ఓ ట్రెయిలర్ లారీలో తరలిస్తున్న ఇనుప రాడ్లు ఆటోపై కూలిపడడంతో నలుగురు కూలీలు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఎగుడుదిగుడుగా ఉన్న మట్టి రోడ్డు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులంతా అస్సాం రాష్ట్రానికి చెందిన కూలీలే. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఇంద్రకరణ్ వద్ద సోమవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది.