sangareddy
-
తన కూతురిని ప్రేమిస్తున్నాడని తండ్రి ఘాతుకం
-
పటాన్చెరులో హైడ్రా కూల్చివేతలు.. బోర్డులు ఏర్పాటు!
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణలో హైడ్రా(HYDRA) కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. అక్రమ నిర్మాణాలపై హైడ్రా మరోసారి కొరడా ఝలిపించింది. తాజాగా ముత్తంగిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. పార్క్ స్థలంలో ఆక్రమణలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. శుక్రవారం ఉదయమే అక్కడికి చేరుకున్న హైడ్రా అధికారులు, పోలీసులు.. అక్రమ నిర్మాణాలను తొలగించారు. పోలీసుల బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.తెలంగాణలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే శుక్రవారం ఉదయం సంగారెడ్డి(Sanga Reddy) జిల్లా పటాన్చెరు(Patancheru) మండలం ముత్తంగి గ్రామంలో 296 సర్వే నంబర్లలో ఉన్న గాయత్రి వెంచర్ పార్క్ స్థలంలో నిర్మించిన షెడ్డును హైడ్రా అధికారులు కూల్చివేశారు. ముందుస్తు సమాచారం మేరకు రంగంలోకి దిగిన అధికారులు పూర్తి ఆధారాలతో కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. అక్కడ అధికారులు, పోలీసుల పర్యవేక్షణలో కూల్చివేతలు జరుగుతున్నాయి.ఇదిలా ఉండగా.. తెలంగాణలో చెరువు భూములు, ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు తీసుకొచ్చిన హైడ్రా ఇప్పటికే కొన్ని వందల ఎకరాల ప్రభుత్వ భూములను రక్షించింది. ఈ క్రమంలో పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. మూడు రోజుల క్రితమే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా మరోసారి పంజా విసిరింది. అమీన్పూర్ చెరువులో ఏపీకి చెందిన నేత అక్రమ నిర్మాణాన్ని హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. చెరువును కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేసినట్లు హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. దీనిపై విచారణ జరిపిన హైడ్రా అక్రమాలు జరిగింది నిజమేనని నిర్ధారించుకుని కూల్చివేతలకు దిగింది. గతంలోనూ అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. అయితే ఇక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో కూల్చివేతలు కొనసాగించాలని నిర్ణయించింది.స్వాధీన స్థలాల్లో హైడ్రా బోర్డులుప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, పార్కుల స్థలాల ఆక్రమణలను తేల్చి కూల్చేసిన స్థలాల్లో ‘ప్రొటెక్టెడ్ బై హైడ్రా’ అని బోర్డులు పెట్టాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న స్థలాల్లో ప్రభుత్వ స్థలం అని ఏర్పాటుచేసిన బోర్డులను తొలగించి ఆక్రమిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, దీంతో హైడ్రా ప్రొటెక్షన్లో ఉన్నట్టుగా బోర్డులు పెట్టాలని సూచించారు. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
హత్నూర(సంగారెడ్డి): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తనే హత్య చేసింది భార్య. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం రెడ్డి ఖానాపూర్లో చోటు చేసుకుంది. సోమవారం ఎస్ఐ సుభాష్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన మల్లె నారాయణ(42) మూడేళ్ల కిందట ఉపాధి నిమిత్తం హత్నూర మండలం రెడ్డి ఖానాపూర్ గ్రామానికొచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. గ్రామంలోనే ఎఫ్పీఓ (ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్) కార్యాలయంలో సీఈవోగా పని చేస్తున్నాడు. భార్య లక్ష్మీ సొంత మల్లుపల్లి గ్రామంలోనే ఉండేది. నాలుగు రోజుల కిందట భర్త వద్దకు రెడ్డి ఖానాపూర్ గ్రామానికి వచ్చింది . లక్ష్మీకి బిక్నూర్ మండలం రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన బీజేపీ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు కడారి రాకేశ్తో వివాహేత సంబంధం కొనసాగిస్తుంది. ఈ విషయం తెలిసి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఎలాగైన భర్తను అడ్డు తొలగించుకోవాలని పథకం వేసింది. పథకం ప్రకారం శుక్రవారం రాత్రి ప్రియుడు రాకేశ్, బిక్నూర్ గ్రామానికి చెందిన సాగర్ రమేశ్, డప్పు శ్రీకాంత్, కడారి శ్రీకాంత్తో కలిసి భర్త నారాయణను రెడ్డి ఖానాపూర్ గ్రామ శివారులోని సొసైటీ కార్యాలయం వద్ద హత్య చేసి మృతదేహాన్ని పల్పనూరు గ్రామ శివారులో పడి వేశారు. మరుసటి రోజు (శనివారం) ఏమీ తెలియనట్లు భర్త కనిపించడం లేదని హత్నూర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం గ్రామ ఉదయం శివారులో మృతదేహం ఉందనే సమాచారం మేరకు ఘటన స్థలాన్ని పటాన్ చెరువు డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ నదిముద్దీన్ పరిశీలించారు. అనుమానితురాలుగా ఉన్న భార్యను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా నేరం ఒప్పుకుంది. లక్ష్మీ, రాకేశ్తోపాటు వీరికి సహకరించిన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ సుభాష్ తెలిపారు. లక్ష్మీ సైతం బీజేపీ బీసీ మహిళా మండలాధ్యక్షురాలు పని చేస్తున్నట్లు పేర్కొన్నారు.హత్య కేసులో నిందితుల రిమాండ్హత్నూర(సంగారెడ్డి): భర్తను హత్య చేయించిన భార్యతోపాటు ఇందుకు సహకరించిన నలుగురిని మంగళవారం రిమాండ్కు తరలించినట్లు జిన్నారం సీఐ ఎండీ నయీముద్దీన్ తెలిపారు. హత్నూర పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సుభాష్తో కలిసి వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన మల్లె నారాయణ (42) వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భార్య లక్ష్మీనర్సవ్వ, ప్రియుడు కడారి రాకేష్, చెట్లపల్లి సాగర్, కడారి శ్రీకాంత్, డప్పు శ్రీకాంత్ కలిసి హత్య చేయించిన విషయం తెలిసిందే. పథకం ప్రకారం తన ప్రియుడైన రాకేశ్కు రూ.40 వేలు సుపారీ ఇచ్చింది. లక్ష్మీ నర్సవ్వ ఖానాపూర్లో ఉండే భర్త దగ్గరకు మూడు రోజుల కిందట వచ్చింది. అతడు ఆఫీసులో ఉండగానే తాగడానికి కల్లు తెమ్మని చెప్పింది. అతడు వచ్చే లోపు పథకం ప్రకారం నలుగురు నిందితులు వచ్చి ఆఫీసులోని ఓ గదిలో దాక్కున్నారు. నారాయణ కల్లు తీసుకొని రాగానే వారి వెంట తెచ్చుకున్న కత్తి, కట్టే ఇనుప రాడుతో ఒక్కసారిగా దాడి చేసి నరికి చంపేశారు. ఈ హత్యపై ఎస్సై సుభాష్ తనదైన శైలిలో విచారణ చేయగా భార్య లక్ష్మీతోపాటు మరో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. హత్యకు ఉపయోగించిన కారు, కత్తి కట్టే ఇనుప రాడును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు. -
పెళ్లికి పెద్దలు ఒప్పుకోవడం లేదనే...
మునిపల్లి(అందోల్)/నారాయణఖేడ్: పెళ్లికి పెద్దలు అంగీకరించడం లేదంటూ ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన శుక్రవారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం సింగూరు ప్రాజెక్టు హరిత రిసార్ట్లో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం..నిజాంపేటకు చెందిన కరిపే ఉదయ్కుమార్ (21), మంగలి రోహిత(19) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలకు చెందినవారు అంగీకరించలేదు.ఈ క్రమంలో గురువారం ఉదయ్, రోహితలు సింగూరు ప్రాజెక్టు సమీపంలోని హరిత రిసార్ట్లో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. ఒకే ఫ్యాన్కు ఇద్దరూ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈ ప్రేమజంట ఆత్మహత్య విషయం రిసార్ట్ నిర్వాహకులకు శుక్రవారం తెలిసింది. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడ రాసి ఉంచిన సూసైడ్నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ ప్రేమకు తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు అందులో పేర్కొన్నట్టు తెలిసింది. ఉదయ్కుమార్ది మిర్చి వ్యాపారం కాగా, రోహిత నారాయణఖేడ్లోని మోడల్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ (బీజెడ్సీ) ఫైనలియర్ చదువుతోంది. గురువారం ఆమె క్లాసులకు హాజరు కాలేదు. శుక్రవారం ఉదయం రోహిత తండ్రి దుర్గేష్ కళాశాలకు ఫోన్ చేసి కూతురు ఆచూకీ గురించి ఆరా తీసినట్టు తెలిసింది. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. కాగా ఉదయ్కుమార్ తండ్రి బాల్కిషన్ కొంతకాలం క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. హరిత రిసార్ట్ మేనేజర్ సాంబశివరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్ఐ రాజేశ్నాయక్ తెలిపారు. -
గురుకుల పాఠశాల విద్యార్థుల నిరసన
-
నెలకు 5,000 ఖర్చు చేయలేక.. మొసళ్ల నదిలో వదిలేశారు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఒక మొసలికి ఆహారంగా రోజుకు సుమారు అర కిలో మాంసం వరకు సరిపోతుంది. వీటికి రోజువిడిచిరోజు ఓ కిలో వర కు బీఫ్ ఆహారంగా వేస్తారని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం నెలకు ఎక్కు వలో ఎక్కువ రూ.ఐదు వేల వరకు.. ఏడాదికి రూ.60 వేలకు మించి ఖర్చు కావు. ఈ మాత్రం నిధులు లేవనే సాకుతో అటవీశాఖ అధికారులు మంజీరా అభయారణ్యం వద్ద ఉన్న మొసళ్ల పునరావాస కేంద్రాన్నే మూసివేశారు. ఈ కేంద్రంలో ఉన్న మొసళ్లను నదిలో వదిలేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.మూడింటిని కూడా మేపలేక..సంగారెడ్డికి సమీపంలో ఉన్న మంజీరా అభయార ణ్యం విభిన్న పక్షి జాతులకు నిలయం. మంజీరా డ్యాం వద్ద ఉన్న చిత్తడి నేలల్లో ఏటా వివిధ దేశాల నుంచి వలస పక్షులు కూడా వచ్చి సందడి చేస్తుంటాయి. ఈ డ్యాంవద్ద అటవీశాఖకు సంబంధించి మొసళ్ల పునరావాస కేంద్రం ఉంది. ఇందులో రెండు ఆడ, ఒక మగ మొసలి ఉండేవి. వీటికి మేతకు నిధులు రావడం లేదని ఆ మొసళ్లను నదిలో వది లేసి ఈ కేంద్రాన్ని మూసివేశారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రభుత్వం రూ.కోట్లలో నిధులు ఖర్చు చేస్తుంటే, ఈ నామమాత్ర నిధులు రావడం లేదంటూ మొసళ్లను నదిలో వదిలేసి చేతులు దులుపుకోవడం విమర్శలకు దారితీస్తోంది.పెదవి విరుస్తున్న వన్యప్రాణుల ప్రేమికులుమొసళ్ల పునరావాస కేంద్రాన్ని మూసివేయడం పట్ల వన్యప్రాణుల ప్రేమికులు, సందర్శకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ డ్యాం వద్దకు నిత్యం వందల సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాల నుంచి పక్షి ప్రేమికులు కూడా ఈ అభయారణ్యానికి వస్తుంటారు. ఈ కేంద్రం మూసి ఉండటంతో వీరంతా తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. కాంపా నిధులూ కేటాయించలేరా?వన్యప్రాణుల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కాంపా (కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్, ప్లానింగ్ అథారిటీ) నిధులు మంజూరు చేస్తుంది. ఈ పథకం కింద ఏటా రూ.కోట్లలో నిధులు వస్తున్నప్పటికీ., ఈ మొసళ్ల సంరక్షణ కేంద్రానికి మాత్రం నిధులు కేటాయించడం లేదని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. -
అరోరా లైఫ్ సైన్స్ పరిశ్రమలో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని పారిశ్రామిక వాడలో ఘోర అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అరోరా లైఫ్ సైన్స్ పరిశ్రమలో అగ్నిప్రమాదం కారణంగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు.వివరాల ప్రకారం.. జిన్నారం మండలం కాజిపల్లి పారిశ్రామికవాడలో అరోరా లైఫ్ సైన్స్ పరిశ్రమలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమలోని ఎంబీ-2 బ్లాక్ లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అయితే, రియాక్టర్లలో సాల్వెంట్ మిక్సింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. ఇక, రియాక్టర్ పేలిన ఘటన కారణంగా పారిశ్రామికవాడ ఉలిక్కిపడింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
లగచర్ల ఘటనలో అరెస్టైన వారితో ములాఖత్ అయిన ఈటల, డీకే అరుణ
-
రేవంత్ సోదరుడి అరాచకాలు ఎక్కువయ్యాయి: ఎంపీ ఈటల
సాక్షి, సంగారెడ్డి: వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామ బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వం బేషరతుగా క్షమాపణలు చెప్పి, వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. రైతులపై దుర్మార్గంగా ప్రవర్తించి, థర్డ్ డిగ్రి ప్రయోగించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ మేరకు లగచర్లలో అధికారులపై దాడి చేసిన ఘటనలో అరెస్ట్ చేసిన బాధిత రైతులను సెంట్రల్ జైలులో సోమవారం ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్రెడ్డిలు కలిసి పరామర్శించారు.ఈ ఘటనకు స్కెచ్ వేసింది కాంగ్రెస్ వాళ్లే..ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ప్రభుత్వం అవసరాల కోసం భూములు తీసుకోవడం వేరు కానీ, బడా కంపెనీలకు అప్పజెప్పడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు. కొండ నాలుకకి మందు వేస్తే ఉన్న నాలుక ఉడినట్టు కొడంగల్ నియోజకవర్గ రైతుల పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ వాళ్లే ఈ ఘటనకు స్కెచ్ వేసుకుని రైతులపై దాడులు చేయించారని ఆరోపించారు. 144 సెక్షన్ పెట్టి ప్రజాప్రతినిధులను అక్కడికి వెళ్లకుండా ఆపుతున్నారని.. దీనిపై పార్లమెంట్లో ప్రివిలేజ్ మోషన్ వేస్తామని చెప్పారు.రైతులకు సంకెళ్లు వేయడం కరెక్ట్ కాదు..‘సీఎం రేవంత్ సోదరుడు అరాచకాలు నియోజకవర్గంలో ఎక్కువ అయ్యాయి. నియంతలకు సందర్భం వచ్చినప్పుడు తెలంగాణ సమాజం బుద్ధి చెబుతుంది. రైతులకు సంకెళ్లు, తర్డ్ డిగ్రీ చేయడం కరెక్ట్ కాదు. ప్రజల కన్నీళ్లు చూసినవాడు ఎప్పుడు బాగుపడడు. నీకు అక్కడ ఏముందని పెత్తనం చేలాయిస్తున్నావ్. గతంలో ఖమ్మం రైతులకు సంకెళ్లు వేసిన వారికి పట్టిన గతే మీకు పడుతుంది. అధికారులు చట్టాన్ని పక్కన పెట్టి ఇలా చేయడం కరెక్ట్ కాదు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ల కోసం భూములు ఇస్తే ఉరుకోం’ అని ఈటల హెచ్చరించారు.కలెక్టర్ ఒక్కరే ఎందుకు వెళ్లారు: ఎంపీ డీకే అరుణలగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీకి భూమి ఇవ్వబోమని రైతులు 8 నెలలుగా ఆందోళన చేస్తున్నారని అన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. బలవంతంగా భూములు లాక్కుంటామని అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారని, ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరించారని తెలిపారు. వాస్తవంగా ప్రజాభిప్రాయ సేకరణకి రాకపోతే కలెక్టర్ ఒక్కరే ఎందుకు వెళ్లారని ఆమె ప్రశ్నించారు.పోలీసుల వైఫల్యంతోనే ఈ ఘటన జరిగిందన్నారు. సీఎం రేవంత్ సోదరుడు అక్కడ ఉన్న రైతులను బయపెట్టారని, భూములు ఎలాగైనా గుంజుకుంటామని చెప్పారని ఆరోపించారు.ఘటన తర్వాత రాత్రి గ్రామాల్లోకి వచ్చి పోలీసులు ఇష్టం వచ్చినట్టు దాడి చేశారని.. గొడవ జరిగిన ఘటనలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వదిలేసి మిగతా వాళ్ళని అరెస్ట్ చేశారని తెలిపారు.సీఎం సోదరుడు వెళ్లొచ్చు గానీ మేము వెళ్లొద్దా?భూములు ఇవ్వమని చెబితే సీఎం రేవంత్ స్వయంగా వెళ్లి వాళ్ళని కలిసి మాట్లాడితే బాగుండు. కానీ ఇవన్నీ చేయకుండా భయపెట్టి దాడులు చేపించి ఇలా చేయడం కరెక్టు కాదు. సీఎం సోదరుడు అక్కడికి వెళ్ళవచ్చు కానీ నన్ను అక్కడికి వెళ్లకుండా అడ్డుకున్నారు. రైతులతో దౌర్జన్యంగా బెదిరించి సంతకాలు పెట్టించుకుంటున్నారు. మీరు సీఎం అయితే మా నియోజకవర్గం బాగుంటుంది అనుకుంటే మీరు జనాలపై కక్ష కట్టారు. జనాల కంటే ఫార్మా కంపెనీ ముఖ్యమా?సీఎంకు ఫార్మా కంపెనీలపై అంత ప్రేమ ఎందుకు..? ఓటేసి గెలిపించిన జనాల కంటే మీకు ఫార్మా కంపెనీ ముఖ్యమా సీఎం రేవంత్? కొడంగల్ వాసులు కాదు.. సీఎం వలస వచ్చారు. మీకు నచ్చిన వారికి కంపెనీలు అప్పజెప్పడానికే ఫార్మా కంపెనీలు పెడుతున్నారు. వెంటనే లగచర్ల బాధితులను విడుదల చేయాలి. పంథాలు వద్దు నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష ముఖ్యం.పేదల ఉసురు పోసుకున్న కేసీఆర్ ఇంటికి పోయిండు. మీరు 11 నెలలకే పేదల ఉసురు పోసుకుంటున్నారు. మూసి ప్రజల ఉసురు కూడా పోసుకోవడం కరెక్ట్ కాదు. గర్భిణీ స్త్రీ అని చూడకుండా ఇలా చేయడం దారుణం. సీఎం రేవంత్ అహంకారం వీడాలి.. ఒప్పించి భూములు తీసుకోండి’ అని డీకే అరుణ పేర్కొన్నారు. -
లగచర్ల దాడిలో అరెస్టైన వారిని పరామర్శించనున్న బీజేపీ ఎంపీలు
-
హైవేపై కంటైనర్లో అగ్నిప్రమాదం.. ఎనిమిది కార్లు దగ్ధం
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ బైపాస్ వద్ద అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. కార్లు తరలిస్తున్న కంటైనర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది నెక్సాన్ కార్లు దగ్ధమైనట్టు సమాచారం.వివరాల ప్రకారం.. జహీరాబాద్ బైపాస్ వద్ద కార్లను తరలిస్తున్న కంటైనర్ లారీలో మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో నాలుగు నెక్సాన్ కార్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెస్తున్నారు. కంటైనర్ ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదం కారణంగా రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. -
గీతం యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి,సంగారెడ్డి: గీతం యూనివర్సిటీ సంగారెడ్డి క్యాంపస్ హాస్టల్లో ఇంజినీరింగ్ విద్యార్థిని వర్ష (19) ఆత్మహత్య చేసుకుంది.వర్ష గీతం ఇంజినీరింగ్ కాలేజీలో బీ.టెక్(సీఎస్ఈ) 3వ సంవత్సరం చదువుతోంది.వర్ష స్వస్థలం అనంతపురంగా పోలీసులు గుర్తించారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని మృతికి గల కారణాలపై కాలేజీ సిబ్బంది, తోటి విద్యార్థులను ఆరా తీస్తున్నారు.ఇదీ చదవండి: విద్యార్థిని మృతిపై అనుమానాలు నివృత్తి చేయండి -
స్కూల్లో ‘హైడ్రా’ కూల్చివేతలు
సాక్షి,సంగారెడ్డిజిల్లా: హెచ్ఎండీఏ పరిధిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా మంగళవారం(సెప్టెంబర్3) సంగారెడ్డిజిల్లా అమీన్పూర్ మండలంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టింది. ఐలాపూర్ తండా, అమీన్పూర్లో ఆక్రమణలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఐలాపూర్ తండాలో సుమారు 20 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించేందుకే అక్రమ నిర్మాణాలు కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు. సర్వే నంబర్ 119లో గుర్తుతెలియని వ్యక్తులు ప్లాట్లు వేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో హైడ్రా, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా రంగంలోకి దిగి అక్రమ కట్టడాలు, సరిహద్దు రాళ్లను తొలగించారు. అనంతరం సర్వే నెంబర్ 462లోని అక్కడి ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో ఆక్రమణలు కూల్చివేశారు. 15 గుంటల భూమి ఆక్రమించి స్కూల్ గదులు, ప్రహరీని హైడ్రా కూల్చివేసింది. -
సంగారెడ్డి పెద్దపూర్లో టెన్షన్.. టెన్షన్
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్లో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. రీజనల్ రింగ్ రోడ్డు కోసం అధికారులు భూ సేకరణ సర్వే చేస్తున్నారు. రైతులు సర్వేను ఆడుకున్నారు. సర్వేను అడ్డు కోవడంతో అక్కడి ఉదిక్తత వాతావరణ నెలకొంది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. భూ సర్వే ఆడుకున్న రైతులను పోలీసులు అరెస్ట్ చేసి. డీసీఎంలో తరలించారు. రెండ్రోజుల క్రితం రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) కోసం ప్రజాభిప్రాయ సేకరణలోను భూములు ఇవ్వబోమని రైతుల ఆందోళన చేశారు. -
చౌటుప్పల్–సంగారెడ్డిలో ఇంటర్చేంజ్ కూడళ్లు!
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగ్ రోడ్డుపై రెండు ప్రాంతాల్లో భారీ ఇంటర్ చేంజ్ కూడళ్లను నిర్మించబోతున్నారు. హైదరాబాద్–పుణె జాతీయ రహదారిని క్రాస్ చేసే సంగారెడ్డి సమీపంలోని గిర్మాపూర్ వద్ద.. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిని క్రాస్ చేసే చౌటుప్పల్ వద్ద ఈ కూడళ్లు ఉంటాయి. వీటికోసం ఢిల్లీ ఔటర్ రింగురోడ్డుపై నిర్మించిన ‘ఎక్స్టెండెడ్ డంబెల్’డిజైన్ను ఎంపిక చేశారు. ఎనిమిది వరసల (తొలి దశలో నాలుగు వరసలు)తో రీజనల్ రింగు రోడ్డును నిర్మిస్తున్న నేపథ్యంలో ఇంటర్చేంజ్లను విశాలంగా రూపొందిస్తున్నారు. ఆ డిజైనే ఎందుకు? ఇప్పటికే ఉన్న భారీ రహదారులను ఎక్స్ప్రెస్ వేలు క్రాస్ ప్రాంతాల్లో.. వాహనాలు ఆ రోడ్ల నుంచి రింగ్రోడ్డు మీదకు, రింగురోడ్డు నుంచి ఆ రోడ్ల మీదకు సులువుగా మారేందుకు వీలుగా ఇంటర్ చేంజ్ కూడళ్లను నిర్మిస్తారు. ఆ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న భూమి ఆధారంగా లూప్ డిజైన్లను ఎంపిక చేస్తారు. ఉత్తర–దక్షిణ భాగాలు కలిసే సంగారెడ్డి, చౌటుప్పల్ ప్రాంతాల్లో రోడ్ల పక్కనే చాలా నిర్మాణాలున్నా యి. అలాంటి చోట కూడళ్ల వద్ద భారీ లూప్లు నిర్మిస్తే భూసేకరణ పెద్ద సమస్యగా ఉంటుంది. ఈ క్రమంలో ‘ఎక్స్టెండెడ్ డంబెల్’నమూనాను ఎంపిక చేశారు. ఈ డిజైన్లో వాహనాలు రోడ్లను మారే లూప్లు ఎక్కువశాతం రింగురోడ్డును అనుకునే ఉంటాయి. వీటి నిర్మాణానికి అవసరమైన భూమిలో 70% వరకు రింగురోడ్ భూమినే వినియోగిస్తారు. మిగతా 30 శాతం భూమిని సేకరిస్తే సరిపోతుంది. ఒక్కోటి 150 ఎకరాల్లో.. 3 కిలోమీటర్ల నిడివితో.. ‘ఎక్స్టెండెడ్ డంబెల్’నమూనాలో నిర్మించే ఇంటర్ చేంజ్లలో.. లూప్ రోడ్లు చాలా దూరం నుంచే మొదలవుతాయి. ప్రస్తుతం రీజనల్ రోడ్డులో కూడా.. ప్రధాన కూడలికి ఇరువైపులా ఒకటిన్నర కిలోమీటర్ల దూరం చొప్పున మూడు కిలోమీటర్ల నిడివితో ఈ లూప్ రోడ్లు ఉండనున్నాయి. హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డుపై నిర్మించిన ఇంటర్ చేంజ్ల కంటే ఇది దాదాపు రెట్టింపు సైజు కావడం విశేషం.మొత్తంగా పదకొండు కూడళ్లు.. రీజనల్ రింగురోడ్డుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ వేగంగా సాగుతుండటంతో.. జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఐఏ) రోడ్డు నిర్మాణంపై దృష్టి సారించింది. మరో మూడు నెలల్లో టెండర్ల ప్రక్రియ మొదలయ్యే చాన్స్ ఉంది. ఈ మేరకు అధికారులు రోడ్డు డిజైన్ను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతానికి ఉత్తర భాగం (162 కిలోమీటర్లు.. సంగారెడ్డి నుంచి గజ్వేల్ మీదుగా చౌటు ప్పల్ వరకు) నిర్మాణం చేపట్టనున్నారు. ఈ రోడ్డు దక్షిణభాగంతో కలిసే చోట్ల ఉండే రెండు ఇంటర్ చేంజ్లు సహా ఉత్తరభాగంలో మొత్తం 11 కూడళ్లు ఉంటాయి. వాటి డిజైన్లు సిద్ధమయ్యాయి. » సంగారెడ్డి వద్ద భారీ ‘ఎక్స్టెండెడ్ డంబెల్’డిజైన్తో కూడలి నిర్మిస్తారు. ళీ సంగారెడ్డి తర్వాత వచ్చే రెండో కూడలి 161 నంబర్ జాతీయ రహదారిని క్రాస్చేసే శివంపేట వద్ద ఉంది. ఇక్కడ డబుల్ డంబెల్ డిజైన్లో ఉంటుంది. » మూడో కూడలి నర్సాపూర్–మెదక్ రోడ్డుపై నర్సాపూర్ వద్ద నిర్మిస్తారు. అక్కడ డంబెల్ మోడల్ ఎంపిక చేశారు. ళీ నాలుగో కూడలి హైదరాబాద్–నాగ్పూర్ రహదారిపై తూప్రాన్ వద్ద. ఇక్కడ క్లోవర్ లీఫ్ డిజైన్ ఎంపిక చేశారు. » ఐదో కూడలి తూప్రాన్–గజ్వేల్ దారిలో మజీద్పల్లి వద్ద ఉంటుంది. ఇక్కడ రోటరీ డిజైన్ ఖరారు చేశారు. » ఆరో కూడలి రాజీవ్ రహదారిపై ప్రజ్ఞాపూర్ సమీపంలో వస్తుంది. ఇక్కడ పాక్షిక క్లోవర్ లీఫ్ (మూడు లూప్లు మాత్రమే) డిజైన్ ఎంపిక చేశారు. » ఏడో కూడలి జగదేవ్పూర్–తుర్కపల్లి మధ్య పీర్లపల్లి వద్ద ఉంటుంది. ఇక్కడ రోటరీ డిజైన్ ఎంపిక చేశారు. » ఎనిమిదో కూడలి తుర్కపల్లి–యాదగిరిగుట్ట రోడ్డుపై తుర్కపల్లి వద్ద వస్తుంది. ఇక్కడ కూడా రోటరీ డిజైన్లో నిర్మిస్తారు. » తొమ్మిదో కూడలి హైదరాబాద్–వరంగల్ హైవేపై రాయగిరి వద్ద ఉంటుంది. ఇక్కడ డబుల్ ట్రంపెట్ డిజైన్లో ఉంటుంది. » పదో కూడలి భువనగిరి–వలిగొండ రోడ్డుపై వలిగొండ వద్ద వస్తుంది. ఇక్కడ రోటరీ డిజైన్ ఖరారు చేశారు. » పదకొండో కూడలిని చౌటుప్పల్ వద్ద భారీ ‘ఎక్స్టెండెడ్ డంబెల్’డిజైన్తో నిర్మిస్తారు. -
సంగారెడ్డి జిల్లా నందిగామలో దొంగల బీభత్సం
-
‘చట్నీలో చిట్టెలుక’.. సాక్షి కథనంపై స్పందించిన అధికారులు
సంగారెడ్డి, సాక్షి: సుల్తాన్ పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ క్యాంటీన్ చట్నీలో చిట్టెలుక ఉరుకులు పెట్టడంపై సాక్షి ఇచ్చిన కథనం.. ప్రభుత్వం దృష్టికి వెల్లింది. ఘటనపై ఆగ్రహం వ్యక్తి చేసిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ.. కారకులపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. దీంతో అధికార యంత్రాంగం కదిలింది. నాణ్యతలేని అల్పాహారం, భోజనంతో హాస్టల్ విద్యార్థులు వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈలోపు.. తాజాగా హాస్టల్ క్యాంటీన్ చట్నీలో చిట్టెలుక చక్కర్లు కొట్టడాన్ని కొందరు విద్యార్థులు వీడియో తీసి వైరల్ చేశారు. సాక్షిలో ఈ కథనం ప్రముఖంగా ప్రసారమైంది. దీంతో ప్రభుత్వం స్పందించింది. ఆ వెంటనే మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతో సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ మాధురి రంగంలోకి దిగారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ మాధురి, అందోల్ జోగిపేట డివిజన్ ఆర్డీవో పాండు మంగళవారం మధ్యాహ్నాం క్యాంపస్ హాస్టల్ చేరుకొని జరిగిన సంఘటనపై విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కొంతకాలంగా మెస్లో నాణ్యత లేని భోజనం అందిస్తున్నారన్న విద్యార్థుల ఫిర్యాదుల్ని.. అలాగే ఇవాళ్టి ఎలుక వీడియోను ఆమె పరిశీలించారు. కాంట్రాక్టర్ను తొలగించడంతో పాటు కేర్ టేకర్ పైనా లీగల్యాక్షన్ తీసుకుంటామని, నాణ్యమైన భోజనం అందేలా చూస్తామని ఆమె హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ఘటనతో అలర్ట్.. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో, కళాశాలలో ఉన్న బోర్డింగ్, హాస్టలను , క్యాంటీన్లను తనిఖీలు నిర్వహించాలన్నారాయన. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తూనే.. ఆహార పదార్థాలను తయారు చేసే నిర్వాహాకులు తప్పనిసరిగా FSSAI లైసెన్స్ ను తీసుకోవాలని మంత్రి సూచించారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని సంస్థల లైసెన్సులను వెంటనే రద్దు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మరోవైపు.. హోటల్స్, రెస్టారెంట్స్ తో పాటు బేకరీలు, బోర్డింగ్, హాస్టల్స్, క్యాంటీన్లు, ఆహార పదార్థాలు తయారు చేసే నిర్వాహకుల పై నిఘా ఉంచాలని ఫుడ్ సేఫ్టీ అధికారుల్ని మంత్రి ఆదేశించారు. -
లీడర్ల గుండెల్లో.. విలీన గుబులు
జీహెచ్ఎంసీ పరిధిలోకి తెల్లాపూర్ మున్సిపాలిటీ? ● కలవరపడుతున్న రాజకీయ నాయకులు ● పదవులు కోల్పోతామని ఆవేదన రామచంద్రాపురం(పటాన్చెరు): తెల్లాపూర్ మున్సిపాలిటీ జీహెచ్ఎంసీలో విలీనం అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయం స్థానిక నేతలు, ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. కౌన్సిలర్లు తమ పదవులు ఎక్కడ కోల్పోతామోనని గుబులు పడుతున్నారు. అలాగే అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి దూరమవుతామని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.రామచంద్రాపురం మండలంలో తెల్లాపూర్ గ్రామపంచాయతీగా ఉండేది. ఈ ప్రాంతంలో రియల్ వ్యాపారం జోరుగా సాగుతుండటంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెల్లాపూర్, ఉస్మాన్నగర్, కొల్లూర్, ఈదులనాగులపల్లి, వెలిమెల గ్రామాలను కలిపి తెల్లాపూర్ మున్సిపాలిటీగా ప్రకటించింది. 17 వార్డులను కూడా ఏర్పాటు చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో ఆశావహులందరూ కౌన్సిలర్లుగా పోటీ చేశారు. ఇదంతా జరిగి సుమారు ఐదేళ్లవుతోంది. ప్రజాప్రతినిధులకు మరో మూడు నాలుగు నెలల పదవీకాలం ఉంది. ఈసారి జరిగే ఎన్నికల్లో కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు కొందరు లీడర్లు సిద్ధమవుతున్నారు. అయితే తెల్లాపూర్ను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తారనే వార్త నాయకులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. జీహెచ్ఎంసీ విలీనమైతే రాజకీయ పదవులు పొందలేమన్న భావనలో కార్యకర్తలున్నారు.10 ఏళ్ల క్రితమే ప్రతిపాదనలుతెల్లాపూర్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని పదేళ్ల క్రితమే ప్రతిపాదించారు. నాటి కలెక్టర్ స్థాయి అధికారులు తెల్లాపూర్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయొచ్చని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కానీ ఆ సమయంలో స్థానిక ప్రజాప్రతినిధులు అందుకు నిరాకరించారు. దాంతో కొంత కాలం తరువాత పంచాయతీ కాస్త మున్సిపాలిటీగా ఏర్పడింది.తెల్లాపూర్ మున్సిపాలిటీగా..రామచంద్రాపురం మండలంలోని ఐదు గ్రామాలను కలిపి తెల్లాపూర్ మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. తెల్లాపూర్, ఉస్మాన్నగర్, కొల్లూర్, ఈదులనాగులపల్లి, వెలిమెల గ్రామపంచాయతీలను కలిపారు. అయినా గానీ హైదరాబాద్ను ఆనుకుని ఉన్న తెల్లాపూర్ను సెమీ అర్బన్గా చెప్పుకుంటున్నప్పటికీ ఇక్కడి ఇంకా గ్రామీణ వాతావరణమే ఉంటుంది. ఇక ఈ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేస్తే ఇబ్బందులు తప్పవని స్థానికులు అంటున్నారు.ఆశ.. నిరాశఐదేళ్లుగా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో అన్ని పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు ముందు చూపుతో వారి పార్టీల కోసం కష్టపడుతూ వస్తున్నారు. భవిష్యత్లో తాము కూడా కౌన్సిలర్లుగా పోటీ చేస్తామనే ధీమాలో ఉన్నారు. ప్రధానంగా 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉండటం కూడా ఇందుకు కారణం. తెల్లాపూర్ను జీహెచ్ఎంసీలో విలీనం వార్తలు వెలువడటంతో వారు నిరాశకు లోనవుతున్నారు. తాము రాజకీయ పదవులకు దూరం కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, మున్సిపల్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారు. నేరుగా కలిసి వారి సమస్యలను నివేదించేవారు. అవసరమైతే కౌన్సిలర్లను నిలదీసే అవకాశం ఉంటుంది. కానీ జీహెచ్ఎంసీలో విలీనమైతే సమస్యలు చెప్పుకోవడం కష్టం అవుతుందనే అభిప్రాయం స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. -
వాట్ ఏ టాలెంట్..
-
అత్యంత ప్రమాదకరమైన అల్ఫాజోలం డ్రగ్ స్వాధీనం
-
5 జిల్లాల్లో 43 డిగ్రీల పైనే..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/ సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. శుక్రవారం నల్లగొండ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, జోగుళాంబ గద్వాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 43.3 డిగ్రీల సెల్సియస్, సంగారెడ్డిలో 43.2 డిగ్రీలు, ఆదిలాబాద్లో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలోని 18 మండలాలకు చెందిన 20 గ్రామాల్లో 43 డిగ్రీలు దాటిపోయింది. ఈ జిల్లాలోని మాడుగులపల్లి మండల కేంద్రంతోపాటు మునుగోడు మండలం గూడాపూర్లో 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దామరచర్ల మండల కేంద్రం, అనుముల మండలం ఇబ్రహీంపేట, కనగల్ మండల కేంద్రం, మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామాల్లో 43.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఎండలు తీవ్రం కావడంతో వడదెబ్బ కారణంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నలుగురు మృతిచెందారు. జనగామ జిల్లా చిల్పూరు మండలం వెంకటాద్రిపేట గ్రామానికి చెందిన గాదె జయపాల్రెడ్డి (55) గురువారం వడదెబ్బకు గురికాగా హనుమకొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతిచెందాడు. మహబూబాబాద్ జిల్లాలో సికింద్రాబాద్ తండా గ్రామానికి చెందిన ధరావత్ మంచ్యా (55) వడదెబ్బకు గురై శుక్రవారం మృతిచెందాడు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని జీఎన్ఆర్ కాలనీకి చెందిన స్వర్ణలత (45) రెండ్రోజుల క్రితం నిజామాబాద్లో పెళ్లికి హాజరైంది. ఎండల తీవ్రతతో అస్వస్థతకు గురైంది. నిర్మల్కు వచి్చన తర్వాత గురువారం రాత్రి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. అలాగే నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం శ్రీరంగాపూర్ గ్రామానికి చెందిన రైతు మర్రిపల్లి ఈరయ్య (70) పొలం పనులకు వెళ్లి ఎండ దెబ్బతగలడంతో గురువారం మృతి చెందాడు. -
ఎస్ బి ఆర్గానిక్స్ రియాక్టర్ పేలుడులో తప్పెవరిది..
-
సంగారెడ్డి ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్.. ఏడుగురు కార్మికుల మృతి
సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం.. చందాపూర్ గ్రామంలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎస్బీ ఆర్గానిక్ ఫ్యాక్టరీలో భారీ శబ్దంతో రియాక్టర్ పేలింది. పేలుడు ధాటికి కంపెనీలో పనిచేసే మేనేజర్ రవితోపాటు ఆరుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరో 10 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు. రియాక్టర్ పేలుడుతో కార్మికులు వందల మీటర్ల దూరం ఎగిరిపడ్డారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాక సిబ్బంది ఫైరింజన్లతో మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. దుర్ఘటన జరిగిన సమయంలో కంపెనీలో 50 మంది కార్మికులు పని చేస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న బాధితులు కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. అయితే ఒక రియాక్టర్ నుంచి మరో రియాక్టర్కు మంటలు వ్యాపించాయి.దీంతో ఇంకో రియాక్టర్ పేలితే ప్రమాదం మరింత త్రీవతరం అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు పరిశ్రమ పరిసరాల నుంచి ప్రజల్ని ఖాళీ చేయిస్తున్నారు. గాయపడిన క్షతగాత్రుల్ని సిబ్బంది అత్యవసర చికిత్స కోసం సంగారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి ఎస్బీ ఆర్గానిక్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వెంటనే ఘటన స్థలానికి వెళ్ళి సహాయక చర్యలను పర్యవేక్షించల్సిందిగా ఫైర్ సర్వీసెస్ డి.జి. నాగిరెడ్డిని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించడానికి అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్, ఎస్పీని కోరారు. పరిశ్రమ ప్రమాదంపై సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందజేయాలని జిల్లా అధికారులకు సూచించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే హరీష్ రావు సానుభూతి సంగారెడ్డి పరిశ్రమలో రియాక్టర్ పేలి కార్మికులు మృతి చెందిన ఘటనపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. -
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో భారీ అగ్నిప్రమాదం
-
PM Modi: సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన
-
సికింద్రాబాద్, సంగారెడ్డి జిల్లాలో ప్రధానిమోదీ పర్యటన
-
బీఆర్ఎస్, కాంగ్రెస్ల స్కాముల బంధం గట్టిది: ప్రధాని
Updates: 12:36PM, Mar 5th, 2024 ముగిసిన ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన.. బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్రెడ్డి ప్రధానికి వీడ్కోలు పలికిన గవర్నర్, సీఎం రెండురోజుల తెలంగాణ పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ 12:26PM, Mar 5th, 2024 బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య స్కాముల బంధం గట్టిది: ప్రధాని తెలంగాణలో బీఆర్ఎస్ కుంభకోణాలు చూసి ప్రజలు కాంగ్రెస్కు అవకాశమిచ్చారు అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటే బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య కుంభకోణాల బంధం బలంగా ఉంది కాళేశ్వరంలో బీఆర్ఎస్ దోచుకుంటే విచారణ పేరుతో కాంగ్రెస్ దోచుకుంది. కాంగ్రెస్ తెలంగాణను కొత్త ఏటీఎంగా మార్చుకుంది కాంగ్రెస్ సర్కారు ఆటలు ఎక్కువ కాలం సాగవు మోదీ సర్కారులో ఎయిర్ దాడులు కూడా ఉంటాయి 12:10PM, Mar 5th, 2024 కుటుంబవాదులకు వ్యతిరేకంగా పోరాడుతున్నా : ప్రధాని మోదీ జమ్మూకాశ్మీర్ నుంచి తమిళనాడు దాకా కుటుంబ పార్టీలున్న చోట కుటుంబాలు బాగుపడ్డాయి. కుటుంబవాద పార్టీలు ప్రజాస్వామ్యానికి శత్రువులు పరివార వాదులకు చోరీ చేసేందుకు లైసెన్స్ ఉందా వాళ్లకు కుటుంబం ఫస్ట్... నాకు దేశం ఫస్ట్ కాంగ్రెస్ బయటివారికి ఎవరికీ అవకాశం ఇవ్వదు కుటుంబవాదులు సొంత ఖజానా నింపుకున్నారు. మోదీ దేశఖజానా నింపాడు నేను ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయలేదు. కుటుంబవాదులు మోదీపైనే దాడి చేస్తున్నారు దేశంలో ప్రతి తల్లి, సోదరి, యువకులు, పిల్లలందరూ మోదీ కుటుంబమే ఇందుకు అందరూ మోదీకా పరివార్ అని అంటున్నారు నేను మోదీ కుటుంబం అని తెలంగాణ ప్రజలంటున్నారు తెలంగాణప్రజల కలలు.. నా సంకల్పం ఈ పదేళ్లలో జరిగిన అభివృద్ధి దేశంలో గత 70 ఏళ్లలో జరగలేదు నేను గ్యారెంటీ వ్యక్తిని.. గ్యారెంటీ పూర్తి చేయడం నాకు తెలుసుఘె ఎస్సీ వర్గీకరణపై ఉన్నతస్థాయి కమిటీ వేశాం తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది ఇవాళ రెండోరోజు తెలంగాణ ప్రజలతో ఉండటం సంతోషం సంగారెడ్డి నుంచి రూ. 7వేల కోట్ల అభివృద్ది పనులు ప్రారంభిస్తున్నాం ఎవియేషన్ రంగంలో తెలంగాణకు లబ్ధి చేకూరుతోంది పదేళ్లలో దేశంలో ఎయిర్పోర్టుల సంఖ్య రెట్టింపు అయింది వికసిత్ భారత్ దిశగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది దేశంలో తొలి ఎవియేషన్ సెంటర్ను బేగంపేటలో ఏర్పాటు చేశాం ఘట్కేసర్- లింగంపల్లి మధ్య ఎంఎంటీఎస్ ప్రారంభించాం పటాన్చెరులో ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించిన కార్యక్రమాలు NH-65 లోని పుణే - హైదరాబాద్ రహదారిలో సంగారెడ్డి X రోడ్ నుంచి మదీనాగూడ మధ్యన 31 కి.మీ.ల 6 లేన్ హైవే విస్తరణ (1,298 కోట్లు) NH-765Dలో 399 కోట్లతో మెదక్ - ఎల్లారెడ్డి మధ్యన 2 లైన్ హైవే విస్తరణ NH-765Dలో 500 కోట్లతో ఏల్లారెడ్డి - రుద్రూర్ మధ్యన 2 లైన్ హైవే విస్తరణ పనులు జాతికి అంకితం చేసిన ప్రాజెక్టులు (b) పారాదీప్ - హైదరాబాద్ గ్యాస్ పైప్ లైన్ 3,338 కోట్లు NH-161 లోని కంది - రామసానిపల్లె సెక్షన్ లో 4 వరుసల జాతీయ రహదారి (1,409 కోట్లు) NH-167 లోని మిర్యాలగూడ - కోదాడ సెక్షన్ 2 వరుసల జాతీయ రహదారి విస్తరణ (323 కోట్లు) హైదరాబాద్, సికింద్రాబాద్ల్లో 103 కి.మీ.ల పొడవున చేపట్టిన MMTS ఫేజ్ - II ప్రాజెక్ట్ (1,165 కోట్లు) ఘట్ కేసర్ - లింగంపల్లి మధ్యన కొత్త MMTS రైలు ప్రారంభం తక్కువ చార్జీలకే హైదరాబాద్ ప్రయాణ సౌకర్యం: కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్ని వర్గాల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం కృషి చేస్తోంది ఘట్కేసర్-లింగంపల్లి మధ్య అందుబాటులోకి కొత్త ఎంఎంటీఎస్ ఇవాళ రూ.9 వేల కోట్ల ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభింస్తారు గత పదేళ్లుగా తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం అంకితభావంతో పనిచేసింది. తెలంగాణలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. జాతీయ రహదారుల కోసం రూ. 1.20 లక్షల కోట్లు ఎరువుల సబ్సిడీ కోసం రూ. 33 వేల కోట్లు రైల్వేల అభివృద్ధి కోసం రూ. 35 వేల కోట్లు. రేషన్ సబ్సిడీపై రూ. 30 వేల కోట్లు, ఉపాధి హామీ పథకం కింద రూ. 26,728 కోట్లు. రామగుండం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 1600 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు కోసం రూ. 10,998 కోట్లు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ. 10 వేల కోట్లు. సర్వశిక్షా అభియాన్ కింద రూ. 7,500 కోట్లు. గ్రామపంచాయతీల అభివృద్ధి కోసం రూ. 7,200 కోట్లు రామగుండంలో యూరియా పరిశ్రమ కోసం రూ. 6,338 కోట్లు. ఎల్పీజీ సబ్సిడీ కింద రూ. 5,859 కోట్లు హెల్త్ మిషన్ కింద రూ. 5,550 కోట్లు. ప్రధానమంత్రి కేంద్రీయ విశ్వవిద్యాలయాల కోసం రూ. 4,500 కోట్లు స్వచ్ఛ భారత్ కింద రూ. 3,745 కోట్లు.. ఈఎస్ఐ మెడికల్ కాలేజ్, హాస్పిటల్, ఎయిమ్స్.. ఇలా అనేక రకాలుగా తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం కృషి చేసింది. బీఆర్ఎస్ పార్టీ కేంద్రం తెలంగాణకు ఏం ఇవ్వడం లేదంటూ బురదజల్లుతోంది. కేసీఆర్ కుటుంబ పాలనతో తెలంగాణ సంపద దోచుకున్నారు. 11:00AM, Mar 5th, 2024 పటేల్గూడలోని ఎస్ఆర్ ఇన్ఫినిటీ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 10:40AM, Mar 5th, 2024 బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీ కాసేపట్లో సంగారెడ్డికి వెళ్లనున్న మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్న మోదీ 10:30AM, Mar 5th, 2024 ఉజ్జయిని మహంకాళి ఆలయం నుంచి బేగంపేట ఎయిర్పోర్టుకు బయలుదేరిన ప్రధాని మోదీ 10:20AM, Mar 5th, 2024 సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దర్శించుకున్నారు మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు ప్రధాని మోదీ పూజలు చేసే సమయంలో ఆలయం లోపలికి ఇద్దరికి మాత్రమే అనుమతి దేవాలయం చుట్టూ వెయ్యిమంది పోలీసులతో సెక్యూరిటీ అమ్మవారి దర్శనం అనంతరం బేగంపేట ఎయిర్పోర్టుకు ప్రధాని #WATCH | Telangana: Prime Minister Narendra Modi visits and offers prayers at Ujjaini Mahankali temple in Secunderabad. pic.twitter.com/zijxd4LYAX — ANI (@ANI) March 5, 2024 10:06AM, Mar 5th, 2024 సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకున్న ప్రధాని 9:50AM, Mar 5th, 2024 కాసేపట్లో సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయానికి ప్రధాని మోదీ ప్రధాని నరేంద్రమోదీ రెండో రోజు తెలంగాణ పర్యటన షెడ్యూల్ రాజ్ భవన్ నుంచి బయలుదేరనున్న ప్రధాని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో పూజలు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి పఠాన్ చెరువు బయలుదేరనున్న ప్రధాని పఠాన్ చెరువులో ఉదయం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న ప్రధాని పఠాన్ చెరువు బహిరంగ సభలో మాట్లాడనున్న ప్రధాని సభకు ఏర్పాట్లు పూర్తి.. భారీగా బందోబస్తు ప్రధాని సభ కోసం పటాన్చెరులోని పటేల్గూడ సభా వేదిక వద్ద 23 ఎకరాల్లో భారీగా ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణం, పరిసర ప్రాంతాలను ఫ్లెక్సీలు, కటౌట్లు, కాషాయ జెండాలతో నింపేశారు. అధికారిక కార్యక్రమాల కోసం ఒకటి, రాజకీయ ప్రసంగం కోసం మరొకటి.. రెండు వేదికలను ఏర్పాటు చేశారు. ప్రధాని ముందుగా అధికారిక కార్యక్రమాలు నిర్వహించి, తర్వాత బహిరంగ సభా వేదికపై ప్రసంగిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని మెదక్, జహీరాబాద్ లోక్సభ సీట్లతోపాటు సమీపంలోని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతు కూడగట్టేలా ప్రధాని సభను నిర్వహిస్తున్నారు. కాగా ప్రధాని పర్యటన సందర్భంగా మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం ఉజ్జయని మహంకాళి అమ్మవారి ఆలయం, అక్కడి నుంచి బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకునే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు. వర్చువల్గా శంకుస్థాపన చేయనున్న కార్యక్రమాలివీ.. ► రూ.1,298 కోట్లతో ఎన్హెచ్–65పై సంగారెడ్డి చౌరస్తా నుంచి మదీనాగూడ వరకు 31 కిలోమీటర్ల మేర ఆరు లేన్లుగా విస్తరణ ► రూ.399 కోట్లతో ఎన్హెచ్–765డిపై మెదక్–ఎల్లారెడ్డి మధ్య 2 లైన్ల హైవే విస్తరణ. జాతికి అంకితం చేయనున్న ప్రాజెక్టులివీ.. ► రూ.3,338 కోట్లతో నిర్మించిన పారాదీప్– హైదరాబాద్ గ్యాస్ పైప్లైన్ ► రూ.400 కోట్లతో చేపట్టిన సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ► రూ.1,409 కోట్లతో నిర్మించిన ఎన్హెచ్–161లోని కంది–రామసానిపల్లె సెక్షన్లో 4 వరుసల జాతీయ రహదారి ► రూ.323 కోట్ల ఖర్చుతో చేసిన ఎన్హెచ్–167 మిర్యాలగూడ–కోదాడ సెక్షన్ జాతీయ రహదారి విస్తరణ ► రూ.1,165 కోట్లతో హైదరాబాద్–సికింద్రాబాద్లలో 103 కిలోమీటర్ల పొడవున చేపట్టిన ఎంఎంటీఎస్ ఫేజ్–2 ప్రాజెక్టు. ► ఘట్కేసర్– లింగంపల్లి మధ్య కొత్త ఎంఎంటీఎస్ రైలు ప్రారంభం -
మెడికో రచనా కేసులో ఏం జరిగింది?
సంగారెడ్డి, సాక్షి: మెడికో రచనా రెడ్డి ఆత్మహత్య కేసులో కొత్త అనుమానాలు బయటకు వస్తున్నాయి. ఇటీవల ఆమె పెళ్లి నిశ్చయం కాగా.. ఆ వ్యవహారంలో ఏర్పడిన మనస్పర్థల వల్ల ఆమె డిప్రెషన్కు వెళ్లినట్టు.. దాని వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారని సన్నిహితులు భావిస్తున్నారు. అమీన్ పూర్ సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. "రచనారెడ్డి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని ప్రాథమికంగా అంచనాకు వచ్చాం. ఆమె కారులో కొన్ని ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నాం. ఆమెకు ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ మార్చిలో వివాహానికి పెద్దలు నిర్ణయించారు. ఎంగేజ్మెంట్ జరిగిన యువకుడితో ఆమెకు మనస్పర్థలు వచ్చినట్లు కొందరు చెబుతున్నారు. అయితే ఆత్మహత్యకు గల కచ్చితమైన కారణం ఎఫ్ఎస్ఎల్(FSL)లోనే తేలుతుంది" అని చెప్పారు. మరోవైపు ఆమె సోదరుడు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మా చెల్లి గత కొంతకాలంగా డిప్రెషన్లో ఉంది. చాలాసార్లు నచ్చజెప్పాం. మా పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ ఇచ్చారని" తెలిపారు. జరిగింది ఇది.. ఖమ్మం మమతా కాలేజీలో పీజీ చదువుతున్న రచనా రెడ్డి (25).. ప్రస్తుతం బాచుపల్లిలోని మమతా కాలేజీలో ఇంటర్న్షిప్ చేస్తోంది. ఆమె కుటుంబ సభ్యులు హైదరాబాద్ BHELలోని HIGలో ఉంటున్నారు. అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిష్టారెడ్డిపేట్ ORR రింగ్ రోడ్డుపై కారులో రచనా అపస్మారక స్థితిలో ఉండటాన్ని సోమవారం స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.... ఘటనా స్థలికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మెడికో రచనా రెడ్డి తుది శ్వాస విడిచింది. పాయిజన్ ఇంజక్షన్ తీసుకొని ఆమె సూసైడ్కు పాల్పడిందని అక్కడ లభించిన ఆధారాలను బట్టి ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. -
సంగారెడ్డిలో మెడికో అనుమానాస్పద మృతి
సాక్షి, సంగారెడ్డి: మెడికో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కృష్ణారెడ్డి పేట్ ఓఆర్ఆర్ దగ్గర కారులో ఆపస్మారక స్థితిలో ఉన్న మెడికో రచనా రెడ్డి(25)ని పోలీసులు ఆసుపత్రికి తరలించేలోగా మృతిచెందింది. మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఖమ్మం మమతా కాలేజీలో పీజీ చదువుతున్న రచనా రెడ్డి.. ప్రస్తుతం బాచుపల్లి మమతా కాలేజీలో ఇంటర్న్షిప్ చేస్తోంది. ఆమె మృతిపై అమీన్పూర్ పోలీసులు విచారణ చేపట్టారు -
TS: గద్దర్ విగ్రహ ఏర్పాటుకు లైన్ క్లియర్
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణ ఉద్యమ గొంతుక.. ప్రజాయుద్ధ నౌక గద్దర్ విగ్రహ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది. తెల్లపూర్ మున్సిపాలిటీ పరిధిలో విగ్రహ ఏర్పాటు కోసం జాగా కేటాయిస్తూ మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. గత కొన్ని రోజుల క్రితం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఆ వెంటనే గద్దర్ విగ్రహం ఏర్పాటు కోసం తెల్లాపూర్ మున్సిపాలిటీ ఒక తీర్మానాన్ని చేసింది. దానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథార్టీ(HMDA) ఆమోదించింది. ఈ క్రమంలోనే అవసరమైన స్థలాన్ని కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. విగ్రహ ఏర్పాటు కావల్సిన స్థలం హెచ్ఎండీఏ పరిధిలోకి రావటంతో అనుమతులకు కొంత జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఎట్టకేలకు గద్దర్ విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం స్థలం కేటాయించటం పట్ల గద్దర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
కూలిన చర్చి స్లాబ్.. నలుగురి పరిస్థితి విషమం
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుందంది. కోహీర్లో నిర్మాణంలో ఉన్న ఓ చర్చి కూలిపోయింది. మెథడిస్ట్ చర్చికి స్లాబ్ వేస్తుండగా ఒక్కసారిగా స్లాబ్ చెక్కలు కూలి పోయాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి. శిధిలల్లో మరో నలుగురు కూలీలు చిక్కుకున్నారు. ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నలుగురు కూలీల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన క్షతగాత్రులను సంగారెడ్డిజిల్లా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు ఉత్తరప్రదేశ్కు చెందిన వారిగా సమాచారం. చదవండి: సురేందర్ కిడ్నాప్ కేసు డీసీపి శ్రీనివాస్ రావు కీలక వ్యాఖ్యలు -
రేణుశ్రీ ఆత్మహత్యకు ముందు ఎవరితో ఫోన్లో మాట్లాడింది..
సంగారెడ్డి: రుద్రారంలోని గీతం వర్సిటీలో బీటెక్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది. శుక్రవారం సాయంత్రం వర్సిటీ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడటం విద్యార్థిలోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నగరంలోని కూకట్పల్లి– శంషీగూడలోని శిల్పా బృందావన్ కాలనీకి చెందిన రాహుల్, లక్ష్మీసరస్వతీల కూతురు రేణుశ్రీ గీతం విశ్వవిద్యాలయంలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో వర్సిటీ ఐదో అంతస్తుపైకి వెళ్లి ఫోన్లో మాట్లాడి అనంతరం ఆత్మహత్యకు పాల్పడింది. మూడు నెలల క్రితమే ఇంజనీరింగ్ కళాశాలలో చేరిన ఆమె గురించి వివరాలు ఎవరికీ సరిగ్గా తెలియవు. కళాశాలకు సక్రమంగా వెళ్లేదికాదని తోటి విద్యార్థులు చెబుతున్నారు. ఇటీవల రేణుశ్రీని తండ్రి రాహుల్ కలిశారని, క్లాస్లకు రెగ్యులర్గా వెళ్లాలని మందలించినట్లు సమాచారం. విద్యార్థి ఆత్మహత్యకు తండ్రి మందలింపా.. ప్రేమ వ్యవహారం కారణమా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. ఆమె బలవన్మరణానికి గల కారణాలను పోలీసులు అనేక కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నారు. తన సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు ఎవరితో ఫోన్లో మాట్లాడిందోనని ఆరా తీస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ పురుషోత్తం రెడ్డి చెప్పారు. కాగా, రేణుశ్రీ ఆత్మహత్యపై తల్లిదండ్రులు కాకుండా ఆమె బంధువు పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. కేసు దర్యాప్తులోఉంది. -
గీతం యూనివర్సిటీలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
-
సంగారెడ్డి: గీతం యూనివర్సిటీలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం విశ్వవిద్యాలయంలో బీటెక్ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. యూనివర్సిటీ భవనం అయిదవ అంతస్తు నుంచి దూకి రేణు శ్రీ(18) అనే యువతి శుక్రవారం బలవన్మరణానికి పాల్పడింది. యూనివర్సిటీలో చేరిన మూడు నెలల్లోనే విద్యార్థిని ఆత్మ హత్య చేసుకోడానికి గల కారణాలు తెలియల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పటాన్చెరు ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా రేణు శ్రీ కుటుంబం మాదాపూర్లో నివసిస్తోంది. కూతురు ఆత్మహత్య విషయం తెలుసుకొని హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్ధిని ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణల విచారిస్తున్నారు. యువతి ఆత్మహత్య చేసుకుంటుండగా తోటి విద్యార్ధులు వీడియో తీయగా.. వారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. గీతం యూనివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్న రేణుశ్రీ అనే యువతి బిల్డింగ్ 6వ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. pic.twitter.com/mqA7ChvkBn— Telugu Scribe (@TeluguScribe) January 5, 2024 Video Credits: Telugu Scribe చదవండి: TS: గుండెపోటుతో టెన్త్ విద్యార్థి మృతి -
అత్తను హత్య చేసి... అడ్డువచ్చిన భార్యపై..
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డిలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి అత్తను హత్య చేసి అడ్డుపడ్డ భార్య గొంతు కోశాడు. ఈ ఘటన సంగారెడ్డిలోని పటాన్చెరు మండలం ఇస్నాపూర్ పద్మారావు కాలనీలోని ఓ ఇంట్లో జరిగింది. రుద్రారంకు చెందిన సాయిబాబా.. తన భార్య సత్యవతిని సంసారానికి రాకుండా అత్త శాంతమ్మ అడ్డుపడుతోందని కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం అత్త శాంతమ్మ(40) ఇంటికి వచ్చి ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. శాంతమ్మపై దాడి చేస్తున్న సమయంలో సాయబాబాను భార్య సత్యవతి అడ్డుకుంది. మరింత కోపంతో సాయిబాబా తన భార్య గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. భార్య గొంతు కోయడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన సత్యవతిని చికిత్స కోసం స్థానికులు సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. పటాన్చెరు పోలీస్స్టేషన్కు వచ్చి నిందితుడు సాయిబాబా లొంగిపోయియాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. చదవండి: జూబ్లీహిల్స్లో కి‘లేడీ’: లిఫ్ట్ అడిగి, బట్టలు చించుకుని కేకలేస్తూ.. -
దురదృష్టవశాత్తు అధికారం కోల్పోయాం: హరీశ్ రావు
సంగారెడ్డి: దురదృష్టవశాత్తు మనం అధికారం కోల్పోయాం.. బీఆర్ఎస్ ఒడిదొడుకులు కొత్త కాదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సంగారెడ్డిలో నిర్వహించిన బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో హరీశ్రావు మాట్లాడారు. పరీక్ష ఫెయిల్ అయిన తర్వాత విద్యార్థి కుంగిపోతే ఇంకో పరీక్ష పాస్ కాలేడని అన్నారు. రానున్న రోజుల్లో స్థానిక, పార్లమెంట్ ఎన్నికల రూపంలో పరీక్షలు రాబోతున్నాయని తెలిపారు. వచ్చే ఎన్నికలు ఎదుర్కోవడానికి పకడ్భంధీ కార్యాచరణతో ముందుకు పోదామని చెప్పారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎన్నో విజయాలు సాధించిందని అన్నారు. వాళ్లు మనకన్నా బాగా పాలిస్తారని ప్రజలు అవకాశమిచ్చారని తెలిపారు. దుష్ప్రచారం కూడా కొంతపై చేయి సాధించిందని తెలిపారు. కేవలం 2 శాతం ఓట్లతో అధికారం కోల్పోయామని, బీఆర్ఎస్ ఎపుడూ తెలంగాణ ప్రజల పక్షమేమని స్పష్టం చేశారు. తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ అని గెలిచినప్పుడు పొంగి పోలేదు.. ఓటమితో కుంగి పోలేదని తెలిపారు. కొత్త ప్రభుత్వానికి కొంత టైం ఇద్దామని, వాళ్ళిచ్చిన హామీల అమలులో విఫలం అయితే ప్రజా గొంతుక అవుదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మన నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారని, మనం ధైర్యం కోల్పోవద్దని ఏమైనా లోపాలు ఉంటే సమీక్షించుకుందామని అన్నారు. మనకు పోరాటాలు కొత్త కాదని,భవిష్యత్ మనదేనని అన్నారు. కేసీఆర్ దమ్మున్న నాయకుడు కనుకే తెలంగాణ వచ్చిందని తెలిపారు.సంగారెడ్డి కార్యకర్తల గురించి ఎంత చెప్పినా తక్కువేనని, కార్యకర్తలకే సంగారెడ్డి విజయం అంకితం చేస్తున్నానని తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో భార్య మృతి! భర్తే ఇలా చేశాడని..
సాక్షి, మెదక్: అనుమానాస్పద స్థితిలో భార్య మృతి చెందగా భర్తే ఆమెను హత్య చేశాడని ఆరోపిస్తూ బాధితురాలి బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన మిరుదొడ్డిలో శనివారం జరిగింది. మహిళ బంధువులు గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం.. మిరుదొడ్డికి చెందిన కమలాకర్తో వర్గల్ మండలం గుంటి పల్లి గ్రామానికి చెందిన పద్మ(22)కు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. కొన్నాళ్లకు వారి మధ్య కలహాలు నెలకొనడంతో రెండు, మూడు సార్లు పెద్దలు నచ్చజెప్పారు. ఇటీవల అదనపు కట్నం తీసుకురావాలని భార్య పద్మను కమలాకర్ వేదించడంతో రెండు రోజులుగా వారి మధ్య గొడవలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో శనివారం తెల్లవారు జామున పద్మ ఇంట్లోనే అనుమానాస్పదంగా మృతి చెందింది. దీంతో ఆమె భర్తతో పాటు అత్తమాములు ఇంటి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పద్మ తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. కమలాకర్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న గజ్వేల్ ఏసీపీ ఎం.రమేశ్, సిద్దిపేట రూరల్ సీఐ చేరాల్ తమ సిబ్బందితో అక్కడికి చేరుకుని క్లూస్ టీంతో పరిశీలించారు. ఆందోళనకు దిగిన పద్మ బంధువులకు పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు వారికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నిందితులను కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. పద్మ తండ్రి దుల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గజ్వేల్ ఏసీపీ ఎం. రమేశ్ తెలిపారు. ఇవి కూడా చదవండి: లిఫ్ట్ లేదన్నది గమనించకుండా అడుగుపెట్టడంతో.. తీవ్ర విషాదం! -
సంగారెడ్డి జిల్లాలో అగ్ని ప్రమాదం
-
సంగారెడ్డి బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
-
సంగారెడ్డి: పటాన్చెరు నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
-
బీజేపీలో ‘బీఫామ్’ మంటలు.. సంగారెడ్డిలో ఉద్రిక్తత
-
బీజేపీలో ‘బీఫామ్’ మంటలు.. సంగారెడ్డిలో ఉద్రిక్తత
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి బీజేపీలో ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. బీఫామ్లు మంటలు రేపుతున్నాయి. అభ్యర్థుల జాబితాలో పేర్లు ఉండి బీఫామ్ మరొకరికి ఇవ్వడంతో తీవ్రస్థాయిలో ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. సంగారెడ్డి రిటర్నింగ్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టికెట్ ఇచ్చి బీఫామ్ ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆర్వో కార్యాలయం ముందు బీజేపీ నేత రాజేశ్వర్రావు దేశ్పాండే నిరసన తెలిపారు. బీఫామ్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ దేశ్పాండే ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, సంగారెడ్డి బీఫామ్ను పులిమామిడి రాజుకు బీజేపీ అధిష్టానం బీఫామ్ అందించింది. కాగా, వేములవాడ బీజేపీ అభ్యర్థిగా చెన్నమనేని వికాస్రావుకు చివరి క్షణంలో బీజేపీ అధిష్టానం బీఫామ్ అందించింది. ఇప్పటికే తుల ఉమ నామినేషన్ దాఖలు చేయగా, వికాష్రావు తరపున ఆయన అనుచరులు నామినేషన్ వేశారు. -
సంగారెడ్డిలోని గంజి మైదానంలో జరిగిన కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభ (ఫొటోలు)
-
సంగారెడ్డి: గుండెపోటుతో 12 ఏళ్ల బాలుడి మృతి
సాక్షి, సంగారెడ్డి: చిన్నవయసులోనే గుండెపోటుతో కన్నుమూస్తున్న వరుస ఘటనలు చూస్తున్నాం. తాజాగా సంగారెడ్డిలోనూ అలాంటి విషాద ఘటనే నెలకొంది. 12 ఏళ్ల బాలుడు నిద్రలోనే గుండెపోటుతో కన్నుమూసిన ఘటన స్థానికులతో కంటతడి పెట్టిస్తోంది. కంగ్టి మండలం తడ్కల్కు చెందిన ఖలీల్(12) ఒంట్లో బాగోలేదని తల్లిదండ్రులకు చెప్పాడు. గతరాత్రి నిద్రలో అపస్మారక స్థితికి గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గం మధ్యలోనే అతను కన్నుమూశాడు. ఖలీల్ను పరిశీలించిన వైద్యులు గుండెపోటుతోనే కన్నుమూసినట్లు ధృవీకరించారు. దీంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. నిన్నటిదాకా తమ కళ్ల ముందు ఆడిపాడిన చిన్నారి లేడనే విషయాన్ని వాడ ప్రజలు తట్టుకోలేక కంటతడి పెడుతున్నారు. -
టెట్ పరీక్షలో విషాదం.. గర్భిణి మృతి
సాక్షి, సంగారెడ్డి: టెట్ పరీక్ష రాసేందుకు వెళ్లి గర్భిణి ఎగ్జామ్ సెంటర్లో మృతి చెందిన పటాన్చెరు మండలం పరిధిలో జరిగింది. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరనే భయంతో.. రాధిక అనే అభ్యర్థిని పరీక్షకు త్వరగా చేరుకోవాలని ప్రయత్నించింది. గచ్చిబౌలిలో రాధిక, అరుణ్ దంపతులు నివాసముంటున్నారు. రాధిక 8 నెలల గర్భంతో ఉంది. ఇస్నాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆమెకు సెంటర్ పడింది. బైక్ పై ప్రయాణమై ఇస్నాపూర్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో పరీక్షకు ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో.. ఎగ్జామ్ సెంటర్ వద్ద ఆమె వేగంగా పరిగెత్తింది. సెంటర్కు చేరుకున్న వెంటనే ఆమెకు బీపీ ఎక్కువై చెమట్లు పట్టేశాయి. పరీక్ష సెంటర్లోనే కుప్పకూలి పడిపోయింది. హుటాహుటిన రాధికను పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి ఆమె భర్త అరుణ్ తీసుకెళ్లారు. అయితే అప్పటికే రాధిక మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. వీరిద్దిరికి ఇదివరకే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. -
SFI,ABVP విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ
-
సంగారెడ్డిలో అర్ధరాత్రి ఉద్రిక్తత..
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో గురువారం అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థి సంఘాలైన ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ సంఘాల నేతలు మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో పలువురు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ సంఘాల నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అయితే, ప్లీనరీ సమావేశాలు ఉండటంతో ఎస్ఎఫ్ఐ నేతలు ఫ్లెక్సీలు కట్టారు. కాగా, ఫ్లెక్సీల విషయంలో వీరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించినట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: విద్యార్థినుల మృతితో రెండు గ్రామాల్లో విషాదం -
‘వాళ్ల మాటలు కోటలు దాటితే, చేతలు పకోడిలా ఉంటాయి’
సాక్షి, సంగారెడ్డి: బీజేపీ వాళ్ళకు మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ అని హరీష్ రావు మండిపడ్డారు. మాటలు కోటలు దాటుతాయి.. చేతలు పకోడిలా ఉంటాయని సెటైర్లు వేశారు. తెల్లపూర్ మున్సిపాలిటి పరిధిలోని కొల్లూరులో డబుల్ బెడ్ రూమ్ల ఇళ్ల పంపిణి కార్యక్రమం శనివారం జరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న నియోజకవర్గ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్ శరత్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూం ఇండ్లు తీసుకున్న వారిలో సంతోషం కనపడుతుందన్నారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 60 లక్షల విలువైన ఇల్లు పేదల సొంతమయ్యాయని పేర్కొన్నారు. విలువైన స్థలంలో ధనవంతులు ఉండే ప్రాంతంలో పేద ప్రజలకు ఇండ్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని ప్రశంసించారు. కాంగ్రెస్, బీజేపీలు ఎప్పుడు ధర్నాలే చేస్తాయని, పనిచేయవని విమర్శించారు. హైదరాబాద్ నలుమూలలా లక్ష డబుల్ బెడ్ రూమ్లు ఇస్తున్నామన్నారు. ఇక్కడ ఇండ్ల వద్ద అన్ని వసతులు కల్పిస్తామని, ఆసుపత్రి, రేషన్ షాపుతో పాటు అన్ని సౌకర్యాలు అందిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించినట్టు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇలా అన్ని మతాలను గౌరవించే వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. ఆలయం, చర్చ్, మసీదు కూడా ఏర్పాటు చేస్తామని, ఫంక్షన్ హాల్లు నిర్మిస్తామని పేర్కొన్నారు. చదవండి: మేడ్చల్ జిల్లాలో రాజకీయ సంద‘ఢీ’.. ప్రత్యర్థులెవరు? ‘బీఆర్ఎస్ సర్కార్ అంటే మాటలు తక్కువ పనులు ఎక్కువ. ఇప్పుడు మంచినీళ్లకు ధర్నాలు లేవు. తాగు నీరు సరఫరా మంచిగా జరుగుతుంది. బీజేపీ వాళ్ళు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్నో చెప్పారు. ఇల్లు పోతే ఇల్లు, బండి పొతే బండి ఇస్తామన్నారు. బండి పోతే బండి.. గుండు పోతే గుండు అన్నారు. బండి లేదు గుండు లేదు. డబుల్ ఇంజిన్ సర్కార్లో ఎక్కడైనా డబుల్ బెడ్ రూమ్లు ఇచ్చారా ? వీరిది డబుల్ ఇంజన్ కాదు ట్రబుల్ ఇంజన్ సర్కార్. విలువైన ఇంటిని జాగ్రత్తగా కాపాడుకోండి. ఇల్లు ఇచ్చిన, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న కేసీఆర్ను ఆశీర్వదించండి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గేటెడ్ కమ్యునిటీగా మారనుంది’ అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాజాసింగ్, దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్, మాగంటి గోపీనాథ్, మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రాల్లో.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎందుకు లేవు? - మంత్రి శ్రీ @BRSHarish.#DignityHousing pic.twitter.com/Uddlkvy64E — BRS Party (@BRSparty) September 2, 2023 -
సంగారెడ్డి: బీఆర్ఎస్లో అయోమయ పరిస్థితి!
మెదక్ జిల్లాలోని 10 శాసనసభ స్థానాలలో సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గం ఒకటి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యంత ఆసక్తిని రేపే నియోజకవర్గం ఇది. ఇక్కడి ప్రజాతీర్పు భిన్నంగా ఉంటుంది. ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగితే.. ఆరు సార్లు కాంగ్రెస్, నాలుగుసార్లు ఇండిపెండెంట్లు గెలిచారు. ఇక.. బీఆర్ఎస్ రెండు సార్లు, బీజేపీ, టీడీపీ ఒక్కోసారి అధికారంలోకి వచ్చాయి. మళ్లీ కాంగ్రెస్ పట్టు సాధించేనా? కాంగ్రెస్లో స్ట్రాంగ్ లీడర్గా ఉన్న తూర్పు జయప్రకాశ్ రెడ్డి(అలియాస్ జగ్గారెడ్డి) 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం విశేషం. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేకుండ తన సొంత క్యాడర్తో దూసుకుపోయాడు. 2004లో ఆయన తొలిసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం పొందారు. ఆ తర్వాత 2009, 2018లో మాత్రం కాంగ్రెస్ తరఫున గెలిచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందు వరకు కాంగ్రెస్ సంగారెడ్డి అడ్డాగా ఉండేది. కానీ 2014 ఎన్నికల తర్వాత సీన్ మొత్తం మారింది. అక్కడ గులాబీ జెండ ఎగరింది. దాంతో సంగారెడ్డిలో కాంగ్రెస్ వీక్ అయ్యి బీఆర్ఎస్ బలపడినట్లు అనిపించింది. కానీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి గెలుపొందడంతో సంగారెడ్డిపై మళ్లీ హస్తం పట్టు సాధించింది. ఇక తాజా పరిణామాలు ప్రకారం.. ఇప్పుడు జగ్గారెడ్డి బీఆర్ఎస్లో చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుండటంతో రాబోయే సంగారెడ్డి అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తిగా మారాయి. ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలిక సంగారెడ్డిలో ఉత్కంఠత నెలకొంది. నియోజకవర్గంలోని ఆసక్తికర అంశాలు : మహబూబ్ చెరువు, మంజీర డ్యామ్ రాజకీయానికి అంశాలు బీఆర్ఎస్లో అయోమయం కార్ ఓవర్ లోడ్ అధిక పోటీలో బిఆర్ఎస్ నాయకులు MLA జగ్గారెడ్డి బిఆర్ఎస్లోఇక వెళ్ళే సూచనలు ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు: రియల్ వ్యాపారం హైదరాబాద్కి దగ్గర ఉన్నా నియోజక వర్గంలో మౌలిక వసతుల విషయంలో పెద్దగా అభివృద్ధి లేకపోవడం రాజకీయ పార్టీల వారీగా ప్రధాన పార్టీల టికెట్ల ఆశిస్తున్నవారు బీఆర్ఎస్ చింతా ప్రభాకర్ (మాజీ ఎమ్మెల్యే) కాంగ్రెస్ జగ్గారెడ్డి బిజేపి రాజేశ్వర్ రావు దేశ్ పాండే (బిజేపి నియోజక వర్గ ఇంచార్జ్) శివరాజ్ పాటిల్ నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు : నదులు : మంజీర నది ఆలయాలు : వైకుంట పురం ఆలయం / ఇస్మాయిల్ ఖాన్ పేట భవానీ మాత ఆలయం -
కాంగ్రెస్కు షాక్.. బీఆర్ఎస్లోకి జగ్గారెడ్డి?
సాక్షి, సంగారెడ్డి: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో తెలంగాణలో కూడా హస్తం నేతలు స్పీడ్ పెంచారు. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో కొందరు సీనియర్లను కూడా పార్టీలోకి ఆహ్వానించింది. మరోవైపు.. కొంత మంది హస్తం నేతలు కాంగ్రెస్ను వీడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. బీఆర్ఎస్లో చేరునున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ సర్కార్ వైపు జగ్గారెడ్డి మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. ఇక, కొంతకాలంగా జగ్గారెడ్డి.. బీఆర్ఎస్ నేతలతో సఖ్యతగా ఉండటం విశేషం. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి జగ్గారెడ్డి సంగారెడ్డి బరిలోకి దిగే అవకాశం ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా, పార్టీ మార్పు వార్తలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నా.. వాటిని జగ్గారెడ్డి ఖండించకపోవడం ఆసక్తికరంగా మారింది. ఇదే, పార్టీ మార్పు అంశానికి మరింత బలాన్ని చేకూర్చుతోంది. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్గా నియమించినప్పటి నుంచే జగ్గారెడ్డి సీరియస్గా ఉన్నారు. ఈ క్రమంలో బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేశారు. ఇక, కాంగ్రెస్ హైకమాండ్కు కూడా పలు సందర్భాల్లో జగ్గారెడ్డి లేఖలు రాశారు. రేవంత్ను టీపీసీసీ చీఫ్గా నియమించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక, ఇటీవల కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న పలు కార్యక్రమాల్లో కూడా జగ్గారెడ్డి యాక్టివ్గా కనిపించకపోవడం గమనార్హం. ఒకానొక సమయంలో కేసీఆర్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలపై కూడా జగ్గారెడ్డి సానుకూలంగా స్పందించి.. గులాబీ సర్కార్ను అభినందించడం విశేషం. ఇది కూడా చదవండి: కేసీఆర్ సార్ ‘మదిలో’ ఎవరు..? అందరిలోనూ హై టెన్షన్..! -
విషాదం.. కొడుకు మరణ వార్త విని తండ్రి మృతి
సాక్షి, సంగారెడ్డి: కన్న కొడుకు మరణ వార్త విన్న తండ్రి గుండెపోటుతో మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వీరిద్దరి మరణంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని గోంగ్లూర్ తండాకూ చెందిన బానోత్ భీమ్లా శుక్రవారం బైక్పై జోగిపేట్ పట్టణానికి మోటర్ రిపేర్ కోసం వెళ్లాడు. అనంతరం, ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో అల్మాయిపేట సబ్స్టేషన్ సమీపంలోకి రాగానే రోడ్డు పక్కకు బైక్ పార్క్ చేశాడు. అనంతరం 161 నాందేడ్ జాతీయ రహదారి దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో, ఘటనా స్థలంలోనే భీమ్లా మృతిచెందాడు. ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే, కొడుకు బానోత్ భీమ్లా మరణ వార్త విని అతడి తండ్రి ధర్మ నాయక్ గుండెపోటుతో మరణించాడు. ఇక, ఇద్దరి మరణంలో తండాలో విషాదం నెలకొంది. ఇది కూడా చదవండి: బైక్పై చోరీ కోసం వచ్చి.. ఉన్న బైక్ వదిలి పరార్.. -
తల్లిదండ్రుల కష్టం ఏమిటో అర్థం చేసుకోలేని స్థితిలోనూ! శెభాష్ బిడ్డా..
Special Olympics 2023: ‘‘కష్టాలురానీ కన్నీళ్లురానీ.. ఏమైనాగానీ ఎదురేదీరానీ.. ఓడీపోవద్దు రాజీపడొద్దు.. నిద్రే నీకొద్దు నింగే నీ హద్దు.. గెలుపు పొందె వరకు.. అలుపు లేదు మనకు’’.. కష్టాల కడలిలో కొట్టుకుపోతున్నా సానుకూల దృక్పథం వీడొద్దని, సంకల్ప బలం ఉంటే మనిషి సాధించలేనిది ఏదీ ఉండదంటూ స్ఫూర్తిని రగిల్చాడో సినీకవి. నిరాశలో కూరుకుపోయిన వారిని తట్టిలేపి గమ్యం వైపు పరుగులు తీయమని చాటిచెప్పే ఈ పాటలోని ప్రతీ వాక్యం రిషితకు సరిగ్గా సరిపోతుంది. వైకల్యం కేవలం శరీరానికి మాత్రమే కానీ ఆత్మవిశ్వాసానికి కాదని నిరూపించిన ఈ బంగారు తల్లిది సంగారెడ్డి. అమ్మ కడుపులో ఉండగానే అమ్మ కడుపులో ఉండగానే కవల సోదరుడిని పోగొట్టుకుని.. డౌన్ సిండ్రోమ్ బారిన పడ్డ రిషితను కంటికి రెప్పలా కాపాడుకున్నారు తల్లిదండ్రులు. గుండెకు రంధ్రంతో పాటు వైకల్యంతో జన్మించిన తమ చిన్నారిని చూసి జాలి పడ్డవారే.. శెభాష్ బిడ్డా అని అభినందించే స్థాయికి తీసుకువచ్చారు. అమ్మానాన్నలు తనకోసం పడుతున్న కష్టాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నప్పటికీ వారితో పాటు దేశం మొత్తం గర్వపడేలా చేసింది రిషిత. బెర్లిన్లో జరిగిన స్పెషల్ ఒలంపిక్స్లో రజత పతకాలు సాధించి దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసింది. అసాధారణ ప్రతిభతో రోలర్ స్కేటింగ్లో సత్తా చాటి మెడల్స్తో తిరిగి వచ్చింది. ఇబ్బందులు ఉన్నా బీహెచ్ఈఎల్కు చెందిన ప్రశాంత్రెడ్డి- మాధవి దంపతులు తమకు కవలలు పుట్టబోతున్నారన్న వైద్యుల మాట విని ఎంతగానో మురిసిపోయారు. ఇద్దరు పిల్లల ఆలనాపాలనా, బంగారు భవిష్యత్తు గురించి ఎన్నెన్నో కలలు కన్నారు. కానీ విధిరాత మరోలా ఉంది. గర్భంలో ఉండగానే పిల్లాడు చనిపోయాడు.. ఆ ప్రభావం అతడి కవల సోదరి రిషితపై కూడా పడింది. డౌన్సిండ్రోమ్ బారిన పడిందామె. పైగా పుట్టిన తొమ్మిది నెలల తర్వాత రిషిత గుండెలో రంధ్రం ఉందన్న భయంకర నిజం తల్లిదండ్రులకు తెలిసింది. గుండె నిబ్బరంతో కడుపులో ఉండగానే ఓ బిడ్డను పోగొట్టుకుని.. భూమ్మీదకు వచ్చిన పాపాయి కూడా ఎంతకాలం బతుకుందో తెలియని పరిస్థితిలోనూ ప్రశాంత్రెడ్డి- మాధవి గుండె నిబ్బరం కోల్పోలేదు. తాము ఊపిరి పోసిన ప్రాణాన్ని నిలబెట్టుకునేందుకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే వెనుకడుగు వేయలేదు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించి.. వారి సాయంతో పాపకు చికిత్స చేయించారు. అందరిలా కాకుండా మరింత ప్రత్యేకంగా ఉన్న తమ బుజ్జాయిని స్పెషల్ కేర్ స్కూళ్లో చేర్పించారు. ఆత్మవిశ్వాసం సడలనివ్వకుండా అక్కడే రిషిత జీవితం మలుపు తిరిగింది. ఆమెలో నిగూఢంగా దాగి ఉన్న ప్రతిభను ట్రైనర్ గుర్తించాడు. దీంతో రోలర్ స్కేటింగ్లో ఆమెకు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు తల్లిదండ్రులు. అంతేకాదు రిషితలో ఆత్మవిశ్వాసం పెంపొందేలా వివిధ నగరాల్లో జరిగిన పోటీలకు సైతం తీసుకువెళ్లేవారు. అలా ఒక్కో అడుగు వేస్తూ రిషిత స్పెషల్ ఒలంపిక్స్కు అర్హత సాధించింది. ఆమె టాలెంట్ను గుర్తించిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా మద్దతుగా నిలిచింది. తల్లిదండ్రులు, కోచ్ ఇచ్చిన ప్రోత్సాహంతో రిషిత అంచెలంచెలుగా ఎదిగింది. తప్పకుండా ఒలంపిక్స్లో మెడల్ సాధిస్తుందన్న వారి నమ్మకాన్ని నిలబెడుతూ స్పెషల్ ఒలంపిక్స్లో భారత్కు పతకాలు అందించింది. నిజంగా స్ఫూర్తిదాయకం చిన్న చిన్న మనస్పర్థలు, గొడవలకే విడిపోయే దంపతులు ఉన్న ఈ సమాజంలో సంతానం విషయంలో ఎంతటి కష్టం వచ్చినా తట్టుకుని నిలబడ్డ ప్రశాంత్రెడ్డి- మాధవి నిజంగా ఈతరం జంటలకు ఆదర్శనీయం. పదహారేళ్లుగా బిడ్డను పసిపాపలా సాకుతూ ఆమెను ఈ స్థాయికి చేర్చిన వారిద్దరికీ హ్యాట్సాఫ్! అదే విధంగా.. వైకల్యాన్ని జయించి తల్లిదండ్రులను సగర్వంగా తలెత్తుకునేలా చేసిన రిషితకు అభినందనలు!! 190 దేశాల నుంచి వచ్చిన అథ్లెట్ల నుంచి పోటీని తట్టుకుని గెలుపొందిన ఆమెకు జేజేలు!! ప్రభుత్వం రిషిత లాంటి స్పెషల్ కిడ్స్కు చిన్నప్పటి నుంచే అండగా నిలిస్తే అమ్మానాన్నలతో పాటు ఆ పిల్లలకు కూడా ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందని రిషిత తల్లిదండ్రులు అంటున్నారు. నిజమే కదా!! ఏమిటీ స్పెషల్ ఒలంపిక్స్? శారీరక, మానసిక వైకల్యంతో బాధపడుతున్న అథ్లెట్ల కోసం ప్రత్యేకంగా 1968లో స్పెషల్ ఒలంపిక్స్ ఆరంభించారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అథ్లెట్లు 32 క్రీడా విభాగాల్లో పోటీపడతారు. అథ్లెటిక్స్, సైక్లింగ్, పవర్లిఫ్టింగ్, రోలర్స్కేటింగ్, స్విమ్మింగ్ ఇలా వివిధ క్రీడల్లో పోటీలు నిర్వహిస్తారు. -సుష్మారెడ్డి యాళ్ల చదవండి: సిక్సర్ల రింకూ.. ఎక్కడా తగ్గేదేలే! వీడియోతో సెలక్టర్లకు దిమ్మతిరిగేలా! -
జోగిపేట ఆక్స్ఫర్డ్ స్కూల్పై కేసు నమోదు.. కారణం ఇదే..
సాక్షి, సంగారెడ్డి: జోగిపేటలోని ఆక్స్ఫర్డ్ స్కూల్పై కేసు నమోదు అయ్యింది. ఆక్స్ఫర్డ్ పాఠశాలలో అధిక ఫీజులు, బుక్స్ విక్రయిస్తున్నారని డీఈవోకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు విద్యార్థి సంఘాలు డీఈవోకు ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో డీఈవో ఆదేశాలలో ఎంఈవో కృష్ణ ఆక్స్ఫర్డ్ స్కూల్లో తనిఖీలు చేపట్టారు. అయితే, స్కూల్ను తనిఖీ చేయడానికి వచ్చిన ఎంఈవోతో పాఠశాల సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలో స్కూల్ నిర్వాహకుడు వేణుపై ఎంఈవో జోగిపేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్లో సీట్ల కేటాయింపుపై సస్పెన్స్.. ఆ 70 మంది పరిస్థితేంటి? -
డబుల్ బెడ్రూమ్ టౌన్షిప్ ప్రారంభించిన కేసీఆర్.. స్పెషల్ ఇదే..
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంగారెడ్డి జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా కొల్లూరులో కేసీఆర్ నగర్ పేరుతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ టౌన్షిప్ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరుగురు లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. అంతకుముందు డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ను సందర్శించారు. కాగా, సుమారు 60 వేల మంది ఆవాసం ఉండేలా ఒకేచోట ఏకంగా 15,660 ఇండ్ల నిర్మాణాన్ని తెలంగాణ సర్కారు చేపట్టింది. నిరుపేదల కోసం సకల సౌకర్యాలతో కొల్లూరులో ఈ ఆదర్శ టౌన్షిప్ను నిర్మించింది. నాణ్యతలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కార్పొరేట్ హంగులతో పేదల కోసం కలల సౌధాలను నిర్మించింది. రూ.1,489.29 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టులో కార్పొరేట్ అపార్ట్మెంట్లకు తీసిపోకుండా సకల హంగులతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించారు. ఈ టౌన్షిప్లో 145 ఎకరాల విస్తీర్ణంలో 1432.50 కోట్ల రూపాయల వ్యయంతో ఒకే చోట 15,600 ఇళ్ల నిర్మాణం జరిగింది. సుమారు 60 వేల మంది ఆవాసం ఉండేలా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారు. G+9 నుంచి G+10, G+11 అంతస్తుల వరకు టౌన్షిప్ నిర్మాణం జరిగింది. మొత్తం 117 బ్లాక్లు, బ్లాక్కి 2 లిఫ్ట్ల చొప్పున మొత్తం 234 లిఫ్ట్లను ఏర్పాటు చేశారు. టౌన్షిప్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్, స్కూల్స్, 118 వాణిజ్య దుకాణాల నిర్మాణం జరిగింది. ఇది కూడా చదవండి: తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది.. వారి మౌనం వెనుక కారణం? -
సంగారెడ్డి జిల్లా కొల్లూరు డబుల్ బెడ్ రూం ఇండ్ల విశేషాలు
-
సంగారెడ్డి జిల్లా అమిన్ పురలో భారీ సైబర్ మోసం
-
సంగారెడ్డి: అత్తామామల హత్యకు అల్లుడి షాకింగ్ స్కెచ్
సాక్షి, సంగారెడ్డి: చిన్న చిన్న విషయాలే.. ఒక్కోసారి తీవ్ర నిర్ణయాలు తీసుకునేలా ఉసిగొల్పుతాయి. అలా ఓ అల్లుడు ఏకంగా తనకు పిల్లనిచ్చిన అత్తామామల్ని చంపేయాలని ప్లాన్ వేశాడు. అది మామూలు స్కెచ్తో కాదు.. షాకింగ్ స్కెచ్తో!. చివరకు ఆ కుట్ర బయటపడడం, అందుకు కారణం ఏంటో తెలిసి పోలీసులతో పాటు స్థానికులు షాక్ తినడం ఒకదాని వెంట మరొకటి జరిగాయి. అత్తమామల హత్యకు షాకింగ్ స్కెచ్ వేసిన ఓ అల్లుడు కటకటాల పాలయ్యాడు. రమేష్ అనే వ్యక్తి తన భార్య తల్లిదండ్రుల్ని చంపడానికి ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగా.. ఈ నెల 12వ తేదీన ఇంటి తలుపులకు కరెంట్ షాక్ పెట్టాడు. అయితే రమేష్ అనుకున్నట్లు జరగలేదు. అత్తామామలకు బదులుగా.. తల్లీకూతుళ్లు ఆ తలుపును తాకడంతో షాక్కి గురయ్యారు. కరెంట్ షాక్తో విలవిలలాడుతూ.. వాళ్లు వేసిన కేకలకు స్థానికులు అప్రమత్తం అయ్యారు. వెంటనే కరెంట్ ఆఫ్ చేయడంతో ప్రాణాపాయం తప్పింది. ఇక ఈ ఘటనపై బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించగా.. విచారణలో తాజాగా అల్లుడు రమేష్ కుట్రదారుడని తేలింది. ఇంతకీ ఎందుకు చంపాలని ప్రయత్నించాడో తెలుసా?.. గతంలో ఓసారి ఇంటికి వెళ్లినప్పుడు ఆ అత్తామామలు, అల్లుడు రమేష్ను మందలించలేదనట. పలకరించలేదన్న ఆ కోపంతో అప్పటి నుంచి రగిలిపోతున్న రమేష్.. ఎలాగైనా వాళ్లను చంపేయాలని అనుకున్నాడట. చివరకు కరెంట్షాక్తో యత్నిస్తే తన మీదకు రాదని అలా చేశానని రమేష్ వెల్లడించడం గమనార్హం. ప్రస్తుతం ఆ అల్లుడిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు పోలీసులు. ఇదీ చదవండి: మంచిర్యాలలో దారుణం.. ఊరంతా చూస్తుండగానే.. -
‘అల్లం’ రైతుల్లో ఆనందం.. ఐదు రెట్లు పెరిగిన ధర..
సాక్షి, సంగారెడ్డి: గత ఏడాదితో పోలిస్తే అల్లం ధర ఒక్కసారిగా ఐదు రెట్లు పెరిగింది. దీంతో రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో రైతులు ఏటా అల్లం పంటను సంప్రదాయక పంటగా సాగుచేస్తూ వస్తున్నారు. ఐదేళ్లుగా క్వింటాలు అల్లం ధర రూ.2 వేల నుంచి రూ.2,500 మాత్రమే పలుకుతూ వచి్చంది. కానీ ప్రస్తుతం మార్కెట్లో రూ.8 వేలకు పైగా ధర పలుకుతోంది. దీంతో పంటను సాగు చేస్తున్న రైతులు ఆనందంగా ఉన్నారు. ఐదేళ్లుగా మార్కెట్లో అల్లం పంటకు సరైన ధర లేక పోవడంతో దేశవ్యాప్తంగా సాగువిస్తీర్ణం భారీగా పడిపోయింది. అంతే కాకుండా గత ఏడాది అధికంగా వర్షాలు పడటంతో సాగులో ఉన్న పంట సగానికి పైగా దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో పంటను కాపాడుకున్న రైతులకు కాసుల వర్షం కురుస్తోంది. అనేక మంది రైతులు గత ఏడాది క్రితమే ధర లేని కారణంగా అల్లం సాగుకు స్వస్తి చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 1,500 ఎకరాల్లో పంట సాగులో ఉన్నట్టు అంచనా. ఇందులో జహీరాబాద్ ప్రాంతంలోనే 90 శాతం సాగవుతోందని రైతులు చెపుతున్నారు. ఈ ఏడాది మళ్లీ పంట సాగుపై ఆసక్తి ప్రస్తుతం అల్లం పంటకు మార్కెట్లో మంచి ధర లభిస్తుండటంతో ఈ ఏడాది అల్లం పంటను సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. మే నెల నుంచి జూన్ చివరి వరకు రైతులు అల్లం పంటను సాగు చేస్తారు. ఎకరం పంట సాగుకు సుమారు 1.50 లక్షల మేర పెట్టుబడి వ్యయం అవుతుంది. మార్కెట్లో ధర ఉంటేనే గిట్టుబాటవుతుంది. లేకపోతే పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. కాగా, అల్లం పంట సాగుకు కేరళ రాష్ట్రం ప్రతీతి. ఈ ఏడాది అక్కడ కూడా భారీగానే పంట సాగుకు రైతులు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లాలో మాత్రం ఈ ఏడాది 3 వేల ఎకరాలకు పైగా పంట సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయరంగ నిపుణులు చెపుతున్నారు. పంట ఉన్న రైతులకు లబ్ధి అల్లం పంట ఉన్న రైతులకు మంచి ధర వస్తోంది. దీంతో లబ్ధి పొందుతున్నారు. గతంలో ధర లేక రైతులు నష్టపోయిన సందర్భాలున్నాయి. పంట సాగు తక్కువగా ఉన్నందున రైతులకు మార్కెట్లో గిట్టుబాటు ధర లభిస్తోంది. క్వింటాల్ ధర రూ.8 వేలు పలుకుతోంది. ఈ ఏడాది పంట సాగు పెరిగే అవకాశం ఉంది. –అనూష, ఉద్యానవన అధికారి, జహీరాబాద్ బాగా గిట్టుబాటు అయింది ఎకరం పొలంలో గత ఏడాది అల్లం పంట సాగు చేసుకున్నా. ఇటీవల పంటను తీసి విక్రయించా. 60 క్వింటాళ్ల మేర పంట దిగుబడి వచి్చంది. పంట సాగు కోసం సుమారు రూ.1.50 లక్షలు ఖర్చు పెట్టాను. క్వింటాలు అల్లం రూ.9 వేల ధరకు అమ్మాను. మంచి ధర రావడంతో బాగా గిట్టుబాటు అయింది. – నర్సింహారెడ్డి, రైతు–చిరాగ్పల్లి ఇంకా ధర పెరుగుతుందనే ఆశతో ఉన్న అల్లం పంట తక్కువ విస్తీర్ణంలో సాగులో ఉంది. దీంతో మరింత ధర పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ నేప థ్యంలో పంటను ఇంకా భూమిలోనే నిల్వ పెట్టాను. ప్రస్తుతం 4ఎక రాల్లో పంట ఉంది. ఈ ఏడాది మరో 6 ఎకరాల్లో సాగు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నా. క్వింటాలు ధర రూ.10 వేలకు పైగా పలికే అవకాశం ఉంది. –వెంకట్రెడ్డి, రైతు, హోతి (కె) చదవండి: ‘బాక్స్ సాగు’ భలేభలే..! -
విషాదం.. స్కూల్లో గుండెపోటుతో టీచర్ అకాల మరణం
సాక్షి, సంగారెడ్డి : ఇటీవలి కాలంలో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లాలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు స్కూల్లోనే గుండెపోటుతో మృతిచెందింది. దీంతో, స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లాలోని చౌటకూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్న పద్మలత బుధవారం పాఠాలు చెబుతోంది. ఈ క్రమంలో మధ్యలో తరగతి గది నుంచి బయటకు వచ్చి నీళ్లు తాగింది. అనంతరం, ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను సహచర ఉపాధ్యాయులు 108 అంబులెన్స్లో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. సంగారెడ్డి స్వస్థలమైన ఆమె మృతిపట్ల ఉపాధ్యాయులు, సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. -
31 కిలోమీటర్ల రోడ్డుకు రూ.1,297 కోట్లా..!
సాక్షి, హైదరాబాద్: ఆరు వరుసలకు విస్తరిస్తున్న రోడ్డది.. నిడివి 31 కి.మీ. మాత్రమే. కానీ దాని నిర్మాణానికి మాత్రం ఏకంగా రూ. 1,297 కోట్లు ఖర్చు కానుంది! అంటే ఒక కిలోమీటర్కు దాదాపు రూ. 42 కోట్ల వ్యయం అన్నమాట. దీన్ని మరోలా చెప్పాలంటే ఎనిమిది వరుసలు, 158 కి.మీ. నిడివితో రూపుదిద్దుకున్న ఔటర్ రింగురోడ్డు నిర్మాణంలో ప్రతి కిలోమీటర్కు అయిన ఖర్చు స్థాయికి దాదాపు సమానమన్నమాట! ఈ కాస్త దూరానికే అంత ఖర్చు ఎందుకు అనుకుంటున్నారా? ఇందులో నిర్మించేది ప్రధాన రోడ్డొక్కటే కాదు.. సరీ్వసు రోడ్లు, క్రాష్ బ్యారియర్లు, ఎలివేటెడ్ కారిడార్లు, జంక్షన్ల వద్ద వంతెనలు, అండర్పాస్లు, కల్వర్టులు.. ఒకటేమిటి ఎక్స్ప్రెస్ వే అంటే ఇలా ఉండాలనే రీతిలో ఇది రూపుదిద్దుకోబోతోంది. ఓ రకంగా చెప్పాలంటే మోడల్ ఎక్స్ప్రెస్ వేగా నిలవబోతోంది. హైదరాబాద్–పుణే జాతీయ రహదారిపై మియాపూర్–సంగారెడ్డి మధ్య ఉన్న ఈ మార్గం ఎక్స్ప్రెస్ వే తరహాలో ముస్తాబుకానుంది. అందుకే ఖర్చు సైతం భారీగా ఉంది. ట్రాఫిక్ చిక్కులకు తెరదించేలా... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల్లో విస్తరించి ఉన్న 65వ నంబర్ జాతీయ రహదారిపై కొన్నేళ్లుగా ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో దాన్ని విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ శివార్లలో ఆ మార్గాన్ని యుద్ధప్రాతిపదికన 6 వరుసలకు విస్తరించనుంది. ఇందులో హయత్నగర్ దాటాక విజయవాడ రోడ్డులో జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాథికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) రోడ్డు విస్తరణను చేపట్టనుండగా ముంబై రహదారిలో మియాపూర్ సమీపంలోని మదీనాగూడ నుంచి సంగారెడ్డి వరకు రాష్ట్ర పీడబ్ల్యూడీ విభాగం అభివృద్ధి చేయనుంది. తాజాగా మదీనాగూడ–సంగారెడ్డి మధ్య 6 వరుసల విస్తరణ పనులకు సంబంధించిన డీపీఆర్కు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ అ«దీనంలోని స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ ఆమోదించింది. దీంతో ఇక టెండర్లు పిలిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అవి ఖరారయ్యాక రెండున్నరేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు. రోజుకు సగటున లక్ష వాహనాలు.. నగరం నుంచి సంగారెడ్డి రోడ్డు అత్యంత బిజీగా మారిపోయింది. డీపీఆర్ తయారీలో భాగంగా గత ఆగస్టులో ఇస్నాపూర్, పటాన్చెరు మధ్య వెళ్తున్న వాహనాల సంఖ్యపై జాతీయ రహదారుల విభాగం సర్వే నిర్వహించగా ఒక రోజులో సగటున లక్ష వాహనాలు ప్రయాణిస్తున్నట్లు తేలింది. పటాన్చెరు వద్ద రోజుకు 30,683 కార్లు, 12,353 త్రిచక్ర వాహనాలు, 34,437 ద్విచక్ర వాహనాలు, 5,551 బస్సులు, 9 వేల ట్రక్కులు... ఇలా అన్నీ కలిపి రోజుకు లక్ష వరకు తిరుగుతున్నాయి. ఇక మదీనాగూడ ప్రాంతంలో ఆ సంఖ్య అంతకు రెట్టింపుగా ఉంటోంది. ఈ రోడ్డును విస్తరిస్తే ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పుడేం చేస్తారు..? మదీనాగూడ నుంచి సంగారెడ్డి వరకు 31 కి.మీ.మేర రోడ్డును 6 వరుసలకు విస్తరించనున్నారు. మూడు వరుసల సరీ్వసు రోడ్డు, ఫుట్పాత్, వరద నీటి డ్రెయిన్తో 11.66 కి.మీ., మిగతా నిడివిలో రెండు వరుసల సరీ్వసు రోడ్డు ఉండేలా నిర్మించనున్నారు. రుద్రారం వద్ద 1,020 మీటర్ల మేర, గంగారం వద్ద 840 మీటర్ల మేర రెండు ఎలివేటెడ్ కారిడార్లతోపాటు కొత్తగా 11 చిన్న వంతెనలు నిర్మించనున్నారు. ఏడు మేజర్, 19 మైనర్ జంక్షన్లను విస్తరించనున్నారు. ఏడు ప్రాంతాల్లో అండర్పాస్లు, ఆరు చోట్ల కల్వర్టులను కట్టనున్నారు. ఐదు ప్రాంతాల్లో లిఫ్టు వసతి ఉండే ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, రోడ్డుకు రెండు వైపులా క్రాష్ బ్యారియర్లను ఏర్పాటు చేయనున్నారు. వెరసి ప్రధాన క్యారేజ్ వే మీదకు చుట్టుపక్కల నుంచి ఇతర వాహనాలు, మనుషులు, జంతువులు వచ్చే వీలుండదు. ప్రధాన క్యారేజ్ వే మీదుగా వెళ్లే వాహనాలకు, దీన్ని దాటుతూ అటూఇటూ పోయే వాహనాలకు పరస్పరం ఆటంకం లేని విధంగా డిజైన్ చేశారు. ఇందుకు వీలుగా అదనంగా కావాల్సిన భూమి కోసం రూ. 166 కోట్లు వెచి్చస్తున్నారు. అన్నీ కలిపి నిర్మాణానికి రూ. 1,297 కోట్లు ఖర్చు కానున్నట్టు డీపీఆర్లో పేర్కొనగా దానికి తాజాగా కేంద్రం ఆమోదముద్ర వేసింది. బీహెచ్ఈఎల్ వంతెన కాకుండా.. ఈ రోడ్డు విస్తరణలో భాగంగా బీహెచ్ఈఎల్ కూడలి వద్ద 131 కోట్లతో భారీ వంతెన నిర్మిస్తున్నారు. 60 మీటర్ల వెడల్పుతో అది ఉండనుంది. దాన్ని ఈ రోడ్డు విస్తరణ ప్రాజెక్టులో కాకుండా విడిగా చూపారు. దానికి సంబంధించి ఎన్హెచ్ఏఐ రూపొందించిన నమూనా ప్రకారం పనులు సాధ్యం కాదంటూ రాష్ట్ర ప్రభుత్వ అ«దీనంలోని ఎన్హెచ్ విభాగం ఇటీవల ప్రతిపాదించింది. దీనిపై ఇరు విభాగాల మధ్య విభేదాలు తలెత్తడంతో పనుల్లో జాప్యం జరుగుతోంది. ఇందుకు కారణం మీరంటే మీరంటూ ఇరు విభాగాలు లేఖలు రాసుకోవడం వివాదాస్పదంగా మారింది. చదవండి: డేటా దేశం దాటిందా? -
ట్విట్టర్ టిల్లు, లిక్కర్ క్వీన్, హ్యాపీ రావు.. .. బండి సంజయ్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర పర్యటన రద్దవడం పట్ల తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ వివరణ ఇచ్చారు. కొన్ని కారణాల వల్ల నడ్డా గారు రాలేక పోయారని, మరోసారి వస్తానని చెప్పారని తెలిపారు. జేపీ నడ్డా, ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలోనే బీజేపీ అతి శక్తి వంతమైన పార్టీగా అవతరించిందని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. శుక్రవారం సంగారెడ్డిలో జిల్లా పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణలో కాషాయపు రాజ్యం రావాలి. గతంలో బీజేపీని ఉత్తరాది పార్టీ అని విమర్శించారు. ఇక్కడ ఏ ఉప ఎన్నిక జరిగినా బీజేపీ గెలుస్తోంది. ముఖ్యమంత్రి కుటుంబాన్ని ఎక్కడికక్కడ ప్రజలు అడ్డుకుంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఈ సర్కార్ నెరవేర్చలేదు. మోదీని తిడుతూ టైం పాస్ పాలిటిల్స్ చేస్తున్నారు. కేసీఆర్ కొడుకు, ట్విటర్ టిల్లును ఉరికించి కొడుతారు. మోదీని బ్రోకర్ అంటవా..! నువ్వు బ్రోకర్, నీ అయ్య పాస్ పోర్ట్ బ్రోకర్. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. మునుగొడులో పోలింగ్ ఏజెంట్లు దొరకని పార్టీ బీఆర్ఎస్. టీఎస్పీఎస్సీ నిర్వాకం వల్ల 30 లక్షల మంది భవిష్యత్ నాశనం అయితే మీ అయ్యా ఎందుకు మాట్లాడలేదు. టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలి. నీ కుటుంబం ప్రమేయం లేకపోతే సిట్టింగ్ విచారణతో జరిపించాలి. నా పైన పరువు నష్టం దావా వేశారు. ట్విట్టర్ టిల్లు, లిక్కర్ క్వీన్, హ్యాపీ రావు, అగ్గిపెట్టే రావు వీళ్లే తెలంగాణను ఏలుతున్నారు. రాబోయే రోజుల్లో యుద్ధం కొనసాగిస్తాం. కచ్చితంగా బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటు చేస్తాం’ అని పేర్కొన్నారు. (చదవండి: Tspsc Paper Leak: రేవంత్ ఆరోపణలపై సిట్ రియాక్షన్) -
31న తెలంగాణకు జేపీ నడ్డా..
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ప్రకాష్ నడ్డా ఈ నెల 31న రాష్ట్రానికి రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా నడ్డా సంగారెడ్డిలో బీజేపీ కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీవర్గాలు వెల్లడించాయి. అదేరోజు తెలంగాణలోని జనగామ, వరంగల్, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలతోపాటు ఏపీలోని మరో రెండు జిల్లాల కార్యాలయాలను ఆయన వర్చువల్గా ప్రారంభిస్తారు. సంగారెడ్డిలో జరిగే బహి రంగ సభలో నడ్డా ప్రసంగిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆయన విడిగా సమావేశం కానున్నట్టు సమాచారం. అనంతరం శంషాబాద్ నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారని పార్టీవర్గాలు తెలిపాయి. -
సంగారెడ్డి మెడికల్ కాలేజీ విద్యార్థులు మంత్రి హరీష్ రావు ముఖాముఖీ
-
ఐఐటీహెచ్లో డార్క్ స్కై అబ్జర్వేటరీ
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఖగోళశాస్త్రంలో ఉన్నతస్థాయి పరిశోధనలకు ఉపయోగపడే అడ్వాన్స్డ్ డార్క్ స్కై అబ్జర్వేటరీని హైదరాబాద్ ఐఐటీలో ఏర్పాటు చేశారు. నేషనల్ సైన్స్ డే మంగళవారం ఐఐటీలో నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఇస్రో మాజీ చైర్మన్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ కె.రాధాకృష్ణన్ ఈ అబ్జర్వేటరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖగోళ శాస్త్ర పరిశోధనలకు ఈ అబ్జర్వేటరీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్.మూర్తి, ఫిజిక్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం పహారి, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఉగాది తర్వాత గొర్రెల పంపిణీ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రెండో విడత గొర్రెల పంపిణీ ఉగాది, శ్రీరామనవమి పండగల తర్వాత చేపడతామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖమంత్రి టి.హరీశ్రావు ప్రకటించారు. గొర్రెల ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ పథకం యూనిట్ వ్యయాన్ని కూడా పెంచుతామన్నారు. ఆదివారం సంగారెడ్డిలో దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం, కురుమ సంఘం భవన నిర్మాణానికి శుంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో హరీశ్రావు మాట్లాడుతూ రూ.300 కోట్లతో హైదరాబాద్లో గొల్ల, కురుమల ఆత్మగౌరవ భవనం నిర్మిస్తున్నామన్నారు. టీడీపీ ప్రభుత్వం గొల్ల, కురుమలను వాడుకుందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు బడ్జెట్లో బీసీల సంక్షేమానికి రూ.2 వేల కోట్లతో సరిపెట్టి, బీసీలకు అన్యాయం చేస్తోందని హరీశ్ విమర్శించారు. కురుమ సామాజిక వర్గంలో బాల్యవివాహాలు ఎక్కువగా జరిగేవని, కల్యాణలక్ష్మి పథకం అమలు చేసిన తర్వాత ఈ బాల్యవివాహాలు బంద్ అయ్యాయన్నారు. రాష్ట్రంలో గొల్ల, కురమలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్ణాటక మాజీ మంత్రి రేవన్న సీఎం కేసీఆర్ను కలిసి గొంగడి కప్పి అభినందించారని హరీశ్రావు గుర్తుచేశారు. ఈ విషయంలో రేవన్నకు ఏఐసీసీ నోటీసులు కూడా జారీ చేసిందన్నారు. సభలో ఎంపీలు బీబీపాటిల్, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, మాణిక్రావు, హెచ్డీసీ రాష్ట్ర చైర్మన్ చింతప్రభాకర్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, గొల్ల కుర్మ సంఘం నేతలు నగేశ్, శ్రీహరి, పాండు తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి హామీ పనుల పరిశీలన
హుస్నాబాద్రూరల్: హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ, మహ్మదాపూర్ గ్రామాల్లో చేపట్టిన ఉపాధి హామీ పనులను శుక్రవారం సీఆర్డీ టెక్నికల్ బృందం పరిశీలించింది. జిల్లెలగడ్డలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అవెన్యూ ప్లాంటేషన్, గ్రామ పంచాయతీ భవన నిర్మాణం, వైకుంఠధామాలు, మొక్కల పెంపకం పనుల నాణ్యతను క్వాలిటీ కంట్రోల్ అధికారులు సంతోష్కుమార్, మమత తనిఖీ చేశారు. అలాగే మహ్మదాపూర్లో చెరువు పనులను పరిశీలించారు. అధికారుల వెంట ఏపీడీ ఓబులేశ్, ఎంపీడీఓ కుమారస్వామి, ఏపీఓ పద్మ, ఈసీ శ్రీనివాస్, సర్పంచ్లు లావుడ్య స్వరూప ఉన్నారు. -
ప్రమాదవశాత్తు ట్రాక్టర్ దగ్ధం
దుబ్బాకటౌన్: సెల్ఫ్ మోటర్లో షార్ట్సర్క్యూట్ సంభవించి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ దగ్ధమైంది. ఈ సంఘటన రాయపోల్ మండలం వీరారెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రైతు కాసరాజు మూడేళ్ల క్రితం పొలం పనుల నిమిత్తం ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. గురువారం సాయంత్రం పొలం దున్ని చెట్టు క్రింద ట్రాక్టర్ నిలిపి పశువుల వద్దకు వెళ్లాడు. తిరిగి వచ్చి ట్రాక్టర్ను ఇంటికి తీసుకెళ్దామని స్టార్ట్ చేయగా సెల్ఫ్ మోటర్లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించడంతో వాటిని ఆర్పేందుకు రాజు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ షేక్ మహబూబ్ తెలిపారు -
బీడీఎల్ ఉద్యోగికి లండన్ రికార్డ్స్లో చోటు
పటాన్చెరు: లండన్కి చెందిన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్లో ప్రముఖ సామాజిక కార్యకర్త, బీడీఎల్ విన్నర్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ రఘు అరికపూడినకు చోటు లభించింది. శుక్రవారం మినిస్టర్స్ కాలనీలో తెలంగాణ రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి జగదీశ్వర్రెడ్డి చేతుల మీదుగా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రశంస పత్రాన్ని, అవార్డ్ను అందుకున్నారు. 35 ఏళ్లుగా ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఆ అవార్డు లభించింది. ఈ సందర్భంగా రఘు మాట్లాడారు. బీడీఎల్లో ఓ సామాన్య కార్మికుడిగా సేవలందిస్తూ దేశంలోని ఎన్నో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సామాజిక కార్యక్రమాలను నిర్వహించానన్నారు. ఇప్పటి వరకు 18 వేల మంది నిరుపేదలకు సాయం అందించినట్లు తెలిపారు. తన సేవలను గుర్తించి అంతర్జాతీయ అవార్డు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఇది మరింత బాధ్యత పెంచిందన్నారు. తనకు సహాయ సహకారాలను అందించిన బీడీఎల్ ఉద్యోగులు, హోప్ ఫర్ స్పందన అభిష్టికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా సమన్వయకర్త డాక్టర్ బింగి నరేంద్రగౌడ్ పాల్గొన్నారని తెలిపారు. -
పాత కక్షల నేపథ్యంలో యువకుడి హత్య
అపటాన్చెరుటౌన్: తన తమ్ముడిని చంపాడనే అనుమానంతో ఓ యువకుడిని హత్య చేసిన సంఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పటాన్చెరు మండలం లకడారం గ్రామానికి చెందిన మ్యాగని రాజు(24) కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మానసను వివాహం చేసుకున్నాడు. అయితే ఇటీవలే మానస పుట్టింటికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో మృతుడు రాజు తండ్రి కిష్టయ్య సంగారెడ్డి రాజంపేట ఇందిరా కాలనీకి చెందిన తన బావమరిది మల్లేశం కు ఫోన్ చేసి కోడలు మానసను తీసుకురమ్మని చెప్పాడు. దీంతో మల్లేశం తన బైక్పై మానస ఇంటికి గురువారం వెళ్లాడు. అప్పటికే అక్కడ మాచర్ల శంకర్ తో పాటు మరికొంతమంది నీవు ఎందుకు వచ్చావని అతని పై దాడి చేశారు. ఈ ఏడాది జనవరి సంక్రాంతి పండగ సమయంలో తన సోదరుడు జగన్ అలియాస్ జోగన్నను రాజు తీసుకెళ్లి తాగించి చంపేశాడని శంకర్ అనుమానం పెంచుకొన్నాడు. మల్లేశంకు ఫోన్ చేసి రాజును పిలవాలని లేదంటే చంపేస్తానని శంకర్ బెదిరించాడు. దీంతో మల్లేశం రాజుకు ఫోన్ చేయించి శుక్రవారం తెల్లవారుజామున పిలిపించారు. అయితే రాజు రాగానే శంకర్తోపాటు మరి కొంతమంది చంపి శవాన్ని కుంటలో పడేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి మామ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మద్యం మత్తులో విద్యుత్ స్తంభం ఎక్కి..
వెల్దుర్తి (తూప్రాన్): మద్యం మత్తులో ఓ యువకుడు విద్యుత్ స్తంభం ఎక్కాడు. వివిద్యుదాఘాతంతో తీవ్రగాయాలై కిందపడ్డాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఎస్ఐ మధుసూదన్గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం శంకరాజ్ కొండాపూర్ గ్రామానికి చెందిన యాట సాయిరాం (24) శుక్రవారం సాయంత్రం వెల్దుర్తి నుంచి తన స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఉప్పులింగాపూర్ గ్రామ శివారులో పోలీసులు వాహన తనిఖీలతోపాటు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారు. ఆ సమయంలో అక్కడకు చేరుకున్న సాయిరాం మద్యం మత్తులో హల్చల్ చేస్తూ పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం ఎక్కాడు. గమనించిన పోలీసులు కిందకు దించి అక్కడి నుంచి పంపించారు. అనంతరం యథావిధిగా తనిఖీలు చేస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత సాయిరాం మళ్లీ తిరిగొచ్చి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభంపైకి ఎక్కి తీగలు పట్టుకోవడతో విద్యుదాఘాతంతో కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని తూప్రాన్ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. అయితే వాహనతనిఖీల సమయంలో సాయిరాం స్కూటీపై వచ్చాడా లేక రోడ్డు పక్కన నిలిపి పోలీసుల దగ్గరకు వచ్చాడా అన్నదానిపై స్పష్టత లేదు. టవరెక్కడం..భయపెట్టడం చిన్నశంకరంపేట(మెదక్): గత ఏడాది కూడా సాయిరాం ఇదే తరహాలో హల్చల్ చేశాడు. 2022 ఆగస్టు 27వ తేదీన సాయిరాం చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ట్రిపుల్రైడ్ వెళుతున్నాడు. వాహన తనిఖీలో భాగంగా అతడి వాహనాన్ని ఆపినా, ఆగకుండా వెళ్లాడు. పోలీసులు వెంబడించడంతో బైక్ వదిలి విద్యుత్ టవర్ ఎక్కి హంగామా చేశాడు. వెంటనే పోలీసులు విద్యుత్ అధికారులను అప్రమత్తం చేసి కరెంట్ సరఫరా నిలిపివేశారు. ఆ తర్వాత సముదాయించి ఇంటికి పంపించారు. విద్యుదాఘాతంతో యువకుడికి తీవ్రగాయాలు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి పోలీసుల వాహన తనిఖీ నేపథ్యంలో హల్చల్ -
పట్టుబడిన వాహనదారులకు జరిమానా
పటాన్చెరు టౌన్: డ్రైంకెన్ డ్రైవ్లో పట్టుబడిన వాహనదారులకు కోర్టు జరిమానా విధించింది. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పటాన్చెరు ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ రెడ్డి అన్నారు. బుధ, గురువారాల్లో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్లో 25 మంది పట్టుబడ్డారు. వారిని శుక్రవారం సంగారెడ్డి కోర్టులో హాజరుపర్చగా జడ్జి 24 మందికి ఒక్కొక్కరికి రూ.2 వేలు, మరో వ్యక్తికి రూ.3 వేల జరిమాన విధించినట్లు పోలీసులు తెలిపారు. తనిఖీల్లో పట్టుబడిన 13 మందికి.. సిద్దిపేటకమాన్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనదారులకు సిద్దిపేట కోర్టు జరిమానా విధించింది. సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా, ఎంపీడీఓ కార్యాలయ చౌరస్తా, రాజీవ్ రహదారిపై సిద్దిపేట ట్రాఫిక్ సీఐ రామకృష్ణ తమ సిబ్బందితో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో 13 మంది పట్టుబడ్డారు. వారిని సిద్దిపేట కోర్టులో హాజరుపర్చగా జడ్జి రమేశ్బాబు రూ.29,500 జరిమానా విధించారు. నగల తయారీ దుకాణంలో అగ్నిప్రమాదం కోహెడరూరల్(హుస్నాబాద్): నగల తయారీ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బస్వాపూర్ గ్రామంలో నగలతయారీ దుకాణంలో గ్యాస్ సిలిండర్ లీకై మంటలు చెలరేగాయి. షాపు యాజమాని లక్ష్మీనారాయణ శుక్రవారం బంగారు ఆభరణాలు తయారు చేస్తుండగా దుకాణంలోని గ్యాస్ సిలిండర్ లీకై మంటలు చెలారేగాయి. దీంతో స్థానికుల సహకారంతో మంటలను ఆర్పివేశారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పిలుచ్చుకున్నారు. బైక్ చోరీ జహీరాబాద్ టౌన్: పట్టణంలోని సాయిరాం నగర్లో కాలనీలో మోటారు బైక్ను చోరీ చేశారు. సాయిరాం నగర్ కాలనీలో నివాసం ఉంటున్న సుదర్శన్ ఏపీ28 డీఆర్8838 నంబర్ గల హీరో గ్లామర్ మోటారు బైక్ ఇంటి ముందు పార్క్ చేశాడు. శుక్రవారం లేచి చూసేసరికి బైక్ కనిపించలేదు. దీంతో బాధితుడు సుదర్శన్ జహీరాబాద్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చోరీకి యత్నించిన వ్యక్తి అరెస్ట్ నర్సాపూర్: నర్సాపూర్లోని ఓ ఏటీఎంలో చోరీ చేసేందుకు యత్నించిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ శివకుమార్ తెలిపారు. పట్టణంలోని బస్టాండ్లోని ఏటీఎంలో గురువారం రాత్రి చోరీ చేసేందుకు ప్రయత్నించాడని ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా విచారణ చేయగా మండలంలోని పెద్దమ్మ తండాకు చెందిన భాస్కర్ ఏటీఎంలో చోరీకి యత్నించినట్లు రుజువుకావడంతో శుక్రవారం అతడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చినట్లు చెప్పారు. -
వ్యక్తి అనుమానాస్పద మృతి
రామాయంపేట(మెదక్): నార్సింగి మండలం శేరిపల్లిలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందగా, ఇది హత్యేనని ఆరోపిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి. శేరిపల్లి గ్రామానికి చెందిన ములుకల కిష్టయ్య (45) అదే గ్రామంలో నూతనంగా నిర్మించిన ఒక ఇంటికి గురువారం రాత్రి జరిగిన విందుకు వెళ్లాడు. రాత్రి 12 గంటల సమయంలో కొందరు కిష్టయ్యను ఆటోలో తెచ్చారు. మాట్లాడేస్థితిలో లేకపోవడంతో అతడిని ఇంటిలో పడుకోబెట్టి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు ఉదయం లేచిచూసే సరికి విగతజీవిగా కనిపించాడు. కిష్టయ్య ముక్కు నుంచి రక్తంకారుతుండటం గమనించారు. ఈవిషయం తెలిసి గ్రామస్తులు మృతుడి ఇంటి వద్దకు తరలివచ్చారు. చనిపోయిన కిష్టయ్య మృతదేహాన్ని ఆటోలో తెచ్చారని కుటుంబ సభ్యులు విలపించారు. మృతదేహాన్ని తీసుకెళ్లి రాత్రి విందు జరిగిన ఇంటికి తీసుకెళ్లేందుకు సిద్ధపడగా, సమాచారం అందుకున్న నార్సింగి ఎస్ఐ నర్సింలు గ్రామానికి వచ్చి వారిని సముదాయించారు. న్యాయం చేస్తామని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ఆసుపత్రికి తరలించాలని సూచించారు. మృతుడి కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్తులు నార్సింగి వచ్చి పోలీస్స్టేషన్ వద్ద నిరసన వ్యక్తంచేశారు. ఎస్ఐ వారిని సముదాయించి రామాయంపేటకు తీసుకురాగా, వారు సీఐ చంద్రశేఖర్రెడ్డితో మాట్లాడారు. సీఐ మృతదేహాన్ని పరిశీలించారు. కిష్టయ్యకు భార్య తిరుపతమ్మ, ఇద్దరు కుమారులున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నర్సింలు తెలిపారు. -
డైరెక్టర్ పదవి పోతుందనే భయంతోనే ఆరోపణలు
రామాయంపేట సహకార సంఘం చైర్మన్ బాదె చంద్రం రామాయంపేట(మెదక్): డైరెక్టర్ పదవి పోతుందనే భయంతోనే రామాయంపేట సహకార సంఘం డైరెక్టర్ దేవుని నర్సింహులు తమపై అవనసర ఆరోపణలు చేస్తున్నారని సంఘం చైర్మన్ బాదె చంద్రం ఆరోపించారు. శుక్రవారం సంఘం వైస్ చైర్మన్ సులోచన, డైరెక్టర్లు సుధాకర్రెడ్డి, లక్ష్మారెడ్డి, రమావత్ లక్ష్మి, లద్ద నిర్మల, భాగ్యలక్ష్మితో కలిసి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దేవుని నర్సింహులుకు ముగ్గురు సంతానం ఉండటంతో బచ్చురాజ్పల్లి నరేందర్ డీసీఓకు ఫిర్యాదు చేశారని, అధికారుల విచారణలో అది వాస్తవమేనని తేలిందన్నారు. తన డైరెక్టర్ పదవి పోతుందనే భయంతోనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి రూ.20 లక్షలు దుర్వినియోగమైనట్లు నర్సింహులు చేసిన ఆరోపణలు తప్పని, గోనె సంచులు కొనుగోలు చేసే అధికారం తమకు లేదని స్పష్టంచేశారు. ఏటా గోనె సంచులు సవిల్ సప్లయి కార్యాలయం నుంచి తమకు వస్తాయని, మిగిలిన సంచులు తాము అధికారులకు అప్పగించామన్నారు. నిధులు దుర్వినియోగానికి పాల్పడితే ఏశిక్షకై నా సిద్ధమేనని బాదె చంద్రం ప్రకటించారు. -
ఇంటి నుంచి వెళ్లి చెరువులో శవమై..
మెదక్ మున్సిపాలిటీ: ఇంటి నుంచి వెళ్లిన యువకుడు చెరువులో చెరువులై శవమై కనిపించాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ పట్టణంలోని అజంపురా వీధికి చెందిన మహ్మద్ మోహిన్(24) ఈనెల 20వ తేదీన ఇంటి నుండి వెళ్లిపోయాడు. దీంతో అతడి కుటుంబీకులు పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం పట్టణ శివారులోని గోసముద్రం చెరువులో ఓ గుర్తు తెలియని శవం తేలింది. గొర్రెల కాపరుల ద్వారా విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మహమ్మద్ మోహిన్ కుటుంబీకులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడికి చేరుకుని మృతుడు ధరించిన దుస్తుల ఆధారంగా మహ్మద్ మోహిన్గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వాహనం అడుగు భాగంలో మంటలు
అప్రమత్తమైన పెట్రోల్ బంక్ సిబ్బంది ఫైర్ గ్యాస్తో మంటలు ఆర్పిన వైనం మద్దూరు(హుస్నాబాద్): మండల కేంద్రంలోని హెచ్పి పెట్రొల్ బంక్లో డిజిల్ పోసుకుంటున్న టాటా ఏస్ వాహనం నుంచి మంటలు చెలరేగాయి. గమనించిన పెట్రోల్ బంక్ నిర్వాహకులు ఫైర్గ్యాస్తో మంటలను ఆర్పివేశారు. ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రేబర్తి గ్రామానికి చెందిన టాటా ఏస్ ట్రాలీ వాహనం పత్తి లోడ్తో వచ్చింది. డీజిల్ నింపుతున్న క్రమంలో వాహనం కింది నుంచి మంటలు చెలరేగాయి. గమనించిన నిర్వాహకులు వెంటనే మంటలు ఆర్పారు. మంటలను చూసినవారంతా పరుగులు తీశారు. అనంతరం బంక్ నిర్వాహకులు మాట్లాడుతూ పెట్రోల్ నింపే సమయంలో సెల్ఫోన్ మాట్లాడకూడదని, ఆ క్రమంలోనే ప్రమాదం సంభవించిందన్నారు. -
యువకుడి హత్య
తమ్ముడిని చంపాడనే అనుమానంతో ఓ యువకుడిని హత్య చేసిన సంఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 8లో బైక్పై వెళ్లే పరిస్థితి లేదు బైక్మీద రోడ్డుపైకి రావాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. వీధుల్లో కుక్కలు వాహనాల వెంట పడుతున్నాయి. దీంతో ప్రమా దాలు జరుగుతున్నాయి. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి. – గోపి, రామచంద్రాపురం పిల్లలను పంపాలంటే అంబర్పేట ఘటన తర్వాత చిన్నారులను బయటకు పంపాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఏ వీధిలోకి వెళ్లినా వీధి కుక్కల బాధ తప్పడం లేదు. – మురళీకృష్ణ, రామచంద్రాపురం వీధి కుక్కలను నివారించాలి వీధి కుక్కల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలి. గతంలో కన్నా ప్రస్తు తం వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగింది. వాటిని పూర్తిస్థాయిలో నియంత్రించారు. – నాగరాజు గౌడ్, బీడీఎల్ కాలనీ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం వీధి కుక్కల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. సంబంధిత శాఖకు సంబంధించినవారు కుక్కలను ఎప్పటికప్పుడు తీసుకొని వెళుతున్నారు. – బాలయ్య, జీహెచ్ఎంసీ ఉపకమిషనర్ -
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
సంగారెడ్డిటౌన్: జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి అధికారులకు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తనచాంబర్లో సివిల్ సప్లై అధికారులు, కాంట్రాక్టర్లు, రైస్మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ యాసంగిలో 2,07,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశామన్నారు. అందుకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయి శిక్షణ, గన్నీల ముందస్తు ఏర్పాట్లు, మిల్లులకు ధాన్యం కేటాయింపు, ధాన్యం నిల్వ ఏర్పాటుపై మిల్లర్లకు ఆదేశాలు జారీ చేశారు. యాసంగి ధాన్యంపై అదనపు కలెక్టర్ వీరారెడ్డి -
ప్రభుత్వాస్పత్రుల్లోనే ప్రసవాలు జరగాలి
సంగారెడ్డి టౌన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో 95 శాతం ప్రసవాలు జరిగేలా ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ శరత్ అన్నారు. శుక్రవారం జిల్లావైద్య,ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గర్భిణీని ఏఎన్ఎం తప్పనిసరిగా 12 వారాల లోపు నమోదు చేయించి, క్రమం తప్పకుండా నిర్ణీత వ్యవధిలో పరీక్షలు చేయించాలన్నారు. ప్రభుత్వాస్పత్రిలోనే ప్రసవాలు జరిగేటట్టు ప్రోత్సహించాలన్నారు. పుట్టిన ప్రతి శిశువుకు వారి వయసు ఆధారంగా సకాలంలో టీకాలు వేయించాలని ఆదేశాలు జారీ చేశారు. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి టీం రోజు 250 మందిని పరీక్షించాలన్నారు. దగ్గరచూపు.. దూరపుచూపు వారికి అద్దాలను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ గాయత్రీదేవి, ప్రోగ్రాంఆఫీసర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 95శాతం చేరేలా ప్రణాళిక సిద్ధం చేయాలి: కలెక్టర్ -
ఎస్డీఎఫ్.. స్లో..!
నిధులున్నా.. ముందుకుసాగని పనులు.. కాంట్రాకర్లకు కలిసొచ్చేపనులే ఎంపిక.. సీఎం కేసీఆర్ ప్రత్యేకంగామంజూరు చేసిన నిధుల తీరిది సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా మంజూరు చేసిన స్పెషల్ డవలప్మెంట్ ఫండ్స్ (ఎస్డీఎఫ్) వినియోగం అస్తవ్యస్తంగా సాగుతోందనే ఆరోపణలున్నాయి. ఈ నిధులతో చేపట్టిన పనులు ఆశించిన మేరకు ముందుకు సాగడం లేదు. పరిపాలన అనుమతులు మంజూరు చేసి ఆరు నెలలు దాటింది. అయినా ఇంకా చాలా చోట్ల పనులు అసలు ప్రారంభానికే నోచుకోలేదు. రూ.371.40 కోట్లతో పనులు ఎస్డీఎఫ్ కింద ప్రభుత్వం ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.20 లక్షల చొప్పున, మున్సిపాలిటీలకు రూ.20 కోట్లు మంజూరు చేసింది. సంగారెడ్డి, జహీరాబాద్ మున్సిపాలిటీలకు రూ.50 కోట్ల చొప్పున మంజూరయ్యాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం రూ.371.40 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు గత ఏడాది జూలైలో ఈ పనులకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఆయా వార్డుల్లో తిరిగి క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పనులను ఎంపిక చేయాల్సి ఉండగా, ఆయా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మొక్కుబడిగా తిరిగి పనులను ఎంపిక చేశారు. ఆ మూడు పనులకే ప్రాధాన్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబందించిన పనులను ఎంపిక చేయాల్సి ఉండగా, చాలా చోట్ల కాంట్రాక్టర్లకు కలిసొచ్చే పనులు సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం వంటి వాటికే ప్రాధాన్యం ఇచ్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువమంది బీఆర్ఎస్కు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే ఈ పనులను పంచుకున్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో కౌన్సిలర్లు ఈ పనుల కోసం ఏకంగా వాగ్వావాదాలకు దిగిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇదీ పనుల ప్రగతి.. అన్ని గ్రామ పంచాయతీల్లో రూ.121.40 కోట్ల అంచనా వ్యయంతో 2,478 పనులు చేపట్టారు. ఇప్పటి వరకు కేవలం 189 పనులకు సంబంధించి రూ.8.88 కోట్ల మేరకు మాత్రమే పనులు జరిగాయి. అన్ని మున్సిపాలిటీల్లో కలిపి రూ.250 కోట్లతో 939 పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో ఇప్పటి వరకు కేవలం రెండే పనులకు రూ.94 లక్షలు మాత్రమే వినియోగించుకోగలిగారు. పనులు జరుగుతున్నాయి..: జగదీశ్వర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, పీఆర్ ఎస్డీఎఫ్లో చేపట్టిన పనులు కొనసాగుతున్నాయి. ఆయా స్థానిక సంస్థల తీర్మానాల మేరకు నామినేషన్పై పనులు అప్పగించాం. పలు గ్రామాల్లో పనులు చేసేది ఒకరిద్దరే కావడంతో ఆయా చోట్ల కొన్ని పనులు ప్రారంభించాల్సి ఉంది. ‘‘ప్రతి గ్రామ పంచాయతీకి రూ.20 లక్షలు, మున్సిపాలిటీలకు రూ.20 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నా.. ఈ భారీ మొత్తంలో మంజూరు చేస్తున్న ఈ ప్రత్యేక నిధులను సద్వినియోగం చేసుకోండి. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి క్షేత్రస్థాయిలో తిరిగి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ఖర్చు చేయండి.’’ – గత ఏడాది నారాయణఖేడ్లో జరిగిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ చెప్పిన మాటలివి. -
వీధికుక్కల దాడిలో జింకకు గాయాలు
కంది(సంగారెడ్డి): వీధికుక్కల దాడిలో ఓ జింక తీవ్రంగా గాయపడింది. ఇంద్రకరణ్ ఎస్ఐ రాజేష్నాయక్ కథనం ప్రకారం...మండల పరిధిలోని తోపుగొండ సమీపంలో శుక్రవారం నీరు తాగేందుకు ఓ జింక వచ్చింది. వీధికుక్కలు ఒక్కసారి దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. గమనించిన గ్రామస్తులు కుక్కలను తరిమి అటవీఅధికారులతోపాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాయపడిన జింకను పశువైద్యశాలకు తరలించి అటవీఅధికారులు చికిత్స చేయించారు. గ్రామాల్లో వీధుల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉందని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. వీధుల్లో చిన్నపిల్లలు తిరగడానికి ఇబ్బంది పడుతున్నారని, కుక్కల బెడదను అరికట్టాలని కోరారు.