సంగారెడ్డికి మెట్రో వేయండి.. | MLA Jagga Reddy Demands Of Metro Rail Services Up To Sangareddy | Sakshi
Sakshi News home page

సంగారెడ్డికి మెట్రో వేయండి..

Feb 13 2023 1:31 AM | Updated on Feb 13 2023 1:31 AM

MLA Jagga Reddy Demands Of Metro Rail Services Up To Sangareddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మియాపూర్‌ నుంచి సంగారెడ్డి రాంమందిర్‌ మీదుగా సదాశివపేట వరకు మెట్రో రైలును మంజూరు చేయాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం కేసీఆర్‌ను కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం శాసనసభలో కేసీఆర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. తన వినతి పట్ల సీఎం సానుకూలంగా స్పందించారని, ఈ మెట్రోలైన్‌ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారని జగ్గారెడ్డి విలేకరులకు తెలిపారు.

అదే విధంగా గ్రూప్‌–1 మెయిన్స్‌కు 1:50 కాకుండా 1:100 నిష్పత్తిలో అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని సీఎంను కోరగా, ఇందుకు కూడా ఆయన సానుకూలంగా స్పందించారని ఆయన వెల్లడించారు.  సంగారెడ్డి నియోజకవర్గంలో బాలురు, బాలికల ఉన్నత పాఠశాలలు, కళాశాలలు, హాస్టల్‌ భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. ఈ మేరకు అసెంబ్లీ లాబీల్లోని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చాంబర్‌లో ఆదివారం ఆమెను కలిసి వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement