూమ్ స్టూడియో నుంచి ఉపాధ్యాయుల బోధనలు ప్రత్యక్ష ప్రసారమవుతాయి. ఈ ఎక్విప్మెంట్ యూనిట్ సరఫరా, నిర్వహణ ఒక ప్రైవేటు ఏజెన్సీకి గత ప్రభుత్వం అప్పగించింది. ఆ ఏజెన్సీ ప్రతినిధికి గత ప్ర భుత్వ పెద్దలతో సత్సంబంధాలున్నాయి. ఫైబర్ నెట్ లేకుండానే... నాసిరకం ఎక్విప్మెంట్తో... పరికరాలన్నీ అమర్చి, ఇన్స్టాల్ కావాలంటే ఆ పాఠశాలలకు ఫైబర్ నెట్ కనెక్షన్ ఉండాలి. కళ్లెం ఇచ్చి గుర్రం ఇవ్వనట్టుగా ఫైబర్ నెట్ కనెక్షన్ ఇవ్వకుండా ఎక్విప్మెంట్ సరఫరా చేసిన ఘనత గత ప్రభుత్వానికి దక్కింది. తొలి విడత 70 పాఠశాలల్లో 51 పాఠశాలలకు ఫెబర్ నెట్ కనెక్షన్లుండటంతో ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేశారు. మిగతా 19 పాఠశాలల్లో గత ఏడాది కాలంగా ఎక్విప్మెంట్ నిరుపయోగంగా ఉంది. ఇన్స్టాల్ చేసిన వా టిలో 19 పాఠశాలల్లో కొన్ని రోజుల్లోనే ఎక్విప్మెంట్ మొరాయించింది. అలాగే, రెండో విడత 99 పాఠశాలల్లో కేవలం 36 పాఠశాలలకు ఫైబర్ నెట్ కనెక్షన్ ఉండటంతో ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేశారు. మిగతా 63 పాఠశాలల్లో సంబంధిత ఎక్విప్మెంట్ నిరుపయోగంగానే ఉంది. ఇన్స్టాల్ చేసినవాటిలోని ఏడు పాఠశాలల్లో కొన్ని రోజులకే ఎక్విప్ మెంట్ పనిచేయడం మానేసింది. మూడో విడతలో 88 పాఠశాలలకు ఎక్విప్మెంట్ యూనిట్లను సరఫరా చేయగా, వాటిలో 44 పాఠశాలలకు మాత్రమే ఫైబర్ నెట్ కనెక్షన్ ఉండటంతో ఇన్స్టాల్ చేశారు. ఇందులో 13 పాఠశాలల్లో కొన్ని రోజులకే పనిచేయడం మానేశాయి. ఇలా మొత్తం 257 పాఠశాలల్లో 131 పాఠశాలలు మాత్రమే ఇన్స్టాల్కు నోచుకోగా, వాటిలో 92 మాత్రమే యాక్టివ్గా ఉ న్నాయి. 39 పాఠశాలల్లో పనిచేయడం లేదు. ఇక, 126 పాఠశాలలకు ఎక్విప్మెంట్ వచ్చి నా ఫైబర్ నెట్ కనెక్షన్ లేక ఇన్స్టాల్ కాలేదు. దీంతో అక్కడికొచ్చిన ఎక్విప్మెంట్ నిరుపయోగంగా ఉండిపోయింది. ఇందులో చెప్పాల్సిన విషయమేంటంటే పాఠశాలలకు వచ్చి న ఎక్విప్మెంట్ ఆశించిన క్వాలిటీలో లేవని తెలుస్తున్నది. దీనికి తోడు ఎక్విప్మెంట్ యూనిట్ విలువ రూ.4.5 లక్షల మేర చూపించినట్టు తెలిసింది. కానీ వాస్తవంగా దాని విలువ బహిరంగ మార్కెట్లో రూ.2.75 లక్షల మేర ఉంది. దాదాపు లక్షా 50 వేల వరకు తేడా ఉన్నట్టుగా తెలుస్తున్నది. సాధారణంగా బల్క్లో తీసుకుంటే తగ్గాలి. కానీ ఇక్కడ ఎక్కువగా ఉంది. దీని వెనక పెద్ద గోల్మాల్ నడిచింది. ముడుపుల బాగోతం నడవడంతో కాంట్రాక్టర్ చెప్పిందే వేదం అన్నట్టుగా సాగిపోయింది. ఇదొక్క జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా సాగింది. ఇదొక పెద్ద కుంభకోణం. ఇదీ వర్చ్యువల్ క్లాస్ రూమ్ బాగోతం. అడ్వాన్స్డ్ డిజిటల్ మాయ... అడ్వాన్స్డ్ డిజిటల్ క్లాస్ రూమ్ పేరుతో కూడా మరో కథ నడిచింది. ప్రాథమిక పాఠశాలలో అధునాతన డిజిటల్ క్లాస్రూమ్ బోధనా కార్యక్రమాన్ని అమలు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఇదంతా ఎన్నికలకు ముందు చేసిన ఆలోచన. అదే సందర్భంగా యుద్ధప్రాతిపదికన ఒక ఏజెన్సీతో ఒప్పందం చేసుకుం ది. ఎన్నికలకు ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం అడ్వాన్స్డ్ డిజిటల్ క్లాస్ రూమ్ పేరుతో 154 ప్రాథమిక పాఠశాలలకు ఎక్విప్మెంట్ యూనిట్లను సరఫరా చేశారు. 65 ఇంచెస్ ఇంట్రాక్టివ్ ప్లాట్ పేనల్, ఐఎఫ్పీ మౌంటెడ్ బ్రాకెట్, 1కేవీఎ ఆన్లైన్ యూపీఎస్, వైర్లెస్ కీ బోర్డు, మౌస్ వంటి పరికరాలతో కూడిన ఎక్విప్మెంట్ యూనిట్ను కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సరఫరా చేశారు. గత ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ఏజెన్సీ జూలై 7వ తేదీ తర్వాత హడావుడిగా యూనిట్ల ను పాఠశాలలకు చేరవేసింది. ఒక్కొక్క యూని ట్ విలువ రూ.6 లక్షల మేర చూపించినట్టుగా ప్రస్తుత ప్రభుత్వ అధికారులు గుర్తించారు. వాస్తవానికైతే మార్కెట్ ప్రకారం దాని విలువ రూ.3 లక్షల నుంచి 3.5 లక్షల మేర ఉంటుంద ని అంచనా. దాదాపు 2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు అదనంగా లాగేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని గుర్తించారేమో పాఠశాలలకు యూనిట్లు సరఫరా చేయవద్దని, తక్షణం నిలిపివేయాలని సర్వశిక్షా అభియాన్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ సంబంధిత సరఫరా ఏజెన్సీని జూలై 3వ తేదీన ఆదేశించారు. కానీ సద రు ఏజెన్సీ పట్టించుకోకుండా యుద్ధప్రాతిపది కన పాఠశాలలకు ఎక్విప్మెంట్ యూనిట్లను సరఫరా చేసేసింది. ఈ విషయం తెలుసుకున్న స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ తక్షణమే సర్వశిక్షా అభియాన్ జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్కు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. వచ్చిన యూనిట్లను తీసుకోవద్దని, అప్పటికే వచ్చేస్తే వాటిని తెరవొద్దని, ఇన్స్టాల్ చేయవద్దని ఆదేశించారు. దీంతో ప్రాజెక్టు ఆఫీసర్ సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తగు ఆదేశాలు ఇచ్చారు. ఫలితంగా సంబంధిత యూనిట్లు ఎక్కడికక్కడ అక్కరకు రాకుండా ఉన్నాయి. వీటిలో కూడా నాసిరకం పరికరాలు ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఎక్విప్మెంట్ యూనిట్లను తెరవద్దని ఆదేశాలిచ్చాం.. అడ్వాన్స్డ్ డిజిటల్ క్లాస్ రూమ్ పేరుతో 154 పాఠశాలలకు సరఫరా చేసిన ఎక్విప్ మెంట్ యూనిట్లను తెరవద్దని సంబంధిత పాఠశాలల ప్ర«ధానోపాధ్యాయులకు ఆదేశాలిచ్చాం. స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాల మేర కు తక్షణ ఆదేశాలిచ్చాను. ఎక్కడైనా తెరిచినట్టయితే సంబంధిత ప్రధానోపాధ్యాయులే బాధ్యత వహించాలి. – బి.శ్రీనివాసరావు, పీఓ, సర్వశిక్షా అభియాన్ -
నూతన ఆవిష్కరణ కేంద్రాలుగా తరగతి గదులు...!
సాంకేతిక రంగంలో నేడు వస్తోన్న విప్లవాత్మకమైన మార్పులు ప్రపంచం రూపు రేఖల్ని మార్చేస్తున్నాయి. 21వ శతాబ్దంలో మనిషి మేధస్సుతోపాటే అభివృద్ధి చెందిన నూతన సాంకేతిక విప్లవంలో మరమనిషి ఆవిష్కరణ ఓ మహాద్భుతం. మనిషి మేధో వికాసాన్నుంచి ఉద్భవించిన ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏకారణం చేతైనా మనిషే అందిపుచ్చుకోలేని పరిస్థితి వస్తే వాళ్ళు తరాలపాటు వెనకబడిపోవాల్సిందే. అందుకే ప్రతి ఒక్కరూ టెక్నా లజీతో అనుసంధానం కాక తప్పని పరిస్థితులు కల్పిం చింది. అభివృద్ధి చెందిన దేశాల్లో, మానవ వనరుల కొరత ఉన్న దేశాల్లో ఇప్పటికే చాట్ బోట్స్ పేరిట రోబోల వినియోగం పెరిగిపోయింది. ఇది ఒక్క కమ్యూనికేషన్ రంగానికి మాత్రమే పరిమితం కాలేదు. విద్య, వైద్యం, జర్నలిజం, హోటల్ మేనేజ్ మెంట్ ఇలా ప్రతి రంగంలోనూ మరమనిషి ప్రమే యం పెరుగుతోంది. ఈ సవాల్ను దీటుగా ఎదు ర్కొని మనిషి మనగలగాలంటే నిరంతర జ్ఞాన సము పార్జన, దాని ఆచరణ తప్పనిసరి. ఈ ప్రక్రియ బాల్య దశ నుంచే మొదలు కావాలి. పాఠశాల స్థాయి నుంచే ఆ ప్రయత్నం ప్రారంభించాలి. బడి చదువే అందుకు వేదిక కావాలి. సాంకేతిక విజ్ఞాన బోధనకు తొలి అడుగు పాఠశాలలోనే మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పక తప్పదు. 21వ శతాబ్దంలో సామాజిక, ఆర్థిక, సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులు మిగతా రంగాలతో పాటు విద్యారంగాన్నీ తీవ్రంగా కుదిపేస్తున్నాయి. పోస్ట్కార్డులు అంతరించి వాట్సాప్, టెలిగ్రామ్ల రాకతో సమాచార బట్వాడా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినట్టుగా విద్యారంగం లోనూ నేడు అలాంటి మార్పులే రావాల్సిన తప్పని సరి పరిస్థితి. అభివృద్ధి చెందిన దేశాలు కాలానుగు ణంగా తమ విద్యాబోధనా ప్రమాణాలను ఎప్పటిక ప్పుడు విశ్లేషించుకుంటూ ముందుకెళుతున్నాయి. గతంలో విద్యారంగానికి ఉపా«ధ్యాయుడే కేంద్ర బిందువు. కానీ నేడు విద్యార్థి కేంద్రంగా విద్యాబో ధన జరుగుతోంది. పుస్తకంలో ఉన్న జ్ఞానాన్ని విద్యార్థి మెదడులోకి ఎక్కించడమే నాడు ప్రధాన లక్ష్యం. ఎంత సమర్థంగా విద్యార్థి ఆ సమాచారాన్ని గుర్తుపెట్టుకుంటే అంత గొప్పగా భావించేవారు. అదే ఓ గొప్ప విద్యగా పరిగణించేవారు ఆనాడు. కానీ నేటి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇన్ఫర్మేష న్కన్నా ఇన్నోవేషన్ ప్రధానమైంది. కొత్త ఆవిష్కర ణలు చేసే విద్యార్థులను తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా మారింది. విద్యార్థిలో సమాచారం గుర్తు పెట్టుకొనే సామర్థ్యం కన్నా, ఆ సమాచారం ఎంత మేరకు అవగతం చేసుకొనే శక్తి, విశ్లేషించే నైపుణ్యం ఉందో చూస్తున్నారు. అందుబాటులో ఉన్న సమాచా రాన్ని నేటి సామాజిక పరిస్థితులతో అన్వయించు కొనే సామర్థ్యంతో నూతన ఆవిష్కరణలు చేసే విద్యార్థులకే నేడు పెద్దపీట వేస్తున్నారు. అందువల్ల ఈ రోజు విద్యారంగంలో ఉపాధ్యాయుడు సర్వాంత ర్యామి కానేకాదు. తరగతి గదిలో విద్యార్థి నైపుణ్యాభి వృద్ధికి, మేథో వికాసానికి అవసరమైన మెళకువలను బోధించడమే ఉపాధ్యాయుడి ప్రథమ కర్తవ్యంగా మారింది. విద్యార్థిలో అవగాహన ఎంతగా పెరిగితే అన్ని కొత్త ఆవిష్కరణలు వచ్చే అవకాశం ఉంటుంది. టెక్నాలజీ నేడు అన్ని రంగాలనూ శాసిస్తోంది. ఎవరైతే సాంకేతిక నైపుణ్యాన్ని కలిగి ఉంటారో వారికే అవకాశాలు విరివిగా లభిస్తాయి. ఈ నేపథ్యంలో టెక్నాలజీలో వచ్చే మార్పులు విద్యారంగంలో రాక పోయినట్టయితే ఆ విద్య వచ్చే శతాబ్దానికి పనికి రాదు. పిల్లలు పుట్టి పెరుగుతున్న క్రమంలో పలకా బలపం పట్టుకుంటేనే మురిసిపోయేరోజులు పోయి పుట్టడంతోనే సెల్ఫోన్, ట్యాబ్, ల్యాప్టాప్లను అవలీలగా ఆపరేట్ చేయగలిగిన డిజిటల్ యుగంలో మనమున్నాం. ఈరోజు సెల్ఫోన్ ఓ నిత్యావస రంగా మారిపోయింది. దేశంలో సెల్ఫోన్ లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. ఈ రోజు తరగతి గదిలో విద్యార్థి చేతిలో ఉన్న సెల్ఫోన్ తీసుకుంటే వాళ్ళకు కోపం వస్తుంది. టెక్నాలజీలో అనునిత్యం వస్తోన్న మార్పుల వల్ల విద్యార్థులు తమను తాము నిత్యం అప్డేట్ చేసుకుంటూ ముందుకెళుతున్నారు. ఈ సాంకేతిక మార్పులను గమనించి విద్యారంగానికి వాటిని అన్వయించుకోవడంలో విఫలమైతే మాత్రం విద్యార్థులు తరగతి గదులకు దూరమయ్యే ప్రమా దం లేకపోలేదు. విద్యార్థి ఆసక్తిని గమనించి విద్యా వ్యవస్థకు సాంకేతిక సొబగులు అద్దాలి. సమాచార రంగం, డిజిటల్ టెక్నాలజీలో వస్తున్న మార్పులు చాలా వేగంగా మారుతున్నాయి. ఈ రోజు విద్యార్థి అవగాహన పెంచే అంశంపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఏ విద్యార్థీ పుట్టుక తోనే మేధావి కాడు. పిల్లవాడికి తగిన వాతావరణ కల్పిస్తేనే రాణించగలరు. అందువల్ల పిల్లల్లో కొత్త ఆలోచనలను రేకెత్తించడమే నేటి ఉపాధాయుడి ప్రధాన కర్తవ్యం. ఆలోచించే వ్యక్తి దేశానికి వరం. ఒకప్పుడు తరగతిగదిలో పాఠం బోధించిన వెంటనే పిల్లవాడిని ప్రశ్నించేవాళ్ళం. దీంతో పిల్లవాడు అదే సమాచారాన్ని గుర్తుంచుకొని చెప్పగలిగితే మేధావి అని కీర్తించే వాళ్ళం. విద్యార్థి ప్రదర్శించే ఆ నైపు ణ్యంతో ఉపాధ్యాయుడు సంతృప్తి చెందేవాడు. కానీ అది అవగాహన కాదు. అది కేవలం రీకాల్ మాత్రమే. అలాంటి చదువులో విద్యార్థి పాత్రధారి కాలేదు. గురువు బోధించిన పాఠంలో విద్యార్థి శ్రమ లేకపోతే అది కేవలం ఉపరితల జ్ఞానంగానే మిగిలి పోతుంది. అందువల్ల విద్యార్థిని బోధనలో పాత్ర ధారి చేయాలి. అందుకు విద్యార్థి ఉపయోగించే సెల్ ఫోన్నే సాధనంగా ఎంచుకొని ఆ టెక్నాలజీతో అతడి ఆలోచనను పెంచేలా వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలి. అలాకాకుండా మనం మడికట్టు కొని కూర్చుంటే ఛాదస్తులమవుతాం. దినదినం మారుతున్న టెక్నాలజీని ఉపయోగించి విద్యార్థి అవ గాహనను, ఆలోచనను పెంచేలా కృషి చేయాలి. ఉపాధ్యాయుడి బోధనలు విద్యార్థికి ఆసక్తికరంగా ఉంటే మెదడులో కవాటాలు తెరుచుకుంటాయి. అవి తెరచుకుంటేనే విద్యార్థి ఆలోచనలు మొదలు పెడ తాడు. ఆ ఆలోచనలతోనే కొత్త జ్ఞానం ఉత్పత్తి అవు తుంది. అదే నూతన ఆవిష్కరణలకు కారణమౌ తుంది. క్లాస్రూంలు కొత్త ఆవిష్కరణలకు కేంద్రాల యినప్పుడే విద్యారంగంలో మరో విప్లవం సాధ్యమ వుతుంది. నేటి తరగతి గది ఆవిష్కరణల సృష్టిగానీ, పాత జ్ఞానాన్ని వల్లించే కేంద్రం కారాదు. మర మనిషి విసురుతున్న చాలెంజ్లను తరగతి గదులు స్వీకరిం చాలి. 21వ శతాబ్దంలో వచ్చిన సమాచార, సాంకేతిక విప్లవాలకు విద్యారంగాన్ని జోడిస్తే వచ్చే మరో విప్ల వంతో సామాజిక పరివర్తన సాధ్యమవుతుంది. -వ్యాసకర్త : ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు డాక్టర్ చుక్కారామయ్య -
నేటి నుంచి పాలిటెక్నిక్ ప్రవేశాల కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాలిటెక్నిక్లలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించేందుకు సాంకేతిక విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈనెల 14 నుంచి రిజిస్ట్రేషన్లను ప్రారంభించనున్నట్లు పాలిసెట్–2018 కన్వీనర్ నవీన్ మిట్టల్, ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులై, పాలిసెట్లో ర్యాంకు సాధించిన విద్యార్థులు ప్రవేశాలకు అర్హులని చెప్పారు. సీబీఎస్ఈ/ఐసీఎస్ఈ విద్యార్థుల ప్రవేశాలు మాత్రం వారి పదో తరగతి ఉత్తీర్ణతను బట్టి ఉంటాయని వెల్లడించారు. విద్యార్థులు 14 నుంచి 18వ తేదీ వరకు ఆన్లైన్లో ((https://tspolycet. nic.in)) రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే రూ.300, ఇతరులు రూ.600 ప్రాసెసింగ్ ఫీజు ఆన్లైన్ (క్రెడిట్/డెబిట్కార్డు/నెట్ బ్యాంకింగ్) ద్వారా చెల్లించాలని వివరించారు. ఫీజు చెల్లించేటప్పుడు విద్యార్థి తన మొబైల్ నంబరు, ఈ–మెయిల్ ఐడీ, ఆధార్ నంబరు ఇవ్వాలని, ఆదాయ ధ్రువీకరణ పత్రం (వర్తించే వారు) నంబరు ఇవ్వాలని సూచించారు. ఆ తర్వాత హెల్ప్లైన్ కేంద్రాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరు కావాలని పేర్కొన్నారు. తగ్గిన కాలేజీలు, సీట్లు ఈసారి పాలిటెక్నిక్ కాలేజీలతోపాటు సీట్లు తగ్గిపోయాయి. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 181 కాలేజీల్లో 43,082 సీట్లు అందుబాటులో ఉండగా, ఈసారి 13 కాలేజీలు తగ్గిపోయాయి. 4,470 సీట్లకు కోత పడింది. రాష్ట్రవ్యాప్తంగా 168 కాలేజీల్లో 38,612 సీట్ల భర్తీకి సాంకేతిక విద్యాశాఖ చర్యలు చేపట్టింది. గతేడాది 55 ప్రభుత్వ కాలేజీల్లో 11,752 సీట్లు ఉండగా.. ఈసారి అవే కాలేజీల్లో 11,512 సీట్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. 2 ఎయిడెడ్ కాలేజీల్లో గతేడాది 420 సీట్లు ఉండగా, ఈసారి 360 సీట్లు ఉన్నట్లు తెలిపింది. గతేడాది 122 ప్రైవేటు కాలేజీల్లో 30,190 సీట్లు ఉండగా, ఈసారి 111 ప్రైవేటు కాలేజీల్లో 26,740 సీట్లు అందుబాటులో ఉన్నట్లు వివరించింది. వెబ్సైట్లో సమగ్ర వివరాలు ప్రవేశాల కౌన్సెలింగ్కు సంబంధించి తేదీల వారీగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరు కావాల్సిన విద్యార్థుల ర్యాంకుల వివరాలను సాంకేతిక విద్యాశాఖ తమ వెబ్సైట్లో పొందుపరిచింది. ఏ ర్యాంకుల వారికి ఏయే కాలేజీల్లో సీట్లు వచ్చాయనే వివరాలను విద్యార్థుల అవగాహన కోసం వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. విద్యార్థులు పాలిసెట్ ర్యాంకు కార్డు, ఆధార్ కార్డు, టెన్త్ మెమో, రాష్ట్ర ఎస్సెస్సీ బోర్డు కాకుండా ఇతర బోర్డుల వారు హాల్టికెట్, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, టీసీ, 2018 జనవరి 1 తర్వాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాలని వెల్లడించింది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాయబోయే విద్యార్థులు ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వారికి రెండో దశలో మిగిలిపోయే సీట్లను కేటాయిస్తారు. వారు టెన్త్ ఉత్తీర్ణులైతేనే ఆ సీటు ఇస్తారు. ఇదీ ప్రవేశాల షెడ్యూలు 14–5–2018 నుంచి 18–5–2018: ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు 15–5–2018 నుంచి 19–5–2018: సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 15–5–2018 నుంచి 21–5–2018: వెరిఫికేషన్ పూర్తయిన వారికి వెబ్ ఆప్షన్లు 23–5–2018: మొదటి దశ సీట్లు కేటాయింపు 23–5–2018 నుంచి 27–5–2018 వరకు: ట్యూషన్ ఫీజు చెల్లించడంతోపాటు కాలేజీలో చేరేందుకు ఆన్లైన్లో అంగీకారం తెలపాలి. సీట్లు పొంది ఫీజు చెల్లించకుండా, అంగీకారం తెలుపకపోతే రెండో దశలో అవకాశం ఉండదు. మొదటి దశలో సీటు వస్తే అంగీకారం తెలిపి, ఫీజు చెల్లించాలి. వారి పాత ఆప్షన్ల ప్రకారం కాలేజీలు, సీటును మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. 24–5–2018 నుంచి 27–5–2018: సీట్లు రాని వారు ఆప్షన్లను మార్చుకోవచ్చు. ఒకవేళ మార్చుకోకపోతే ముందుగా వారు ఇచ్చిన ఆప్షన్లనే పరిగణనలోకి తీసుకుంటారు. 30–5–2018: సీట్లు మెరుగుపరుచుకోవాలని అంగీకారం తెలిపిన వారికి, మొదటి దశలో సీట్లు రాని వారికి రెండో దశ సీట్లు కేటాయిస్తారు. మిగిలిన సీట్లను టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రాయబోయే వారికి కేటాయిస్తారు. 30–5–2018 నుంచి 1–6–2018 వరకు: ట్యూషన్ ఫీజు చెల్లింపు, కాలేజీల్లో చేరికలు 1–6–2018 నుంచి: తరగతులు ప్రారంభం -
టెక్నికల్ చదువులకు ఈ కోర్సులొద్దు
సాక్షి, న్యూఢిల్లీ : సాంకేతిక విద్యను కరెస్పాండెన్స్(సుదూర) కోర్సులు ద్వారా అందించవద్దని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఇంజనీరింగ్ లాంటి సడ్జెట్లకు విద్యా సంస్థలు దూర విద్యా విధానంలో అందిస్తున్న కోర్సులపై సుప్రీంకోర్టు పరిమితులు విధించింది. ఈ కోర్సుల్లో దూర విద్యకు వ్యతిరేకంగా తీర్పు చెప్పేందుకు, ఇదే అంశంపై పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పులను అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. అదేవిధంగా టెక్నికల్ విద్యను కరెస్పాండెన్స్ ద్వారా అందించేందుకు ఒడిశా హైకోర్టు ఇచ్చిన అనుమతిని సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. కంప్యూటర్ సైన్సు డిగ్రీని కరెస్పాండెన్స్ ద్వారా పొందితే దాన్ని రెగ్యులర్ క్లాస్ మాదిరి పరిగణలోకి తీసుకోమని పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు రెండేళ్ల క్రితం తీర్పునిచ్చాయి. -
లక్ష స్టార్టప్ల లక్ష్యం!
• 2025 కల్లా ప్రారంభించే లక్ష్యంతో చర్యలు • అందుబాటులోకి ఏఐసీటీఈ స్టార్టప్ పాలసీ • స్టార్టప్ పాలసీకి అనుగుణంగా కరిక్యులమ్లో మార్పులు • తమ పరిధిలోని కాలేజీల్లో అమలుకు కసరత్తు సాక్షి, హైదరాబాద్: సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులతో 2025 నాటికి లక్ష స్టార్టప్లను ఏర్పాటు చేయించడంతోపాటు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిం చాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిర్ణయించింది. జాతీ య స్టార్టప్ పాలసీని ఆదర్శంగా తీసుకొని సాంకేతిక రంగంలో స్టార్టప్లను అందుబాటు లోకి తెచ్చే కసరత్తు ప్రారంభించింది. ఇందు కోసం రూపొందించిన స్టార్టప్ పాలసీ ఏఐసీ టీఈ–2016ను అందుబాటులోకి తెచ్చింది. పాలసీ విధివిధానాల్ని వెబ్సైట్లో ఉంచింది. ఏఐసీటీఈ స్టార్టప్ పాలసీ ఎందుకంటే... సాంకేతిక విద్యను పూర్తి చేసుకొని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా స్టార్టప్ కంపెనీలను ప్రారంభించాల్సిన యావరేజ్ వయస్సు 32 ఏళ్లు. కానీ దేశంలో కొత్తగా స్టార్టప్ కంపెనీ లను ప్రారంభిస్తున్న వారు 13 శాతమే. ఈ విషయాన్ని నాస్కామ్ నివేదికలే వెల్లడిస్తు న్నాయి. మిగతా స్టార్టప్లను ప్రారంభిస్తున్నది ఇప్పటికే ఉన్న ఎంఎన్సీలు, కంపెనీలే. అందుకే విద్యార్థులే సొంతంగా స్టార్టప్లను ప్రారంభించేలా ఏఐసీటీఈ చర్యలకు సిద్ధమైంది. కాలేజీల్లో ఏం చేయాలంటే.. విద్యార్థులే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా, ఆ దిశగా వారు ఆలోచించేలా కాలేజీల్లో బోధన కొనసాగించాలి. స్టార్టప్లే లక్ష్యంగా కరిక్యులమ్, పెడగాజీలో మార్పులు తీసుకు రావాలి. విద్యార్థులు ప్రారంభించే స్టార్టప్లు మార్కెట్లో నిలదొక్కుకునేలా చేయాలి. పాలసీ ఎవరి ఆధ్వర్యంలో అమలు చేస్తారంటే.. దేశ వ్యాప్తంగా స్టార్టప్ పాలసీని అమలు చేసేందుకు నేషనల్ రిసోర్స్ ఇన్స్టిట్యూషన్స్ (ఎన్ఆర్ఐ)ను గుర్తిస్తారు. 4 ప్రధాన రంగాల్లో అనుభవం, విశేష కృషి చేస్తున్న సంస్థలను ఎన్ఆర్ఐలుగా గుర్తిస్తారు. అందులో ఔత్సా హిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న వాటిని పరిగణనలోకి తీసుకుం టారు. అలాగే ఏఐసీటీఈ గుర్తింపు పొందిన కోర్సులను కనీసంగా ఐదేళ్లుగా నిర్వహిస్తున్న సంస్థలై ఉండాలి. విద్యార్థులను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్డడంలో, స్టార్టప్లను ప్రారంభింపజేయడంలో అను భవం కలిగి ఉండి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినవి అయి ఉండాలి. ప్రభుత్వానికి నోడల్ ఏజెన్సీగా పని చేస్తున్నవి లేదా ప్రభుత్వ ప్రాజెక్టులను చేస్తున్నవి అయి ఉండాలి. పాఠ్యాంశాలు జ్ఞానం, నైపుణ్యాలు, ప్రవర్తన ఆధారిత సిలబస్లు ఉండాలి. విద్యార్థులను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేలా కోర్సులు ఉండాలి. -
ఇంజనీరింగ్ స్పాట్ అడ్మిషన్లకు నోటిఫికేషన్
► జారీ చేసిన సాంకేతిక విద్యా శాఖ ► 6న విద్యార్థులకు స్లైడింగ్కు అవకాశం ► 8న కాలేజీల వారీ నోటిఫికేషన్లు ► 13లోగా ప్రవేశాలు పూర్తి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో భర్తీ కాకుండా మిగిలిపోయిన 12,638 సీట్లను యాజమాన్యాలు భర్తీ చేసుకునేందుకు వీలు కల్పిస్తూ సాంకేతిక విద్యా శాఖ స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ను మంగళవారం జారీ చేసింది. కాలేజీలు, బ్రాంచీల వారీగా భర్తీ అయిన సీట్లు, ఖాళీల వివరాలను tseamcet.nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు శాఖ వెల్లడించింది. ఒరిజినల్ సర్టిఫికెట్లు లేని విద్యార్థులకు స్పాట్ అడ్మిషన్లలో సీట్లు ఇవ్వరని పేర్కొంది. ఇందులో సీట్లు పొందిన విద్యార్థులకు, కాలేజీలో ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా బ్రాంచీలు మార్పు చేసుకున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదని స్పష్టం చేసింది. ఈ నెల 6న విద్యార్థులు స్లైడింగ్ ద్వారా బ్రాంచీలను మార్పు చేసుకోవచ్చంది. కాలేజీలు, బ్రాంచీల వారీగా మిగిలిపోయిన సీట్ల వివరాలతో యాజమాన్యాలు ఈ నెల 8న స్పాట్ అడ్మిషన్లకు నోటిఫికేషన్లు జారీ చేయాలని, 13 లోగా ప్రవేశాలను పూర్తి చేయాలని సూచించింది. స్పాట్ అడ్మిషన్లలో ప్రవేశాలు పొందిన విద్యార్థుల వివరాలను ఆన్లైన్ ద్వారా ఈ నెల 16 లోగా అప్లోడ్ చేయాలంది. హార్డ్ కాపీలు, డీడీలు, ఇతర సర్టిఫికెట్లను ఈ నెల 20 లోగా ప్రవేశాల కన్వీనర్కు యాజమాన్యాలు అందజేయాలని స్పష్టం చేసింది. ఎంసెట్లో అర్హత సాధించిన వారు రూ.1,000, అర్హత పొందనివారు రూ.1,500 ఫీజుగా చెల్లించాలి. నిబంధనలివీ..: కాలేజీల్లో మిగిలిన సీట్లను ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా ముందుగా భర్తీ చేయాలి. ఆ తరువాత ఎంసెట్లో అర్హత సాధించిన వారితో భర్తీ చేయాలి. గ్రూపు సబ్జెక్టుల్లో 44.5 శాతానికి పైగా మార్కులు వచ్చిన వారితో భర్తీ చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే 39.5 శాతానికి పైగా మార్కులు వచ్చిన వారితో... అప్పటికీ సీట్లు మిగిలిపోతే ఇంటర్మీడియెట్లో నిర్ణీత మార్కులతో ఉత్తీర్ణులైన వారితో భర్తీ చేయాలి. తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారై, విద్యార్థుల పూర్తిగా ఇతర రాష్ట్రాల్లోనే చదివుంటే నాన్లోకల్ కేటగిరీలోనూ తెలంగాణలో ప్రవేశాలు కల్పించరు. వారిని చేర్చుకుంటే ర్యాటిఫికేషన్ చేయరు. అవసరమైన సర్టిఫికెట్లు...: ఒరిజినల్ టెన్త్ మార్కుల మెమో, ఇంటర్మీడియెట్ మార్కుల మెమో, స్టడీ సర్టిఫికెట్లు, ఎంసెట్ ర్యాంకు కార్డు (అర్హులైతే), కుల ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే), నివాస ధ్రువీకరణ పత్రం. -
15,036 సీట్లు ఖాళీ
- ముగిసిన ఇంజనీరింగ్, బీఫార్మసీ తుది దశ కౌన్సెలింగ్ - కొత్తగా 13,953 మందికి సీట్లు.. సాక్షి, హైదరాబాద్ : ఎంసెట్ (ఇంజనీరింగ్, బీఫార్మసీ) తుదిదశ కౌన్సెలింగ్ శనివారంతో ముగిసింది. మొత్తంగా 28,989 సీట్లు అందుబాటులో ఉండగా.. కొత్తగా 13,953 మందికి సీట్లు లభించాయని సాంకేతిక విద్య కమిషనర్ ఎంవీ రెడ్డి వెల్లడించారు. గతంలో సీట్లు పొందిన అభ్యర్థుల్లో 15,822 మంది స్లైడింగ్ ద్వారా ఇతర కోర్సులు/కళాశాలల్లో సీట్లు పొందారని తెలిపారు. ఇంకా 15,036 సీట్లు మిగిలిపోయాయని చెప్పారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో 12,638 సీట్లు, ఫార్మసీ, ఫార్మ్-డి కోర్సుల్లో 2,394 సీట్లు మిగిలాయని వెల్లడించారు. ఇక తుది దశలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నా.. 2,583 మంది అభ్యర్థులకు సీట్లు లభించలేదని తెలిపారు. ఇక 80 కళాశాలల్లో వందశాతం సీట్లు భర్తీకాగా.. రెండు కళాశాలలకు ఒక్క విద్యార్థి కూడా ఆప్షన్ ఇవ్వకపోవడం గమనార్హం. మిగిలిపోయిన సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా ఆయా కళాశాలల యాజమాన్యాలు భర్తీ చేసుకునే అవకాశం ఉంది. స్పాట్ అడ్మిషన్ ద్వారా పొందిన సీట్లకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు. 2 లోగా ‘సెల్ఫ్ రిపోర్టింగ్’ చేయాలి... తుదిదశ కౌన్సెలింగ్లో సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 2వ తేదీలోగా ఫీజు చెల్లించి వెబ్సైట్లో ‘సెల్ఫ్ రిపోర్టింగ్’ చేయాలని అధికారులు సూచించారు. సీటు లభించిన కళాశాల్లో రిపోర్టు చేసేందుకు కూడా ఆగస్టు 2 చివరి తేదీ అని చెప్పారు. సీటు రద్దు చేసుకోవాలనుకునే అభ్యర్థులు 4 లోగా ఫీజు రశీదు, సర్టిఫికెట్ల ఎక్నాలెడ్జిమెంట్ రశీదుతో మాసబ్ట్యాంక్లోని సాంకేతిక విద్యాభవన్లో సంప్రదించాలని సూచించా రు.ఫీజు రీయింబర్స్మెంట్ నిమిత్తం ఆదాయ ధ్రువీకరణ సమర్పించని అభ్యర్థులు ఆగస్టు 1లోగా రాష్ట్రంలో ఏదైనా హెల్ప్లైన్ కేంద్రంలో అప్డేట్ చేసుకోవచ్చు. బీఫార్మసీ, ఫార్మ్-డిలపై తగ్గిన మోజు బీఫార్మసీ, ఫార్మ్-డి కోర్సులపై అభ్యర్థుల్లో మోజు తగ్గడంతో భారీగా సీట్లు మిగిలిపోయాయి. ఎంపీసీ స్ట్రీమ్ నుంచి చేరే బీఫార్మసీ కోర్సుల్లో కేవలం 5.83శాతం సీట్లు, ఫార్మ్-డి కోర్సులో 12.35 శాతం సీట్లు భర్తీ కావడం గమనార్హం. -
నేటి నుంచి పాలిసెట్ తుదివిడత కౌన్సెలింగ్
- రాష్ట్రవ్యాప్తంగా 21 హెల్ప్లైన్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి - 6న సీట్లు కేటాయించనున్న సాంకేతిక విద్యామండలి సాక్షి, హైదరాబాద్: పాలిసెట్-2016 ర్యాంకర్లకు తుదివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు సాంకేతిక విద్యామండలి అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 21 హెల్ప్లైన్ కేంద్రాల్లో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సర్టిఫికెట్ల పరిశీలనకు (తొలివిడతలో వెరిఫికేషన్ చేయించుకోని) అభ్యర్థులు హాజరుకావచ్చు. వీరితో పాటు మొదటి విడత కౌన్సెలింగ్కు హాజరైనా ఏ కళాశాలలోనూ సీటు రాని అభ్యర్థులు, ఒకవేళ సీటు పొందినప్పటికీ కళాశాల లేదా కోర్సును మార్చుకోవాలనుకుంటున్న అభ్యర్థులు కూడా ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం రాత్రి 8 గంటల వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన అభ్యర్థులకు ఈ నెల 6న సాయంత్రం ఆరుగంటల తరువాత సీట్ల కేటాయింపు చేయనున్నట్లు కౌన్సెలింగ్ క్యాంప్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు. తుదివిడత కౌన్సెలింగ్లో సీట్లు పొందిన వారు ఆయా కళాశాలల్లో ఈ నెల 8లోగా రిపోర్టు చేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అందుబాటులో 25 వేల సీట్లు తుది విడత కౌన్సెలింగ్కు హాజరవుతున్న అభ్యర్థులకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంకా 24,948 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 205 పాలిటెక్నిక్ కాలేజీల్లో 50,632 సీట్లుం డగా, తొలివిడత కౌన్సెలింగ్లో కేవలం 25,684 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. మిగిలిపోయిన సీట్ల భర్తీ నిమిత్తం తాజాగా తుదివిడత కౌన్సెలింగ్ ప్రక్రియను సాంకేతిక విద్యామండలి ప్రారంభించింది. సప్లిమెంటరీ అభ్యర్థులకు అవకాశం లేనట్టే పాలిసెట్లో ర్యాంకులు పొంది టెన్త్ ఫెయిలైన అభ్యర్థులకు తుదివిడత కౌన్సెలింగ్లో అవకాశం లేకుండా పోయింది. వివిధ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఈ ఏడాది భారీగా సీట్లు మిగిలిపోవడంతో టెన్త్ సప్లిమెంటరీలో పాసైన అభ్యర్థులకు అవకాశమివ్వాలని తొలుత సాంకేతిక విద్యామండలి భావించినప్పటికీ.. సప్లిమెంటరీ ఫలితాల విడుదలలో విద్యాశాఖ నుంచి స్పష్టమైన సమాచారం అందలేదని తెలుస్తోంది. దీంతో రెండో విడత ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇబ్బంది కలగకూడదని భావించిన సాంకేతిక విద్యామండలి అధికారులు.. తాజాగా తుదివిడత కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టారు. స్పాట్ అడ్మిషన్స్ షెడ్యూల్ నాటికి ఫలితాలు వస్తే టెన్త్ సప్లిమెంటరీలో పాసైన అభ్యర్థులకు పాలిటెక్నిక్లలో చేరేందుకు చివరి అవకాశం లభించనుంది. -
విద్యాశాఖాధికారులపై భగ్గుమన్న పీఏసీ
అధికారుల తీరుపై సీఎస్కు వివరించిన చైర్మన్ బుగ్గన సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ అధికారుల తీరుపై ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శాఖపై కంప్ట్రోలర్, ఆడిటర్ జన రల్ వ్యక్తం చేసిన అభ్యంతరాలకు వివరణ ఇవ్వకుండా, సాంకేతిక విద్యాశాఖ తమ పరిధిలోకి రాదని చెప్పడంతో కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అధికారుల తీరును కమిటీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ దృష్టికి తీసుకొచ్చారు. పీఏసీ ప్రాధాన్యాన్ని వివరించారు. వెంటనే ఆయన స్పందించారు. సచివాలయం నుంచి హుటాహుటిన అసెంబ్లీకి వచ్చిన ఆయన పీఏసీ ముందు హాజర య్యారు. అసెంబ్లీ కమిటీ సమవేశాలకు అధికారులు తప్పకుండా హాజరయ్యేలా చర్యలు తీసుకుంటానని, భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ తాము ఉన్నత విద్యపై కాగ్ వ్యక్తం చేసిన అభ్యంతరాలను సమీక్షించాలని భావించామని, ఆ శాఖ అధికారులు ఒక్క సాంకేతికశాఖ తమ పరిధిలోకి రాదనే ఉద్దేశంతో గైర్హాజరయ్యారని తె లిపారు. -
ఎస్సై ప్రిలిమినరీలో బీటెక్ల హవా..
సాక్షి, హైదరాబాద్: సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ప్రిలిమినరీ రాత పరీక్షలో అత్యధికంగా ఇంగ్లిషు, సాంకేతిక పరిజ్ఞానం మీద పట్టున్న వారే ఎంపికయ్యారు. వివిధ విభాగాల్లోని 539 ఎస్సై పోస్టుల భర్తీ కోసం దాదాపు 1,87,255 మంది దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఏప్రిల్ 17న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించగా 88,875 మంది అర్హత సాధించారు. అయితే వీరిలో బీటెక్, ఎంటెక్, ఎంసీఏ వంటి సాంకేతిక విద్య అభ్యసించిన వారే అత్యధికంగా అర్హత సాధించారు. బీటెక్ చేసిన 38,476 మంది దరఖాస్తు చేసుకోగా, 61.14 శాతంతో 23,526 మంది అర్హత సాధించారు. అలాగే ఎంటెక్ చదివిన 3,263 మంది దరఖాస్తు చేసుకోగా, 71.55 శాతంతో 2,335 మంది అర్హత సాధించారు. ఎంసీఏ చేసిన అభ్యర్థులు 2,982 మంది దరఖాస్తు చేసుకోగా, 77.86 శాతంతో 2,322 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక బీకాం అభ్యర్థుల విషయానికొస్తే 29,772 మంది దరఖాస్తు చేసుకోగా, 36.74 శాతంతో 10,940 మంది అర్హత సాధించారు. బీఏ అభ్యర్థుల విషయంలో కూడా 21,619 మంది దరఖాస్తు చేసుకోగా, 40.08 శాతంతో 8,665 మంది అర్హత సాధించారు. -
యూనివర్సిటీల్లో బయోమెట్రిక్ విధానం
వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నత విద్యామండలి టెక్నికల్ కార్యదర్శి ఆదేశం కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఈయేడాది నుంచే రాయలసీమ యూనివర్సిటీ, అనుబంధ డిగ్రీ, పీజీ కళాశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని ఉన్నత విద్యామండలి టెక్నికల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి సునీతాధావారా ఆదేశించారు. సోమవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్లో రాయలసీమ యూనివర్సిటీ వీసీ నరసింహులు, ఇతర అధికారులతో మాట్లాడారు. ఫీజురీయింబర్స్మెంట్ వివరాలను ఆధార్తో అనుసంధానం చేసి ఎలాంటి అక్రమాలకు చోటులేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. -
ఏపీ పాలిసెట్-2016 ప్రవేశ పరీక్ష ‘కీ’ విడుదల
విజయవాడ (మొగల్రాజపురం): రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో పాలిటెక్నిక్ డిప్లమో కోర్సుల్లో ప్రవేశాల కోసం గత నెల 27న నిర్వహించిన పాలిసెట్-2016 పరీక్ష ‘కీ’ని రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి కార్యదర్శి ఎ.నిర్మల్కుమార్ సోమవారం విడుదల చేశారు. ఫలితాలను ఈ నెల 7వ తేదీన విడుదల చేస్తామని తెలిపారు. జూన్ మొదటి వారంలో కౌన్సెలింగ్ జరుగుతుందని వివరించారు. ‘కీ’ని https://polycetap. nic.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా 333 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 1,32,385 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. -
వర్సిటీలకు కష్టకాలమే!
* ఉన్నత విద్యకు పెరగని కేటాయింపులు... సాంకేతిక విద్యకు కోత * పీఆర్సీ మేరకు వేతనాలు అందని పరిస్థితి * అంబేడ్కర్ ఓపెన్, తెలుగు వర్సిటీలకు ఒక్కపైసా కేటాయించని వైనం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని యూనివర్సిటీలకు ఈ ఏడాది కష్టకాలమే ఎదురవుతోంది. ల్యాబ్ల కోసం పరికరాల కొనుగోలు, నిర్మాణాలు, ఇతర అవసరాలు, కంప్యూటర్ విద్య, స్పోర్ట్స్కు మినహా యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీల నిర్వహణకు రాష్ట్ర బడ్జెట్లో పెద్దగా నిధులు కేటాయించలేదు. అంతేకాదు వర్సిటీల్లో పనిచేసే అధ్యాపకులు, సిబ్బందికి కొత్త పీఆర్సీ మేరకు వేతన సవరణ చేసినా... ఆ మేరకు వేతనాల నిధులను మాత్రం పెంచలేదు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన మేరకే ఈసారీ కేటాయించారు. ఇటీవలే అధ్యాపకులు, ఉద్యోగులకు పెరిగిన డీఏకు సంబంధించీ నిధులివ్వలేదు. దీంతో వర్సిటీల అధ్యాపకులకు ఇబ్బందులు తప్పేలా లేవు. మరోవైపు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెరిగాయి. కానీ డిగ్రీ కాలేజీలు, వర్సిటీల్లో పనిచేసే కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పెరిగిన మేరకు వేతనాలు ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూ వంటి ప్రధాన వర్సిటీలకు కూడా కేటాయింపు పెంచకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉస్మానియాలో వేతనాల కోసం గత బడ్జెట్లో రూ.238 కోట్లు ఇవ్వగా... ఈసారీ అంతే కేటాయించారు. కాకతీయ వర్సిటీకి కూడా గత బడ్జెట్ తరహాలోనే 67.03 కోట్లు కేటాయించారు. ఇక తెలుగు యూనివర్సిటీ, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వంటి వాటి నిర్వహణకు ఒక్క పైసా ఇవ్వలేదు. మంథని, సుల్తాన్పూర్లోని జేఎన్టీయూ కాలేజీలకు అత్తెసరు నిధులనే కేటాయించారు. గతేడాది సుల్తాన్పూర్ జేఎన్టీయూ కాలేజీకి రూ.50కోట్లు ఇవ్వగా, ఈసారి రూ.14కోట్లే కేటాయించారు. మంథని కాలేజీకి గతేడాది రూ.143కోట్లు ఇవ్వగా... ఈసారి రూ.64.50కోట్లతో సరిపుచ్చారు నిర్మాణాలు, ల్యాబ్లపై దృష్టి డిగ్రీ, ఇంటర్ కొత్త కాలేజీల్లో మాత్రం పలు నిర్మాణాలు, ల్యాబ్ సదుపాయాల కల్పన, కంప్యూటర్ విద్య బోధన, నైపుణ్యాల పెంపు, శిక్షణలకు బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేశారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు తెలంగాణ స్కిల్ నాలెడ్జ్ సెంటర్లకు రూ.6కోట్లు ఇచ్చారు. దీంతో సహా మొత్తంగా సదుపాయాల కల్పనకు రూ.46కోట్లు కేటాయించారు. డి గ్రీ కాలేజీల్లో నిర్మాణాలకు ఆర్డీఎఫ్ కింద రూ.98కోట్లు ఇచ్చారు. మొత్తంగా ఉన్నత విద్యకు గత బడ్జెట్లో రూ.1,652.39కోట్లు ఇవ్వగా... ఈసారి రూ.1,720.97కోట్లు కేటాయించారు. సాంకేతిక విద్యకు మాత్రం నిధులు తగ్గాయి. 2015-16 బడ్జెట్లో రూ.509.21కోట్లు కేటాయించగా ఈసారి రూ. 443.02 కోట్లే ప్రతిపాదించారు. పాలిటెక్నిక్లలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సదుపాయాల కల్పన కోసం గతేడాది రూ.18.38కోట్లు ఇస్తే ఈసారి రూ.47.07కోట్లు కేటాయించారు. -
పాఠశాల స్థాయి నుంచే సాంకేతిక విద్య
సాక్షి, హైదరాబాద్: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో వృత్తిపరమైన నైపుణ్యాలు పెంచేం దుకు, సాంకేతిక విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ప్రత్యేకంగా నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్క్(ఎన్ఎస్క్యూఎఫ్)ను రూపొందించి వొకేషనల్ విద్యను ప్రవేశపెట్టిన కేంద్రం ఇప్పుడు సాంకేతిక విద్యా కోర్సులను కూడా పాఠశాలస్థాయి నుంచే ప్రవేశ పెట్టేందుకు కసరత్తు చేస్తోంది. కళాశాల స్థాయి వరకు ఆయా కోర్సులను అనుసంధానం చేసే దిశగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా సెంట్రల్ అడ్వయిజరీ బోర్డు ఆఫ్ ఎడ్యుకేషన్(కేబ్) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ఇప్పటివరకు అమలు చేస్తున్న వృత్తి విద్యాకోర్సులను పరిశీలించి, భవిష్యత్తులో ఉండాల్సిన కోర్సులను పకడ్బందీగా రూపొందించేందుకు కేబ్ వివిధ రాష్ట్రాల మంత్రులతో కూడిన సబ్కమిటీని ఇటీవల ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి మానవ వనరుల మంత్రిత్వ శాఖ సహాయమంత్రి ప్రొఫెసర్ రామ్ శంకర్ కఠారియా చైర్పర్సన్. మరోవైపు ఇటీవల ఢిల్లీలో వివిధ రాష్ట్రాలకు చెందిన రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్(ఆర్ఎంఎస్ఏ) డెరైక్టర్లతో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ సమావేశం నిర్వహించింది. మోడల్ స్కూళ్లలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న వృత్తి విద్యా కోర్సులను అన్ని ఉన్నత పాఠశాలల్లో అమలు చేయాలని స్పష్టం చేసింది. సబ్ కమిటీ ఏం చేయాలంటే.. * ప్రస్తుతం అమల్లో ఉన్న వృత్తి, సాంకేతిక విద్యా విధానం, వాటిని పాఠశాలలు, ఉన్నత విద్యా కోర్సుల తో అనుసంధానం చేసే అంశాలపై అధ్యయనం చేయాలి. * వివిధ రాష్ట్రాల్లో స్కిల్, సాంకేతిక విద్య అమలులో ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లను రాష్ట్రాలవారీగా పరిశీలించాలి. వాటిని అధిగమించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణను రూపొందించాలి. * ప్రస్తుతం ఉన్న నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమాలు, కోర్సులు, వృత్తి విద్యా, శిక్షణా కోర్సులను బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలను వివరించాలి. * ఇప్పటివరకు అమలు చేస్తున్న వృత్తి విద్యా కోర్సులు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉన్నాయా? వాటిల్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలన్న అంశాలపై నివేదిక అందజేయాలి. * పరిశ్రమల భాగస్వామ్యం పెం చాలి. పరిశ్రమల్లో శిక్షణా కార్యక్రమాలు చేపట్టేలా, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సులను రూపొందించాలి. -
సాంకేతిక విద్యకు పెద్దపీట: డిప్యూటీ సీఎం
ఇబ్రహీంపట్నం(రంగారెడ్డి జిల్లా): టీఆర్ఎస్ ప్రభుత్వం సాంకేతిక విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ చెప్పారు. ఆయన శనివారం రాత్రి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలో ఇండియన్ యూత్ ఫెలోషిప్ (ఐవైఎఫ్) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ఇంజినీరింగ్ చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.10 లక్షల సాయం ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. -
ఉపాధి లేని చదువులేల?
-
ఉపాధి లేని చదువులేల?
* ఇంజనీరింగ్ చేసి కూలి పనులా? * విద్యాశాఖ సమీక్షలో సీఎం కేసీఆర్ * ఇక ఉపాధే లక్ష్యంగా చదువులుండాలి * సాంకేతిక విద్యను సమూలంగా మార్చాలి * కొత్త లెక్చరర్లతో సమర్థంగా డిగ్రీ కోర్సులు * మానవ వనరుల అవసరాలు గుర్తించండి * మైనారిటీలకు జిల్లాకో హాస్టల్, గురుకులం * గురుకుల విద్యంతా ఒకే గొడుగు కిందకు.. * గురుకులాల్లో గ్రాముల లెక్కన భోజనమేంది?... బఫే విధానంలో విద్యార్థులకు తిన్నంత పెట్టాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: ‘‘ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు హోంగార్డులుగా, సెక్యూరిటీ గార్డులుగా, ఉపాధి హామీ కూలీలుగా పనిచేస్తుండటం సిగ్గుచేటు. మెరుగైన ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించని చదువులెందుకు? సాంకేతిక విద్యను సమూలంగా మార్చేయండి. ప్రభుత్వమే గాక ప్రైవేటు రంగంలోనూ ఎన్నో ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్నాయి. వాటిపై దృష్టి పెట్టండి. ఆయా రంగాల అవసరాలకు అనుగుణంగా కోర్సులు రూపొందించండి. అవి యువతకు మెరుగైన ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేలా చూడండి. రాష్ట్రంలో ఉన్నత విద్యా వ్యవస్థను సమూలంగా మార్చేయండి’’ అని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కేజీ టు పీజీ, ఉన్నత విద్యా రంగంపై ఆయా విభాగాల ఉన్నతాధికారులతో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం దాకా సచివాలయంలో ఆయన సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. పలు శాఖల కింద పనిచేస్తున్న రెసిడెన్షియల్ విద్యా సంస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తేవాలని ఆదేశించారు. ప్రస్తుతం 668 గురుకులాలుండగా, నియోజకవర్గానికి సగటున 10 చొప్పున వాటిని రాష్ట్రవ్యాప్తంగా 1,190కి పెంచాలన్నారు. 12వ తరగతి వరకు వాటిలో పేద విద్యార్థులకు ఉచిత విద్యనందించాలని, ఎస్సీ, ఎస్టీలందరికీ ప్రవేశాలు కల్పించాలని ఆదేశించారు. ‘‘ప్రస్తుతం సాంఘిక సంక్షేమ గురుకులాలు మెరుగ్గా నడుస్తున్నాయి. అన్నీ అదే నమూనాలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగ తదితర విభాగాలుగా గురుకులాలు నడుస్తుండటం, ఒక్కోదాంట్లో ఒక్కో విధానం, ఒక్కోరకం మెస్ చార్జీలుండటం సరికాదు. అన్నింటిలో ఒకే రకమైన విద్య, వసతులు కల్పించండి. విద్యార్థులకు గ్రాముల చొప్పున భోజనమేమిటి? ఇకపై అలా కాకుండా బఫే పద్ధతిలో వారికి తిన్నంత భోజనం పెట్టాలి’’ అని ఆదేశించారు. ‘‘పిల్లలు నాలుగో తరగతి దాకా తల్లిదండ్రుల సంరక్షణలోనే ఉండాలి. ఆ మేరకు గ్రామ స్థాయిలోనేవిద్యా బోధన జరగాలి. తరవాత మాత్రం ఇంగ్లిష్ మీడియంలో చదువు చెప్పాలి’’ అన్నారు. దళిత అమ్మాయిలకూ ప్రత్యేక హాస్టళ్లు రాష్ట్రంలో మైనారిటీల సంఖ్య ఎక్కువగా ఉండగా, వారికి హాస్టళ్లు తక్కువగా ఉన్నాయని సీఎం అన్నారు. ‘‘రాష్ట్రంలో 3,000 హాస్టళ్లుండగా మైనారిటీ విద్యార్థులకు 21 మాత్రమే ఉన్నాయి. అందుకే ప్రతి జిల్లాలో మైనారిటీ విద్యార్థులకు ఒక రెసిడెన్షియల్ పాఠశాల, హాస్టల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. మైనారిటీ బాలికలు మధ్యలోనే చదువు ఆపేస్తున్నారు. ప్రత్యేక వసతి, సదుపాయాలు కల్పిస్తే పై చదువులు చదువుతారు’’ అని చెప్పారు. దళిత అమ్మాయిల కోసం కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక హాస్టల్ ఏర్పాటు చేయాలన్నారు. చదువంటే ఇంజనీరింగ్, మెడిసినే కాదు చదువంటే ఇంజనీరింగ్, మెడిసిన్ మాత్రమేనన్న భావనను పోగొట్టాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సాంకేతిక విద్యలో మార్పులు తేవాలన్నారు. సమాజానికి అవసరమయ్యే సేవలేమిటి, అందుకు విద్యార్థులను ఎలా తయారు చేయాలి, ఏ వృత్తిలో ఎందరు అవసరం వంటి విషయాలను గుర్తించి చర్యలు చేపట్టాలని విద్యాశాఖను ఆదేశించారు. ఐటీఐలనూ విద్యా శాఖే నిర్వహించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని ఉద్యోగావకాశాలను గుర్తించి డిగ్రీలో తదనుగుణంగా కోర్సులను ప్రవేశపెట్టాలని ఆదేశించారు. ‘‘దీనిపై విద్యార్థులకూ అవగాహన కల్పించండి. పోటీ పరీక్షలంటే పబ్లిక్సర్వీసు కమిషన్ల ద్వారా వచ్చే ఉద్యోగాలేనన్న భావన పట్టభద్రుల్లో ఉంది. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మరెన్నో ఉద్యోగాలున్నాయని డిగ్రీ స్థాయిలోనే విద్యార్థులకు తెలిసేలా చేయాలి. డిగ్రీ చదువుతూనే ఏం చేయాలో వారిలో స్పష్టత తేవాలి. డిగ్రీ కోర్సులను మరింత సమర్థంగా నిర్వహించాలి. అందుకవసరమైన లెక్చరర్ల నియామకాన్ని పూర్తి చేస్తాం. ద్వితీయ భాషగా తెలుగు, ఉర్దూలను ఎంచుకునే వెసలుబాటు కల్పించాలి. అప్పుడే ఇంగ్లిష్ మీడియం వారికి మాతృభాషపై పట్టుంటుంది’’ అన్నారు. అనాథలకు స్టేట్ చిల్డ్రన్గా గుర్తింపు అనాథ పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం కేసీఆర్ సూచించారు. ‘‘వారికి రాష్ట్ర ప్రభుత్వమే తల్లీతండ్రి అని ప్రకటించినందున వారి పోషణ, రక్షణ బాధ్యత తీసుకోవాలి. అనాథ పిల్లలను స్టేట్ చిల్డ్రన్గా గుర్తించండి. పది పూర్తయిన వారిని ఇంటర్కు గురుకులాల్లో చేర్పించండి’’ అని ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, ప్రభుత్వ సలహాదారు పాపారావు, పలువురు ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. -
కంప్యూటర్ క్లాస్ లేనట్టే!
‘సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుందాం.. టెక్నాలజీలో ముందుకెళదాం..’ అంటూ ఊదరగొట్టే ప్రభుత్వం, విద్యార్థులకు కంప్యూటర్ విద్యను దూరం చేస్తోంది. ఉన్నత పాఠశాలల్లో ఈ విద్యను అందించే ప్రాజెక్టును నిలుపుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది. తమను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి, ఇప్పుడీ నిర్ణయం ఏంటని కంప్యూటర్ కాంట్రాక్ట్ టీచర్లు ప్రశ్నిస్తున్నారు. బాబొచ్చాక ఉన్న జాబు ఊడుతోందని ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు సైతం తీవ్ర నిరాశ చెందుతున్నారు. చిలకలూరిపేట రూరల్ : ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తోన్న కంప్యూటర్ విద్యను అటకెక్కించింది. ఈ విద్యను అందించే ఐసీటీ ప్రాజెక్టును నిలుపుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది. జిల్లావ్యాప్తంగా 267 ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ విద్యను బోధిస్తున్నారు. 534 మంది కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు ఈ విద్యను బోధిస్తున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 66,750 మంది విద్యార్థులు కంప్యూటర్ విద్యను అభ్యసిస్తున్నారు. ప్రభుత్వం 2012-13 విద్యా సంవత్సరంలో కంప్యూటర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ నేతృత్వంలో లెవల్ 1, 2, 3, 4 గా పుస్తకాలను పంపిణీ చేసింది. జిల్లాలోని అన్ని ఉన్నత, మున్సిపల్ పాఠశాలల్లో విద్యార్థులకు వారానికి మూడు క్లాస్లు నిర్వహిస్తున్నారు. ఆరవతరగతి నుంచి పదో తరగతి వరకు కంప్యూటర్ విద్యార్థులకు ఎంఎస్ పెయింటింగ్, పవర్ పాయింట్, కంప్యూటర్ ఇవాల్యూషన్, ఎంఎస్ ఆఫీస్, వర్డ్, ఎక్సెల్, ఇంటర్నెట్, ఎంఎస్ ఎక్సెస్, హెచ్టీఎంఎల్, వెబ్ డిజైనింగ్ వంటివి పాఠ్యాంశాలుగా బోధిస్తున్నారు. ప్రైవేటు సెంటర్లలో వేలకువేలు ఫీజులు చెల్లించలేని మధ్య, దిగువ తరగతి విద్యార్థులకు ఈ విద్య వరంలాంటిది. రిగ్యులరైజ్ చేస్తారనుకుంటే.. అయితే కంప్యూటర్ విద్యను అందించే ఏజెన్సీలను ఈ నెల ఐదో తేదీ నుంచి నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏజెన్సీద్వారా 2002లో కేవలం రూ.1,410 వేతనంతో కాంట్రా క్ట్ ఉపాధ్యాయులు నియమితులయ్యారు. 2008 లో వీరికి వేతనాన్ని రూ.2,410కి పెంచారు. ప్రభుత్వం తమను రిగ్యులరైజ్ చేస్తుందని ఆశతో వీరంతా పని చేస్తున్నారు. ఏజెన్సీ నిర్వహణకు బ్రేక్ వేయడంతో తాము ఉపాధి కోల్పోతున్నామని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై చిలకలూరిపేట ఎంఈవో కె.మురళీధరరావును వివరణ కోరగా కొంతకాలం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యాబోధన నిలచిపోయిందన్నారు. ప్రభుత్వం వెంటనే మరో ప్రాజెక్ట్ను ఎంపిక చేసి దీనిని పునఃప్రారంభిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. జీతాలు తక్కువైనా.. ప్రభుత్వం అందించే నామమాత్రపు వేతనాలతో వేలాదిమంది విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందించాం. ఉన్న పళంగా ప్రభుత్వం ఏజెన్సీ నిలుపుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయటం బాధగా ఉంది. - చింతలపూడి వీరబ్రహ్మం, కంప్యూటర్ ఉపాధ్యాయుడు, జెడ్పీ హైస్కూల్, మురికిపూడి, చిలకలూరిపేట మండలం. ఉన్నది ఊడగొట్టారు... సుదీర్ఘకాలం నుంచి విధులు నిర్వహిస్తున్న కంప్యూటర్ ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేస్తారని భావించాం. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించాలి. - టీవీ నరసింహారావు, కంప్యూటర్ ఉపాధ్యాయుడు, జెడ్పీ హైస్కూల్, గుమ్మనంపాడు, బొల్లాపల్లి మండలం -
నీరు, నిధులు..
దృష్టి సారించకపోతే ఎస్కేయూ మనుగడకే ముప్పు ఎస్కేయూ ఇన్చార్జ్ వీసీ చార్య లాల్ కిశోర్ సాంకేతిక విద్యలో 30 ఏళ్ల బోధనానుభవం.. విస్తృత పరిశోధనలతో కీలక నిర్ణయూలకు దోహదమైన మేధావి ఆచార్య కొండేపూడి లాల్కిశోర్. ప్రస్తుతం ఈయన జేఎన్టీయూ(అనంతపురం) వైస్ చాన్స్లర్ (వీసీ)గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఎస్కేయూకూ ఇన్చార్జ్ వీసీగా వ్యవహరిస్తున్నారు. కచ్చితమైన నిర్ణయూలు తీసుకోవడంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచిన ఆయన ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్గా ఎస్కేయూలో కలియదిరుగుతూ ఏన్నో ఏళ్లుగా తిష్ట వేసిన సమస్యలపై విద్యార్థులు, సిబ్బందితో మాట్లాడారు. బోధన సిబ్బంది సమస్యలు, విద్యార్థుల ఇక్కట్లు, విభాగాధిపతుల కష్టాల గురించి ఆరా తీస్తూనే పలు సూచనలు చేశారు. వీసీనే స్వయంగా తమ కష్టాల గురించి ఆరా తీయడంతో కొన్ని సమస్యలైనా పరిష్కారానికి నోచుకుంట్యాని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు, సిబ్బందితో వీసీ మాటామంతీ ఇలా.. లాల్ కిశోర్ : అందరూ బాగున్నారా... ఇంజినీరింగ్ విద్యార్థులు : బాగున్నాం సార్ లాల్ కిశోర్ : రాజ్యాంగం కల్పించిన హక్కులు, భాద్యతలు తెలుసా? మౌనిక (బీటెక్ సివిల్ ఇంజనీరింగ్): ప్రజాస్వామ్యం పద్ధతి ప్రకారం నడవాలని రాజ్యాంగ నిర్మాతలు హక్కులతో పాటు బాధ్యతలను కూడా యిచ్చారు. హక్కుల గురించి పోరాడటంతో పాటు ప్రతి పౌరుడు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తే బాగుంటుంది. లాల్ కిశోర్ : సివిల్ బ్రాంచ్ ఎందుకు తీసుకున్నావు? మౌనిక : కోర్ బ్రాంచెస్కి చాలా ప్రాముఖ్యత ఉంది. భవిష్యత్లో సివిల్ ఇంజినీరింగ్కు డిమాండు అధికంగా ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు బాగా ఉంటాయనే నమ్మకం ఉంది. లాల్ కిశోర్ : సివిల్స్కు ప్రిపేరవుతున్నావా? సాయి శిరీష : అవును సార్, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ సాధించాలనే ధ్యేయంతో ఉన్నా. లాల్ కిశోర్: కళాశాలలో బోధన ఎలా ఉంది? ఝాన్సీ: టు బీ ప్రాంక్ చాలా బాగుంది సార్. నిరంతరం తరగతులు జరుగుతున్నాయి. నూతన విధానాలతో ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాం. ప్రత్యేక చొరవ తీసుకుని ఫ్యాకల్టీ బాగా చెబుతున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లిష్పై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. లాల్ కిశోర్ : ఇంజినీరింగ్ రంగంలో యువతకు భవిష్యత్తు ఎలా ఉందనుకుంటున్నారు? అఖిల (సీఎస్ఈ): మారుతున్న కాలానుగుణంగా నైపుణ్యాలు పెంపొందించుకోవాల్సి ఉంది. ఇంటర్కు, బీటెక్ అకడమిక్ పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉంది. ఇక్కడ ఎక్కువగా డీవియేట్ కావడానికి అవకాశాలు ఎక్కువ. అధ్యాపకులు చెప్పే అంశాల కంటే స్వతహాగా నేర్చుకునే అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి. నిర్బంధ విద్య తరహాలో కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్ విద్య ఉండడంతో ఎక్కువగానే నేర్చుకున్నామని చెప్పాలి. బీటెక్లో ఎవరికి వారు స్వీయ నియంత్రణతో సబ్జెక్ట్పై పూర్తి పట్టు పెంచుకుంటే అవకాశాలకు కొదవ ఉండదని నా అభిప్రాయం. లాల్ కిశోర్ : ఇంజినీరింగ్ కళాశాలలో మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి? శ్రావణ్ కుమార్ రెడ్డి: నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. తాగడానికి కూడా నీళ్లు లేవు. ప్రత్యేకించి మరుగు దొడ్లు ఏ మాత్రం లేవు. అమ్మాయిలు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి ఎద్దడితో ప్రతి ఏటా రెండు నెలలు ఆలస్యంగా తరగతులను నిర్వహించాల్సిన దుస్థితి దాపురించింది. దీంతో సిలబస్ పూర్తికాకపోవడంతో అవస్థలు పడాల్సి వస్తోంది. లాల్ కిశోర్ : ల్యాబొరేటరీస్ ఎలా ఉన్నాయి? శ్రావణ్ కుమార్ రెడ్డి: కొత్తగా ఏర్పాటు చేశారు సార్.. తరగతులు బాగా నిర్వహిస్తున్నారు. అన్నీ బాగున్నాయి. లాల్ కిశోర్ : హాస్టల్స్ ఎలా ఉన్నాయి? రమ్య: పర్వాలేదు. నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది సార్.. లాల్ కిశోర్ : ఏఏ బుక్స్ చదువుతున్నావు? చందన : లైబ్రరీ సదుపాయం ఉంది. లెక్చరర్స్ చెప్పిన పుస్తకాలతో పాటు లైబ్రరీ పుస్తకాలను చదువుతున్నాం. లాల్ కిశోర్ : కోర్సు వర్క్ ఎలా ఉంది? మౌనిక : కంప్యూటర్ సైన్స్లో బీటెక్ చదువుతున్నా. ప్రత్యేకించి బయట కంప్యూటర్ కోర్సులను నేర్చుకుంటున్నా. భావవ్యక్తీకరణ నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి ప్రతి రోజు ఇంగ్లిష్ పేపరు చదువుతున్నా. దీంతో వర్తమాన అంశాలపై కూడా పట్టు ఏర్పడుతోంది. ఇంజనీరింగ్ కళాశాల ఆవరణంలో మొక్కలు నాటుతున్న విద్యార్థులను ఉద్ధేశించి లాల్ కిశోర్: ఎన్ ఎస్ ఎస్ క్యాంపు వల్ల ఉపయోగమేమిటీ? మీరు ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు? సుగుణ బాబు: జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) విద్యార్థి దశలోనే జాతికి సేవ చేయడానికి కల్పించిన ఓ మహావకాశం. ఏ పౌరుడైనా తన మాతృదేశానికి సేవ చేస్తేనే రుణం తీర్చుకున్నవారవుతారు. విద్యార్థి దశ నుంచి సేవ అలవర్చుకోవడానికి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. మూడు రోజుల నుంచి చిన్నకుంట గ్రామంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటుతున్నాం. వాటి సంరక్షణ పై ప్రచారం చేస్తున్నాం. ఎస్కేయూలో ప్రతి చెట్టుకు పాదులు తీసి ట్యాంకరు ద్వారా నీటి సరఫరా చేయిస్తున్నాము. లాల్ కిశోర్: మొక్కలు నాటడం వల్ల ఎలాంటి అనుభూతికి లోనవుతున్నారు? కుసుమ : చెట్లు నాటడం వల్ల వర్షాలు బాగా కురుస్తాయి. ప్రకృతి చేసిన ద్రోహం కంటే మానవ ఆకృత్యాలతో కృత్రిమ కరువును తెచ్చుకుంటున్నాము. ఈ వైఖరి మారాలి. ప్రతి ఒక్కరూ విధిగా చెట్లను పెంచాలి. మేము నాటే మొక్కను నాలుగేళ్లు సంరక్షించుకుంటే తర్వాత అదే పెరుగుతుంది. మేము మా ఇంటి వద్ద కూడా నలభై మొక్కలు నాటాము. లాల్ కిశోర్ : ఓకే ఆల్ ది బెస్ట్.. మొక్కల పెంపకాన్ని ఇలాగే కొనసాగించండి. ఫార్మసీ విభాగంలోని బోధన సిబ్బందితో లాల్ కిశోర్: సిబ్బంది కొరత ఉందా? వరలక్ష్మి (ఫార్మసీ లెక్చరర్): బీ.ఫార్మసీ విభాగం మొదట ఇంజనీరింగ్ విభాగం కింద ఉండేది. తర్వాత సొంతంగా బిల్డింగ్ సదుపాయం కలిగింది. అపుడు ముగ్గురు టీచింగ్ స్టాఫ్ ఉండేవాళ్లు .ప్రస్తుతం తొమ్మిది మంది ఉన్నారు. ఈ సంఖ్య ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. మూడేళ్ల నుంచి ఫ్యాకల్టీకి జీతాలు పెంచలేదు. ఫార్మసీ ఇన్ఛార్జ్ ప్రొఫెసర్ డాక్టర్ హుస్సేన్రెడ్డితో లాల్ కిశోర్ : ప్రత్యేక పరికరాలు ఏమైనా ఉపయోగిస్తున్నారా? హుస్సేన్రెడ్డి : ల్యాబొరేటరీలో కొన్ని ప్రత్యేక పరికరాలు అమర్చాము. ఫార్మసీ విభాగానికి ఏఐసీటీఈ నుంచి గుర్తింపు పొందిన వర్సిటీలో ఇదే మొదటిది. కౌన్సిల్ ఫర్ ఫార్మసీ ఇండియా నుంచి కూడా గుర్తింపు పొందితే నిధులు బాగా వస్తాయి. ఆ విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం సార్.. ఎం.ఫార్మసీని కూడా నిర్వహిస్తున్నాం. లాల్ కిశోర్: విద్యార్థులను ఎలా సన్నధ్దం చేస్తున్నారు? కిశోర్ (ఫార్మసీ లెక్చరర్) : ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక నైపుణ్యాలు పెంపొందించేలా చర్యలు తీసుకుంటున్నాం. దీంతో హెటిరో, రెడ్డీస్ ల్యాబ్ వంటి బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. విభాగానికి నిధులు కొరత ఉంది. ప్రాక్టకల్స్ నిర్వహించడానికి పక్క విభాగాల నుంచి పరికరాలు తీసుకోవాల్సి వస్తోంది. ప్రాక్టికల్స్ చేయలేనివి డెమో ద్వారా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మరింతగా ఫార్మసీ విభాగాన్ని ఆధునీకరించాల్సి ఉంది. లాల్ కిశోర్: బి.ఫార్మసీ పూర్తయ్యూక ఏం చేయాలనుకుంటున్నారు? అంజలి (బీ.పార్మసీ విద్యార్థి): జాబ్ చేయాలనుకుంటున్నా సార్.. లాల్ కిశోర్: ఫార్మసిస్ట్ల పాత్ర ఏమిటి? ఎం.శిరీష : సమాజంలో ఫార్మసిస్టులది కీలకమైన పాత్ర. రోగాలకు ఔషధాలను కనుక్కోవాలి. నిరంతరం పరిశోధనలు కొనసాగించాలి. రాష్ట్ర విభజన తర్వాత కోస్తా ప్రాంతం కంటే రాయలసీమ ప్రాంతంతో ఫార్మా రంగం అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కెమిస్ట్రీ విభాగాధిపతి ఆచార్య జే.శ్రీరాములతో లాల్ కిశోర్: ఎస్కేయూలో కెమిస్ట్రీ విభాగానికున్న ప్రత్యేకత ఏమిటి? శ్రీరాములు : ప్రతి ఏటా సీఎస్ఐఆర్ ఫెలోషిప్లకు ఐదు నుంచి 10 మంది ఎంపికవుతున్నారు. ఎస్ఏపీ, యూజీసీ ప్రాజెక్ట్లు మూడు నడుస్తున్నాయి. గతంలో 14 మంది బోధన సిబ్బంది ఉండేవాళ్లు. ప్రస్తుతం ఆ సంఖ్య ఎనిమిదికి పడిపోయింది. సిబ్బంది కొరత వేధిస్తోంది. పోస్టులు భర్తీ చేస్తే మరింత అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. సొంత డబ్బుతో కొన్ని వస్తువులను కొని ల్యాబ్లకు వాడుకునే పరిస్థితి ఏర్పడింది. వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. లాల్ కిశోర్: ఎన్విరాన్మెంట్ స్టడీస్లో పరిశోధనలు ఏమైనా చేశారా? సుధాకర్ బాబు (కెమిస్ట్రీ ప్రొఫెసర్): రాయలసీమలో ఏర్పడిన కాలుష్యంపై ప్రత్యేక పరిశోధనలు చేశాము. సాయిల్ అనాలసిస్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాము. కెమిస్ట్రీ విభాగం నుంచి చదివి ఎంతో మంతి అత్యున్నతమైన స్థానాల్లో కొనసాగుతున్నారు. లాల్ కిశోర్: నూతన ఆవిష్కరణల గురించి.. ఎల్.కే.రవీంద్రనాథ్ (కెమిస్ట్రీ బీఓఎస్ చెర్మైన్): ఈ విభాగం నుంచి 300 పీహెచ్డీలు ప్రదానం చేశాం సార్. 1500 పబ్లికేషన్స్ను ముద్రించాము. బోధన సిబ్బంది కొరత ఉంది. దీనికి తోడు ఛాయిస్ బేస్డ్ సిస్టమ్ విధానానికి మరింత మంది ఫ్యాకల్టీ అవసరం ఏర్పడింది. మామ్ వంటి ప్రాజెక్ట్ల రూపకల్పనలో ఇక్కడి పూర్వ విద్యార్థుల సహకారం ఉంది. లాల్ కిశోర్: ఎస్కేయూలో నీటి సమస్యను తీర్చడానికి ప్రత్యామ్నాయ చర్యలు ఏమైనా ఉన్నాయా? లింగారెడ్డి(వైఎస్సార్ విద్యార్థి విభాగం కార్యదర్శి): వర్సిటీలో నీటి ఎద్దడిని నివారించడానికి పీఏబీఆర్ డ్యాం నుంచి నీటిని సరఫరా చేరుుంచాలి సార్.. ఈ సమస్యతో ప్రతి ఏటా అకడమిక్ ఇయర్ డిస్టర్బ్ అవుతోంది. వందలాది భోదన, భోదనేతర ఉద్యోగాలు భర్తీకి నోచుకోలేదు. వీటిని భర్తీ చేస్తే విద్యలో నాణ్యత పెంపొందుతుంది. ఎస్కేయూలో తాగునీటి ఎద్దడి తీవ్రతరం ఎస్కేయూలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఆలోచించాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్సిటీ మనుగడకే ప్రమాదకరమైన నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి. బీటెక్ కోర్సులను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. బీ-ఫార్మసీ విభాగానికి నిధులు పెంచాలి. వర్సిటీలో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయాలి. - ఎస్కేయూ ఇనచార్జ్ వీసీ ఆచార్య కె. లాల్కిశోర్ -
ర్యాగింగ్ను సహించం
బెల్లంపల్లి : వారందరూ సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు. సుదూర ప్రాంతాల నుంచి నిత్యం బస్సులు, ఆటోల్లో బెల్లంపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు రాకపోకలు సాగిస్తుంటారు. అలా వచ్చి వెళ్లే క్రమంలో బాలికలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక కళాశాలలో కొత్తగా చేరిన విద్యార్థిని, విద్యార్థులు ఈవ్టీజింగ్, ర్యాగింగ్ వంటి ఆకృత్యాలకు గురయ్యే అవకాశాలు లేకపోలేదు. ఇలా విద్యార్థిని, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పోలీసుశాఖ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింపజేసే ప్రయత్నం చేసింది సాక్షి. శాంతిభద్రత పరిరక్షణలో ఎంతో బిజీగా ఉండే బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీ భాస్కర్ భూషణ్ వీఐపీ రిపోర్టర్గా మారి పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులతో అడిషనల్ ఎస్పీ సంభాషణ ఇలా సాగింది.. అడిషనల్ ఎస్పీ : హాయ్ గల్స్, హౌఆర్యూ.. విద్యార్థినులు : (బెంచీపై నుంచి లేచి నిలబడి) హాయ్ సార్.. అడిషనల్ ఎస్పీ : నేను భాస్కర్భూషణ్, అడిషనల్ ఎస్పీ విద్యార్థినులు : ఓకే సార్.. గుర్తు పట్టాం అడిషనల్ ఎస్పీ : ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్గా మీ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోవడానికి వచ్చాను. చెప్పండి(అంటూనే ఓ విద్యార్థినిని పలకరించారు.) అడిషనల్ ఎస్పీ : నీ పేరేంటమ్మా...? విద్యార్థిని : సార్.. నా పేరు అనుష అడిషనల్ ఎస్పీ : ఏం చదువుతున్నావు..? అనూష : ఏఈఐ ఫైనల్ ఇయర్ అడిషనల్ ఎస్పీ : ఓకే.. మీ కాలేజీలో ఈవ్టీజింగ్ ఏమైనా జరుగుతోందా? అనూష : అలాంటిదేమీ లేదు సార్.. అడిషనల్ ఎస్పీ : భయపడకు, అలా జరిగితే నిర్భయంగా చెప్పు.(పక్కనే ఉన్న మరో విద్యార్థిని కల్పించుకొని మాట్లాడారు) విద్యార్థిని : లేదు సార్.. మేము బాగానే ఉంటున్నాం. అడిషనల్ ఎస్పీ : మీ పేరేంటీ?వనజ : సార్ నా పేరు వనజ అడిషనల్ ఎస్పీ : ఏం చదువుతున్నావు. మీదెక్కడా? వనజ : నేను కూడా ఏఈఐ ఫైనల్ ఇయర్, మాది జైపూర్ సార్ అడిషనల్ ఎస్పీ : ఓకే.. మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? వనజ : ఫార్మర్స్(రైతులు) సార్ అడిషనల్ ఎస్పీ : ఓకే మిమ్మల్నీ ఎవరైనా ఈవ్టీజ్ చేస్తే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటారు.. వనజ : అది.. సార్.. అడిషనల్ ఎస్పీ : ఏం పరవాలేదు ధైర్యంగా చెప్పమ్మా.. వనజ : సార్.. అమ్మాయిలను టీజ్ చేసే వారిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలి. అడిషనల్ ఎస్పీ : ఓకే.. ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వనజ : ఇకముందు మరే అమ్మాయిని టీజ్ చేయకుండా ఫనిష్మెంట్ ఇవ్వాలి. బట్ అతడి స్టడీ మాత్రం స్పాయిల్ కాకుండా చూడాలి సార్. అడిషనల్ ఎస్పీ : గుడ్... బాగా చెప్పావమ్మా.(మరో అమ్మాయితో అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ) అడిషనల్ ఎస్పీ : మీ పేరేంటమ్మా? విద్యార్థిని : సార్, నా పేరు సుప్రియ అడిషనల్ ఎస్పీ : ఎక్కడ నుంచి వస్తావు సుప్రియ : సార్, మాది రామకృష్ణాపూర్ అడిషనల్ ఎస్పీ : కాలేజీకి ఎలా వస్తావు.. సుప్రియ : బస్సులో వస్తాను సార్ అడిషనల్ ఎస్పీ : బస్సు ప్రయాణంలో ఏమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయా.. సుప్రియ : పెద్దగా ప్రాబ్లమ్స్ లేవు సార్. అడిషనల్ ఎస్పీ : బస్సులో గల్స్ కూర్చునేందుకు సీటు ఇస్తారా? సుప్రియ : ఒక్కోసారి కష్టంగానే ప్రయాణం చేస్తుంటాం సార్.. (మరో అమ్మాయితో మాట్లాడుతూ) అడిషనల్ ఎస్పీ : మీ పేరేంటీ విద్యార్థిని : నా పేరు హారతి సార్ అడిషనల్ ఎస్పీ : నువ్వెక్కడి నుంచి కాలేజీకి వస్తావు హారతి : మందమర్రి నుంచి సార్ అడిషనల్ ఎస్పీ : నీవు కూడా బస్సులోనే వస్తావా హారతి : అవును సార్.. అడిషనల్ ఎస్పీ : ఓకే.. బస్సు ప్రయాణంలో ప్రాబ్లమ్స్ లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది?(మరో విద్యార్థిని కల్పించుకొని మాట్లాడారు.) విద్యార్థిని : సార్ హైదరాబాద్లో మాదిరిగా ఇక్కడ కూడా బస్సుల్లో ఉమెన్స్కు ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలి. అడిషనల్ ఎస్పీ : ఓకే... మీ పేరు? విద్యార్థిని : సార్ నా పేరు సుష్మిత అడిషనల్ ఎస్పీ : ఈ విషయం ఆర్టీసీ అధికారుల దృష్టికి మీరెప్పుడైనా తీసుకెళ్లారా? సుష్మిత, సుప్రియ, హారతి : లేదు సార్.. అడిషనల్ ఎస్పీ : కనీసం మీ కాలేజీ ప్రిన్సిపాల్, లెక్చరర్స్కు చెప్పారా? సుష్మిత, సుప్రియ, హారతి : చెప్పలేదు సార్.. అడిషనల్ ఎస్పీ : మీరు పడుతున్న ప్రాబ్లమ్స్ ఆర్టీసీ అధికారులకు చెప్పండి. పరిశీలించి సాల్వ్ చేస్తారు. ఓకేనా.. సుష్మిత, సుప్రియ, హారతి : అలాగే సార్ అడిషనల్ ఎస్పీ : ఉమెన్స్ రక్షణకు ప్రత్యేకంగా చట్టాలు ఉన్నాయి తెలుసా? హారతి : కొన్ని తెలుసు సార్.. అడిషనల్ ఎస్పీ : ఉమెన్స్ను వేధిస్తే నిర్భయ చట్టం, రక్షణకు షీ, అత్యవసరంగా 181 వంటి సదుపాయాలను పోలీసు శాఖ కల్పిస్తోంది. సుప్రియ : అవును సార్. వీటి గూర్చి ఇంకా చాలామందికి తెలియదు.. అడిషనల్ ఎస్పీ : ఇలాంటి విషయాలను గల్స్ తోటి వారికి చెప్పాలి. వారికి అవగాహన కల్పించాలి. హారతి : అలాగే చెబుతాం సార్ అడిషనల్ ఎస్పీ : గల్స్ను వేధించినట్లు తెలిస్తే సహించేది లేదు. చట్టపరంగా దోషులపై చర్య లు తీసుకుంటాం. బాయ్స్ బుద్ధిగా మెలగాలి.(అంటూ అక్కడి నుంచి అడిషనల్ ఎస్పీ వరండాలో ఉన్న విద్యార్థుల వైపు వెళ్లారు.) అడిషనల్ ఎస్పీ : (ఓ విద్యార్థి వద్దకు వెళ్లి) నీ పేరేంటీ? విద్యార్థి : నా పేరు నితిన్ అడిషనల్ ఎస్పీ : ఫ్రెషర్స్ను ఎవరైనా ర్యాగింగ్ చేస్తున్నారా? నితిన్ : మా కాలేజీలో ర్యాగింగ్ జరగదు సార్.. అడిషనల్ ఎస్పీ : ఓకే.. ఇంత వరకు ఎవరిని ర్యాగింగ్ చేయలేదా? నితిన్ : లేదు సార్.. అడిషనల్ ఎస్పీ : ఇంతకుముందు ర్యాగింగ్ జరిగినట్లు విన్నాను. నిజం కాదా? నితిన్ : సార్.. నాకైతే తెలియదు. అడిషనల్ ఎస్పీ : ర్యాగింగ్, ఈవ్టీజింగ్ నిషేధం కనుక అటువంటి చర్యలు కాలేజీలో జరిగితే సహించేది లేదు. ఆ దుశ్చర్యలకు పాల్పడే విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా కాలేజీ నుంచి తొలగించబడతారు. విద్యార్థులు (సామూహికంగా మాట్లాడుతూ) : అలాంటి చర్యలకు పాల్పడం సార్ అడిషనల్ ఎస్పీ : మీ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉందా? నితిన్ : ఉంది సార్ అడిషనల్ ఎస్పీ : వెరీగుడ్.. మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటీ? నితిన్ : గౌట్జాబ్ సాధించాలనేది నా ఏయిమ్ సార్ అడిషనల్ ఎస్పీ : ఓకే... బెస్టాఫ్లక్.(మరో విద్యార్థిని పలకరించారు.) మీ పేరేంటీ? విద్యార్థి : శ్రీకాంత్ సార్ అడిషనల్ ఎస్పీ : మీ కాలేజీలో ప్లేస్మెంట్ ఉందా? శ్రీకాంత్ : లేదు సార్.. అడిషనల్ ఎస్పీ : ఎందుకు జరగడం లేదు...? శ్రీకాంత్ : ఏమో సార్.. నాకు తెలియదు. అడిషనల్ ఎస్పీ : మైనింగ్ బ్రాంచి ఉంది కదా? సింగరేణిలో హండ్రెడ్ పర్సెంట్ మైనింగ్ ఉద్యోగాలు వస్తాయి కదా? శ్రీకాంత్ : అవును సార్... మైనింగ్కు మంచి డిమాండ్ ఉంది. (ఆతర్వాత అడిషనల్ ఎస్పీ పక్కనే ఉన్న అమ్మాయిల వద్దకు వెళ్లి పలకరించారు.) అడిషనల్ ఎస్పీ : మీరు బాగా చదువుకుంటున్నారా? విద్యార్థినులు : బాగా చదువుకుంటున్నాం సార్. అడిషనల్ ఎస్పీ : వెరీగుడ్.. మీతో బాయ్స్ ఎలా వ్యవహరిస్తున్నారు? సల్మాతబస్సుమ్ : (అనే విద్యార్థిని మాట్లాడుతూ) ఫ్రెండ్లీగా ఉంటారు సార్.. అడిషనల్ ఎస్పీ : ఏం ప్రాబ్లమ్స్ చేయట్లేదు కదా? సల్మాతబస్సుమ్ : అలాంటిదేమి లేదు సార్.. అడిషనల్ ఎస్పీ : అన్ని సబ్జెక్టుల లెక్చరర్స్ ఉన్నారా? సల్మాతబస్సుమ్ : అందరు ఉన్నారు సార్. అడిషనల్ ఎస్పీ : క్లాస్ బాగా చెబుతారా? సల్మాతబస్సుమ్ : బాగా చెబుతారు సార్.(మరో విద్యార్థినితో అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ) అడిషనల్ ఎస్పీ : నీ పేరేంటీ? విద్యార్థిని : నా పేరు స్వప్న సార్.. అడిషనల్ ఎస్పీ : రోజు కాలేజీకి ఎలా వస్తావు? స్వప్న : ఆటోలో వస్తాను సార్.. అడిషనల్ ఎస్పీ : ఆటో డ్రైవర్లు ఏమైన ప్రాబ్లమ్స్ చేస్తున్నారా? స్వప్న : లేదు సార్. అడిషనల్ ఎస్పీ : ఓకే.. గల్స్ ధైర్యంగా కాలేజీకి రావాలి. ఎవరైనా మిమ్మల్ని వేధిస్తే మా దృష్టికి తీసుకురండి.. తగిన చర్యలు తీసుకుంటాం. విద్యార్థినులు : ఓకే.... థ్యాంక్యూ సార్... (వెంటనే అడిషనల్ ఎస్పీ పక్కనే ఉన్న లెక్చరర్స్ వద్దకు వచ్చి మాట్లాడారు.) అడిషనల్ ఎస్పీ : గల్స్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన బాధ్యత మీపైన(లెక్చరర్స్) ఉంది. రాకపోకలు చేసే క్రమంలో కలుగుతున్న ఇబ్బం దులు, కాలేజీలో గల్స్ పడే ప్రాబ్లమ్స్ను అడి గి తెలుసుకొని పరిష్కరించండి. మా దృష్టికి తీసుకువస్తే మేము కూడా సహకరిస్తాం. లెక్చరర్స్ : తప్పకుండా సార్. మీరు సూచించిన మాదిరిగానే గల్స్పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తాం. -
జయాన్ని ఖాయం చేసుకోవాలంటే..
JEE MAIN - 2015 సాంకేతిక విద్య.. నేటి ఆధునిక ప్రపంచంలో సమున్నత కెరీర్ దిశగా వెళ్లేందుకు సరైన దారి! అందుకే ఉన్నత విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ చేసి, కెరీర్ను అత్యున్నతంగా తీర్చిదిద్దుకోవాలని ఇంటర్ ఎంపీసీ విద్యార్థులు కలలుగంటారు. ఆ కలల్ని నిజం చేసుకునేందుకు ఉత్తమ మార్గం జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ).. ఇది నిట్లు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇతర సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు వీలుకల్పించే పరీక్ష. అంతేకాదు.. ఐఐటీల్లో సీటు కోసం పోటీపడాల్సిన జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హత సాధించాలంటే జేఈఈ మెయిన్లో మెరుగైన మార్కులు సంపాదించాల్సిందే! తాజాగా జేఈఈ మెయిన్- 2015కు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో విజయ శిఖరాన్ని అందుకునేందుకు సీనియర్ ఫ్యాకల్టీ ఎం.ఎన్.రావు అందిస్తున్న సూచనలు... మ్యాథమెటిక్స్ మ్యాథమెటికల్ రీజనింగ్; వేరియన్స్, మీన్ డీవియేషన్; స్టాండర్డ్ డీవియేషన్లో ఆరోహణ, అవరోహణ క్రమం చాలా ముఖ్యమైనవి. మీన్ వాల్యూ థీరమ్; సెట్స్ అండ్ రిలేషన్స్; 3డీ లైన్స్-ప్లేన్స్; వెక్టార్స్ ఆల్జీబ్రా; క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్; మ్యాట్రిసెస్; ప్రమేయాల్లో రేంజ్, డొమైన్; డెఫినెట్ ఇంటెగ్రల్స్; కంటిన్యుటీ; డిఫరెన్షిబిలిటీ; మాక్సిమ-మినిమ అంశాలపై దృష్టి సారించాలి. ఇందులో ఎక్కువ మార్కులు సాధించాలంటే కాన్సెప్టులపై పట్టు సాధించాలి. ఫిజిక్స్ గత పరీక్షల సరళిని ప్రశ్నిస్తే మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీలతో పోలిస్తే ఫిజిక్స్ ప్రశ్నలు క్లిష్టంగా ఉంటున్నాయి. అయితే కాన్సెప్టులను అర్థం చేసుకుని, వాటికి సంబంధించిన ప్రశ్నలు, అనువర్తనాలు, సమస్యల్ని సాధిస్తే ఎక్కువ మార్కులు సాధించవచ్చు. కరెంట్ ఎలక్ట్రిసిటీలో రెసిస్టెన్స్; ఎలక్ట్రో మ్యాగ్నటిక్ ఇండక్షన్లో సెల్ఫ్ ఇండక్షన్, మ్యాగ్నటిక్ ఫీల్డ్ ముఖ్యమైనవి. మోడర్న్ ఫిజిక్స్లో బైండింగ్ ఎనర్జీ, లాజిక్ గేట్స్, హాఫ్ లైఫ్ టైమ్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. హీట్, థర్మోడైనమిక్స్, ఆప్టిక్స్ అంశాలు కూడా ముఖ్యమైనవి. కెమిస్ట్రీ గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నల ఆధారంగా చూస్తే కెమికల్ కైనటిక్స్, న్యూక్లియర్ కెమిస్ట్రీ, సొల్యూషన్స్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ప్రాక్టికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలోని అంశాలు ముఖ్యమైనవని తెలుస్తోంది. అభ్యర్థులు వీటిపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి చాప్టర్ల వారీగా రియాక్షన్స్ను నోట్ చేసుకోవాలి. ప్రతి రియాక్షన్కు సంబంధించి దాని విశ్లేషణ, వ్యవస్థ, ఉత్పత్తులు, కావల్సిన నిబంధలను ఒక క్రమ పద్ధతిలో రాసుకోవాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్, రిడాక్స్ రియాక్షన్స్, గ్రూప్స్, ప్రాక్టికల్ కెమిస్ట్రీ అంశాలపై పట్టుతో మంచి ఫలితాలు సాధించవచ్చు. మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ -
మోడల్ స్కూల్స్
అధ్వానంగా ఆదర్శ పాఠశాలలు 80 శాతం సిబ్బంది కొరత కంప్యూటర్లూ కరువే పునాదులకే పరిమితమైన హాస్టళ్లు తాగునీటి సౌకర్యం అంతంతమాత్రమే మరుగుదొడ్లు లేక ఇబ్బందులు చిత్తూరు: విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తామంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన ఆదర్శ పాఠశాలలు అధ్వానంగా మారాయి. పాఠశాలలు ప్రారంభమై నాలుగేళ్లు గడుస్తున్నా పలు పాఠశాలలకు సొంత భవనాలు లేవు. హాస్టల్ భవనాలు పునాదులకే పరిమితమయ్యాయి. మంచినీరు కూడా అందని పరిస్థితి, పాఠశాలలకు వెళ్లేందుకు సరైన దారి లేదు. ఆటస్థలాలు అసలే లేవు. మరుగుదొడ్ల వసతి కల్పించిన పాపానపోలేదు. ఇప్పటికీ 80 శాతం అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్కొక్క పాఠశాలలకు 40 కంప్యూటర్లను కేటాయించి విద్యార్థులకు సాంకేతిక విద్యనందిస్తామని అధికారులు గొప్పలు చెప్పినా నామమాత్రంగా కూడా కంప్యూటర్లు అందించలేదు. ఏ ఒక్క ఆదర్శ పాఠశాలలోనూ కంప్యూటర్ శిక్షకుడు లేరంటే మోడల్ స్కూళ్ల పరిస్థితి ఏమిటో అర్థమవుతుంది. జిల్లాలో 2009- 10 సంవత్సరానికిగాను ప్రభుత్వం ఫేస్-1 కింద 18, ఫేస్ -2 కింద మరో రెండు.. మొత్తం కలిపి 20 ఆదర్శ పాఠశాలలను మంజూరు చేసింది. జిల్లాలోని రామకుప్పం, గంగవరం, నిమ్మనపల్లె, రొంపిచెర్ల పాఠశాలలకు ఇంతవరకు సొంత భవనాలను నిర్మించలేదు. దీంతో అధ్వానపు వసతుల మధ్య ఆ పాఠశాలలు ప్రైవేటు భవనాల్లో నడుస్తున్నాయి. కొద్దిపాటి చినుకులు రాలినా గదులు ఉరుస్తుండడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక అన్ని ఆదర్శ పాఠశాలల్లోనూ హాస్టల్ భవనాలు పూర్తి కాకపోవడంతో ఆరుబయటే వంట చేసుకోవాల్సిన పరిస్థితి. కొన్ని పాఠశాలల ఆవరణలు ముళ్లచెట్లతో నిండిపోయాయి. సరైన రహదారి సౌకర్యం లేదు. హాస్టల్ లేకపోవడంతో బాలికలు సక్రమంగా పాఠశాలలకు రావడంలేదు. పలు పాఠశాలలు గ్రామాలకు దూరంగా నిర్మించడంతో విద్యార్థులు రాలేక పాఠశాలలకు ఎగనామం పెడుతున్నారు. మొత్తంగా ప్రభుత్వం నిర్మించిన ఆదర్శ పాఠశాలల్లో విద్యతోపాటు మౌలికవసతులు కరువయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు మోడల్ స్కూళ్లు ఉన్నాయి. దాదాపు 1300 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కుప్పం, శాంతిపురం, రామకుప్పం పాఠశాలల్లో హాస్టల్ భవనాలు పునాదులకే పరిమితమయ్యాయి. వంటగదులు లేవు. పై మూడు పాఠశాలల్లో తాగునీటి సమస్య అధికంగా ఉంది. సగానికి పైగా అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఆరు మోడల్ స్కూళ్లు ఉన్నాయి. 44 అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 7 కంప్యూటర్లు మాత్రమే ఇచ్చారు. ఐదు మండలాలకు సంబంధించి హాస్టల్ భవనాలు పూర్తి కాలేదు. పలమనేరు నియోజకవర్గంలో బెరైడ్డిపల్లె మండలంలో మాత్రమే మోడల్ స్కూల్ ఉంది. అధ్యాపకుల కొరత వల్ల పాఠశాలలో చురుకైన విద్యార్థులే మిగిలిన విద్యార్థులకు పాఠాలు చెబుతుండడం విశేషం. పుంగనూరు నియోజకవర్గంలో అడవినాచనగుంటలో వంటగది లేదు. ప్రహారీగోడ లేదు. ఇంటర్లో 140 మంది విద్యార్థులుండగా ముగ్గురు లెక్చరర్లు మాత్రమే ఉన్నారు. హాస్టల్ భవనం లేదు. పీలేరు నియోజకవర్గంలో కలకడ, కేవీపల్లెలో రెండు మోడల్ స్కూళ్లు మాత్రమే ఉన్నాయి. రెండు పాఠశాలల్లో పది మంది ఉపాధ్యాయుల కొరత ఉంది. కలకడ స్కూల్కు సరైన దారి లేదు. సత్యవేడు నియోజకవర్గంలో కన్నవరం, కేవీబీ పురం పాఠశాలల్లో వంట గదులు లేవు. కంప్యూటర్ ఆపరేటర్, పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హాస్టల్ వసతి లేరు. చంద్రగిరి నియోజకవర్గంలో ఎర్రావారిపాళెం పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉంది. పిల్లల తల్లిదండ్రులే చందాలేసుకుని కొంత మంది ఉపాధ్యాయులను నియమించుకున్నారు. జీడీ నెల్లూరు నియోజకవర్గంలోని వెదురుకుప్పం, కా ర్వేటినగరం పాఠశాలల్లో సి బ్బంది కొరత ఉంది. మరుగుదొడ్ల సౌకర్యం లేదు. కంప్యూట ర్లు నామమాత్రంగా ఇచ్చారు. -
బోధనా విధానంలో మార్పు రావాలి : సుధీర్ కుమార్ జైన్
గెస్ట్ కాలమ్ సాంకేతిక విద్య.. దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్ సంపాదించింది. కానీ ఎన్నో సమస్యలు. ముఖ్యంగా ఏటా లక్షలమంది సర్టిఫికెట్లు అందుకుంటున్నా.. ఉద్యోగ నైపుణ్యాలు లేవనేది ప్రధాన ఆరోపణ. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా బోధనలో మార్పులు తెస్తేనే విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు కావాల్సిన నైపుణ్యాలు లభిస్తాయని స్పష్టం చేస్తున్నారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-గాంధీనగర్ డెరైక్టర్ ప్రొఫెసర్ సుధీర్ కుమార్ జైన్. ఐఐటీ-రూర్కీలో 1979లో సివిల్ ఇంజనీరింగ్లో బీఈ పూర్తి చేసి.. తర్వాత కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంఎస్, పీహెచ్డీ పట్టా అందుకున్నారు. 1984 నుంచి ఐఐటీ-కాన్పూర్లో ప్రొఫెసర్గా విధులు నిర్వర్తించి.. ఆ తర్వాత ఐఐటీ గాంధీనగర్ వ్యవస్థాపక డెరైక్టర్గా ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్న ప్రొఫెసర్ సుధీర్ కుమార్ జైన్తో ఇంటర్వ్యూ.. అన్నిటా మార్పులు అవసరం ఇంజనీరింగ్, సాంకేతిక విద్య విధానంలో మార్పులు తీసుకురావాలనే విద్యావేత్తల అభిప్రాయంతో ప్రతి ఒక్కరూ ఏకీభవించాల్సిందే. అయితే, ఇదే సమయంలో అన్ని కోర్సులకు సంబంధించిన విధానాల్లోనూ మార్పులు చేయాలి. ముఖ్యంగా ఉన్నత విద్యలో ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. స్ట్రక్చరల్ విధానంలోని కరిక్యులం, ఫ్యాకల్టీ కొరత, ఇండస్ట్రీ-అకడమిక్ వర్గాల మధ్య ఒప్పందాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం వీటిల్లో ముఖ్యమైనవి. వీటిని అధిగమించాలంటే విద్యావేత్తలు, పరిశ్రమ వర్గాలు కలిసి చర్చించి ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన విధానాలు సూచించాలి. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ), ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ వంటి వినూత్న విధానాలను ప్రవేశపెట్టాలి. వీటివల్ల విద్యార్థులకు వాస్తవ పరిస్థితులకు అవసరమైన నైపుణ్యాలు లభిస్తాయి. దాంతోపాటు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే సంసిద్ధత లభిస్తుంది. ఇండస్ట్రీ - ఇన్స్టిట్యూట్ ఒప్పందాలు ముఖ్యం విద్యార్థులకు క్షేత్ర స్థాయి నైపుణ్యాలు లభించేలా తద్వారా పరిశ్రమ వర్గాల నుంచి గుర్తింపు పొందేలా చేయాలంటే ఇన్స్టిట్యూట్లు పరిశ్రమ వర్గాలతో ఎక్స్ఛేంజ్ ఒప్పందాలు కుదుర్చుకోవాలి. ఐఐటీ- గాంధీనగర్ ప్రారంభించినప్పటి నుంచీ రీసెర్చ్, అకడమిక్స్, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్స్కు సంబంధించి ఇండస్ట్రీ వర్గాలతో నిరంతరం సంప్రదింపులు చేస్తోంది. అండర్ రైటర్స్ లేబొరేటరీ, ది రికో కంపెనీ, నీల్సన్ ఎల్ఎల్సీ వంటి అంతర్జాతీయ పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకున్నాం. ఐఐటీల్లో ఫ్యాకల్టీ కొరతకూ పరిష్కారం ఐఐటీల్లో అందులోనూ కొత్తగా ఏర్పాటైన ఐఐటీలను వేధిస్తున్న సమస్య ఫ్యాకల్టీ కొరత. దీనికి కూడా పరిష్కారం ఉంది. ప్రస్తుత వేతన విధానాలు, ఇతర ప్రోత్సాహకాలను దృష్టిలో పెట్టుకుంటే.. అనుభవజ్ఞులైన వారికంటే యంగ్ టాలెంట్కు పెద్దపీట వేయాలి. దీనివల్ల ఫ్యాకల్టీ కొరత తీరడంతోపాటు టీచర్ - స్టూడెంట్స్ మధ్య జనరేషన్ గ్యాప్ కూడా తక్కువగా ఉంటుంది. విద్యార్థులు కూడా తమ టీచర్లతో బిడియం లేకుండా సందేహాలు నివృత్తి చేసుకోగలరు. విద్యా సంస్థలు.. పరిశోధన, అభివృద్ధికి పరిశ్రమ వర్గాలతో ఒప్పందాలు చేసుకుంటే అద్భుత ఫలితాలు సొంతమవుతాయి. ఇవి విద్యార్థులకు ప్రాక్టికల్ నైపుణ్యాలు అందించడంతోపాటు, సామాజిక అవసరాలను తీర్చేందుకు దోహదం చేస్తాయి. ఈ క్రమంలో ఇన్స్టిట్యూట్లు స్పాన్సర్డ్ రీసెర్చ్ కోసం ప్రయత్నించాలి. పరిశ్రమలను మెప్పించే రీతిలో తమ ఇన్స్టిట్యూట్లోని సదుపాయాలు, సౌకర్యాల గురించి వివరించాలి. ఇలాంటి చర్యల ఫలితంగానే ఐఐటీ - గాంధీనగర్కు అమెరికాకు చెందిన అండర్ రైటర్స్ లేబొరేటరీస్ నుంచి ఫైర్ ఇంజనీరింగ్ లేబొరేటరీ, ఫైర్ సేఫ్టీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇనీషియేటివ్స్ కోసం ఐదు లక్షల డాలర్ల గ్రాంట్ లభించింది. ఎంటర్ప్రెన్యూర్షిప్ను అకడమిక్ స్థాయిలోనే ప్రస్తుత పారిశ్రామికీకరణ, పోటీ వాతావరణం నేపథ్యంలో విద్యార్థులకు అకడమిక్ స్థాయి నుంచే ఎంటర్ప్రెన్యూర్షిప్పై అవగాహన కల్పించాలి. ఈ విషయంలో ఇతర ఇన్స్టిట్యూట్లతో పోల్చితే ఐఐటీలు కొంత ముందంజలో ఉన్నాయి. ఐఐటీ- గాంధీనగర్లో బీటెక్ స్థాయిలోనే ఎంటర్ప్రెన్యూర్షిప్ను ఎలక్టివ్గా, మైనర్గా పొందుపరిచాం. దేశంలో ఇటీవల కాలంలో వ్యక్తమవుతున్న మరో అభిప్రాయం కొత్త ఐఐటీలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాయని! కానీ నా ఉద్దేశంలో పాత ఐఐటీలతో పోల్చితే కొత్త ఐఐటీలకు కొన్ని అదనపు ప్రయోజనాలు ఉంటాయి. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటం ఇందులో ముఖ్యమైంది, ప్రస్తావించదగింది. దీనివల్ల ఒక ఇన్స్టిట్యూట్ వృద్ధికి అవసరమైన మార్పులను వేగవంతంగా అమలు చేసే వీలు లభిస్తుంది. అంతేకాకుండా పాత ఐఐటీల్లో లోపాలను పరిశీలించి అవి కొత్త ఐఐటీల్లో తలెత్తకుండా చూడొచ్చు. జాబ్ ప్రొవైడర్స్ను రూపొందించడమే లక్ష్యం ఐఐటీ గ్రాడ్యుయేట్స్కు జాబ్స్ సొంతమవడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ జాబ్ ప్రొవైడర్స్ను తీర్చిదిద్దితే వారు మరికొందరికి అవకాశాలు కల్పిస్తారు. ఈ క్రమంలో ఐఐసీ పేరుతో ఇంక్యుబేషన్ సెంటర్ను కూడా ఏర్పాటు చేశాం. దీని ప్రధాన ఉద్దేశం ఔత్సాహిక విద్యార్థులు తమ సొంత వెంచర్లు ప్రారంభించేందుకు అవకాశాలు కల్పించడం. స్టార్టప్స్ దిశగా నడవాలనుకునే విద్యార్థులకు మంచి ప్రోత్సాహమందిస్తున్నాం. విస్తృత కోణంలో ఆలోచిస్తే విభిన్న అవకాశాలు ఐఐటీలకు ఉన్న క్రేజ్తో ఈ ఇన్స్టిట్యూట్ల్లో అడుగుపెట్టాలనుకుంటారు. కానీ వివిధ కారణాల వల్ల సీటు కొందరికే లభిస్తోంది. ప్రతిభ ఉంటే అవకాశాలకు ఎలాంటి హద్దులు లేవు అని గుర్తించాలి. ఐఐటీల స్థాయిలోనే దేశంలో మరెన్నో ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. వాటిలో చేరేందుకు కృషి చేయాలి. కోర్సులో చేరాక.. అభ్యసనం పరంగా స్వతంత్రంగా వ్యవహరించాలి. అన్నీ టీచర్లు చెబుతారు అనుకుంటే పొరపాటు. టీచర్ ఒక అంశం చెబితే దానికి అనుబంధంగా ఉండే అన్ని అంశాలను సొంతంగా నేర్చుకోవాలి. అప్పుడే కెరీర్లో రాణించగలుగుతారు. -
విద్యార్థుల జీవితాలతో చెలగాటం
జవాబు పత్రాల మూల్యాంకనంలో జేఎన్టీయూహెచ్ నిర్లక్ష్యం ప్రతిభ గల విద్యార్థులకూ పదిలోపు మార్కులు కొన్ని సబ్జెక్టుల్లో మూకుమ్మడిగా ఫెయిల్ చేసిన వైనం అనర్హులు దిద్దుతున్న ఫలితం బ్యాక్లాగ్స్తో దూరమవుతున్న ఉద్యోగావకాశాలు ఫీజులపైనే అధికారుల దృష్టి యూనివర్సిటీ తీరుపై విద్యార్థుల్లో తీవ్ర అసంతృప్తి హైదరాబాద్: ప్రతిభ కలిగిన విద్యార్థులకు సున్నా మార్కులు రావడం, అనామకుడికి సైతం అరవై శాతం మార్కులు వేయడం జేఎన్టీయూహెచ్కే చెల్లింది. ఒకప్పుడు సాంకేతిక విద్యకు కేరాఫ్ అడ్రస్గా ఉన్న జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(హైదరాబాద్) ప్రతిష్ట మసకబారుతోంది. అరకొర వసతులతోనే ఉన్నంతలో కష్టపడి చదివి పరీక్షలు రాస్తున్న విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనంలోనూ వర్సిటీ పరీక్షల విభాగం ఘోరంగా విఫలమవుతోంది. ఇష్టారీతిలో మార్కులేస్తూ మూకుమ్మడిగా విద్యార్థులను ఫెయిల్ చేస్తున్నారు. నాలుగేళ్లపాటు బీటెక్ చదివి 80 శాతం మార్కులు సాధించినా, బ్యాక్లాగ్స్ కారణంగా ఉద్యోగావకాశాలకు అర్హత సాధించలేకపోతున్నారు. ఫలితంగా ఎన్నో ఆశలతో బీటెక్లో చేరిన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. విద్యార్థులకు జరుగుతున్న నష్టానికి బాధ్యత వహించేందుకు కళాశాలల యాజమాన్యాలు, జేఎన్టీయూహెచ్ అధికారులు సిద్ధంగా లేకపోవడం గమనార్హం. ఇవేం మార్కులు బాబోయ్! యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల పాలిట కొన్ని సబ్జెక్టులు పీడకలగా మారాయి. కంప్యూటర్ సైన్స్లో కొన్ని, ఈసీఈ గ్రూప్లో కొన్ని సబ్జెక్టులను బోధించేందుకు అర్హులైన అధ్యాపకులే దొరకడం లేదు. ఒకవేళ ఉన్నా, విద్యార్థుల జవాబు పత్రాలను దిద్దేందుకు తగిన విషయ నిపుణులు ఉన్నారా అన్నదీ ప్రశ్నార్థకమే! మేడ్చల్ పరిధిలోని ఒక ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థుల్లో ఎక్కువమంది ‘వెబ్ టెక్నాలజీ’ సబ్జెక్టులో ఫెయిల్ కావడమే ఇందుకు ఉదాహరణ. ఈ కాలేజీలో మూడో సంవత్సరం బీటెక్ చదువుతున్న 41 మంది విద్యార్థులు.. ఇటీవలి సెమిస్టర్ పరీక్షలో వెబ్ టెక్నాలజీ సబ్జెక్టు మినహా మిగిలినవన్నీ పాసయ్యారు. కోర్సు మొత్తం కలిపి 80 శాతం మార్కులు వచ్చిన ఓ విద్యార్థికి సైతం వెబ్ టెక్నాలజీ సబ్జెక్టులో ఆరు మార్కులు వచ్చాయి. 75 శాతం మార్కులున్న మరో విద్యార్థికి ఈ సబ్జెక్టులో 2 మార్కులు రాగా, 79 శాతం మార్కులున్న ఇంకొకరికి 15 మార్కులే వచ్చాయి. ఇలా మార్కులు వచ్చిన వేలాది మంది విద్యార్థులు చేసేది లేక రూ. 1000 చెల్లించి రీవాల్యుయేషన్కు దరఖాస్తు పెట్టుకున్నారు. నెల దాటినా జేఎన్టీయూహెచ్ అధికారులు రీవాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేయలేదు. మరోవైపు నవంబరు 17 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు జరగనుండడంతో దిక్కుతోచని పరిస్థితి విద్యార్థులది. ఇదే రీతిన పలు కాలేజీల్లోని విద్యార్థులు మెఫా, నెట్వర్క్ సెక్యూరిటీ వంటి సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులతో బెంబేలెత్తిపోతున్నారు. భవిష్యత్తుపై గొడ్డలి పెట్టు ఇలాంటి మూల్యాంకనం వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులు కూడా ఉద్యోగావకాశాలను కోల్పోవాల్సి వస్తోంది. కొన్ని సబ్జెక్టుల్లో పాస్ కాని విద్యార్థులను ఆయా కంపెనీలు ఇంటర్వ్యూలకు పిలవడం లేదు. దీంతో ప్రతిభావంతులు కూడా నిరాశకు గురవుతున్నారు. వర్సిటీ పరిధిలోని 319 అనుబంధ ఇంజినీరింగ్ కాలేజీల్లో బ్యాక్లాగ్ లేకుండా బయటకు వెళ్లిన విద్యార్థులు ఎంతమందో కూడా అధికారులు చెప్పలేని పరిస్థితి ఉంది. తమకు ఆశించిన దానికంటే తక్కువ మార్కులు వచ్చాయని విద్యార్థులు అడిగితే రూ.100 చెల్లించి రీకౌంటింగ్/రూ.1000చెల్లించి రీవాల్యుయేషన్ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆపై చాలెంజ్ ఎవాల్యుయేషన్ కావాలంటే రూ. 10 వేలు, ఆన్సర్ బుక్లెట్ జిరాక్సు కావాలంటే రూ. 5000 చెల్లించాల్సి ఉంటుంది. రీకౌంటింగ్, రీవాల్యుయేషన్లో పాసైన విద్యార్థులకు వారు చెల్లించిన సొమ్మును వాపసు ఇవ్వటం లేదు. జవాబు పత్రాలు దిద్దిన ఆచార్యుడో లేదా మార్కులను కంప్యూటర్లో నమోదు చేస్తున్న వర్సిటీ సిబ్బందో తప్పు చేస్తే, శిక్ష మాత్రం విద్యార్థులే అనుభవిస్తున్నారు. అనుభవజ్ఞులైన వర్సిటీ ప్రొఫెసర్లతో కాకుండా ప్రైవేటు కాలేజీలకు చెందిన అర్హత లేని అధ్యాపకులతోనే మూల్యాంకన ప్రక్రియ చేపడుతున్నారు. అరకొర పరిజ్ఞానంతో సదరు ఆధ్యాపకులు జవాబు పత్రాలను పూర్తిగా పరిశీలించకుండానే ఇష్టమొచ్చినట్లుగా మార్కులు వేసి విద్యార్థులను ఫెయిల్ చేస్తున్నారు. -
పాలిటెక్నిక్లలోనూ ‘టాస్క్ఫోర్స్’తనిఖీలు!
174 ఇంజనీరింగ్ కాలేజీల్లో నడుస్తున్న పాలిటెక్నిక్లపై దృష్టి బోధన సిబ్బంది, వలిక వసతులపై పరిశీలన హడలిపోతున్న ప్రైవేటు యాజమాన్యాలు హైదరాబాద్: ఇక పాలిటెక్నిక్ల పరిస్థితిపై తెలంగాణ సాం కేతిక విద్యాశాఖ దృష్టి సారించింది. ప్రత్యేక ‘టాస్క్ఫోర్స్’ను ఏర్పాటు చేసి, అన్ని ప్రైవేటు పాలిటెక్నిక్ లను తనిఖీ చేయాలని అధికారులు యోచిస్తున్నారు. లోపాలున్నాయన్న కారణంతో ఈ ఏడాది 174 ఇంజనీరింగ్ కళాశాలలకు జేఎన్టీయూహెచ్ అఫిలియేషన్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. జేఎన్టీయూహెచ్ అధికారులు ఇచ్చిన షాక్ నుంచి ఇంకా తేరుకోకముందే.. తమ కళాశాలల్లోని పాలిటెక్నిక్లలో ‘టాస్క్ఫోర్స్’ తనిఖీలకు రానుందని తెలిసి ప్రైవేటు యాజమాన్యాలు హడలిపోతున్నాయి. బోధనా సిబ్బందే కీలకం: రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 467 పాలిటెక్నిక్లు ఉండగా, వీటిలో 239 పాలిటెక్నిక్లు ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో షిప్టు పద్ధతిన నడుస్తున్నాయి. అన్ని ఇంజనీరింగ్ కళాశాలలకు ఏఐసీటీఈ అనుమతులున్నప్పటికీ, విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా బోధనా సిబ్బంది లేకపోవడమే పెద్దలోపంగా అధికారులు భావిస్తున్నారు. 174 కళాశాలల్లో బోధనా సిబ్బంది కొరత ఉన్నట్లు జేఎన్టీయూహెచ్ గుర్తించి అఫిలియేషన్ నిలిపి వేయడంతో.. వాటిలో నడుస్తున్న పాలిటెక్నిక్ల తనిఖీలకు సాంకేతిక విద్యాశాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. పరిశీలన అవసరమే:వెంకటేశ్వర్లు, ఎస్బీటీఈటీ కార్యదర్శి పాలిటెక్నిక్లకు అఫిలియేషన్ ఇచ్చే సమయంలో ఆయా సంస ్థల్లో వసతులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తాం. ఇంజనీరింగ్ కళాశాలకు ఉండాల్సిన వసతుల్లో సగం ఉన్నా పాలిటెక్నిక్ నిర్వహణకు సరి పోతుంది. అఫిలియేషన్ ఇచ్చే సమయంలో చిన్నచిన్న లోపాలున్నట్లు అధికారులు గుర్తిస్తే, సవరించుకుంటామని యాజమాన్యాల నుంచి హామీ తీసుకుంటాం. ఇటీవల లోపాలున్నాయం టూ కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలకు జేఎన్టీయూహెచ్ అఫిలియేషన్ నిలిపి వేయడంతో, వాటిలో నిర్వహిస్తున్న పాలిటెక్నిక్లను పరిశీలించాల్సిన అవసరమైతే ఉంది. దీనిపై సాంకేతిక విద్యా కమిషనర్ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. -
సాంకేతిక విద్య అవసరం
కర్నూలు(రాజ్విహార్): నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు సాంకేతిక విద్య అవసరమని, ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న కంప్యూటర్ టీచర్లను తొలగించడం తగదని శాసన మండలి సభ్యుడు డాక్టర్ ఎం. గేయానంద్ అన్నారు. బుధవారం స్థానిక కొత్త బస్టాండ్ సమీపంలోని కార్మిక, కర్షక భవన్లో కంప్యూటర్ టీచర్స్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘విద్యార్థులకు కంప్యూటర్ విద్య అవసరమా.. లేదా?’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంగ్లీషు మీడియం, కంప్యూటర్ విద్య ఉన్న పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ఈక్రమంలోనే ప్రతి ఏడాది వేలాది మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు విద్యా సంస్థల్లో చేరుతున్నారని ఆదేదన వ్యక్తం చేశారు. ఈ వలసలు నివారించేందుకు ప్రభుత్వాలు ఏటా రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తోందని, అయినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. కంప్యూటర్ టీచర్స్ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ తొలగించిన కంప్యూటర్ టీచర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సదస్సులో ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సింగ్, నాగరాజు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కంప్యూటర్ టీచర్లు పాల్గొన్నారు. -
జూలై 7 నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ఈ విద్యాసంవత్సరం ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియను జూలై 7వ తేదీ నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లలో సాంకేతిక విద్యాశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. అయితే ఫీజు రీయెంబర్స్మెంట్కు సంబంధించిన స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు పాత ప్రవేశాల విధానం అమల్లో ఉంటున్నందున రెండు రాష్ట్రాల్లో ఫీజు రీయెంబర్స్మెంట్, కొత్త కాలేజీల అనుమతుల వ్యవహారం ఆలోగానే తేల్సాల్సి ఉంది. మరోవైపు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నుంచి కొత్త కాలేజీలకు ఇచ్చే అనుమతుల వివరాలు త్వరలోనే రానున్నాయి. ఈనెల 29 నుంచి కౌన్సెలింగ్ను ప్రారంభించాలని గతంలోనే నిర్ణయించినా కొత్త కాలేజీల అనుమతులు, ఫీజు రీయింబర్స్మెంట్పై ఉత్తర్వులు జారీ కావాల్సి ఉన్నందున కౌన్సెలింగ్ను వాయిదా వేసింది. ఈనెల 28 నుంచి ఈసెట్ కౌన్సెలింగ్ ఇదిలాఉండగా, డిప్లొమా విద్యార్థులకు ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాలకు ఉద్దేశించిన ఈసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ను ఈనెల 28 నుంచి చేపట్టాలని ఉన్నతవిద్యామండలి నిర్ణయించింది. 28వ తేదీ నుంచి జులై 3వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టాలని, 5వ తేదీన సీట్లు కేటాయించాలని నిర్ణయించింది. -
మరో దఫా పదవీయోగం
అయ్యన్నను నాలుగోసారి వరించిన మంత్రి పదవి మరోమారు చరిత్ర పుటల్లోకి నర్సీపట్నం అభివృద్ధిపై ఆశగా ఎదరుచూస్తున్న ప్రజానీకం ఆనందంలో పార్టీ వర్గాలు స్థానిక ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడుకు రాష్ట్ర కేబినెట్ మంత్రిగా పదవి లభించడంతో ఆ పార్టీ వర్గాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. గతంలో మూడు దఫాలుగా మంత్రిగా, ఒకమారు ఎంపీగా పనిచేసిన అయ్యన్న మరోమారు మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో నియోజకవర్గం అభివృద్ధిపై స్థానికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. నర్సీపట్నం, న్యూస్లైన్ : దేశం పార్టీ ఆవిర్భావం 1983 నుంచి నర్సీపట్నం శాసనసభకు పోటీచేస్తున్న అయ్యన్న మొదటి దశలోనే విజయం సాధించి, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రభుత్వం బర్తరఫ్ చేశాక 1985లో రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎన్టీ రామారావు, ఎమ్మెల్యేగా ఎన్నికైన అయ్యన్నపాత్రునికి సాంకేతిక విద్యాశాఖ, యువజన సర్వీసులు మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఆ సమయంలో అయ్యన్న స్థానికంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ ఏర్పాటుకు కృషిచేశారు. దీంతో పాటు ప్రభుత్వ సాంకేతిక శిక్షణ సంస్థ, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశారు. తిరిగి 1994 తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అయ్యన్నను ఆర్అండ్బీ శాఖ వరించింది. అప్పట్లో నియోజకవర్గం పరిధిలోని మారుమూల గ్రామాల పరిధిలోని వందల కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్డును ఆర్అండ్బీకి బదలాయించి, పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు. రెండేళ్ల తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో సైతం అయ్యన్నపాత్రుడు ఆర్అండ్బీ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ పదవి చేపట్టిన కొద్ది రోజుల్లోనే పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో పార్టీ అయ్యన్నను అనకాపల్లి ఎంపీగా పోటీకి దింపింది. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తరువాత అయ్యన్నను అటవీశాఖ మంత్రి పదవి వరించింది. ఆ సమయంలో నియోజకవర్గంలోని పెడిమికొండ నర్సరీ, ఆరిలోవ జౌషధ మొక్కల పెంపకానికి ప్రత్యేక నిధులు కేటాయించారు. 2004 ఎన్నికల్లో అయ్యన్న ఎమ్మెల్యేగా విజ యం సాధించినా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఖాళీగానే ఉండిపోయారు. ఆ తరువాత 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ముత్యాలపాప చేతిలో అయ్యన్న ఓటమి పాలయ్యారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశం పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆది నుంచి గంటా రాకను వ్యతిరేకిస్తున్న అయ్యన్న సాక్షాత్తూ విశాఖలో జరిగిన సభలో చంద్రబాబు సమక్షంలోనే తన వాదంపై గళం విప్పారు. ఈ విధం గా కొన్ని సమయాల్లో అధినేత చంద్రబాబుకు తలనొప్పిగా వ్యవహరించిన అయ్యన్నకు మంత్రి పదవి రాదనే వదంతులు వ్యాపిం చాయి. దానికి భిన్నంగా ఆదివారం చంద్రబాబుతో పాటు అయ్యన్న కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. అయ్యన్నకు పంచాయతీరాజ్ లేక అటవీశాఖ మంత్రి బాధ్యతలు కేటాయిస్తారని ప్రచారంలో ఉంది. నాలుగోసారి మంత్రిగా ప్రమాణం చేసిన అయ్యన్నతో నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి సాధిస్తుందని స్థానికులు అనందం వ్యక్తం చేస్తున్నారు. -
15 తర్వాత ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు!
జూలై 15లోగా ప్రవేశాల పూర్తికి సాంకేతిక విద్యాశాఖ ఏర్పాట్లు ఆగస్టు ఒకటి నుంచి తరగతులు ప్రారంభించడానికి కసరత్తు హైదరాబాద్: ఇంజనీరింగ్లో ప్రవేశాల కోసం వచ్చే నెల 15 తర్వాత వెబ్ ఆప్షన్ల ప్రక్రియను చేపట్టేందుకు సాంకేతిక విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. వెబ్ ఆప్షన ్ల నుంచి మొదలుపెట్టి మొత్తం ప్రవేశాల ప్రక్రియను జూలై 15లోగా పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఒకవేళ జూలై 15 నాటికి పూర్తి కాకపోయినా 25 నాటికి ఆ ప్రక్రియను పూర్తిచేసి ఆగస్టు ఒకటో తేదీ నుంచి తరగతులను ప్రారంభించాలని భావిస్తోంది. ఇందుకోసం జూన్ 9న ఎంసెట్ ర్యాంకులను వెల్లడించిన వెంటనే వెబ్ ఆప్షన్లకు సంబంధించిన చర్యలపై దృష్టి సారించాలని నిర్ణయించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ జూలై 31 నాటికే ప్రవేశాలను పూర్తిచేసి ఆగస్టు 1 నుంచి తరగతులను ప్రారంభించాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశించడంతో ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రవేశాల ప్రక్రియపై మరింత స్పష్టత అవసరమని అధికారులు భావిస్తున్నా.. వెబ్ ఆప్షన్లకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. వన్టైమ్ పాస్వర్డ్తో ఆప్షన్లు.. ఈసారి వెబ్ ఆప్షన్లకు వన్టైమ్ పాస్వర్డ్ విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు. ఆప్షన్లు ఇచ్చే సమయంలో లాగిన్ కాగానే విద్యార్థి మొబైల్ నంబరుకు పాస్వర్డ్ వస్తుంది. ఆ నంబర్ను ఎంటర్ చేసి ఆప్షన్ల పేజీలోకి వెళ్లి ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఆ పాస్వర్డ్ 15 నిమిషాలపాటు మాత్రమే పని చేస్తుంది. ఆ సమయంలో విద్యార్థి ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత సమయం పూర్తికాగానే విద్యార్థి ఇచ్చిన ఆప్షన్లు ఆటోమేటిక్గా సేవ్ అవుతాయి. మళ్లీ లాగౌట్ అయి, లాగిన్ అయితేనే మరో పాస్వర్డ్ వస్తుంది. దానిని ఎంటర్ చేసి మళ్లీ మరిన్ని ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.. ఇచ్చిన ఆప్షన్లు మార్చుకోవచ్చు. ఇంజనీరింగ్ ప్రవేశాల్లో వెబ్ ఆప్షన్ల విధానం వల్ల ఇంటర్నెట్ కేంద్రాల నిర్వాహకులు విద్యార్థి స్క్రాచ్ కార్డులోని పాస్వర్డ్ను దొంగిలించడం, వారికి తెలియకుండానే కొన్ని కాలేజీల్లో ఆప్షన్లు ఇవ్వడం వంటి మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ వన్టైమ్ పాస్వర్డ్ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించారు. -
శాఖగా కళాశాల, సాంకేతిక విద్య
హైదరాబాద్: కళాశాల విద్య, సాంకేతిక విద్య శాఖలను విలీనం చేసి, ఒకే విభాగంగా కొనసాగించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సంస్థల పునర్వ్యవస్థీకరణ, సంస్కరణల కమిటీ చైర్మన్ వీకే అగర్వాల్ వద్ద విద్యా శాఖ విభజన సమావేశం శుక్రవారం జరిగింది. విద్యాశాఖలో అధికారులు, సిబ్బంది విభజనపైనా సమీక్షించారు. కళాశాల, సాంకేతిక విద్య లేదా సాంకేతిక, కళాశాల విద్య శాఖలుగా ఇవి రెండు రాష్ట్రాల్లో కొనసాగనున్నాయి. అలాగే రాజీవ్ విద్యా మిషన్, పాఠశాల విద్యా శాఖలను విభజించేందుకు కసరత్తు జరుగుతోంది. వాటి విభజన తరువాత వేర్వేరు రాష్ట్రాల్లో రెండు శాఖలు ఒకే ఐఏఎస్ అధికారి పాలనలో కొనసాగనున్నాయి. ఒకవేళ ఇంటర్మీడియెట్ కమిషనరేట్, ఇంటర్మీడియెట్ బోర్డును విభజిస్తే ఇవి రెండూ ఒక అధికారి పరిధిలో ఉండనున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఇదే విధానం కొనసాగనుంది. అయితే ఇంటర్మీడియెట్ బోర్డు పదో షెడ్యూలులో ఉండగా, ఇంటర్ విద్య కమిషనరేట్ అందులో లేదు. అయితే ఇంటర్మీడియెట్ బోర్డును ఇప్పుడే విభజిస్తారా? ఏడాది తరువాత రెండు ప్రభుత్వాలు కలిసి నిర్ణయం తీసుకున్నాకే తుది నిర్ణయం ఉంటుందా? అనేది ఇంకా తేలలేదు. కొత్త పోస్టుల అవసరం లేకుండా, ఉన్న పోస్టులనే రెండు రాష్ట్రాలకు సర్దుబాటు చేస్తూ విభజించాలని సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలో పోస్టుల కేడర్లో ఒక స్థాయి తగ్గించడం లేదా పెంచడం వంటి చర్యలతో రెండు రాష్ట్రాలకు 13:10 నిష్పత్తిలో సర్దుబాటు చేయాలనే అంశంపైనే చర్చ జరిగినట్లు తెలిసింది. -
‘పది’లమైన పట్టుతో... పాలిసెట్లో మెరుపులు
పది పూర్తయింది మొదలు.. ఎన్నో అవకాశాలు.. మరెన్నో ప్రత్యామ్నాయాలు కళ్లముందు మెదులుతాయి. నేటి ఆధునిక ప్రపంచంలో సాంకేతిక విద్యకు ప్రాధాన్యత పెరుగుతుండటంతో ఆ దిశగా వేసే అడుగులు ఉజ్వల భవితకు దారిచూపుతాయి. ఇలాంటి కోర్సుల్లో పాలిటెక్నిక్ ఒకటి. ఇందులో ప్రవేశం కోసం నిర్వహించే పాలిసెట్ (పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్)-2014 పై ఫోకస్.. ఇంజనీరింగ్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ తదితర)లో డిప్లొమా కోర్సులు చేయాలనుకొనే విద్యార్థులు పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష (పాలిసెట్) రాయాల్సి ఉంటుంది. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్.బి.టి.ఇ.టి) -ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతను చేపట్టింది. అన్ని జిల్లాల ముఖ్య కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష విధానం: ప్రశ్నపత్రం బహుళైచ్ఛిక (ఆబ్జెక్టివ్ ) పద్ధతిలో ఉంటుంది. వీటి సమాధానాలను ఓఎమ్ఆర్ పత్రంలో గుర్తించాలి. 120 ప్రశ్నలు, ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. మొత్తం 120 మార్కులకు పరీక్ష ఉంటుంది. నెగె టివ్ మార్కులు ఉండవు. పరీక్ష సమయం - 2 గంటలు. పరీక్ష-స్వరూపం: సబ్జెక్ట్ ప్రశ్నలు మార్కులు మ్యాథ్స్ 60 60 ఫిజిక్స్ 30 30 కెమిస్ట్రీ 30 30 మొత్తం 120 120 అంశాలవారీ ప్రిపరేషన్ ప్లాన్ గణితం:మొత్తం 120 ప్రశ్నలలో 60 ప్రశ్నలు గణితం నుంచే వస్తా యి. కాబట్టి విద్యార్థులు ఈ సబ్జెక్ట్పై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ప్రిపరేషన్లో మిగతా అంశాలతో పోలిస్తే రెండింతల సమయం గణితానికి కేటాయిచడం మంచిది. అంతేకాకుండా 60 ప్రశ్నలకు 60 నిమిషాలలో మాత్రమే సమాధా నం రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే 120 ప్రశ్నలకు 120 నిమిషాలు మాత్రమే. అంటే తక్కువ సమయంలో వేగంతోపాటు కచ్చితత్వంతో కూడిన జవాబులను గుర్తించేలా సాధన చేయాలి. ఇందుకోసం విద్యార్థులు కొన్ని మెళకువల ను పాటిస్తే గణితంలో అత్యధిక మార్కులు సాధించవచ్చు. ఏ చాప్టర్కెన్ని మార్కులు? ప్రవేశ పరీక్షలో వచ్చే గణిత ప్రశ్నలు పదోతరగతి సిలబస్ నుంచే వస్తాయి. వీటిలో అధికభాగం త్రికోణ మితి, వైశ్లేషిక రేఖాగణితం పాఠ్యాంశాల నుంచి ఉంటాయి. ఒక్కో పాఠ్యాంశం నుంచి సుమారు 12 నుంచి 16 ప్రశ్నలు అడిగే వీలుంది. సాంఖ్యక శాస్త్రం, రేఖాగణితం నుంచి 6-8 ప్రశ్నలు, శ్రేఢులు, మాత్రికల నుంచి 3-4 ప్రశ్నలు, మిగిలిన అధ్యాయాలైన ప్రవచనాలు- సమితులు, ప్రమేయాలు, బహుపదులు, ఏకఘాత ప్రణాళిక, వాస్తవ సంఖ్యలు, గణన చాప్టర్లలో ఒక్కో అంశం నుంచి రెండేసి ప్రశ్నలు వస్తాయి. త్రికోణమితి, వైశ్లేషిక రేఖాగణితం, సాంఖ్యకశాస్త్రం, రేఖాగణితం, మాత్రికలు, శ్రేఢులు, అధ్యాయాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తే బాగుంటుంది. అవగాహన ముఖ్యం: ప్రశ్నపత్రాన్ని పరిశీలించినట్లయితే ప్రశ్నలు పదోతరగతి సిలబస్ నుంచే ఇస్తున్నప్పటికీ కొంచెం కఠిన స్థాయిలోనే ఉంటుంది. చాలావరకు అప్లికేషన్ (అన్వయించే పద్ధతి) ఆధారంగా ప్రశ్నలు వస్తాయి. కొన్ని ప్రశ్నలకు సమాధానం రాయాలంటే ఒక్కో ప్రశ్నకు ఒక నిమిషం కంటే ఎక్కువ సమయం పడుతుంది. (ఉదా: సాంఖ్యకశాస్త్రం). త్రికోణమితి, వైశ్లేషిక రేఖాగణితం, సాంఖ్యకశాస్త్రం, రేఖాగణితం, మాత్రికలు, శ్రేఢుల పాఠ్యాంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. గణితంలో గట్టెక్కండిలా: - గణితానికి ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఎక్కువ సమ యం కేటాయించాలి. పాఠ్యాంశాలను సాధన చేయాలి. - పదోతరగతి పాఠ్యాంశాలన్నింటినీ భావనలు, సూత్రాల ఆధారంగా నేర్చుకోవాలి. - పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన గత ప్రశ్నపత్రాలు పరిశీలించి, వాటిలో ఇచ్చే ప్రశ్నల స్థాయిని, పాఠ్యాంశాల వెయిటేజీని గుర్తించాలి. తర్వాత ఇదే తరహా ప్రశ్నలు గల సమగ్రమైన మెటీరియల్ను, ప్రామాణిక పుస్తకాలను సేకరించుకొని సాధన చేయాలి. - సమస్యలను సాధించేటపుడు ప్రతి ప్రశ్నను 1 నిమిషంలో సాధిస్తున్నారో లేదో అంచనా వేసుకోవాలి. - ఎక్కువగా అన్వయ(అప్లికేషన్) ఆధారిత ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి ప్రతి పాఠ్యాంశంలో ఈ తరహా ప్రశ్నలపై పట్టు సాధించండి - వివిధ నమూనా పరీక్షలను (మోడల్ టెస్ట్) 2 గంటల సమయం నిర్దేశించుకొని, ఆ సమయంలోనే పరీక్ష పూర్తి చేస్తున్నారో లేదో సరిచూసుకోండి. - నమూనా పరీక్షలను సాధన చేసేటప్పుడు సమాధానాల ను ఓఎంఆర్ పత్రంపైనే గుర్తించేటట్లు సాధన చేయాలి. - అవసరమైన చోట సమస్యలను సాధించేటపుడు సులభమార్గం (షార్ట్ కట్ మెథడ్స్) ఉపయోగించాలి. - పరీక్షరోజున ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నలను చివరిలో సాధించాలి. - మోడల్ పేపర్స రాసిన తర్వాత మూల్యాంకనం చేసుకొని, తప్పుగా రాసిన ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని మళ్లీ ప్రాక్టీస్ చేయాలి. - త్రికోణమితి, వైశ్లేషిక రేఖా గణితం, సాంఖ్యక శాస్త్రం, రేఖాగణితం, మాత్రికలు, శ్రేఢులు పాఠ్యాంశాల్లో గల అప్లికేషన్ ఆధారిత ప్రశ్నలను ఎక్కువగా సాధన చేయాలి. భౌతిక, రసాయన శాస్త్రాలు: భౌతికశాస్త్రంలో 30, రసాయన శాస్త్రం నుంచి 30 మార్కులు చొప్పున మొత్తం 60 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. భౌతిక శాస్త్రంలో పరీక్ష పదోతరగతి స్థాయిలోనే ఉంటుంది. కానీ 8, 9 తరగతుల పాఠ్య పుస్తకాలను కూడా చదవాలి. పదోతరగతిలోని అన్ని పాఠ్యాంశాలతోపాటు, 8వ తరగతిలోని మన విశ్వం, గతిశాస్త్రం, అయస్కాంతత్వం, విద్యుత్ పాఠాలు, 9వ తరగతి నుంచి శుద్ధగతి శాస్త్రం, గతిశాస్త్రం, కాంతి, విద్యుత్, ఆధునిక భౌతిక శాస్త్రం పాఠాలను క్షుణ్నంగా చదవాలి. - పాఠాలలోని భావనలను విపులంగా, విశ్లేషణాత్మకంగా చదవాలి. - సమస్యలను సాధించడానికి అధిక ప్రాధాన్యతనివ్వాలి - ప్రతి భౌతిక రాశి ప్రమాణాలను, స్థిరాంకాలను గుర్తుంచుకోవాలి. అన్ని భావనలను విశ్లేషణాత్మకంగా చదివి, బిట్ల రూపంలో తయారు చేసుకోవాలి. - బిట్లో రెండు లేదా మూడు భావనలు ఇమిడి ఉండేలా రాసుకోవాలి. - పదో తరగతిలో ముఖ్యంగా గతిశాస్త్రం, ధ్వని, కాంతి, అయస్కాంతత్వం, విద్యుత్, ఆధునిక భౌతికశాస్త్రం, ఎలక్ట్రానిక్స్ అంశాలను క్షుణ్నంగా చదవాలి. - పదో తరగతికి చెందిన పాఠ్య పుస్తకాలు, బిట్బ్యాంకులపైనే ఆధార పడకుండా ఇంటర్లో పదో తరగతికి అనుబంధంగా ఉండే పాఠ్యాంశాలను కూడా సాధన చేస్తే బాగుంటుంది. - పదో తరగతి పరీక్షలు పూర్తయిన వెంటనే అతి తక్కువ సమయంలోనే పాలిసెట్ ఉంటుంది. కాబట్టి లక్ష్యాత్మకంగా సాధన చేయాలి. రసాయనంలో రాణించాలంటే: - ఈ అంశం నుంచి కూడా 30 బిట్లు ఉంటాయి. పదో తరగతిలోని 10 అధ్యాయాలూ ముఖ్యమైనవే. వీటితోపాటు 8, 9 తరగతుల పాఠ్య పుస్తకాలను కూడా చదవాలి. - 8వ తరగతిలోని రసాయన చర్యలలో రకాలు, సంకేతాలు - సాంకేతికాలు, ఫార్ములాలు, రసాయన చర్యా వేగాలు ముఖ్యమైనవి. - 9వ తరగతిలోని పరమాణు నిర్మాణం, రసాయన బంధం, లోహ సంగ్రహణ శాస్త్రం ముఖ్యమైనవి. వీటితోపాటు నైట్రోజన్, ఫాస్ఫరస్ అధ్యాయాల నుంచీ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. పదో తరగతికి అనుబంధంగా ఇంటర్లో ఉండే పాఠ్యాంశాలను కూడా చదివితే మెరుగైన స్కోర్కు వీలుంది. పరీక్ష రాసే సమయంలో: మొదటగా రసాయన శాస్త్రంలో అంటే 91-120 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. అనంతరం భౌతికశాస్త్రంలోని వాటికి జవాబులు రాయాలి. చివరిగా గణితం ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నను క్షుణ్నంగా చదివి సమాధానం కచ్చితంగా రూఢి చేసుకున్న తరువాతనే ఓఎంఆర్లో దిద్దాలి. లేకుంటే సమయం వృథా అవుతుంది. ఒక్కోసారి ఆప్షన్స్ను యత్న-దోష (ట్రైల్ అండ్ ఎర్రర్ ) పద్ధతి ద్వారా కూడా ఎంపిక చేసుకోవచ్చు. కేవలం పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ప్రిపేర్ అయినట్లు కాకుండా కొంచెం విశ్లేషణాత్మకంగా ప్రిపేర్ అయితే పాలిసెట్లో మంచి ర్యాంకు సొంతంచేసుకోవచ్చు. మీ కలను సాకారం చేసుకోవచ్చు. పాలిసెట్-2014 ముఖ్య సమాచారం: అర్హత: పదో తరగతి పూర్తి చేసిన వారు. లేదా ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాసు రుసుం: రూ.350 (ఫీజును ఏపీ ఆన్ లైన్, మీసేవ, ఈసేవ కేంద్రాలలోనే చెల్లించాలి) దరఖాస్తు స్వీకరణ తేదీ: 06-04-2014 దరఖాస్తుకు చివరి తేదీ: 28-04-2014 హాల్టికెట్ డౌన్లోడ్ తేదీ: 10-05-2014 పరీక్ష తేదీ: 21-05-2014 ఫలితాల వెల్లడి: 06-06-2014 వెబ్సైట్: www.sbtetap.gov.in prepared by: Vanam Raju, (Mathematics); Nagaraja Shekar, (Physical Science) -
టాస్క్ఫోర్స్ నివేదికింకా గుట్టుగానే !
ఇంజనీరింగ్ కాలేజీల్లో తనిఖీల వివరాలు వెలుగుచూడని వైనం సాంకేతిక విద్యాశాఖ వద్దే నివేదికను పెండింగ్లో పెట్టిన సర్కారు మళ్లీ ప్రవేశాల ప్రక్రియ మొదలుతో తల్లిదండ్రుల్లో ఆందోళన సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలపై తనిఖీలు చేసి టాస్క్ఫోర్స్ కమిటీ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం ఇంకా గుట్టుగానే ఉంచింది. తనిఖీలు పూర్తయి ఏడాది గడిచినా ఆ నివేదికను బయట పెట్టకుండా సాంకేతిక విద్యాశాఖ వద్దే పెండింగ్లో పెట్టింది. కాలేజీల వారీగా నివేదికలోని అంశాలు బయటకు వస్తే నాణ్యతా ప్రమాణాలు కొరవడిన విద్యాసంస్థల్లో విద్యార్థులు చేరరు. అందుకే కొన్ని కళాశాలల యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గే టాస్క్ఫోర్స్ నివేదికను ప్రభుత్వమే బయటకు రానివ్వట్లేదనే ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది కూడా నివేదికలోని అంశాలను పక్కనబెట్టి అన్ని కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టిన ప్రభుత్వం... ఇప్పుడు మళ్లీ ప్రవేశాల సమయం వచ్చినా దానిపై స్పందించట్లేదు. ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ గత నెల 20నే ప్రారంభమైంది. అప్పుడే తల్లిదండ్రుల్లో ఏది మంచి కళాశాల? ఎక్కడ ఎలాంటి బోధనా సిబ్బంది ఉన్నారు? సదుపాయాలెలా ఉన్నాయనే అంశాలపై ఆలోచన మొదలైంది. ఇక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన నేపథ్యంలో అధికారులపై ప్రజాప్రతినిధుల ఒత్తిడికి అవకాశం లేదు. ఇప్పుడైనా ఆ టాస్క్ఫోర్స్ నివేదికను బయటపెట్టాలని, కాలేజీల వారీగా వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం ద్వారా విద్యార్థులకు మేలు చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కాలేజీలు చేసే ప్రచారంతో మోసపోకుండా చూడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. సౌకర్యాల్లేకున్నా భారీగా ఫీజు.... 2012-13 విద్యా సంవత్సరం ఫీజుల ప్రతిపాదనల కోసం ఇంజనీరింగ్ తదితర వృత్తివిద్యా కళాశాలలు సమర్పించిన వ్యయ నివేదికల్లో... కొన్ని యాజమాన్యాలు రూ. లక్షకు పైగా ఫీజు ప్రతిపాదించాయి. చాలా కాలేజీల్లో సౌకర్యాలేవీ లేకున్నా ఫీజు భారీగా పెంచాలని పేర్కొన్నాయి. దీంతో కాలేజీల్లో వసతులపై తనిఖీలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం చట్టసవరణ చేసి 2012, ఆగస్టు 11న జీవో 54 జారీ చేసింది. సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్.కె.సిన్హా, సీనియర్ ఐపీఎస్ అధికారి ఉమేష్ షరాఫ్ సభ్యులుగా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ కన్వీనర్గా రాష్ట్ర టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అదే సంవత్సరం సెప్టెంబర్లో ఇంజనీరింగ్ కళాశాలల్లో తనిఖీలు ప్రారంభించి, గత ఏడాది ఫిబ్రవరిలో పూర్తి చేసింది. దీని ఆధ్వర్యంలోని జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీలు 686 ఇంజనీరింగ్ కళాశాలల్లో తనిఖీలు చేశాయి. నిబంధనలు ఉల్లంఘించిన కాలేజీలకు వచ్చే విద్యా సంవత్సరానికి అనుమతులు ఇవ్వొద్దని కమిటీ సిఫారసు చేసింది. సంబంధిత నివేదికను గత ఏడాది ఫీజుల నిర్ధారణ కోసం ఏఎఫ్ఆర్సీకి అందజేసింది. ప్రభుత్వానికి మాత్రం ఇప్పటికీ ఆ నివేదిక అందలేదు. ఒకవేళ ప్రభుత్వానికి చేరితే నివేదికను బయటపెట్టాల్సి వస్తుందని, తద్వారా కాలేజీల్లోని లోపాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే తొక్కిపెడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నివేదికలోని కొన్ని అంశాలు... - 60 శాతం కాలేజీల్లో నిబంధనల ప్రకారం ప్రయోగశాలలు, పరికరాలు లేవు. కంప్యూటర్ ల్యాబ్లు ఉన్నా 75 శాతం కాలేజీల్లో ఇంటర్నెట్ సదుపాయమే లేదు. - లైబ్రరీల్లో విద్యార్థుల రిఫరెన్స్కు ఉపయోగపడే జర్నల్స్ లేవు. - 20 శాతం కాలేజీల్లో నిబంధనల ప్రకారం భవనాలు లేవు. ఏటేటా అదనపు కోర్సులను, సీట్లను మంజూరు చేయించుకునే కాలేజీ యాజమాన్యాలు... విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా భవనాలను మాత్రం నిర్మించట్లేదు. - ప్రతి 15 మంది విద్యార్థులకు ఒకరు చొప్పున ఫ్యాకల్టీ ఉండాల్సి ఉన్నా 75 శాతం కాలేజీల్లో ఆ నిష్పత్తిలో లేరు. - 164 కాలేజీలు మాత్రమే నిబంధనల ప్రకారం ఆరో వేతన స్కేళ్లను అమలు చేస్తున్నాయి. మిగిలిన 500కు పైగా కాలేజీల్లో అమలుకు నోచుకోవట్లేదు. - ఫ్యాకల్టీకి ఎంటెక్, పీహెచ్డీ విద్యార్హత ఉండాల్సి ఉన్నా 70 శాతం మంది బీటెక్ అర్హతతోనే పనిచేస్తున్నారు. వారికి ఆయా యాజమాన్యాలు రూ. 6 వేల నుంచి రూ. 10 వేలు వరకు మాత్రమే చెల్లిస్తున్నాయి. -
మగువ ముంగిట్లోకి సాంకేతిక విద్య
సిద్దిపేట జోన్, న్యూస్లైన్: సిద్దిపేట చదువుల తల్లి మణిహారంలో మరో ముత్యం వచ్చి చేరింది. గత ఏడాది మంజూరైన పాలిటెక్నిక్ కళాశాలకు అనుసంధానంగా వచ్చే విద్యా సంవత్సరం(2014-15) నుంచి సిద్దిపేటలో మహిళా పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్మిశ్రా జీఓ నం. 19 విడుదల చేశారు. దీంతో సిద్దిపేట పరిసర ప్రాంత మహిళలకు సాంకేతిక విద్య ముంగిట్లోకి రానుంది. ఏడాదికో కళాశాల విద్యాపరంగా దినదినాభివృద్ధి చెందుతున్న సిద్దిపేటకు గత ఏడాది బాలుర పాలిటెక్నిక్ కళాశాల మంజూరైంది. కొంతకాలంగా తాత్కాలిక భవనంలో కొనసాగిన ఈ పాలిటెక్నిక్ కళాశాల, ఇటీవలే రాజగోపాల్పేటలో నిర్మించిన సొంత భవనంలోకి మారింది. ఈక్రమంలోనే సిద్దిపేటలో మహిళా పాలిటెక్నిక్ కళాశాలను కూడా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే హరీష్రావు ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదలను పరిశీలించిన సాంకేతిక విద్యాశాఖ, ఏఐసీటీఈ నిబంధనల మేరకు నూతన కళాశాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దీంతో ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్మిశ్రా సిద్దిపేటలో మహిళా పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేస్తూ జీఓ జారీ చేశారు. అంతేకాకుండా కళాశాల ఏర్పాటుకు రూ.5.44 కోట్ల ప్రతిపాదనలతో ప్రణాళికను రూపొందించి, తొలి విడతలో రూ. 77 లక్షలు మంజూరు చేశారు. సివిల్, ఎలక్ట్రికల్ కోర్సులు..120 సీట్లు 2014-15 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్న సిద్దిపేట మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్, ఎలక్ట్రికల్ కోర్సులుంటాయి. ప్రస్తుతం ఒక్కో కోర్సులో 60 సీట్ల చొప్పున మొత్తం 120 సీట్లకు ఉన్నతవిద్యాశాఖ అనుమతులు తెలిపింది. కళాశాలకు సంబంధించి బోధన, బోధనేతర సిబ్బంది నియామకానికి మరోవారం రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సిద్దిపేటలోని ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలోని ఓ భవనాన్ని తాత్కాలికంగా మహిళా పాలిటెక్నిక్ కళాశాలకు కేటాయించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత మహిళా పాలిటెక్నిక్ కళాశాలకు శాశ్వత భవనాలు నిర్మించనున్నారు. -
దేశాభివృద్ధిలో సాంకేతిక విద్య కీలకం
జేఎన్టీయూ, న్యూస్లైన్ : దేశాభివృద్ధిలో సాంకేతిక విద్య కీలక పాత్ర పోషిస్తుందని డీఆర్డీఓ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) చీఫ్ అవినాష్ చందర్ అన్నారు. పరిశోధన ఫలాలు సామాన్యులకు అందించినప్పుడే దానికి సార్థకత చేకూరుతుందన్నారు. ఆ దిశగా పరిశోధనలు చేయాలని విద్యార్థులకు సూచించారు. సోమవారం అనంతపురం జవహల్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ-ఎ) పరిపాలన భవనంలో ఐదో స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వీసీ లాల్కిశోర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అవినాష్ చందర్ హాజరై ప్రసంగించారు. భారతదేశంలో మేథో సంపత్తికి కొదవ లేదని, ఎంతో మంది ఇంజనీర్ల కృషి ఫలితంగా నేడు ‘అగ్ని’ వంటి క్షిపణులను స్వయంగా తయారు చేసుకోగలిగామన్నారు. ఇదే సమయంలో కొందరు వలసబాట పట్టడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తల కృషితో దేశంలోని మేథో సంపత్తిని సద్వినియోగం చేసుకుని దేశీయంగా ఆశించిన విజయాలు సాధించామన్నారు. ఇందుకు అనంతపురం జేఎన్టీయూకు చెందిన ముగ్గురు శాస్త్రవేత్తల ప్రతిభా పాటవాలే నిదర్శనమన్నారు. ప్రాచీన కాలం నుంచి ఆంధ్రప్రదేశ్.. సాంకేతిక పరిజ్ఞానానికి హబ్గా వెలుగొందిందన్నారు. అదే సంప్రదాయాన్ని మున్ముందు కొనసాగించాలన్నారు. ఇంజనీర్లు అవిశ్రాంతంగా చేసిన కృషి షలితంగా దేశీయంగా అగ్ని, చంద్రయాన్, మంగళయాన్, జీఎస్ఎల్వీ, వివిధ రకాల యుద్ధ యంత్రాల తయారీ, ఆధునిక పరిశోధనలు సాధ్యమయ్యాయన్నారు. వాటి ఫలితాలను నెహ్రూ కాలం నుంచి నేటి వరకూ పొందుతున్నామన్నారు. ఈ ఫలితాలతో సాంకేతిక రంగంలో భారత దేశం ఒక శాస్త్ర లీడర్గా నిలుస్తోందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కాగా.. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ప్రకటించిన 200 ఉత్తమ పరిశోధనా సంస్థలలో భారత దేశానికి చెందిన ఒక్కదానికి కూడా చోటు దక్కకపోవడం పట్ల ఆయన ఆందోళన చెందారు. దేశంలో విద్యను అభ్యసించిన ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, మేధావులు ఇతర దేశాలకు వలసబాట పట్డడమే ప్రధాన కారణమన్నారు. ఇది ఎంతమాత్రం తగదని.. దేశీయంగా తమ ప్రతిభను చాటి దేశ ప్రతిష్టను ఇనుమడింప చేయడంలో భాగస్వాములు కావాలని భావి ఇంజినీర్లకు సూచించారు. భాతరదేశ సాంకేతిక విజ్ఞాన పరిశోధనా రంగంలో పంజాబ్ యూనివర్శిటీ తర్వాత అనంతపురం జేఎన్టీయూ దేశ వ్యాప్తంగా రెండో స్థానంలో నిలుస్తోందన్నారు. దేశంలో ఇంజినీరింగ్ విద్య అభ్యసించిన వారు డీఆర్డీఓలో కీలకంగా మారారన్నారు. అందుకు గతంలో అగ్ని ప్రయోగంలో ఏర్పడిన లోపాలను డిసెంబర్ 31వ తేదీ రాత్రికి రాత్రే బాలాసోర్ పరిశోధనా క్షేత్రాన్ని చేరుకుని క్షిపణి లోపాలను సరిదిద్దడమే నిదర్శనమన్నారు. విద్యాభ్యాసానికి దీటుగా పరిశోధనలకు జేఎన్టీయూ ప్రాధాన్యత ఇవ్వడం ఆహ్వానించదగ్గ విషయన్నారు. పరిశోధనలో నాణ్యతా ప్రమాణాల పెంపు పరిశోధనల్లో నాణ్యతా ప్రమాణాలు, విలువలతో కూడిన విద్యకు పెద్దపీట వేశామని జేఎన్టీయూ వీసీ లాల్కిశోర్ అన్నారు. ఇందుకు అవసరమైన మౌలిక వసతులు, నిధులను ఎప్పటికప్పుడు సమకూర్చుతున్నామన్నారు. నిష్ణాతులైన అధ్యాపకులతో విద్యాబోధన సాగుతోందన్నారు. సాంకేతిక విద్యకు చుక్కానిలా వర్శిటీని తీర్చిదిద్దామన్నారు. వర్శిటీలో 14 బీటెక్, 69 బీఫార్మా, ఫార్మాడీ, ఎంటెక్, ఎంఫార్మా స్పెషలైజేషన్ కోర్సులు, 5 ఎమ్మెస్సీ, 3 ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మాడీ(పీబీ) కోర్సులు నడుస్తున్నాయన్నారు. ఎంఎస్ఐటీ కోర్సును నూతనంగా ఈ ఏడాది నుంచి ప్రారంభించామన్నారు. విదేశీ యూనివర్శిటీలతో అవగాహన ఒప్పందాలు, వీఎల్ఐసీ సిస్టమ్ డిజైన్, ఎంబేడెడ్ సిస్టమ్స్ లాంటి కొత్త ప్రోగ్రాంలను పరిచయం చేశామన్నారు. కలికిరిలో నూతనంగా వర్శిటీ అనుబంధ ఇంజినీరింగ్ కళాశాల ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో రెక్టార్ సుదర్శన్రావ్, రిజిస్ట్రార్ హేమచంద్రారెడ్డి, డెరైక్టర్లు, ప్రొఫెసర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
అమెరికాలో టాటా లాబీయింగ్
వాషింగ్టన్/న్యూఢిల్లీ: టాటా గ్రూప్ అమెరికాలో వలస అంశాలు, సాంకేతిక విద్య తదితర అంశాలపై లాబీయింగ్ను ముమ్మరం చేసింది. గత రెండేళ్లుగా ఈ విషయంలో స్తబ్ధుగా ఉన్న ఈ గ్రూప్ సెప్టెంబర్ 30తో ముగిసిన క్వార్టర్కు లాబీయింగ్ జోరు పెంచిందని అమెరికా సెనేట్కు నివేదించిన లాబీయింగ్ డిస్క్లోజర్ ఫార్మ్స్ వెల్లడించాయి. టాటా గ్రూప్నకు చెందిన టాటా అమెరికా ఇంటర్నేషనల్ కార్ప్, టీసీఎస్లు ఈ ఏడాది లాబీయింగ్ కోసం రూ.2 కోట్లకు పైగా ఖర్చు చేశాయని వెల్లడైంది. అమెరికాలో లాబీయింగ్ చట్టబధ్దమైన వ్యవహారం. ప్రతి మూడు నెలలకు కంపెనలు తమ తమ లాబీయింగ్ లావాదేవీల వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. కాగా, భారత్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, తదితర అంశాలపై వాల్మార్ట్ కంపెనీ అమెరికాలో లాబీయింగ్ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించింది. భారత్ రిటైల్ రంగంలో ఎఫ్డీఐలు, ఇంకా ఇతర 50 అంశాలపై వాల్మార్ట్ సంస్థ లాబీయింగ్ నిమిత్తం 15 లక్షల డాలర్ల వరకూ వ్యయం చేసినట్లు వెల్లడైంది. -
సాంకేతిక విద్యకు రూ.10 కోట్లు మంజూరు
లక్ష్మీదేవిపల్లి, న్యూస్లైన్ : నాణ్యమైన సాంకేతిక విద్యనందించేందుకు ప్రపంచ బ్యాంకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రూ. 10 కోట్లు మంజూరయ్యాయని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కె.సాయిలు తెలిపారు. కొత్తగూడెంలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (యూసీఈ) కళాశాలలో శనివారం నిర్వహించిన టెక్నికల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇంప్రూమెంట్ ప్రొగ్రామ్కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంచవర్ష ప్రణాళికలో మంజూరు చే సిన నిధులతో నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే ధ్యేయమన్నారు. ప్రపంచ స్థాయిలో విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. డిసెంబర్ 2014 నాటికి రూ.10 కోట్లు ఖర్చులు చే యడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా మెంటరింగ్, కౌన్సెలింగ్, పేద విద్యార్థులకు మెరుగైన విద్యనందించడం, పీజీ, పీహెచ్డీ తదితర కార్యక్రమాలను చేపట్టనున్నామన్నారు. ఈ నిధుల్లో మొదటి విడతగా రూ.2.25 కోట్లు విడుదలయ్యాయని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కె.శౌరి, వైస్ ప్రిన్సిపాల్ జగన్మోహన్రాజు, టీఈక్యూఐపీ కోఆర్డినేటర్ ఎం.మురళీధర్రెడ్డి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ యూనిట్ హెడ్ ఎ.రవీందర్బాబు, ఎస్పీఎఫ్యూ హెడ్ ప్రొడ్యూస్మెంట్ అధికారి టి.ఎస్.మాణిక్య ప్రభు, కళాశాల సిబ్బంది శ్రీకాంత్, రాము, స్పందన్, రవి, తదితరులు పాల్గొన్నారు. కొత్త స్కీములకు రూ.100 కోట్ల ప్రతిపాదనలు నిరుపేద విద్యార్థులకు సాంకేతిక విద్యనందించేందుకు రెండు కొత్త స్కీములు ప్రవేశపెట్టేందుకు రూ. 100 కోట్ల ప్రతిపాదనలు పంపామని కేయూ రిజిస్ట్రార్ సాయిలు తెలిపారు. యూసీఈ కళాశాలలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాంకేతిక విద్యా ప్రమాణాలను మెరుగు పర్చేందుకు రాష్ట్రీయ ఉచిత శిక్షాభియాన్ (రూసా), నేషనల్ నాలెడ్జ్ కమిషన్ (ఎన్కేసీ) స్కీములకు నిధులు మంజూరు చేయాలని ఎన్కేసీ కమిషన్ చైర్మన్ శ్యాం గంగాధర్ పిట్రోడా కమిటీకి ప్రతిపాదనలు పంపామని చెప్పారు. ఈ స్కీముల ద్వారా రాబోయే రోజుల్లో ఈక్వీటీ, యాక్సెస్, ఎక్స్లెన్స్ తదితర అంశాలతో సాంకేతిక విద్యలో ఉన్నత ప్రమాణాలను కలిగి ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా మారుమూల ప్రాంతాల్లోని నిరుపేద విద్యార్థులకు సైతం అవకాశాలు కల్పించేందుకు దోహదపడుతుందన్నారు. దేశంలో 1,500 విశ్వవిద్యాలయాలున్నాయని, వాటిని మరింత అభివృద్ధి పర్చేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నామని తెలిపారు. -
సాంకేతిక విద్యలో నాణ్యత పెంచాలి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే సాంకేతిక విద్యలో నాణ్యత పెంచాల్సిన బాధ్యత అధ్యాపకులపైనే ఉందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయమంత్రి పల్లంరాజు అన్నారు. సంగారెడ్డి మండలం ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లోని ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్లో శని వారం జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. పోటీతత్వం, సృజనాత్మకంగా ఆలోచించ గలిగే మానవ వనరులు ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు. శాస్త్ర, సాంకేతిక అంశాలపై అధ్యాపకులకు మంచి పట్టు ఉన్నప్పుడే బోధనలో నాణ్యత ఉంటుందన్నారు. సాంకేతిక పరంగా పురోగమిస్తున్నందున అధ్యాపకులు కూడా ఎప్పటికప్పుడు నూతన అంశాలపై అవగాహన పెంచుకోవాల్సిందిగా పల్లం రాజు సూచించారు. నూతన పరిశోధనలు చేసేందుకు ఎలాంటి నిధుల కొరత లేదని మానవ వనరుల అభివృద్ధి మంత్రి త్వ శాఖ అదనపు కార్యదర్శి అనిత వెల్లడిం చారు. ఈ సదస్సులో బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ప్రొఫెసర్ ఎస్కే నంది, ఐఐటీ హైదరాబాద్ డెరైక్టర్ యూబీ దేశాయ్ పాల్గొన్నారు.