Jagga Reddy
-
రాహుల్ గాంధీపై బండి సంజయ్ వ్యాఖ్యలకు జగ్గారెడ్డి కౌంటర్
-
ఖజానా ఖాళీ.. తలలు పట్టుకుంటున్న సీఎం,డిప్యూటీ సీఎం
సాక్షి,హైదరాబాద్ : కేసీఆర్ ఖజానా ఖాళీ చేశారు. ఇప్పుడు నిధులు సర్దుబాటు చేయలేక సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తలలు పట్టుకుంటున్నారని’ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ ,కిషన్ రెడ్డి కోతల రాయుళ్లు.ఐటీఐఆర్ తీసుకొచ్చి బీజేపీ నేతలు మాట్లాడాలి. నేనేంటో,నా పనితనం ఏంటో రాష్ట్ర నేతలకు, ఎంపీ రాహుల్ గాంధీ, ఏఐసీసీ నేతలకు తెలుసు. నా అవసరం అనుకుంటే జగ్గారెడ్డికి పదవి ఇస్తారు. జగ్గారెడ్డి పదవి ఉన్నా ..లేకున్నా పార్టీ కోసం పనిచేస్తూనే ఉంటాడు.బీజేపీ నేతలు సీఎం రేవంత్ను రెచ్చగొట్టి తిట్టించుకుంటారు. ఎన్నికలకు చాలా సమయం ఉంది.. పింక్ బుక్ అంటూ రెచ్చగొట్టకు కవిత. కేసీఆర్ ఖజానా ఖాళీ చేశారు. నిధులు సర్దుబాటు చేయలేక మా సీఎం, డిప్యూటీ సీఎం తలలు పట్టుకుంటుంన్నారు.వరంగల్కు రావాలంటే రాహుల్ గాంధీ భయపడతారా?..రాహుల్ గాంధీ ఓంట్లోనే భయం లేదు.. కన్యాకుమారి టూ కాశ్మీర్ పాదయాత్ర చేశారు. కేసీఆర్ కనీసం పది కిలోమీటర్లు పాదయాత్ర చేయగలరా? ఐటీఐఆర్ కోసం అవసరం అయితే కిషన్ రెడ్డి, బండి సంజయ్ను కలుస్తా. ఐటీఐఆర్ ద్వారా వేల ఉధ్యోగాలు తెలంగాణ నిరుద్యోగులకు వస్తాయి’ అని అన్నారు. -
రేవంత్ రెడ్డి పేరును మరిచిపొయ్యిన లీడర్
-
ఇదేం రాజకీయం.. తెలంగాణలో బీజేపీ బలమెంత?: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. భారత్ మాతాకీ జై అనే బీజేపీ నాయకులు.. భారతమాత కూతురు ప్రియాంకా గాంధీని తిడితే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో తెలంగాణలో బీజేపీ బలమెంతా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.తాజాగా జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘బీజేపీ నాయకులు ప్రియాంక గాంధీపై అనుచిత వాఖ్యలు చేయకపోతే బీజేపీ ఆఫీసుకి పోవాల్సిన అవసరం మాకేంటి?. మా ఇంటి ఆడబిడ్డలను తిడితే మనం ఊరుకుంటామా. ప్రియాంక గాంధీని తిడితే ఎందుకు ఊరుకోవాలి. మా యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీసుకు పోవడాన్ని పీసీసీ చీఫ్ తప్పు పట్టారు. కాంగ్రెస్ నేతలు మా లైన్ దాటితే మేం పెద్ద మనసుతో సర్ది చెప్పుకున్నాం.కేంద్ర మంత్రి బండి సంజయ్ రెచ్చగొట్టేలా గాంధీ భవన్ వెళ్లి దాడి చేసి తగల పెట్టండి అని మాట్లాడుతున్నారు. బీజేపీ సంస్కారం ఏంటో, కాంగ్రెస్ సంస్కారం ఏంటో బయటపడింది. సెంట్రల్ మినిస్టర్స్ వాళ్ళ కార్యకర్తలకు సర్ది చెపుతారా? రెచ్చ గొడుతారా?. బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. భారత్ మాతాకీ జై అనే బీజేపీ నాయకులు భారతమాత కూతురు ప్రియాంకా గాంధీని తిడితే ఊరుకుంటారా?. మా వాళ్లని కొట్టడానికి బీజేపీ నాయకులు అంత పెద్ద తోపులా?. మా యూత్ కాంగ్రెస్ వాళ్లని ఎందుకు రెచ్చగొడుతున్నారు?. తెలంగాణలో బీజేపీ బలం ఎంత?. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులపై దాడి చేసేంత బలం బీజేపీకి ఉందా?. మేం మా కార్యకర్తలకు ఏం చెప్తున్నాం? మీరు మీ కార్యకర్తలకు ఏం చెప్తున్నారు?. ప్రియాంక గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు బీజేపీ నాయకులు క్షమాపణ చెప్పాలి.డీకే అరుణ, రాజాసింగ్కు కౌంటర్..డీకే అరుణ తప్పుడు మార్గంలో వెళ్తున్నారు. ప్రియాంక గాంధీని అవమానించిన బీదూరిని డీకే అరుణ సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. అలాగే, రాజాసింగ్కి బీజేపీ ఆఫీసులోకి ఎంట్రీనే లేదు. రాజాసింగ్ డైలాగులు కొట్టడం మానుకోవాలి. ఆయన కంటే పెద్ద డైలాగులు మేము కూడా కొట్టగలం. రాజాసింగ్ ఏమైనా మాట్లాడుకోవచ్చు.. కానీ, కాంగ్రెస్ పార్టీ, నేతలపై మాట్లాడుతా అంటే నడవదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
అంబేద్కర్ వల్లే మోదీ, అమిత్ షాకు పదవులు: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. ఇదే సమయంలో అంబేద్కర్ రాజ్యాంగం వేరు.. భగవంతుడు వేరు అన్న విషయం అమిత్ షా గుర్తించాలి అంటూ కామెంట్స్ చేశారు.తాజాగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘అంబేద్కర్ను అమిత్ షా అవమానించిన విధానంపై రాహుల్ గాంధీ గళం విప్పారు. పార్లమెంట్ నిండు సభలో అంబేద్కర్ను అవమానించేలా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొనే వరకు రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారు. చట్టాలు, న్యాయాలు అంబేద్కర్ రాజ్యాంగం వల్లే ఉన్నాయి. బీసీలుగా చెప్పుకొనే మోదీ, అమిత్ షా కూడా అంబేద్కర్ రాజ్యాంగం వల్లే పదవులు పొందారు.అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశ ప్రజల భావాలు దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారు. రాహుల్ గాంధీ బాధ్యత.. గాంధీ, నెహ్రూ అడుగుజాడల్లో నడవటం. అంబేద్కర్ రాజ్యాంగం వేరు భగవంతుడు వేరు అనే విషయం అమిత్ షా గుర్తించాలి. అమిత్ షా, రాహుల్ గాంధీకి తేడా.. రాహుల్ గాంధీ దేవుని మొక్కుతాడు కానీ పబ్లిసిటీ చేయరు. బీజేపీ నేతలు కూడా దేవుడ్ని మొక్కతారు కానీ, పబ్లిసిటీ చేసుకుంటారు. దేవుడు అనేది నమ్మకం ధైర్యం.. భగవంతుడు అనేది వ్యక్తిగత విషయం. కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ గాంధీ పిలుపునకు సిద్ధంగా ఉంటారు’ అని కామెంట్స్ చేశారు. -
ప్రధాని మోదీకి ఎటువంటి విజన్ లేదు: జగ్గారెడ్డి
-
AICC కార్యదర్శి విష్ణుపై జగ్గారెడ్డి ఫైర్
-
కాంగ్రెస్ను చంపేస్తారా?.. ఏఐసీసీ కార్యదర్శిపై జగ్గారెడ్డి ఫైర్
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ కార్యదర్శి విష్ణుపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. ఇన్ఛార్జ్లు పార్టీని చంపేయాలని చూస్తున్నారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రాత్రి ఓ ఫంక్షన్లో ఏఐసీసీ కార్యదర్శిపై ఆయన మాటల దాడి చేశారు. ఇంతకీ మీరు ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్నారా..? వేరే రాష్ట్రం వెళ్ళిపోయారా..? అంటూ జగ్గారెడ్డి ప్రశ్నించారు.మెదక్ జిల్లా కూడా నేనే చూస్తున్నానంటూ విష్ణు చెప్పగా, పార్టీ ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షీ కూడా ఉన్నారా.. వేరే రాష్ట్రం పోయారా..?. అధికార పార్టీ అంటే ఎలా ఉండాలి? మీరేం చేస్తున్నారో అర్థం అవుతుందా? అంటూ జగ్గారెడ్డి నిలదీశారు. కొత్త వాళ్లకు పదవులు సిఫార్సు చేస్తున్నారు. వారు ఫైనల్ అయ్యే వరకు కూడా మాకు తెలియడం లేదంటూ కార్యదర్శికి జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: లగచర్ల రైతుకు సంకెళ్లు.. సీఎం రేవంత్ సీరియస్ -
కేటీఆర్.. కాంగ్రెస్ ముందు నీ అనుభవమెంత?: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ కల్పవృక్షం లాంటిది. కేటీఆర్, హరీష్ రావు కోతల రాయుళ్లు అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అలాగే, కాంగ్రెస్ వ్యూహాల ముందు కేటీఆర్ ఆలోచన, అనుభవం ఎంత? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ఇవ్వడం వల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని చెప్పుకొచ్చారు.కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టి మీ(బీఆర్ఎస్) నెత్తి మీద పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్ళతో పెకలిస్తామని అంటారా?. అధికారంలో ఉన్నా.. లేకున్నా కాంగ్రెస్ నేతలందరూ గంభీరంగానే ఉంటారు. కేటీఆర్, హరీష్ రావు కోతలు కోసే కోతల రాయులు. కాంగ్రెస్ పార్టీ కల్పవృక్షం లాంటిది. కాంగ్రెస్ పార్టీ లాంటి మర్రి చెట్టును కేటీఆర్ పీకేస్తా అనడం సాధ్యమా?.కేటీఆర్ వయసు ఎంత? కాంగ్రెస్ వయసు ఎంత?. కాంగ్రెస్ వ్యూహాల ముందు కేటీఆర్ ఆలోచన, అనుభవం ఎంత?. కాంగ్రెస్ పార్టీ వయసులో కేటీఆర్ వయసు పావు వంతు. రాజకీయం కోసం నిందలు వేయడాన్ని కూడా మేం తప్పు పట్టడం లేదు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ లేదా టీడీపీ ప్రభుత్వం ఏర్పడేది. రాష్ట్రం రావడం వల్లే కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. మా పాలనపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు.బీఆర్ఎస్ పార్టీ ఇంకో ఇరవై ఏళ్తు ప్రతిపక్షంగా కొనసాగాలి. కాంగ్రెస్ వ్యూహాలు అంతుచిక్కవు. మా వ్యూహాలు ఎవరికి అర్థం కావు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బ్యూరోక్రాట్స్ సంతోషంగా నిద్రపోయే రోజులు వచ్చాయి. అధికారులను మానసికంగా కుంగదీసి కలెక్టర్లను మోకాళ్లపై కూర్చోపెట్టిన ఘనత బీఆర్ఎస్ నాయకులది. ఈ భూమి మీద మనుషులు ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. దేశంలో ఉన్న అనేక రాజకీయ పార్టీలు కాంగ్రెస్ అధికారంలోకి రావాలి.. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాయి’ అని కామెంట్స్ చేశారు. -
మా తడాకా చూపిస్తాం.. జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: కలెక్టర్ను చంపాలని బీఆర్ఎస్ కుట్ర చేసిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కలెక్టర్ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి ఆయనన కాపాడారన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పథకం ప్రకారమే కలెక్టర్పై దాడి జరిగిందన్నారు. పదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రజలపై బీఆర్ఎస్ దాడులు చేసిందన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి బీఆర్ఎస్ కార్యకర్తలతో అధికారులపై దాడులు చేస్తున్నారు. దాడులకు ప్రతి దాడులు ఉంటాయి. అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకునేది లేదు. బీఆర్ఎస్ నేతలకు మా తడాకా ఏంటో చూపిస్తాం’’ అంటూ హెచ్చరించారు.మరోవైపు, బీఆర్ఎస్ అరాచక శక్తులతో కలిసి కుట్రపూరితంగా దళిత, గిరిజన రైతులను రెచ్చగొట్టి లగచర్లలో జిల్లా కలెక్టర్, ఆర్డీవో స్థాయి అధికారిపై దాడి చేయించిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు తలకిందులుగా తపస్సు చేసినా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపర్చలేరని చెప్పారు. లగచర్ల ఘటనలో నిందితుల కాల్ డేటాను సేకరించగా, బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థి ఉన్నట్టు తేలిందన్నారు. దీని వెనుక ఎంతటి పెద్దవారున్నా ఉపేక్షించేది లేదని, చట్టప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఏ కేసులోనైనా అరెస్ట్ కావొచ్చు.. పోరాటాలకు సిద్ధమవ్వండి: కేటీఆర్ -
‘మా సోషల్ మీడియాను రంగంలోకి దింపుతాం’
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ సోషల్ మీడియా దండుపాళ్యం ముఠాలా తయారైందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులకు పిచ్చిపట్టిందని ఎద్దేవా చేశారు. శనివారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే కేటీఆర్, హరీశ్రావు పనిగా పెట్టుకున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా చర్యలతో కేటీఆర్, హరీశ్రావులు తిట్లు తింటుంన్నారు. అమెరికా, సింగపూర్ల నుంచి సోషల్ మీడియా నడపడం కాదు. దమ్ముంటే ధైర్యంగా ముందుకు రండి. సమస్యలపై పోరాడితే తప్పులేదు. కానీ వ్యక్తిగత అంశాలపై బీఆర్ఎస్ సోషల్ మీడియా ట్రోల్ చేస్తుంది. ..బీఆర్ఎస్ హాయాంలో ఇద్దరు కలెక్టర్లకు పది సార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు. తిట్టినా.. తప్పేంటి? నేను తిట్టింది గత ప్రభుత్వంలో ఇప్పుడు కాదు. సీఎం వ్యాఖ్యలు అననివి అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి ఫైటర్స్. బీఆర్ఎస్ నేతలు ఇలానే వ్యవహరిస్తే.. మా సోషల్ మీడియాను రంగంలోకి దింపుతాం’’ అని అన్నారు. -
జీవన్రెడ్డికి యాష్కీ, జగ్గారెడ్డి మద్దతు
సాక్షి, హైదరాబాద్: జగిత్యాల నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత టి. జీవన్రెడ్డికి ఆ పార్టీలోని పలువురు నేతలు బహిరంగంగా మద్దతు పలుకుతున్నారు. అనుచరుడి హత్యతో తీవ్ర ఆవేదనలో ఉన్న ఆయన్ను టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ హైదరాబాద్లోని జీవన్రెడ్డి నివాసంలో శుక్రవారం కలిసి పరామర్శించారు. అనుచరుడి హత్యకు సంబంధించిన వివరాలు తెలుసుకొని సానుభూతి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో జీవన్రెడ్డి కాంగ్రెస్ పారీ్టకి ఎనలేని సేవ చేశారని... ఆయన సేవలు పారీ్టకి మరింత అవసర మని అభిప్రాయపడ్డారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పార్టీ ఎమ్మెల్యేలు ఓడిపోయినా ఆ తర్వాత జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్రెడ్డి గెలిచారని గుర్తుచేశారు. అప్పుడే ఆయనకున్న ప్రజాబలం ఏమిటో అర్థమైందన్నారు. జీవన్రెడ్డిని పార్టీ కాపాడుకుంటుందని.. ప్రస్తుత రాజకీయ పరిణామాలతోపాటు ప్రభుత్వ పాలనలో ఆయన తెలిపిన అభ్యంతరాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని యాష్కీగౌడ్ చెప్పారు. ఆయన ఆవేదన చూసి బాధపడ్డా: జగ్గారెడ్డి జీవన్రెడ్డి ఆవేదనపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా స్పందించారు. జీవన్రెడ్డి ఆవేదన చూసి తాను చాలా బాధపడ్డానని.. మనసు కలుక్కుమందని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘మీకు అండగా ఉన్నానని చెప్పడానికి ఈ ప్రకటన మీడియా ద్వారా చేస్తున్నా. నేను ఎవరినీ తప్పుబట్టట్లేదు. కానీ పారీ్టలో మీరు ఒంటరినని అనుకోవద్దు. సమయం వచ్చినప్పుడు నేను మీ వెంట ఉంటా. ఎప్పుడూ జనంలో ఉండే మిమ్మల్ని జగిత్యాల, సంగారెడ్డి ప్రజలు ఎందుకు ఓడించారో అర్థం కావట్లేదు. మీ సమస్యకు అధిష్టానం పరిష్కారం చూపాలని సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాం«దీని కోరుతున్నా’అని జగ్గారెడ్డి ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు -
హరీష్.. కేసీఆర్ను తీసుకొచ్చే కెపాసిటీ ఉందా?: జగ్గారెడ్డి సవాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పటికే ఇరు పార్టీల నేతలు ఆరోపణలు చేసుకున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సవాల్ విసిరారు. రుణమాఫీకి సిద్దమా? అని చాలెంట్ చేశారు.మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘రుణమాఫీపై హరీష్ రావుకు సవాల్ చేస్తున్నాను. రుణమాఫీపై చర్చకు బీఆర్ఎస్ సిద్దామా?. రుణమాఫీపై చర్చకు మల్లిగాడు, ఎల్లిగాడు కాకుండా కేసీఆర్ రావాలి. సీఎం రేవంత్ను ఒప్పించి చర్చకు నేను తీసుకువస్తాను. కేసీఆర్ను ఒప్పించి చర్చకు తీసుకువచ్చే కెపాసిటీ హరీష్కు ఉందా?. మాతో చర్చకు మీకు భయంగా ఉంటే.. సిద్దిపేటలోనే చర్చ పెట్టండి.రుణమాఫీ విషయంలో పబ్లిసిటీ చేయడంలో మేము ఫేయిల్ అయ్యాం. కానీ, బీఆర్ఎస్ మాత్రం పబ్లిసిటీలో పాస్ అయ్యింది. సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ కాలేదని మేమే చెబుతున్నాం. దీనిపై హరీష్ రావు సహా, బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు. ఆర్థిక శాఖను కేసీఆర్ దివాలా తీశారు. బీఆర్ఎస్ పాలన సమయంలో ఎనిమిది కిస్తీల్లో లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయలేకపోయారు. మేం పబ్లిసిటీ దగ్గర ఫెయిల్ అయ్యాం. రుణ మాఫీ అందని రైతులకు ఏ కారణాల వల్ల అందలేదో వివరాలు తెప్పించమని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు’ అని చెప్పుకొచ్చారు. ఇది కూడా చదవండి: రేవంత్.. ముందు రెడ్డికుంటలో నీ ఇల్లు కూల్చేవేయ్: కేటీఆర్ -
బీఆర్ఎస్ నేతలు సురేఖకు క్షమాపణలు చెప్పాలి: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: రైతుల గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదన్నారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. రాజకీయ పరిపూర్ణత లేని నాయకుడిగా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. కొండా సురేఖపై ఇలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదంటూ హితవు పలికారు.మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి కొండా సురేఖను రెచ్చగొట్టి కేసీఆర్, కేటీఆర్లు విమర్శలు చేయించుకుంటున్నారు. వ్యక్తిగత జీవితంలోకి వెళ్లి విమర్శలు చేసుకోవడం పద్దతి కాదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్రావులకు దండలు వేసిన వాళ్లందరినీ అలానే అనుకుంటారా?. రాజకీయ పరిపూర్ణత లేని నాయకుడిగా కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నాడు. కొండా సురేఖకు ఇప్పటికైనా క్షమాపణలు చెప్పి.. ఇప్పటికైనా ఈ వివాదాన్ని బీఆర్ఎస్ ఆపాలి.తెలంగాణలో రుణమాఫీ 18వేల కోట్లు మాఫీ చేశాం. డేటా సరిగా లేకపోవడంతో మిగిలిన రుణమాఫీ చేయలేకపోయాం. రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కేసీఆర్ వదిలి వెళ్లారు. తెలంగాణ బీజేపీకి పట్టు లేదు. కాబట్టి ఉనికి కోసం బీజేపీ రైతు దీక్షతో ప్రయత్నాలు చేసింది. రైతుల గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదు. ప్రధాని మోదీ ప్రతీ పేద వాడి అకౌంట్లో 2లక్షలు వేస్తా అన్నారు. పదేళ్లు ప్రధానిగా ఉండి ఎందుకు చేయలేదు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు.. చేయలేదు. రైతుల ఆదాయం డబుల్ చేస్తాం అన్నారు, చేశారా?. రైతు నల్ల చట్టాలు తెచ్చింది మీరు కదా?.రైతుల మీదకు వెహికల్తో చంపింది మీరు కదా.. ఎప్పుడు ఎందుకు బీజేపీ రాష్ట్ర నాయకులు మాట్లాడలేదు. ధరలు పెరిగినా ప్రజలు ఓట్లు వేసి 8 సీట్లు ఇచ్చేసరికి.. బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలకు కళ్ళు నెత్తికి ఎక్కాయి. బీజేపీ నేతలు నటిస్తున్నారు.. డ్రామా ఆర్టిస్టులు. తెలంగాణ రైతులకు మా విజ్ఞప్తి. రేవంత్ సర్కార్ చేసే ప్రయత్నాలకు అండగా ఉండండి. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ కుటుంబం గురించి తెలుసు. దేశాన్ని 52 ఏళ్ల పాటు రాహుల్ గాంధీ కుటుంబం పాలించింది. మీ మాదిరి రాహుల్ గాంధీ కుటుంబం అని భావించకండి. గాంధీ కుటుంబం మీద పగా పట్టిన మోదీ.. సభ్యత్వం రద్దు చేసి ఆయన ఉండే బంగ్లా ఖాళీ చేయించారు. రాహుల్ గాంధీ చరిత్ర తెలుసుకో.. ఎందుకు నోరు పారేసుకుంటున్నావు కేటీఆర్. మూసీ సుందరీకరణ డబ్బుతో రాహుల్ గాంధీ బతుకుతాడా?. దీంతో, ఏమైనా అర్థం ఉందా?’ అని ప్రశ్నించారు.ఇది కూడా చదవండి: వాళ్లు ఆడబిడ్డలు కాదా.. మంత్రి కొండా సురేఖకు సబిత కౌంటర్ -
అట్లుంటది.. జగ్గారెడ్డితో!
-
రెచ్చగొడితే.. నాలుక కోస్తాం: జగ్గారెడ్డి
సాక్షి హైదరాబాద్: కాంగ్రెస్ కార్యకర్తల్ని ఎందుకు రెచ్చగొడుతున్నారు? రేవంత్రెడ్డిని తిడితే మా కార్యకర్తలు వాళ్ల నాలుకలు కోస్తారంటూ ఆ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం ఆయన గాంధీభవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ను చెడ్డగొట్టాలని బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారంటూ మండిపడ్డారు.‘‘రేవంత్ను ఎవరైనా పనికిమాలిన వాడు అంటే సహించేది లేదు. సీఎంపై కేసీఆర్, కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుకు కోస్తాం. బీఆర్ఎస్ నేతలు.. హైదరాబాద్ ప్రజల మూడ్ను ఖరాబ్ చేశారు. గాంధీ, కౌశిక్ రెడ్డి వ్యవహారం బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారం. వినాయక నిమజ్జనం కోసం కష్టపడుతుంటే.. బీఆర్ఎస్ అనవసర పంచాయతీలు చేస్తున్నారు. వినాయక నిమజ్జనం కార్యక్రమాన్ని డిస్టబ్ చేయాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది’’ అంటూ జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: హైదరాబాద్ ప్రజలపై సీఎం రేవంత్ పగ: కేటీఆర్‘‘పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కండువాలు కప్పే సాంప్రదాయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేదు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కొత్త సాంప్రదాయాని కేసీఆర్ తెరలేపాడు. 2014-18 వరకు కాంగ్రెస్ ఎంపీలు 4, ఎమ్మెల్యేలు 25, ఎమ్మెల్సీ 18 మందిని బీఆర్ఎస్లో చేర్చుకున్నప్పుడు బీఆర్ఎస్ నేతలు ఎందుకు మాట్లాడలేదు?. పార్టీ మారిన వారికి మంత్రి పదవి ఇచ్చింది కేసీఆర్ కాదా.. పార్టీ ఫిరాయింపులకు ఆధ్యుడు కేసీఆర్ కాదా.. శాసన పక్షాన్ని విలీనం చేసుకునే కుట్రకు కేసీఆర్ కారణం. కేటీఆర్ చరిత్ర తెలుసుకో.. కేసీఆర్ సీఎం అయిన రోజే రాజకీయాలలో విలువలు నశించాయి. బీజేపీ డైరెక్షన్లో కేసీఆర్.. కాంగ్రెస్కు వెన్నుపోటు పోడిచారు’’ అంటూ జగ్గారెడ్డి మండిపడ్డారు. -
‘ఎప్పటికైనా పీసీసీ చీఫ్ అవుతా!’
సాక్షి, గాంధీభవన్: టీపీసీసీ చీఫ్ పదవి బీసీ నేతకు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. ఇదే సమయంలో తన మనసులోని మాటను బహిర్గతం చేశారు. తాను కూడా పీసీసీ చీఫ్ కావాలనుకుంటున్నట్టు తెలిపారు. ఎప్పటికైనా పీసీసీ చీఫ్ అవుతానని కామెంట్స్ చేశారు.కాగా, జగ్గారెడ్డి శనివారం గాంధీభవన్లో మీడియా చిట్చాట్లో మాట్లాడుతూ..‘కొత్త పీసీసీ చీఫ్ పార్టీలో అందరినీ కలుపుకునిపోతారని భావిస్తున్నాను. పార్టీ లైన్లో పనిచేసిన నేత మహేష్ కుమార్ గౌడ్. పీసీసీ పదవి బీసీ నేతకు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాను. తెలంగాణలో ముఖ్యమంత్రి రెడ్డి సామాజికి వర్గానికి చెందిన నేత కావడంతో పీసీసీ బీసీ నేతకు ఇచ్చారు. నేను కూడా ఏదో ఒకరోజు పీసీసీ చీఫ్ అవుతాను. ప్రస్తుతం బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి అధిష్టానం పీసీసీ ఇచ్చింది. భవిష్యత్లో రెడ్డిలకు పీసీసీ ఇవ్వాలని అధిష్టానం నిర్ణయిస్తే నేను ప్రయత్నాలు చేస్తాను. కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి చాలా హ్యాపీగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలోనే ఫ్రీడమ్ ఉంటుంది. బీజేపీలో స్టేట్ ప్రెసిడెంట్ కావాలన్నా కష్టమే. ఎవరికీ వస్తుందో తెలియదు. ఎప్పుడు పోతుందో తెలియదు. బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ.. అందులో పార్టీ ప్రెసిడెంట్ పోస్టు ఉండదు. బీసీ కమిషన్ నియామకం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. రైతుల పట్ల పూర్తి అవగాహన ఉన్న నేత కోదండరెడ్డికి రైతు కమిషన్ ఇచ్చారు. వరదల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అందరినీ ఆదుకుంటుంది’ అంటూ కామెంట్స్ చేశారు. -
ఇదేనా బీఆర్ఎస్ రాజకీయం: జగ్గారెడ్డి ఫైర్
సాక్షి, హైదరాబాద్: అధికారంలో లేకున్నా ఆ మైకం నుంచి హరీష్ రావు ఇంకా బయటకు రావడం లేదని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. తెలంగాణలో ప్రతిపక్షాలు రాజకీయం చేయడానికి ఇదే సమయం కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్కు చాలా వ్యత్యాసం ఉంది అని చెప్పుకొచ్చారు.కాగా, జగ్గారెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘ప్రతిపక్ష నేతలు ఖమ్మంలో పర్యటించి ప్రజల నుంచి వచ్చిన సూచనలను ప్రభుత్వానికి ఇవ్వండి. ప్రతిపక్షం ఎలా ఉండాలి అనేది కాంగ్రెస్ పక్షాన నేను ట్రైనింగ్ ఇస్తాను. హరీష్ ఇంకా అధికారం ఉందనే మైకంలోనే ఉన్నారు. ప్రభుత్వం, ప్రతిపక్షం మొదట ప్రజలను సేఫ్ జోన్లోకి తేవాలి. ప్రతిపక్షాల రాజకీయానికి ఇది సమయం కాదు. ప్రభుత్వం మీద బురద చల్లెందుకు బీఆర్ఎస్ లేనిపోని మాటలు చెబుతోంది.మన రాష్ట్ర ప్రతిపక్ష నాయకు కేసీఆర్ ఇంట్లో ఉంటే బీఆర్ఎస్ నేతలు బయట కామెంట్స్ చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్కు చాలా తేడా ఉంది. కాంగ్రెస్ వాస్తవాలకు దగ్గరగా ఉంటుంది. కాంగ్రెస్ శ్రద్ధగా పని చేస్తుంది. కానీ, ప్రచారానికి ప్రయారిటీ ఇవ్వదు. బీఆర్ఎస్ నేతలు 90 శాతం పబ్లిసిటీ చేసి.. 10శాతం పని చేస్తారు. ప్రభుత్వం ప్రజలను కాపాడేందుకు వంద శాతం ప్రయారిటి ఇస్తుంది.ఐదు రోజుల నుంచి వర్షాలు తెలంగాణ, ఆంధ్రలో కురుస్తున్నాయి. పెద్ద మొత్తంలో వర్షాలు రావడంతో చెరువులు, వాగులు, అలగులు పడుతున్నాయి. జంట నగరాల్లో కూడా ఇప్పుడు వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి. ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్షం కారణంగా హైదరాబాద్లో ట్రాఫిక్ ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఖమ్మం జిల్లాలో ఇండ్లు మునిగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేటి మూడు రోజులుగా వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. సహాయక చర్యలు అందిస్తున్నారు.సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మంలో వరద ప్రాంతాల్లో పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే.. అన్ని శాఖల సమన్వయంతో పని చేస్తున్నారు. ఇప్పటికే 7వేల కోట్ల నష్టం జరిగింది. తక్షణ సాయం కోసం కేంద్రం రెండు వేల కోట్లు విడుదల చేయాలని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ రాశారు’ అని కామెంట్స్ చేశారు. -
ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఎందుకొచ్చిందంటే? : జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా డైరెక్షన్లోనే బెయిల్ వచ్చిందని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.కవితకు బెయిల్ రావడంపై జగ్గారెడ్డి స్పందించారు.‘‘లిక్కర్ స్కామ్ లో కవిత మెయిన్ విలన్. మోదీ, అమిత్ షా డైరెక్షన్ లోనే కవితకు బెయిల్ వచ్చింది. రాజకీయ చీకటి ఒప్పందంలో భాగమే కవితకు బెయిల్ వచ్చింది. అదే మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు బెయిల్ ఎందుకు ఇవ్వలేదు..15నెలలు వరకు సిసోడియకు బెయిల్ ఇవ్వలేదు ..ఐదు నెలలకే కవితకు ఎందుకు బెయిల్ ఇచ్చారు’’ అని ప్రశ్నించారు.‘కేసీఆర్ రాజకీయంగా కాంగ్రెస్ను ఢీకొనలేక బీజేపీతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ,బీఆర్ఎస్ అలయన్స్గా పోటీ చేస్తాయి. బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోయే భాగంగానే మద్యం పాలసీ కేసులో కవిత జైలు నాటకం’అని వ్యాఖ్యానించారు.బెయిల్ రాక ముందే మూడు రోజుల నుండి బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు.తీర్పు వెలువరించక ముందే కేసీఆర్ ,కేటీఆర్,హరీష్ రావు,బెయిల్ వస్తుందని లీక్ ఇస్తున్నారు.కేసీఆర్ కుటుంబంపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి.కవిత బెయిల్ అంశం దేశ రాజకీయాలలో కొత్తగా అనిపిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ డమ్మీ పాత్ర పోషించింది. కేసీఆర్ బీఆర్ఎస్ నాయకులను న్యూట్రల్ చేసి బీజేపీకి ఓటు వేయించారు. ట్రబుల్ షూటర్ అంటున్న హరీష్ రావు ఇలాకాలో బీఆర్ఎస్ మూడవ స్థానంలో ఉంది. మోదీ తన బలం పెంచుకోవడానికి ప్రాంతీయ పార్టీలతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. బీజేపీ వెనుక ఉందనే ధైర్యంతో హరీష్ రావు, కేటీఆర్లు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.ఇవాళ కవితకి బెయిల్ రావడం BRS - BJPలో విలీనమా.?వచ్చే ఎన్నికల్లో BJP BRS పొత్తా?ఇదే కేసీఆర్, మోడీకి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్..17 నెలల వరకు సిసోడియాకి బెయిల్ రాలేదు,ఐదు నెలలకే కవితకి బెయిల్ ఎలా వచ్చింది..తెలంగాణలో కాంగ్రెస్ నీ దెబ్బతీసే కుట్ర జరుగుతుంది..#jaggareddy #congress pic.twitter.com/nKH58h8iJJ— Jayaprakash Reddy(OFFICIAL ) (@ImJaggaReddy) August 27, 2024 -
చీప్ లిక్కర్ తాగావా..? జగ్గారెడ్డి కౌంటర్
-
దమ్ముంటే రాజీవ్ విగ్రహాన్ని టచ్ చేయ్: కేటీఆర్కు జగ్గారెడ్డి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ గాంధీ విగ్రహం కూలగొడతామంటే మేము ఖాళీగా ఉన్నామా అంటూ కేటీఆర్కు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ చీఫ్ లిక్కర్ తాగినట్టుగా ప్రవర్తిసున్నారంటూ దుయ్యబట్టారు.‘‘తల్లి గుండెల్లో ఉండాలి కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం లోపల పెడతామని రేవంత్ అన్నారు. రాజీవ్ విగ్రహం ముట్టుకుంటే చెప్పుతో కొడతానన్న సీఎం వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుంది’’ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.పొలిటికల్ కోచింగ్ సెంటర్లో కేటీఆర్ ట్రైనింగ్ తీసుకుంటే మంచిది. కేటీఆర్కు ఎలాంటి విషయాలు మాట్లాడాలో తెలియడం లేదు. కేసీఆర్.. కేటీఆర్కు కోచింగ్ ఇప్పిస్తే మంచిది. పదేళ్ల కాలంలో జర్నలిస్టుల సమస్యల కోసం, ప్లాట్ల కోసం ఏనాడైనా అల్లం నారాయణ కోట్లాడిండా?’’ అంటూ జగ్గారెడ్డి ప్రశ్నించారు. -
బడ్జెట్పై కేసీఆర్ వ్యాఖ్యలు తగదు.. జగ్గారెడ్డి
ప్రతిపక్షనేత కేసీఆర్ తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్పై ఆయన స్పందించారు.కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్.. రాష్ట్ర ప్రజలకు దగ్గరగా ఉండే బడ్జెట్. గత పదేళ్ల కాలంలో హైప్ బడ్జెట్..కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రాక్టీకల్ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పదేళ్ల బడ్జెట్ ఊహల్లో విహరించిన బడ్జెట్ అన్న ఆయన.. కాంగ్రెస్ నాయకత్వం వాస్తవానికి ఎప్పుడూ దగ్గరగా ఉంటుందని తెలిపారు. ప్రజా సంక్షేమం కోరి ప్రవేశ పెట్టిన బడ్జెట్ వ్యవసాయానికి పెద్ద పీట వేయడంతో అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తే.. గత పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వం అప్పులకే ప్రాధాన్యత ఇచ్చిందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. -
చిరుకు జగ్గారెడ్డి చురకలు
హైదరాబాద్, సాక్షి: రైతులకు నష్టం జరుగుతుందని పలు సినిమాలు తీసిన చిరంజీవి... ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతులకు ఎందుకు మద్దతు ఇవ్వలేకపోతున్నాడని ప్రశ్నించారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. రుణమాఫీ హామీ నెరవేర్చిన తరుణంలో ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్పై, అలాగే నటుడు చిరంజీవిపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘తెలంగాణలో రుణమాఫీ పైసలతో ఫోన్లు అన్ని టింగు టింగుమంటుంన్నాయి. ఆగస్టు 15 లోపు 2 లక్షల మాఫీ అయిపోతుంది. దీనికి సాక్ష్యం రైతులే. ఫోన్ లలో మెసేజ్ లు చూసి రైతు ల ఇళ్ళలో సంబరాలు జరుగుతున్నాయి. కానీ, బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు గత రాత్రి నిద్రలేదు. కేటీఆర్ ట్విట్టర్ కే పనికొస్తడు.. పనికి పనికిరాడు. మా ప్రభుత్వానికి ఇంకా నాలుగున్నర సంవత్సరాల టైం ఉన్నా.. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఇచ్చిన హామీ నెరవేర్చాం... ఇప్పటిదాకా బీజేపీ ఎన్నివేల కోట్ల రైతు రుణమాఫీ చేసింది? దీనికి బండి సంజయ్ సమాధానం చెప్పాలి. నీరవ్ మోదీ, లలిత్ మోదీ లాంటోళ్లకు రూ.16 లక్షల కోట్లు బీజేపీ మాఫీ చేసింది. కానీ, ఒక్క రైతుకైనా చేసిందా?. గతంలో.. దేశం మొత్తం 71 వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్కే చెల్లింది. .. రైతులకు నష్టం జరుగుతుందని సినిమా తీసిన మెగాస్టార్ చిరంజీవి.. ఢిల్లీలో ధర్నా చేసిన వారికి ఎందుకు మద్దతు ఇవ్వలేదు?. పవన్ కల్యాణ్కు, బీజేపీ వాళ్లకే ఎందుకు మద్దతు ఇస్తున్నారు. సినిమాలతో కోట్లు సంపాదిస్తున్న మీరు(చిరును ఉద్దేశించి..) రైతుల కష్టాలను ఎందుకు పట్టించుకోవడం లేదు?. రైతుల పేరుతో సినిమా తీసి డబ్బులు సంపాదించి, మోదీకి మద్దతు ఇస్తున్నారు!. రైతులకు మద్దతుగా నిలిచిన రాహుల్కు ఎందుకు సపోర్ట్ ఇవ్వలేదు. కాంగ్రెస్లో ఉంటే చిరంజీవి సరైన దారి లో ఉండేవాడు. ఇప్పుడు పక్కదారి పట్టాడు అని జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేశారు... బీఆర్ఎస్ చరిత్ర అంతా అప్పులే. కేసీఆర్ గత పదేళ్ళలో రూ.7 లక్షల కోట్ల ఆప్పులు చేసి రైతులకు ఇచ్చింది 26 వేల కోట్ల రూపాయలే. కాంగ్రెస్ గత 6 నెలల్లో రైతులకు ఇచ్చింది రూ. 31 వేల కోట్లు. తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ ఖూనీ చేసింది. అటు కేంద్రంలో బీజేపీ నల్ల చట్టాలతో రైతులను మర్డర్ చేసింది. కేంద్ర మంత్రుల కొడుకులు రైతు ల మీద నుంచి బండ్లు ఎక్కించారు అని జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. -
చంద్రబాబు వచ్చింది అందుకే.. కాంగ్రెస్ కేడర్ అలర్ట్: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు భేటీతో రాష్ట్రంలో రాజకీయం మరోసారి హీటెక్కింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను కబ్జా చేసే ప్రయత్నం జరుగుతోందని కామెంట్స్ చేశారు.కాగా, జగ్గారెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో బీజేపీ గేమ్ స్టార్ట్ చేసింది. టీడీపీని ముందుపెట్టి బీజేపీ పొలిటికల్ గేమ్ ఆడుతోంది. తెలంగాణను కబ్జా చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ విషయంలో కాంగ్రెస్ కేడర్ అలర్ట్గా ఉండాలని సూచిస్తున్నాను. సీఎం హోదాలో చంద్రబాబు తెలంగాణలో అడుగుపెట్టాడు.చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంలో రాజకీయం మొదలు పెట్టాడు. కాంగ్రెస్ను దెబ్బ కొట్టేందుకు టీడీపీ, జనసేనను బీజేపీ రంగంలోకి దింపింది. చంద్రబాబు పావుగా వ్యవహరిస్తున్నాడు. ఏపీలో చేసిన పొలిటికల్ గేమ్ను తెలంగాణలో ఆడాలనుకుంటున్నారు. విభజన సమస్యల పేరుతో చంద్రబాబు తెలంగాణలో ఎంటరయ్యారు. రాష్ట్రంలో ఐటీని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీనే. చంద్రబాబు కేవలం కొనసాగించారు’ అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో కేంద్రమంత్రి బండి సంజయ్కు కూడా జగ్గారెడ్డి కౌంటరిచ్చారు. దేశంలో బలమంతా ఈడీ, సీబీఐ, ఐటీ చేతిలోనే ఉంది. ఇప్పటి వరకు బీజేపీలో చేరిన వారంతా వివిధ కేసుల్లో ఉన్నవారే ఉన్నారు. ఇంత కన్నా సాక్ష్యం ఏం కావాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో, జగ్గారెడ్డి వ్యాఖ్యలు తెలంగాణలో చర్చనీయాంశంగా మారాయి. ఇక, ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ సందర్భంగా పలుచోట్ల టీడీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించిన విషయం తెలిసిందే. -
‘ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది’.. జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి చాలా ప్రశాంతంగా ఉన్నానంటూ సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘‘నేను ఎమ్మెల్యేగా ఒడిపోయినందుకు చాలా ప్రశాంతంగా ఉన్నా. మనస్ఫూర్తిగా చెబుతున్న మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడంతో నేనే రిలాక్స్ అవుతున్నా. నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా నేను ఓడిపోయానని బాధపడొద్దు. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి పనులు చేసుకుందామని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి ప్రజల కోసం మనం జవాబుదారీగా ఉండాలని సూచించారు.‘‘సంగారెడ్డి ప్రజల కోసం రెండు నెలల తర్వాత ప్రతి సోమవారం సంగారెడ్డిలోని రాంనగర్ లో నా ఇంటి వద్ద అందిబాటులో ఉంటా. కార్యకర్తలు ఎవరు గాంధీ భవన్ కి రావొద్దు...మీరు వస్తే నేను కలవలేను..మాట్లాడలేను. నా కూతురికి పెళ్లి చెయ్యాలి..కొడుకు బిజినెస్ పెడుతా డబ్బులు కావాలంటున్నాడు. అప్పులు తీర్చడానికే నా జీవితం సరిపోతుంది. ఈ 20 ఏళ్లలో సంగారెడ్డిలో బోనాలు, దసరా ఉత్సవాల కోసం 20 కోట్ల రూపాయలు ఖర్చు చేశానని జగ్గారెడ్డి‘‘ వ్యాఖ్యానించారు. -
ఇదే నా టార్గెట్..
-
మాకొచ్చే సీట్లు !..జగ్గన్న జోకులు
-
మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
నర్సాపూర్ (మెదక్): ‘‘మొన్ననే పెళ్లి చేసిండ్రు...అప్పుడే పిల్లలు పుడతాలేరంటే ఎలా..’’అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా శుక్రవారం మెదక్ జిల్లా నర్సాపూర్లో చేపట్టిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. తమకు పావలా వడ్డీ రుణం రావడం లేదని, ఇళ్లు రాలేదని తదితర హామీలను మహిళలు ప్రశ్నించగా..బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడంలో మోసం చేసిందని విమర్శించారు. ప్లాట్లు ఉన్న దళితులకు తమ ప్రభుత్వం రూ.6 లక్షలు, ఇతరులకు రూ.5లక్షలు ఇస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ‘‘మొన్ననే మాకు పెళ్లి చేసిండ్రు. అప్పుడే పిల్లలు పుడుతలేరంటే ఎట్లా? మూడు నెలలే అయింది, ముచ్చటగా 3 నిద్రలు చేసినం. తొందర పడకండి, జెరా టైమియ్యిండ్రి, హామీ లన్నీ అమలు చేస్తాం’’అని జగ్గారెడ్డి చెప్పారు. -
జగ్గారెడ్డి బంగారం
-
బీఆర్ఎస్ పై జగ్గారెడ్డి నిప్పులు..
-
జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్, సాక్షి: సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే.. టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మళ్లీ క్రియాశీలకంగా మారారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గత రెండు మూడు రోజులుగా చురుకుగా కనిపిస్తున్నారాయన. సంగారెడ్డిలో తాను ఓడిపోతానని ముందే ఊహించానని వ్యాఖ్యానించిన ఆయన.. తాజాగా ఇవాళ గాంధీభవన్లో మళ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్రావులపై మండిపడ్డారాయన. తెలంగాణ వ్యాప్తంగా మహాలక్ష్మి స్కీమ్ ఉచిత బస్సు ప్రయాణానికి అనూహ్య స్పందన లభిస్తోంది. మహిళలంతా ఈ పథకంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హరీష్ రావు, కేటీఆర్లకు బస్సు ప్రయాణం తెలియదు. బెంజ్ కార్ల లో తిరిగే వాళ్లకు.. పేదల సమస్యలు ఏం తెలుసు?. బీఆర్ఎస్ నేతలకు తెలిసింది అమరవీరుల స్థూపం మాత్రమే. రుణమాఫీ పై మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్, హరీష్ లకు లేదు. అసెంబ్లీలో కేటీఆర్, హరీష్రావు రెచ్చిపోతున్నారు నేను గెలిచి ఉంటే.. అసెంబ్లీలో వీళ్లద్దరినీ ఓ ఆట ఆడుకునేవాడ్ని. బీఆర్ఎస్ది కేసీఆర్ పాలన. కాంగ్రెస్ది ప్రజా పాలన. ప్రజాపాలన అనే సంస్కారం బీఆర్ఎస్కు లేదు. కేసీఆర్ కుటుంబానికి ఆరోగ్య శ్రీ అవసరం లేకపోవచ్చు.. కానీ పేదలకు ఆ అవసరం ఉంది. సెక్రటేరియట్ లో 9 ఏళ్ల ఫైల్స్ అన్నీ పెండింగ్ లొ ఉన్నాయి. మా మంత్రులు వాటి బూజు దులుపుతున్నారు. లక్షల కోట్లు అప్పులు చేసి పోయారు. తెలంగాణ ప్రజలు అప్పు చేయమని అడిగారా?. కేబుల్ బ్రిడ్జి కట్టి మీరే ఇంత చెప్పుకుంటే ఓఆర్ఆర్ సృష్టి కర్త వైఎస్ఆర్ గురించి మేం ఇంకెంత చెప్పాల్సి ఉంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత సోనియా గాంధీ ఇంటికి పోయింది కేసీఆర్ కుటుంబం కాదా?. బీఆర్ఎస్ మాట ఇచ్చి తప్పినందుకు కోర్టులో కేసు వేస్తాం. కేసీఆర్ కుటుంబం 420 కాబట్టే ఓడించి ఇంట్లో కూర్చో బెట్టారు. కేటీఆర్, హరీష్ రావుల కోసం 840 చట్టం తేవాలేమో అని జగ్గారెడ్డి మండిపడ్డారు. -
ఓడితే మంత్రి పదవి ఇస్తారా?
-
సోనియా కాళ్లు మొక్కిన కేసీఆర్, తర్వాత రోజే మాట మార్చాడు: ఖర్గే
Updates: గంజి మైదాన్లో కాంగ్రెస్ సభ.. మల్లికార్జున ఖర్గే ప్రసంగం ►కాంగ్రెస్ పేదల కోసం ఆలోచిస్తుంది. ►కర్ణాటకలో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ►తెలంగాణ ఎవరు ఇచ్చారు? ఎవరి కోసం ఇచ్చారు. ►తెలంగాణ ఇవ్వగానే కేసీఆర్ సోనియా ఇంటికెళ్లాడు, ఆమె కాళ్లు మొక్కాడు. ►ఆ తర్వాత రోజే మాట మార్చాడు. ►ఇందిరా గాంధీ సంగారెడ్డిలో అడుగుపెట్టి దేశమంతా కాంగ్రెస్ను గెలిపించింది. ►ఇందిరా గాంధీ హయాంలోనే BHEL, BDL, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాయి. ►ఇందిరాగాంధీ ఇక్కడి నుంచి గెలవకపోయి ఉంటే ఈ సంస్థలు సాధ్యామయ్యేవా? ►తెలంగాణ దగ్గర డబ్బు ఉన్నప్పుడు కేసీఆర్ తనకునచ్చింది చేశారు. ►ఈ ప్రభుత్వం సంస్థలను ఆమ్మేస్తుంది ►తెలంగాణలో ప్రతీ ఒక్కరిపై 5 లక్షల అప్పు ఉంది ►కాంగ్రెస్ పేదల కోసం ఆలోచిస్తుంది. ►బ్యాంకులను జాతీయం చేసింది కాంగ్రెస్. ►రైతు కూలీల కోసం ఉపాధి హామీ పథకం తెచ్చాం. ►తెలంగాణ దగ్గర డబ్బు ఉన్నప్పుడు కేసీఆర్ తనకునచ్చింది చేశారు. ►మేము ఆరు గ్యారంటీలను ఇస్తున్నాం. ►మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతినెల మహిళలకు రూ. 2500 ఇస్తాం. ►రైతులకు రైతు భరోసా కింద 15 వేలు ఇస్తాం. ►ఓట్ల కోసం ఈ పథకాలు కాదు, అన్ని ఆలోచించి ఈ నిర్ణయాలు తీసుకున్నాం. ►మేం అన్నది చేసి చూపిస్తాం, మీరు హామిలిచ్చి వదిలేస్తారు. ►రేవంత్ రెడ్డి మీ దోస్తులకు చెప్పు, నేను బస్సు ఏర్పాటు చేస్తా. ►కర్ణాటకలో హామీలు అమలు అవుతున్నాయో లేదో బీఆర్ఎస్ నేతలను తీసుకెళ్లి చూపించండి. ►ప్రతి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామి ఇచ్చారు. ►తొమ్మిదేళ్లలో 18 లక్షల ఉద్యోగాలు రావాలి. వచ్చాయా? ►ఏ ఒఒక్కరితోనూ కాంగ్రెస్ అధికారంలోకి రాదు. అందరూ కలిసి పనిచేయాలి. ►సంగారెడ్డిలోని గంజి మైదాన్లో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ ప్రారంభమైంది. ఈ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. సంగారెడ్డి సభ అనంతరం మల్లికార్జున ఖర్గే మెదక్ వెళ్లనున్నారు. సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డిలో కాంగ్రెస్ భారీ ర్యాలీ నిర్వహించింది.. ఈ ర్యాలీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. తారా డిగ్రీ కాలేజీ నుంచి గంజి మైదాన్ వరకు ర్యాలీ కొనసాగింది. -
అందరూ సీఎం లే..?
-
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
బీఆర్ఎస్ Vs కాంగ్రెస్.. నేతల మధ్య పొలిటికల్ వార్
సాక్షి, సూర్యాపేట: తెలంగాణ పొలిటికల్ వాతావరణం మరోసారి హీటెక్కింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలు పార్టీలపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ను మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించగా.. బీజేపీ, బీఆర్ఎస్ను కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. ఇక, మంత్రి జగదీష్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ హామీలన్నీ భోగస్. ఆచారణ సాధ్యం కాని హమీలను తెలంగాణ ప్రజలు నమ్మరు. కాంగ్రెస్ నాయకుల మాటలు సినిమా పాత్రల్లో వేసే బఫ్యూన్ల పాత్రలాగా ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులు రాసి ఇచ్చిన స్క్రిప్టును సోనియా, రాహుల్ చదివి వినిపించారు. హామీలు నెరవేర్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి హామీలు ఇవ్వలేదు. కర్ణాటక పరిస్థితేంటి? గతంలో 2 లక్షల రుణమాఫీ అన్నా ప్రజలు నమ్మలేదు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి మాట్లాడితే తెలంగాణ ప్రజలు నమ్మరు. తెలంగాణతో సమానంగా బడ్జెట్ ఉన్న కర్ణాటకలో రైతుబంధు ఎందుకు ఇవ్వట్లేదు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ మీద ఉన్న నమ్మకం కాంగ్రెస్ నాయకులపై లేదు. ఇచ్చిన హామీలు మాత్రమే కాకుండా ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఘనత కేసీఆర్కే దక్కింది. కేసీఆర్ హామీలను కాపీ కొట్టి పథకాలు ఇస్తామంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు అంటూ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా ప్లాన్.. మరోవైపు, జగ్గారెడ్డి మాట్లాడుతూ.. మొదటి సారి CWC సమావేశాలు హైదరాబాద్లో జరిగాయి. బీఆర్ఎస్కు అండగా బీజేపీ, ఎంఐఎం పనిచేస్తున్నాయని రాహుల్ గాంధీ నిన్నటి సభలో స్పష్టంగా చెప్పారు. ఈ మూడు పార్టీలు కలిసి కాంగ్రెస్ను అధికారంలోకి రానివ్వకుండా కుట్రలు చేస్తున్నాయి. దేశ ప్రజలు సంక్షేమం కోసం CWC సమావేశాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. బీజేపీ మత రాజకీయాలు చేస్తూ దేశాన్ని కలుషితం చేస్తోంది. కాంగ్రెస్ సెక్యూలర్ పార్టీ. అన్ని మతాలకు సమాన గౌరవం ఇస్తుంది. మతాలను రెచ్చగొడుతూ అధికారాన్ని కాపాడుకోవాలని బీజేపీ చూస్తోంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: సోనియా గాంధీ అంటే అభిమానం, గౌరవం: విజయశాంతి కామెంట్స్ -
ఆపకపోతే నా అనుచరులకి అప్పగిస్తా: జగ్గారెడ్డి ఫైర్
సాక్షి, హైదరాబాద్: పార్టీ మారడం లేదని నిన్ననే క్లారిటీ ఇచ్చా. మీడియా సమావేశం పెట్టినా.. ఇంకా పుకార్లు ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఆ గుసగుసలు ఇప్పటికైనా బంద్ కావాలి అని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సొంత పార్టీలోనే నేతలు చేస్తున్న ప్రచారంపై ఫైర్ అయ్యారు. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న పుకార్లపై మండిపడ్డ ఆయన.. ‘‘మళ్లీ చెప్తున్నా.. పార్టీ మారే ఉద్దేశం లేదు. నా గురించి నెగెటివ్గా ప్రచారం చేస్తే.. పార్టీలో ఫిర్యాదు చేస్తా. పరువునష్టం దావా వేస్తా. లీగల్ నోటీసు ఇస్తా. అయినా మారకపోతే నా అనుచరులకి అప్పగిస్తా’’ అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు జగ్గారెడ్డి. ‘‘మీడియా సమావేశంలో నేను చెప్పినప్పటికి కొంతమంది గుసగుసలు పెడుతున్నారు. అనుమానం క్లియర్ చేశాను.. మళ్ళీ ఇంకో అనుమానం అంటే ఎలా?. అనుమానించే వారికీ పనేం లేదా? 41 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా. నేను కస్టపడి రాజకీయాల్లో ఉన్నా. కొంతమంది గుసగుసలు ఇప్పటికైనా బంద్ చేయాలి. అప్పు చేసి 3సార్లు ఎమ్మెల్యే అయ్యాను. ఏం సంపాదించుకోలేదు. నా మీద నిరాధార ఆరోపణలు చేస్తే పీసీసీకి, సీఎల్పీకి పిర్యాదు చేస్తా. రేవంత్, భట్టి లతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయించి.. క్రిమినల్ కేసులు పెట్టిస్తా. పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి, పరువు నష్టం దావా వేస్తా. ఇప్పటికీ నాకు స్వంత ఇల్లు లేదు. నాకు ఆస్తులు ఉన్నాయని ఒక్కటి నిరూపించండి.. అది వారికే ఇచ్చేస్తా. ధరణి లో ఒక్క ఎకరా భూమి ఉన్నట్లు చూపితే.. వారికే ఇస్తా. 90 శాతం అహింస వాదిని.. 10 శాతం భగత్ సింగ్ లాగా వేరే పాత్ర పోషిస్తా. నేను పూర్తిగా పబ్లిక్ మనిషిని అంటూ వ్యాఖ్యలు చేశారాయన. ఇదీ చదవండి: కేసీఆర్ దృష్టిలో కమ్యూనిస్ట్ పార్టీ కరివేపాకు! -
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్...బీఆర్ఎస్ వైపు జగ్గారెడ్డి చూపు
-
కాంగ్రెస్కు షాక్.. బీఆర్ఎస్లోకి జగ్గారెడ్డి?
సాక్షి, సంగారెడ్డి: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో తెలంగాణలో కూడా హస్తం నేతలు స్పీడ్ పెంచారు. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో కొందరు సీనియర్లను కూడా పార్టీలోకి ఆహ్వానించింది. మరోవైపు.. కొంత మంది హస్తం నేతలు కాంగ్రెస్ను వీడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. బీఆర్ఎస్లో చేరునున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ సర్కార్ వైపు జగ్గారెడ్డి మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. ఇక, కొంతకాలంగా జగ్గారెడ్డి.. బీఆర్ఎస్ నేతలతో సఖ్యతగా ఉండటం విశేషం. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి జగ్గారెడ్డి సంగారెడ్డి బరిలోకి దిగే అవకాశం ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా, పార్టీ మార్పు వార్తలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నా.. వాటిని జగ్గారెడ్డి ఖండించకపోవడం ఆసక్తికరంగా మారింది. ఇదే, పార్టీ మార్పు అంశానికి మరింత బలాన్ని చేకూర్చుతోంది. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్గా నియమించినప్పటి నుంచే జగ్గారెడ్డి సీరియస్గా ఉన్నారు. ఈ క్రమంలో బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేశారు. ఇక, కాంగ్రెస్ హైకమాండ్కు కూడా పలు సందర్భాల్లో జగ్గారెడ్డి లేఖలు రాశారు. రేవంత్ను టీపీసీసీ చీఫ్గా నియమించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక, ఇటీవల కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న పలు కార్యక్రమాల్లో కూడా జగ్గారెడ్డి యాక్టివ్గా కనిపించకపోవడం గమనార్హం. ఒకానొక సమయంలో కేసీఆర్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలపై కూడా జగ్గారెడ్డి సానుకూలంగా స్పందించి.. గులాబీ సర్కార్ను అభినందించడం విశేషం. ఇది కూడా చదవండి: కేసీఆర్ సార్ ‘మదిలో’ ఎవరు..? అందరిలోనూ హై టెన్షన్..! -
జగ్గారెడ్డి బీఆర్ఎస్లో చేరుతున్నారా? ‘చింతా’ కోసం అత్యవసర సమావేశం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి బీఆర్ఎస్ లో చేరుతారనే ఊహాగానాల నేపథ్యంలో ఆ పార్టీ నేతలు అప్రమత్తమయ్యారు. బుధవారం సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో అత్యవసరంగా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, అన్ని గ్రామాల సర్పంచ్లు, నామినేటెడ్ పదవులు పొందిన నాయకులు, పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు సుమారు 200 మంది అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి వంటి ఇద్దరు ముగ్గురు మినహా మిగిలిన ముఖ్యనేతలంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. చింతాకే అవకాశం ఇవ్వండి పార్టీలోకి వలస వచ్చే వారికి కాకుండా, పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్కే అవకాశం కల్పించాలని ఎక్కువ మంది నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైనా ప్రజలకు అందుబాటులో ఉంటున్న చింతాకు తమ మద్దతు ఉంటుందని సుమారు 80 శాతం మంది ముఖ్యనేతలు స్పష్టం చేశారు. ఈ మేరకు తమ అభిప్రాయాన్ని పార్టీ అధినాయకత్వానికి విన్నవించాలని నిర్ణయించారు. మంత్రి హరీశ్రావు వద్దకు వెళ్లి తమ అభిప్రాయాన్ని పంచుకోవాలని అన్నారు. కాగా కొందరు నేతలు ఇందుకు భిన్నంగా తమ అభిప్రాయం వెల్లడించారు. పార్టీ అధినాయకత్వం ఎవరికి అభ్యర్థిత్వం ఖరారు చేస్తే వారి గెలుపు కోసమే తాము పనిచేస్తామని కొండాపూర్ ఎంపీపీ మనోజ్రెడ్డి, గుంతపల్లి సర్పంచ్ అనంత్రెడ్డి తదితర నేతలు స్పష్టం చేశారు. ఈ క్రమంలో పార్టీ టికెట్ కోసం తమ పేరును కూడా పరిశీలించాలని డాక్టర్ శ్రీహరి విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డిలో అత్యవసర సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్యనేతలు సమావేశం ఆర్గనైజ్ చేసిందెవరు? సంగారెడ్డిలో బీఆర్ఎస్ ముఖ్యనేతల అత్యవసర సమావేశం నిర్వహించడం రాజకీయ వర్గాల్లో ఒకింత కలకలం రేపింది. ఈ సమావేశాన్ని ఆర్గనైజ్ చేసిందెవరనే అంశంపై చర్చ జరుగుతోంది. కాగా పార్టీ మండల, పట్టణ కార్యవర్గం అధ్యక్షులు, కార్యదర్శులు ముఖ్య నాయకులందరికీ ఫోన్లు చేసి సమావేశానికి హాజరుకావాలని కోరినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు మంగళవారం రాత్రే సమాచారం ఇచ్చినట్లు పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ఇది ఒక మేలు కలయికే: చింతా ప్రభాకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బీఆర్ఎస్ ముఖ్యనేతల అత్యవసర సమావేశం నేపథ్యంలో సాక్షి ప్రతినిధి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ను ఫోన్లో సంప్రదించగా నాయకులంతా అత్యవసరంగా సమావేశం నిర్వహించినట్లు నాకు ఫోన్ చేసి చెప్పారు. జగ్గారెడ్డి అనుచరులు, కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు ఆయనతో విభేదించి బీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు జగ్గారెడ్డి బీఆర్ఎస్లోకి వచ్చిన పక్షంలో తమ పరిస్థితి ఏమిటనే అభద్రతా భావంతో ఉన్నారు. అందుకోసమే ఈ అత్యవసర సమావేశం నిర్వహించుకుని ఉంటారని నేను అనుకుంటున్నాను అని పేర్కొన్నారు. -
కోమటిరెడ్డి వ్యాఖ్యలతో నష్టం లేదు: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎంపీ కోమటిరెడ్డి ఒక టి మాట్లాడితే మరో విధంగా మీడియాలో వచ్చిందని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి అన్నారు. కోమటిరెడ్డి పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడలేదని స్పష్టం చేశారు. జగ్గారెడ్డి గురువారం ఎమ్మెల్యే క్వార్టర్స్లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మా ణిక్రావ్ ఠాక్రేను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, రానున్న ఎన్నికల సన్నద్ధతలపై చ ర్చించారు. అనంతరం జగ్గారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తాను కూడా త్వరలో నే పాదయాత్ర మ్యాప్ను ప్రకటిస్తానని చెప్పారు. -
సంగారెడ్డికి మెట్రో వేయండి..
సాక్షి, హైదరాబాద్: మియాపూర్ నుంచి సంగారెడ్డి రాంమందిర్ మీదుగా సదాశివపేట వరకు మెట్రో రైలును మంజూరు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం కేసీఆర్ను కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం శాసనసభలో కేసీఆర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. తన వినతి పట్ల సీఎం సానుకూలంగా స్పందించారని, ఈ మెట్రోలైన్ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారని జగ్గారెడ్డి విలేకరులకు తెలిపారు. అదే విధంగా గ్రూప్–1 మెయిన్స్కు 1:50 కాకుండా 1:100 నిష్పత్తిలో అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని సీఎంను కోరగా, ఇందుకు కూడా ఆయన సానుకూలంగా స్పందించారని ఆయన వెల్లడించారు. సంగారెడ్డి నియోజకవర్గంలో బాలురు, బాలికల ఉన్నత పాఠశాలలు, కళాశాలలు, హాస్టల్ భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. ఈ మేరకు అసెంబ్లీ లాబీల్లోని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చాంబర్లో ఆదివారం ఆమెను కలిసి వినతిపత్రం అందజేశారు. -
పంటలకు సకాలంలో కరెంట్ ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: పంటలు కాపాడుకోవడానికి రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం గొప్పలు చెప్పకుండా సకాలంలో పంటలకు కరెంట్ ఇవ్వాలని టీపీసీసీ నేతలు డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరా అంశంపై అసెంబ్లీలో చర్చించాలన్న తమ విజ్ఞప్తిని స్పీకర్ మన్నించనందుకు నిరసనగా గురువారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, డి.శ్రీధర్బాబు, సీతక్క, జగ్గారెడ్డి సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద నిరసన తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఉచితంగా 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని ప్రభుత్వం డాంబికాలు చెబుతున్నా.. కనీసం 4–5 గంటలు కూడా కరెంట్ ఇవ్వట్లేదని ధ్వజమెత్తారు. ఆ కరెంట్ కూడా ఎప్పుడు ఏ సమయానికి ఇస్తున్నారో చెప్పలేని పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఇబ్బందుల గురించి మాట్లాడటానికి సమయం ఇవ్వాలని సభలో పదేపదే కోరినా పట్టించుకోలేదన్నారు. తమ వైపు స్పీకర్ కనీసం చూడకుండా వాయిదా తీర్మానాన్ని తిరస్కరించినందుకు బయటకు వచ్చామన్నారు. వ్యవసాయానికి 24 గంటల పాటు నిరవధికంగా ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని, విద్యుత్ కోతలపై సభలో చర్చ జరగాలన్నారు. -
సీఎం కేసీఆర్తో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్తో సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి భేటీ అయ్యారు. గురువారం అసెంబ్లీ హాల్లో సీఎంను కలసి మాట్లాడిన ఆయన.. ఆ తర్వాత లాబీల్లోని సీఎం చాంబర్లోనూ కలిశారు. కాగా, ఈ భేటీ రాజకీయ చర్చకు దారితీసింది. సీఎంను కలసిన అనంతరం ఆయన మీడియా పాయింట్లో మాట్లా డుతూ తాను దొంగచాటుగా ముఖ్యమంత్రిని కలవలేదని పేర్కొన్నారు. తాను సీఎం కేసీఆర్ను అసెంబ్లీ హాల్లోనే కలిశానని, ఆ తర్వాత ఆయన చాంబర్లో టైం ఇవ్వడంతో అక్కడకు వెళ్లి నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడానని జగ్గారెడ్డి చెప్పారు. ప్రధానమంత్రిని కాంగ్రెస్ ఎంపీలు కలుస్తారని, అలాగే ఎమ్మెల్యేగా తాను కూడా సీఎంను కలిశానని అన్నారు. మియాపూర్ నుంచి సంగారెడ్డి, సదాశివపేట వరకు మెట్రో రైలు మంజూరు చేయాలని వినతిపత్రం ఇచ్చానని, దళితబంధు పథకం కోసం తన నియోజకవర్గంలోని 550 మంది అర్హుల జాబితా ఇచ్చానని, మహబూబ్ సాగర్ చెరువును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని, ఇందుకోసం రూ.200 కోట్లు కేటాయించాలని అడిగానని చెప్పారు. అలాగే సిద్ధాపూర్లో 5వేల మందికి, కొండాపూర్ ఆలియాబాద్లో 4వేల మందికి ఇళ్లను అప్పగించాలని కూడా సీఎంను కోరినట్టు చెప్పారు. ఇవే వినతిపత్రాలను మంత్రి కేటీఆర్కు కూడా ఇచ్చానని తెలిపారు. తన వినతులపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని చెప్పిన జగ్గారెడ్డి, నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించేందుకు మరోమారు టైం ఇవ్వాలని సీఎంను కోరానని, ప్రగతిభవన్లో సమయం ఇస్తే వచ్చి కలుస్తానని చెప్పానని వెల్లడించారు. చదవండి: టీఎస్ అసెంబ్లీ: కేటీఆర్ Vs శ్రీధర్ బాబు హీటెక్కిన సభ -
చంద్రబాబు తెలంగాణకు రావడానికి కేసీఆరే అవకాశమిచ్చారు: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరుతో సీఎం కేసీఆర్ తెలంగాణను వదిలి జాతీయ రాజకీయాల్లోకి వెళుతు న్నారు కాబట్టే ఏపీకి చెందిన టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణకు వచ్చారని సంగారెడ్డి ఎమ్మెల్యే టి. జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో స్తబ్దుగా ఉన్న టీడీపీని తిరిగి గాడినపెట్టడం కోసం చంద్రబాబు రాష్ట్రానికి రావడానికి కేసీఆరే అవకాశమిచ్చారని అన్నారు. తెలంగాణ అనే పదాన్ని తన పార్టీ నుంచి తొలగించడంతోనే కేసీఆర్ బలం పోయిందని ఆయన అభిప్రాయ పడ్డారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో జగ్గారెడ్డి విలేకరు లతో మాట్లాడుతూ కేసీఆర్ తన పార్టీ నుంచి టీ అనే అక్షరాన్ని తొలగించి తెలంగాణను అవమా నించారని విమర్శించారు. కేసీఆర్లో ఎక్కడో మూలన సమైక్య భావన నెలకొందని, అందుకే తెలంగాణ వాదాన్ని ఆయన చంపేశారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్తో కేసీఆర్ సక్సెస్ కాలేరన్న జగ్గారెడ్డి... తెలంగాణలో ఇకపై సీరి యస్ పాలిటిక్స్ నడుస్తాయని, పొత్తుల గురించి ముందుముందు తెలుస్తుందని వ్యాఖ్యానించారు. రూ. 120 కోట్లు ఏ మూలకు? కాంగ్రెస్ హయాంలో చిరు వ్యాపారులకు 100 శాతం సబ్సిడీతో రుణాలు ఇచ్చామని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మైనారిటీలకు స్వయం ఉపాధి రుణాలు ఇవ్వట్లేదని జగ్గారెడ్డి విమర్శించారు. ప్రభుత్వం ఇటీవల మైనారిటీ కార్పొరే షన్కు ఇచ్చిన రూ. 120 కోట్లు ఏ మూలకు సరిపోతాయని ఆయన ప్రశ్నించారు. మైనారిటీ కార్పొరేషన్కు కనీసం రూ. 1,500 కోట్లు కేటాయించడంతోపాటు రుణాలదరఖాస్తు గడువును జనవరి 5 నుంచి మరో నెలపాటు పొడిగించాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. -
మైనారిటీ వెల్ఫేర్ లోన్స్ గురించి సీఎం కేసీఆర్కు జగ్గారెడ్డి లేఖ
-
Telidevara Bhanumurthy: కొంపలు ముంచే కొత్త దుక్నాలు
తెలంగానకు బోక శానొద్దు లైంది. ఒక్కపారి గా రాస్ట్రంకు బోయొస్తె బాగుంటదని నారదుడు అనుకుండు. తిట్టేటి నోరు, తిరిగేటి కాలు ఊకుండయి. నారదుడు తంబూర దీస్కుండు. ఒకపారి టింగ్ టింగ్ మన్నడు. చిర్తలు గొట్టుకుంట నారాయన, నారాయన అనుకుంట మొగులు మీది కెల్లి ఎల్లిండు. పట్నం దిక్కు గాయిన రాబట్టిండు. నడ్మల నర్కం దిక్కు బోతున్న యముని దున్నపోతు ఎదురైంది. ‘‘యాడికి బోతున్నవ్ నారదా’’ అని అడిగింది. ‘‘తెలంగాణల ఏమైతున్నదో ఎర్క జేస్కునే తంద్కు బోతున్న. నా సంగతి కేంగని నువ్వు పట్నం ఎందుకు బోయినవు’’ అని నారదుడు అడిగిండు. ‘‘మా దున్నపోతుల సంగం ఎలచ్చన్లు ఉంటె ఒక్క తీర్గ రమ్మని నన్ను బిలిస్తె బోయుంటి.’’ ‘‘మీ సంగం ఎలచ్చన్లు ఎట్లయినయి?’’ ‘‘సూద్దామని బోయిన నన్ను సుట్ట కుదురును జేసినయి. దున్నపోతుల సంగం ప్రెసిడెంటును జేసినయి.’’ ‘‘నర్క లోకం దున్నపోతును ప్రెసిడెంట్ నెట్ల జేస్తరని తెలంగాన దున్నపోతులు లొల్లి బెట్టలేదా?’’ ‘‘లొల్లి బెట్టెతంద్కు మా దున్నపోతులేమన్న కాంగ్రెస్ పార్టీయా?’’ ‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్ అసువంటి రాజకీయ పార్టీల గాలి దాక్తె దున్నపోతులల్ల గుడ్క రాజకీయాలు షురువైతయేమో!’’ అని నారదుడు అన్నడు. ‘‘నువ్వు తక్వోనివి గావు నారదా! మా దాంట్ల రాజకీయాలు షురువైతె మేము మేము కొట్లాడు కుంటుంటె సూసి మురుద్దామనుకుంటున్నవు. గీ నడ్మ కాంగ్రెస్, బీఆర్ఎస్ కొత్త దుక్నాలు దెర్సినయి. ఇంతకుముందు తెలంగానల టీఆర్ఎస్ అనేటి కిరాన దుక్నముండేది. గా దుక్నంను హోల్సేల్ దుక్నం జేసి డిల్లిల దెర్సిండ్రు. బీఆర్ఎస్ అని పేరు బెట్టిండ్రు. దుక్నంల కేసీఆర్ గూసుండు. వాస్తు జూసి మంచి మూర్తంల దుక్నం దెర్వబట్కె గిరాకి మంచి గైతదని గాయిన అనుకుండు. గని గాయిన ఒకటను కుంటె ఒకటైంది. కుమార స్వామి, అఖిలేశ్ యాద వ్లే దుక్నం కాడ్కి వొచ్చిండ్రు. గాల్లది ఉద్దెర బ్యారమే. గాల్లు దప్పిడ్సి డిల్లిల ఎవ్వలు గా దుక్నం గురించి ముచ్చట బెట్టలే.’’ ‘‘కాంగ్రెస్ దుక్నాల సంగతేంది?’’ అని నారదుడు అడిగిండు. ‘‘గిప్పుడున్న అంగడిల ఒకల్లను జూసి ఒకల్లు ఓరుస్త లేరు. కండ్లల్ల మన్ను బోసుకుంటున్నరు. భారత్ జోడో యాత్ర జేస్కుంట ప్రేమ దుక్నాలు దెరుస్తున్న. గీ దుక్నాలు కడ్మ దుక్నాల సుంటియి గాదు. గిన్వి ఎవ్విటిని అమ్మయి, కొనయి. అందర్కి ప్రేమను పంచిస్తయి. బువ్వబెడ్తె అర్గిపోతది. బట ్టలిస్తె చిన్గిపోతయి. గని నా ప్రేమ అర్గేది గాదు అని రాహుల్ గాంధి అన్నడు.’’ ‘‘ఇంతకు గాయిన ప్రేమ నెట్ల పంచుతున్నడు?’’ ‘‘కాంగ్రెస్సోల్లు గండ్లబడ్తె గాలియెంబడి ముద్దు లిస్తున్నడు. చిన్న పోరనికి చెప్పులేస్తున్నడు. బుడ్డ పోరగాన్ని ఎత్తుకోని ముక్కు చీమిడి దీస్తున్నడు. కాలేజి పోరగాల్లకు సేకెండిస్తున్నడు. ఛాయ్ దాక్కుంట ముసలోల్ల మంచి చెడ్డ లర్సుకుంటు న్నడు. రాహుల్ గాంధి భారత్ జోడో అన్కుంట పాదయాత్ర జేస్తుంటే పార్టీ తోడో అన్కుంట తెలం గానల కాంగ్రెస్ లీడర్లు కొట్లాడుకుంటున్నరు’’ అని దున్నపోతు అన్నది. ‘‘ఎందుకు కొట్లాడుకుంటున్నరు?’’ అని నార దుడు అడిగిండు. ‘‘రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ అయిన కాడికెల్లి తెలంగాన సీనియర్ కాంగ్రెస్ లీడర్లు లోపట లోపట మండుతున్నరు. మునుగోడుల కాంగ్రెస్ ఓడిపోంగనే గాయిన మీద్కి లేసిండ్రు. టీపీసీసీ కమిటీలు ఎయ్యంగనే రేవంత్ను తిట్టుకుంట గాల్లు శిగమూగ బట్టిండ్రు. భట్టి విక్రమార్క ఇంట్ల కాంగ్రెస్ ఎంపి ఉత్తమ్కుమార్ రెడ్డి, మధుయాష్కి, దామోదర్ రాజ నర్సింహ, జగ్గారెడ్డి, కోదండరెడ్డి, ప్రేంసాగర్ రావు అసువంటి కాంగ్రెస్ సీనియర్ లీడర్లు మీటింగ్ బెట్టిండ్రు. టీడీపీకెల్లి కాంగ్రెస్లకొచ్చిన రేవంత్ రెడ్డి టీపీసీసీ కమిటీలల్ల టీడీపీలకెల్లి వొచ్చి నోల్లకే మోక ఇచ్చిండు. ముంగటి సంది కాంగ్రెస్ల ఉన్నోల్లను పక్కకు బెట్టిండు. సేవ్ కాంగ్రెస్ అన్కుంట గాల్లు లొల్లిబెట్టబట్టిండ్రు. ‘హాత్ సే హాత్’ ప్రోగ్రాంకు డుమ్మాగొట్టిండ్రు. ఇగ దాంతోని టీపీసీసీ కుర్సిలకు సీతక్కనే గాకుంట పన్నెండుమంది కాంగ్రెస్ లీడర్లు రాజినామ జేసిండ్రు. కొట్లాడుకుంటున్న కాంగ్రెస్ లీడర్లల్ల కొంతమందిని గుంజి గాల్ల చేతులల్ల తామర పువ్వులు బెట్టెతంద్కు బీజేపీ రడీగున్నది.’’ ‘‘బీఆర్ఎస్ దుక్నం సంగతేంది?’’ ‘‘డిల్లిల బీఆర్ఎస్ హోల్సేల్ దుక్నం బెట్టినంక కేసీఆర్ పట్నమొచ్చిండు. రొండు మూడు దినా లైనంక పంజాబ్ సీఎం భగవంత్ మాన్ గాయినను గల్సిండు. ఆంద్రప్రదేస్, పంజాబ్, హర్యానా, మహా రాస్ట్ర, ఒడిసా, కర్నాటక రాస్ట్రాలల్ల బీఆర్ఎస్ దుక్నాలు దెరుస్తమని కేసీఆర్ జెప్పిండు. ఆ దుక్నాల ముంగట ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అని రాసిన బోర్డులు బెడ్తమని అన్నడు. మల్ల గలుస్త’’ అన్కుంట దున్నపోతు నర్కం దిక్కుబోయింది. నారాయన, నారాయన అన్కుంట నారదుడు వైకుంటం బోయిండు. (క్లిక్ చేయండి: మందల బడి మురుస్తాంది గొర్రె) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
ధరణిని ఏం చేద్దాం?
సాక్షి, హైదరాబాద్: రైతులను ఇబ్బందిపెడుతున్న ధరణి పోర్టల్ను ఎలా మార్చాలన్న దానిపై ప్రజలు, రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ధరణి పోర్టల్ పనితీరుపై పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇచ్చిన సమాచారంతోపాటు క్షేత్రస్థాయి నుంచి సమాచారం తీసుకుని అధికారికంగా పార్టీ వైఖరిని వెల్లడించాలని భావిస్తోంది. తద్వరా వరంగల్ డిక్లరేషన్కు అనుగుణంగా ముందుకెళ్లే దిశగా కార్యాచరణ మరింత ఉధృతం చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, సీనియర్ నాయకులు కొప్పుల రాజు, మల్లురవి, ధరణి కమిటీ సభ్యులు హర్కర వేణుగోపాల్, ఈరవత్రి అనిల్, చెరుకు సుధాకర్, ప్రీతం తదితరులు హాజరయ్యారు. గంటన్నరపాటు సమావేశమైన వీరు ధరణి పోర్టల్ వల్ల రైతులకు కలుగుతున్న ఇబ్బందులు, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన రైతు సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని కొనసాగించాలా లేదా కొత్త పద్ధతిలో తీసుకెళ్లాలా అనే దానిపై చర్చించారు. దీనిపై మండలానికి ఐదుగురిని నియమించి వారితో డేటా సేకరించాలని, ఆ తర్వాత 3వేల మందితో సమావేశం నిర్వహించి అందులో వెల్లడైన సమాచారం ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుతో రాష్ట్రంలో రిజర్వేషన్లు 50 శాతం దాటాయని, ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్ తరహాలో రిజర్వేషన్లు అమలు చేస్తే ఎలా ఉంటుందన్న దానిపైనా చర్చించారు. మాది తోడికోడళ్ల పంచాయితీ: రేవంత్, జగ్గారెడ్డి ధరణిపై సీఎల్పీలో జరిగిన సమావేశానికి ముందు అసెంబ్లీ ఆవరణలో ఎదురుపడిన రేవంత్రెడ్డి, జగ్గారెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇద్దరూ ఒకరినొకరు పలకరించుకున్న తర్వాత తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పే ప్రయత్నం చేశారు. తమది తోడికోడళ్ల పంచాయతీ అని, పొద్దున తిట్టుకున్నా మళ్లీ కలిసిపోతామని చెప్పారు. రేవంత్ పాదయాత్రకు తన మద్దతు ఉంటుందని చెప్పిన జగ్గారెడ్డి.. రేవంత్రెడ్డిని ఆ పదవి నుంచి దింపి పీసీసీ అధ్యక్షుడు కావాలన్నది తన అభిమతం కాదని స్పష్టంచేశారు. ఆయన దిగిన తర్వాతనే తాను పీసీసీ అధ్యక్షుడిని అవుతానని పేర్కొన్నారు. నాపై కుట్రలు కొత్త కాదు: దామోదర నేను ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడు సింహయాజిని ఎప్పుడూ కలవలేదు. ఎవరో కావాలని తనకు నష్టం కలిగించేలా ప్రచారం చేస్తున్నారు. ఈ కుట్రలు నాకు కొత్తకాదు. గతంలోనూ చాలాసార్లు జరిగాయి. కవిత, సంతోష్ను అరెస్టు చేయాలి: జగ్గారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితతోపాటు ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్ నేరస్తులేనని... వారిని అరెస్టు చేయాలని ఎమ్మెల్యే టి. జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతోశ్ను ముందుపెట్టి తెలంగాణలోని వివిధ పార్టీల నేతలను కొనేందుకు యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ మీడియా హాల్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరడం ఒక స్కీం అని, వివిధ పార్టీల ఎమ్మెల్యేలు, ఇతర నేతలను బీజేపీలో చేర్చుకోవాలనుకోవడం ఒక స్కాం అని అన్నారు. -
తెలంగాణ: అసెంబ్లీ ఆవరణలో సరదా సన్నివేశం
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి.. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి మధ్య నడిచే మాటల యుద్ధం గురించి ప్రత్యేకంగా తెలియంది కాదు. ఒకే ఇంట్లో సాగే టామ్ అండ్ జెర్రీ గోలలాగా.. ఒకేపార్టీలో ఉంటూ వీళ్లు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు ఈ ఫైర్బ్రాండ్స్. ఈ క్రమంలో.. ఇవాళ(శుక్రవారం) ఆసక్తికర ఘటన ఒకటి చోటు చేసుకుంది. అసెంబ్లీ అవరణలో రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి ఎదురు పడ్డారు. సీఎల్పీకి వచ్చిన వీళ్లు తారసపడడంతో మీడియా ఆసక్తిగా వీళ్ల కలయికను చిత్రీకరించే యత్నం చేసింది. అది గమనించిన ఇద్దరూ చేతిలో చెయ్యేసుకుని సరదాగా సంభాషించారు. మా ఇద్దరి మద్య ఉంది తోటికోడలు పంచాయితీనే అంటూ చమత్కరించారు వాళ్లు. ‘మా ఇద్దరి మధ్య ఎలాంటి విబేధాలు లేవు. మాది తోడికోడళ్ళ పంచాయితీ. పొద్దున తిట్టుకుంటాం.. సాయంత్రానికి మళ్లీ కలిసిపోతాం’ అని కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. కలిసి నప్పుడు నవ్వుకొవ్వొద్దా.. కాంగ్రెస్ల ఒకరిని గుంజి గద్దె ఎక్కడం కుదరదు. టీపీసీసీ చీఫ్గా రేవంత్ యాత్రకు మద్దతు ఇస్తానని చెప్పిన కదా అంటూ ఈ సందర్భంగా జగ్గారెడ్డి గుర్తు చేశారు. ఇంకా పదేళ్లు ఐనా.. రేవంత్ రెడ్డి దిగిపోయిన తర్వాతనే తాను పీసీసీ అధ్యక్షుడిని అవుతానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఈ సమయంలో రేవంత్, చుట్టుపక్కల ఉన్నవాళ్లంతా నవ్వులు చిందించారు. #jaggannamla #Revanthreddy pic.twitter.com/4xuXbzqY4m — S-Punna Reddy (@125PunnaReddy) December 2, 2022 -
కవిత, బీఎల్ సంతోష్ లను వెంటనే అరెస్ట్ చేయాలి - జగ్గారెడ్డి
-
‘బీఎల్ సంతోష్, కవితను వెంటనే అరెస్ట్ చేయాలి’
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తెలంగాణలో పొలిటికల్ హీట్ను పెంచింది. లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక పాత్ర ఉన్నట్టు ఈడీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల ఎపిసోడ్లో బీఎల్ సంతోష్కు సిట్ నోటీసులు పంపి విచారణకు రావాలని కోరిన ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. కాగా, లిక్కర్ స్కాం, ఎమ్మెల్యేల ఎపిసోడ్ వ్యవహారంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జగ్గారెడ్డి స్పందించారు. ఈ క్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవితను, బీజేపీ నేత బీఎల్ సంతోష్ను వెంటనే అరెస్ట్ చేయాలి. బీఎల్ సంతోష్ను కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. టీఆర్ఎస్, బీజేపీ నేతలు డ్రామాలు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద స్కాంలు చేశాయి. వారిద్దరినీ తక్షణమే అరెస్ట్ చేసి, వాస్తవాలు వెలికితీయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే బీఎల్ సంతోష్ను తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేస్తే మరిన్ని విషయాలు బయటికొస్తాయని కామెంట్స్ చేశారు. -
పేదలందరికీ ఇళ్ల స్థలాలివ్వాలి.. లేకపోతే ఉద్యమమే: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని అడుగుతానని, ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తానని చెప్పారు. బుధవారం అసెంబ్లీ మీడియా హాల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేట, సిద్ధాపూర్లలోని పేదలకు 5వేల ప్లాట్లు, కొండాపూర్, ఆలియాబాద్లలో 4వేల ప్లాట్లు ఇచ్చామని, అయితే అక్కడ స్థలాలు ఉన్నాయి కానీ పేదలను మాత్రం పంపించి వేశారని చెప్పారు. వెంటనే వారికి పొజిషన్ ఇవ్వాలని, ఇదే విషయమై సీఎం కేసీఆర్కు లేఖ రాశానని వెల్లడించారు. రాష్ట్రంలో రాజకీయం అంతా గందరగోళంగా ఉందని, అన్నీ అండర్స్టాండింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం నిద్రలో ఉంది కానీ కాంగ్రెస్ లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ రావడం వల్ల ప్రజలకు ఏం లాభం జరిగిందో అర్థం కాదు కానీ కాంగ్రెస్ను మాత్రం ఔట్ చేయాలని చూస్తున్నారని చెప్పారు. పడుకున్న కేసీఆర్ను లేపి మా వాళ్లు తన్నించుకున్నారు పడుకున్న కేసీఆర్ను లేపి తన్నించుకున్నది కాంగ్రెస్ పార్టీ వాళ్లేనని అన్న జగ్గారెడ్డి బీజేపీకి రాజకీయం తప్ప సమస్యలపై పోరాటం చేయడం తెలియదని విమర్శించారు. వైఎస్ షర్మిల పాదయాత్రను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. చదవండి: కేసీఆర్.. అసెంబ్లీలో లెంపలేసుకో.. బండి సంజయ్ ధ్వజం.. -
ఎన్నికల వరకు రేవంత్నే కొనసాగించాలి
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ముగి సేంతవరకు టీపీసీసీ అధ్య క్షుడిగా రేవంత్రెడ్డినే కొన సాగించాలని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి అన్నారు. ఇప్పటికిప్పుడు రేవంత్రెడ్డిని దించేయాలని పార్టీలో ఎవరూ కోరుకోవడం లేదని చెప్పారు. సోమవారం అసెంబ్లీ మీడియా హాల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పీసీసీ అధ్యక్షు డిగా ఎవరున్నా పార్టీలోని నేతలందరినీ కలుపుకొని పనిచేయాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని పేర్కొన్నారు. పాదయాత్ర చేయాలనే అభిప్రాయం పార్టీలో ఎవరికైనా ఉండవచ్చని, కానీ పీసీసీ అధ్య క్షుడికే ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. రేవంత్రెడ్డి పాదయాత్ర చేస్తే మనస్ఫూర్తిగా సహ కరిస్తానని తెలిపారు. అయితే రేవంత్ ఏ నిర్ణయం విషయంలోనూ తమను సంప్రదించడం లేదని విమర్శించారు. రేవంత్ ఇటీవల చేసిన కొన్ని తొందరపాటు వ్యాఖ్యల గురించి పార్టీ భేటీలో అడుగు తానని చెప్పారు. సీఎల్పీ నేత భట్టి ఒక నటుడని, ఆయన గురించి అర్ధం కాదని జగ్గారెడ్డి అన్నారు. డ్రామాలు ఓటు బ్యాంకును మార్చవు రాష్ట్రంలో టీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉంటే, కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఉందని జగ్గారెడ్డి అభి ప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తాము మొదటి స్థానానికి వెళ్లి అధికారంలోకి రావాలని, ప్రజలకు మరింత సేవ చేయాలని, టీఆర్ఎస్ రెండో స్థానా నికి వెళ్లాలన్నదే తమ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో బీజేపీ హడావుడి చేస్తున్నా, హైటెక్ డ్రామాలు ఓటు బ్యాంకును మార్చలేవని పేర్కొన్నారు. సంగారెడ్డి రాంనగర్ వరకు మెట్రోరైల్ మెట్రో రైలును మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు పొడిగించాలని జగ్గారెడ్డి కోరారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్కు లేఖ రాసినట్టు తెలిపారు. బీహెచ్ఈఎల్, పటాన్చెరు, పోతిరెడ్డిపల్లి మీదుగా సంగారెడ్డిలోని రాంనగర్ వరకు మెట్రో రైల్ పొడి గించాలని కోరారు. అలాగే ఉప్పల్ మీదుగా యాద గిరిగుట్ట వరకు మెట్రో రైలును పొడిగించాలని, తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన గుట్ట వరకు ఈ రైలును పొడగించడం వల్ల పెద్ద ఎత్తున భక్తు లకు సౌకర్యంగా ఉంటుందని జగ్గారెడ్డి చెప్పారు. -
బీజేపీ, టీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు
సాక్షి, హైదరాబాద్: ప్రజల కష్టాలను గాలికి వదిలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దౌర్భాగ్య పరి పాలన అందిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ , ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. గాంధీభవన్లో గురువారం మీడియాతో ఆయన మాట్లా డుతూ మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు, నల్లధనం దేశానికి తెస్తానన్న హామీలు పత్తా లేకుండా పోయాయని విమర్శించారు. పెరిగిన ధరలకు సమాధానం లేదని, ఎన్నికలప్పుడు మతాన్ని రెచ్చ గొట్టి లబ్ధిపొందడం ఒక్కటే బీజేపీకి తెలుసని నిందించారు. ఇక రాష్ట్రంలో ఉద్యోగాల హామీ నెరవేరలేదని, 57 ఏళ్లకు పెన్షన్ ఇస్తానన్న వాగ్దానాలు అమలు కావడం లేదని ఆరోపించారు. ప్రజలు కూడా కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ మోసపూరిత మాటలను పట్టించుకోకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. బీజేపీ, టీఆర్ఎస్ అవగాహనతోనే రాష్ట్రంలో చెత్త రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. అమిత్షా, కేసీఆర్లు ప్లాన్ ప్రకారమే రెండు పార్టీల పంచాయితీ పెట్టుకొంటూ కాంగ్రెస్ను రాష్ట్రంలో లేకుండా చేయడానికి కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. ఈడీ, ఐటీలకు బండి చీఫ్లా మాట్లాడుతున్నారు ఈడీ, ఐటీ అధికారులు మాట్లాడాల్సిన మాటలు కూడా బండి సంజయ్ మాట్లాడుతున్నారని, ఈ రెండు విభాగాలకు బండి సంజయ్ చీఫ్ అయ్యారా అనేది అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. మంత్రి మల్లారెడ్డి టీడీపీలో ఉన్నప్పటి నుంచే డబ్బులు సంపాదించారని, 8 ఏళ్లుగా లేని దాడులు ఇప్పుడే ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ ఈడీ, ఐటీలను వాడుతుంటే కేసీఆర్ ఏసీబీని వాడుకుంటున్నారని , రెండు పార్టీలదీ రాజకీయమేనని అన్నారు. డబ్బులు ఇస్తే కాంగ్రెస్ లో పదవులు రావని, రాహుల్ గాంధీ పై మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడటం తప్పని జగ్గారెడ్డి ఖండించారు. మర్రి చెన్నారెడ్డి సీఎం అయ్యారని, ఆయన కూడా డబ్బులు ఇచ్చి సీఎం అయ్యారా అని ప్రశ్నించారు. తాను రాహుల్ గాంధీ, ఠాగూర్లకే జవాబుదారీ అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంచి ఆర్గనైజర్ అని కొనియాడారు. -
TS Raids: బీజేపీ టార్గెట్గా జగ్గారెడ్డి సంచలన కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఈడీ, ఐటీ దాడుల నేపథ్యంలో పొలిటికల్ హీట్ పీక్ స్టేజ్కు చేరుకుంది. ఈ క్రమంలో రాజకీయ నేతలు టీఆర్ఎస్, బీజేపీ సర్కార్లను టార్గెట్ చేసి సంచలన కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ఈ దాడులపై స్పందించారు. కాగా, జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ, ఐటీని బీజీపీ వాడుతోంది. కేసీఆర్ ఏసీబీని వాడుకుంటున్నారు. వీరిద్దరి మధ్య దాడుల వల్ల ప్రజలు జరిగే లాభమేంటి?. మా దగ్గర ఏ శాఖ లేదు.. మేమేమీ చేయలేము. టీడీపీలో ఉన్నప్పటి నుంచే మంత్రి మల్లారెడ్డి సంపాదించాడు. గత ఎనిమిదేళ్లలో లేని దాడులు ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు. గోవాలో క్యాసినో ఫ్రీ.. అక్కడ బీజేపీనే కదా అధికారంలో ఉంది. గోవాలో ఆడించేది మీరే.. ఇక్కడ దాడులు చేసేది కూడా మీరేనా అంటూ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తెలంగాణలో కాంగ్రెస్ మనుగడ దెబ్బతీయాలని చూస్తోంది. మీడియాను అడ్డంపెట్టుకుని కుట్ర పన్నుతోంది. లైమ్లైట్లో ఉంచడానికే టీఆర్ఎస్ మంత్రులపై దాడులు జరుపుతోంది అంటూ సంచలన కామెంట్స్ చేశారు. -
మోదీ చిత్రపటాన్ని చీపుళ్లతో కొట్టి నిరసన.. కాంగ్రెస్ నేతల కౌంటర్
సాక్షి, హైదరాబాద్: ఆర్ఎస్ఎస్ నేత సావర్కర్ను ఉద్దేశించి రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యల మంటలు మండుతూనే ఉన్నాయి. రాహుల్ వ్యాఖ్యలకు నిరసనగా ఆయన చిత్రపటాన్ని చెప్పులతో కొడుతూ బీజేపీ నేతలు మహారాష్ట్రలో నిరసన వ్యక్తం చేయగా, రాహుల్ గాంధీకి మద్దతుగా తెలంగాణలో కాంగ్రెస్ నేతలు మోదీ చిత్రపటాన్ని చెప్పులు, చీపుర్లతో కొడుతూ కౌంటర్ ఇచ్చారు. ఆదివారం గాంధీభవన్లో సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి నేతృత్వంలో జరిగిన ఆందోళనలో ఈ మేరకు ప్రతి నిరసన చేపట్టారు. గాంధీభవన్ వెలుపలికి వచ్చేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఆ తర్వాత గాంధీభవన్ ప్రాంగణంలోనే కాంగ్రెస్ నేతలు చీపుర్లు, చెప్పులతో మోదీ చిత్రపటాన్ని కొడుతూ రాహుల్కి మద్దతుగా, సావర్కర్, బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉన్నది అంటే ఉలుకెందుకు: జగ్గారెడ్డి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం హిందూ, ముస్లింలు కలిసి పనిచేశారనీ కానీ, ఆర్ఎస్ఎస్కు చెందిన సావర్కర్ మాత్రం బ్రిటిష్ పాలకులను క్షమాభిక్ష కోరాడని ఆరోపించారు. ఉన్నది అంటే ఉలుకు ఎందుకని పశ్న్రించారు. కార్యక్రమంలో యూత్కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, ఫిషర్మెన్ కమిటీ చైర్మన్ మెట్టు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రేవంత్ ఫెయిల్
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ నాశనమవుతోందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. పార్టీలో ఏ పరిణామం జరిగినా పీసీసీ అధ్యక్షుడే బాధ్యత వహించాలని చెప్పారు. పార్టీని నడిపించడంలో రేవంత్ ఫెయిల్ అయ్యాడని, ఆయనతోపాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, తాను కూడా ఫెయిలేనని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నా.. ప్రజా సమస్యలపై పోరాడే శక్తి ఉన్నా.. వ్యవస్థ బాగోలేదని, అంతా గాడి తప్పిందని వ్యాఖ్యానించారు. పార్టీలో ఉన్న పది మంది కూడా ఒక్క దగ్గర కూర్చునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. రేవంత్ వన్మ్యాన్ షో ప్రయత్నం వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతుంటే రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఏం చేస్తోందో అర్థం కావడం లేదని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఇంట్లో కూర్చుని జూమ్ సమావేశాలు పెడితే సరిపోదని.. పీసీసీ అధ్యక్షుడు గ్రామగ్రామానికి వెళ్లాలని పేర్కొన్నారు. రేవంత్ పాదయాత్రతో వన్ మ్యాన్ షో చేద్దామనుకుంటున్నారని, అలా చేస్తే పార్టీ అధికారంలోకి వస్తుందా అని ప్రశ్నించారు. గతంలో వారానికో మీటింగ్ అని చెప్పారని, పీసీసీ సమావేశాలు ఎక్కడ జరుగుతున్నాయని ప్రశ్నించారు. పీసీసీ, సీఎల్పీ మధ్య సమన్వయం లేదని, ఈ విషయంలో ఇన్చార్జిది కూడా తప్పేనని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుడిని మార్చాలని తాను చెప్పబోనన్నారు. అయితే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే మెడిసిన్ తన దగ్గర ఉందని, భవిష్యత్తులో తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే ఆ మందు బయటకు తీస్తానని పేర్కొన్నారు. నేతలు వెళ్తుంటే ఏం చేస్తున్నారు? శశిధర్రెడ్డి కాంగ్రెస్ను వీడటం పార్టీకి నష్టమని, ఇందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితోపాటు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ సంస్థాగత ఇన్చార్జి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్ బాధ్యత వహించాలని జగ్గారెడ్డి పేర్కొన్నారు. శశిధర్రెడ్డి పార్టీ వదిలి వెళ్లే పరిస్థితి ఏర్పడితే ఈ ముగ్గురూ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అందరూ వెళ్లిపోయిన తర్వాత రేవంత్, భట్టి ఏం చేస్తారని నిలదీశారు. టీఆర్ఎస్, బీజేపీ బయట వాళ్ల ఆట వారు ఆడుతుంటే.. రేవంత్, భట్టి ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో వాళ్ల ఆట ఆడుతున్నారని వ్యాఖ్యా నించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తానొక్కడినే పనిచేశానని రేవంత్ చెప్పడం సరికాదని జగ్గారెడ్డి అన్నారు. మునుగోడు ఓటమి బాధ్యతల నుంచి రేవంత్ తప్పించుకోలేడన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే అన్ని ఖర్చులు తానే పెట్టుకుంటానని రేవంత్ చెప్పాడని.. మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ చెరో రూ.100 కోట్లు పెడితే, రేవంత్ కనీసం రూ.50 కోట్లయినా ఖర్చు పెట్టి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. జనాల కాళ్లు మొక్కితే ఓట్లు పడే రోజులు పోయా యన్నారు. పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత ఇద్దరూ పార్టీ నాయకులందరినీ పట్టించుకోకపోయినా, అసంతృప్తితో ఉన్న నాయకులతో అయినా మాట్లాడాలని సూచించారు. రాష్ట్ర పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఏఐసీసీకి లేఖ రాశానని చెప్పిన జగ్గారెడ్డి.. ఆ లేఖ వివరాలను వెల్లడించేందుకు మాత్రం నిరాకరించారు. బీజేపీ, టీఆర్ఎస్లది కుక్కల కొట్లాట రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ పొలిటికల్ డ్రామా ఆడుతున్నాయని, వారిది కుక్కల కొట్లాట అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, బీజేపీ ఎంపీ అర్వింద్ రైతుల సమస్యలపై కొట్లాడుతున్నారా? ప్రజల సమస్యలు వదిలేసి సొంత దుకాణాలు పెట్టుకుంటున్నారు. టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఒకరినొకరు గిచ్చుకుంటున్నారు. కాంగ్రెస్ ఉనికి లేకుండా చేసేందుకే ఆట ఆడుతున్నారు’’అని మండిపడ్డారు. కాంగ్రెస్లో కలకలం.. ఆరా తీసిన అధిష్టానం మునుగోడు ఉప ఎన్నిక, భారత్జోడో యాత్ర, పార్టీ నుంచి మర్రి శశిధర్రెడ్డి నిష్క్రమణ తదితర అంశాలపై జగ్గారెడ్డి చేసిన వ్యా ఖ్యలు కాంగ్రెస్లో కలకలం రేపాయి. దీనిపై ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావేద్ ఆరా తీసి నట్టు తెలిసింది. శనివారం సాయంత్రం జగ్గారెడ్డికి ఫోన్ చేసిన ఆయన.. ఏం మాట్లాడారు? ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందనే అంశాలపై వివరణ కోరినట్టు సమాచారం. ఇక పార్టీ నేతలు జూమ్ సమావేశాలతో ఏం చేస్తారని వ్యాఖ్యానించిన జగ్గారెడ్డి.. శనివారం సాయంత్రం జూమ్ ద్వారా జరిగిన పీసీసీ కీలక సమావేశానికి హాజరుకాకపోవడం గమనార్హం. -
రేవంత్, భట్టి టార్గెట్గా జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి టీపీసీసీపై సంచలన కామెంట్స్ చేశారు. జగ్గారెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గాంధీభవన్లో మీటింగ్ పెట్టాల్సిందిపోయి ఇళ్లల్లో కూర్చుని జూమ్ మీటింగ్ ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. జూమ్ మీటింగ్ పెట్టడానికి ఇదేమైనా కంపెనీనా?. ఉన్న 10 మంది కూడా గాంధీభవన్లో కూర్చోలేని పరిస్థితి. కొన్ని ఛానళ్ల భజనతోనే రేవంత్కు పీసీసీ దక్కింది. కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మారే పరిస్థితి ఉంటే రేవంత్, భట్టి విక్రమార్క, మహేష్ గౌడ్ ఏం చేస్తున్నారు. నేతలు పార్టీ మారకుండా చూడాల్సిన బాధ్యత పీసీసీకి లేదా?. అందరూ పార్టీ నుంచి వెళ్లిపోయాక గాంధీభవన్లో ఏం చేస్తారు?. మర్రి శశిథర్ రెడ్డి లాంటి వారు పార్టీ నుంచి మారితే కాంగ్రెస్ చాలా నష్ట పోతుంది. 12 మంది ఎమ్మెల్యేల ను కాపాడుకోవడం లో ఉత్తమ్ , భట్టి ఫెయిల్ అయ్యారు. మునుగోడులో ఓటమిని రేవంత్ అంగీకరించాలి. పార్టీ గెలిస్తే క్రెడిట్ రేవంత్కు, ఓడితే మిగలిన వారికి ఇస్తారా?. మాణిక్యం ఠాగూర్ వ్యవస్థను సెట్ చేయడం లేదు. పార్టీలో చాలా ప్రక్షాళన చేయాలి. టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు కాంగ్రెస్కు వస్తుంది అనుకోవడం తప్పు. తెలంగాణలో బలమైన శక్తిగా ఉన్న కాంగ్రెస్ను బలహీనపరచేందుకే టీఆర్ఎస్, బీజేపీ పొలిటికల్ డ్రామాలు చేస్తున్నాయి. మీడియాన డైవర్ట్ చేసేందుకే రెండు పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి. నిరుదోగ్యులకు ఉద్యోగాలు, రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి వంటి హామీలను టీఆర్ఎస్ మరిచిపోయింది. బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య దాడుల వల్ల ప్రజలకు వచ్చే లాభం ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. -
నిత్యం పొడవాటి గడ్డంతోనే..! ఈ ఫొటోలో ఉన్న వ్యక్తిని గుర్తు పట్టారా?
తెలంగాణకు చెందిన ఆ కాంగ్రెస్ నేత స్టైలే వేరు. రాజకీయాలపై మాట్లాడితే మాటల తూటాలే. చూడటానికి కూడా గంభీరంగా ఉంటారు. ఆయనకంటూ ప్రత్యేక హెయిర్ స్టైల్, గడ్డం, నడక తీరు ఉంటుంది. ఎప్పుడూ బారెడు గడ్డం, పొడవాటి మీసంతో జనాల్లో కనిపించే ఆ కాంగ్రెస్ నేత ఒక్కసారిగా మారిపోయారు. నిత్యం గడ్డం, మీసాలు పెంచుతూ ఉండే ఆయన ఉన్నట్టుండి క్లీన్షేవ్తో దర్శనమిచ్చారు .దీంతో ఆయనను గుర్తుపట్టడం కొందరికి కష్టమైపోయింది. తిరుపతి వెంకన్న భక్తుడైన ఆ కాంగ్రెస్ నేత ఎవరో కాదు.. మన సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి. ఆయన తిరుమల శ్రీవారిని సతీసమేతంగా దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించి మొక్కుతీర్చుకున్నారు. దీంతో జగ్గారెడ్డిని గడ్డం మీసాలు లేకుండా గుర్తుపట్టలేకపోతున్నారు కొందరు. అసలు ఆయనేనా అని పరీక్షించి చూస్తున్నారు. ప్రస్తుతం జగ్గారెడ్డి కొత్త లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా, జగ్గారెడ్డికి దైవ భక్తి ఎక్కువ. తరుచూ పూజల్లో పాల్గొంటారు. పండుగల సందర్భంగా చందాల కోసం వచ్చిన భక్తులకు తనకు తోచిన సాయాన్ని చేస్తూనే ఉంటారు.. ఇటీవల రాహుల్ భారత్ జోడో యాత్ర ఆయన నియోజకవర్గంలో (సంగారెడ్డి) ప్రవేశించిన సందర్భంగా జగ్గారెడ్డి కొరడాలతో కొట్టుకుంటూ పోతురాజులను అనుకరించిన విషయం తెలిసిందే. చదవండి: ED Raids Telangana: గ్రానైట్ కంపెనీల్లో సోదాలపై ఈడీ కీలక ప్రకటన -
60వేల మందితో రాహుల్కు స్వాగతం
కొండాపూర్(సంగారెడ్డి): నవంబర్ 3న సంగారెడ్డిలో ప్రారంభమయ్యే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు 60వేల మందితో స్వాగతం పలుకు తామని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి తెలిపారు. సోమవారం మల్కాపూర్లో కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నెహ్రూ ప్రధాని అయ్యాక రాంచంద్రాపూర్లో బీహెచ్ఈఎల్, ఇందిరా గాంధీ మెదక్ నుంచి ఎంపీగా గెలిచి ప్రధాని అయ్యాక బీడీఎల్, ఓడీఎఫ్ వంటి పరిశ్రమలు, సోనియాగాంధీ హయాంలో సంగారెడ్డిలో ఐఐఐటీ ఏర్పాటయ్యాయని గుర్తుచేశారు. సంగారెడ్డి నియోజకవర్గంలో 25 కి.మీ మేర రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగతుందని, యాత్రను విజయవంతం చేయాలని కోరారు. మండలాల అధ్యక్షులు ప్రభు, బుచ్చిరాములు, రాంరెడ్డి, ప్రకాష్ చెర్యాల ఆంజనేయులు, ప్రభుదాసు, రఘు గౌడ్, వెంకటేశం గౌడ్, సునీల్ పాల్గొన్నారు. -
తండ్రి లాంటి సీఎంకు కోపమేల: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తల్లిదండ్రులకు కోపం వచ్చినా వెంటనే తమ పిల్లలను దగ్గరకు తీసుకుంటారని, అలాగే ఈ రాష్ట్రానికి తండ్రి లాంటి సీఎం పోస్టులో ఉన్న కేసీఆర్కు వీఆర్ఏలపై కోపం తగదని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. మూడు నెలలుగా వీఆర్ఏలకు జీతాలు లేవని, వారంతా ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దసరా పండుగ సందర్భంగా అయినా వారి సమస్యలను పరిష్కరించి దసరా కానుక ఇవ్వాలని ఆదివారం మీడియా సమావేశంలో జగ్గారెడ్డి అన్నారు. సమ్మెలో ఉన్న వారంతా జీతాలు లేక అవస్థల పాలవుతున్నారని, ఈ సమ్మె కాలంలోనే 28 మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిన విధంగా పేస్కేల్ అమలు చేయాలని, పదోన్నతులు, వారసులకు ఉద్యోగాలిచ్చే జీవోలను విడుదల చేయాలని కోరారు. సీఎం పెద్ద మనసుతో ఆలోచించి వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి పూనుకోవాలని జగ్గారెడ్డి విజ్ఞప్తిచేశారు. చదవండి: బీజేపీకి కొత్త పేరు చెప్పిన కేటీఆర్ -
జగ్గారెడ్డి ఏ పార్టీలో ఉంటారో తెలియదు: షర్మిల
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంత్రి కేటీఆర్ కోవర్టు అని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. గాంధీ భవన్లో అంతా ఇదే విషయాన్ని చెప్పుకుంటున్నారన్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారం సంగారెడ్డి నియోజకవర్గంలో కొనసాగింది. కంది మండలం ఆరుట్లలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ వైఎస్ఆర్ కూడా పార్టీ మారారంటూ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలను షర్మిల తీవ్రంగా ఖండించారు. జగ్గారెడ్డి మాదిరిగా వైఎస్ఆర్ ఎప్పుడూ రాజకీయ వ్యభిచారం చేయలేదన్నారు. వైఎస్ఆర్ గెలిచిన పార్టీ కాంగ్రెస్లో కలిసిపోయిందనే విషయాన్ని గుర్తుచేశారు. సంతల్లో పశువులను కొనుగోలు చేసినట్టు జగ్గారెడ్డిని టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పారీ్టలు కొనుగోలు చేస్తున్నాయని నిప్పులు చెరిగారు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న జగ్గారెడ్డి రేపు ఏ పార్టీలో ఉంటారో తెలియదన్నారు. సంగారెడ్డి నియోజకవర్గానికి ఒక్క ఎకరానికైనా సాగు నీరందించని టీఆర్ఎస్ను జగ్గారెడ్డి ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. చదవండి: ప్రాజెక్టులకు సహకరించని రాష్ట్ర సర్కారు..కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విమర్శ -
రూ.3వేల పింఛన్.. భార్యాభర్తలిద్దరికీ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: పండుటాకులు తమ జీవిత చరమాంకంలో ప్రశాంతంగా జీవించేలా మానవతా హృదయంతో ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని వృద్ధులకు ప్రస్తుతం ఇస్తున్న పింఛన్ను రూ.2,016 నుంచి రూ.3,016కు పెంచాలని, 57 ఏళ్ల వయసున్న వారికి కూడా పెంచిన పింఛన్ను అమలు చేయాలని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం కుటుంబంలో ఒకరికి మాత్రమే పింఛన్ ఇచ్చే విధానం అమల్లో ఉందని, దాన్ని సవరించి అర్హులైన భార్యాభర్తలిద్దరికీ పింఛన్ ఇవ్వడం ద్వారా వృద్ధాప్యంలో ఆ దంపతులు మరొకరిపై ఆధారపడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆధార్ కార్డులో నమోదైన వయసు కారణంగా చాలా మంది వృద్ధులు పింఛన్కు అర్హత పొందలేకపోతున్నారని వెల్లడించారు. అనేక మంది వయసు 60–70 ఏళ్ల వరకు ఉన్నా ఆధార్కార్డుల్లో 55 ఏళ్లుగానే నమోదైందని, దీంతో వారు పింఛన్ పొందలేకపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. వెంటనే మున్సిపాలిటీల్లో వార్డు సభలు, గ్రామాల్లో గ్రామసభలు ఏర్పాటు చేసి స్థానికంగా విచారణ చేయడం ద్వారా వారి వయసును ఆధార్కార్డుల్లో మార్చి అర్హులైన వారందరికీ పింఛన్ వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. -
రాష్ట్రాన్ని మీరే సంతోషంగా ఏలుకోండి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రంలో అన్ని కులాలవారికి దళితబంధు తరహాలో బంధు పథకాలు ప్రకటించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. రెడ్లు, బ్రాహ్మణులు, వైశ్యుల్లోనూ నిరుపేదలున్నారని..రాష్ట్రంలోని నాలుగు కోట్ల మందికి ఈ బంధు పథకాన్ని అమలు చేసి..రాష్ట్రాన్ని సంతోషంగా ఏలుకోవాలన్నారు. మంగళవారం సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడారు. ముస్లింలకు 12% రిజర్వేషన్లు అమలు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ అమలుకు నోచుకోలేదన్నారు. ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్లు ఎన్నికలోపు అమలు చేయకపోతే ప్రశ్నిస్తామన్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టడం మంచి నిర్ణయమని అదేవిధంగా పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలని కోరారు. ఏఐసీసీ అధ్యక్షపదవి కోసం అశోక్ గెహ్లోట్, శశిథరూర్ పేర్లు విన్పిస్తున్నాయని, సోనియా, రాహుల్ నిర్ణయాన్ని కాదనలేమని చెప్పారు. -
టీషర్ట్ రాజకీయం స్థాయికి బీజేపీ దిగజారింది
సాక్షి, హైదరాబాద్: భారత్ జోడో యాత్రలో రాహుల్గాంధీ ధరించిన టీషర్ట్ గురించి రాజకీయం చేసే స్థాయికి బీజేపీ దిగజారిందని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. రాహుల్గాంధీపై ఏ విమర్శలు చేయాలో ఆ పార్టీకి అర్థం కావడం లేదన్నారు. అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాల గురించి రాహుల్ అడిగే ప్రశ్నలకు సమాధానం లేకనే బీజేపీ టీషర్ట్ రాజకీయం చేస్తోందన్నారు. మరి పూటకో డ్రస్ మార్చే ప్రధాని మోదీ గురించి ఏం చెబుతారని బీజేపీ నేతలను ప్రశ్నించారు. రాహుల్గాంధీ రూ.40వేల టీషర్ట్ ధరించారని, మోదీ రోజూ వేసుకుని తిరిగే రూ.60లక్షల విలువైన డ్రెస్ల గురించి బీజేపీ నేతలు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. రాహుల్ యాత్ర రూట్ మార్పుపై చర్చిస్తా.. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తన నియోజకవర్గంలో కూడా 30 కిలోమీటర్ల మేర ఉంటుందని జగ్గారెడ్డి చెప్పారు. సంగారెడ్డిలో ప్రవేశించి నియోజకవర్గం దాటి వెళ్లేంతవరకు అన్ని కులాలు, మతాలకు చెందిన ప్రజలను ఈ యాత్రలో భాగస్వాములను చేస్తామని తెలిపారు. స్థానిక నేతలతో సమన్వయం చేసుకుని రాహుల్ యాత్రను విజయవంతం చేస్తామని పక్రటించారు. అయితే, ఓఆర్ఆర్ మీదుగా జరిగే పాదయాత్రతో ప్రయోజనం ఉండదని, అందుకే దీనిపై పీసీసీ నాయకత్వంతో చర్చిస్తానని, శంషాబాద్ నుంచి రాజేంద్రనగర్, మెహిదీపట్నం, గచ్చిబౌలి, లింగంపల్లిల మీదుగా సంగారెడ్డికి వచ్చేలా రూట్ మార్చాలని పీసీసీని కోరతానని జగ్గారెడ్డి వెల్లడించారు. -
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదని వెల్లడించారు. తన స్థానంలో ఈ సారి సంగారెడ్డి కార్యక్తనే నిలబెట్టనున్నట్లు తెలిపారు. క్యాడర్ వద్దంటే.. తన భార్య నిర్మలను బరిలోకి దింపుతానని పేర్కొన్నారు. మళ్లీ 2028 ఎన్నికట్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అయితే జగ్గారెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయనంటున్నారనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉండగా ప్రతి రాజకీయ పరిణామంపై వేగంగా స్పందించే కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి ఈ మధ్య కాలంలో మౌనంగా ఉంటున్నారు. సొంత పార్టీ లో కల్లోలం లాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కూడా ఆయన నోరెత్తడం లేదు. నెలరోజులకుపైగా గాంధీభవన్కు కూడా రావడం లేదు. దీంతో ఆయన అసలు ఏం చేయాలనుకుంటున్నారనే విషయాలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీ, టీఆర్ఎస్లలో పనిచేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన జగ్గారెడ్డి తనదైన శైలిలో రాజకీయం నెరుపుతుంటారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయి, 2018లో సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వేదికగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. తన ఆహార్యంతోనే విలక్షణంగా కనిపించే జగ్గారెడ్డి ఏది చేసినా చర్చకు దారితీస్తుందనేది రాజకీయవర్గాల అభిప్రాయం. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యవహారశైలిపై అనేక సందర్భాల్లో విమర్శలు చేసిన ఆయన పార్టీకి నష్టం కలిగిస్తున్నారనేంతవరకు వెళ్లారు. అయినా వెనక్కు తగ్గని జగ్గారెడ్డి తాను పార్టీ మంచి కోసమే చెబుతున్నానంటూ తనదైన శైలిలోనే ముందుకెళ్లారు. -
కాంగ్రెస్లో రాజీనామాలు.. నోరు మెదపని జగ్గా రెడ్డి అందుకేనా..?
-
జగ్గారెడ్డి మౌనం వెనుక ‘వ్యూహం’?
సాక్షి, హైదరాబాద్: ప్రతి రాజకీయ పరిణామంపై వేగంగా స్పందించే కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్, సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి మౌనంగా ఎందుకు ఉంటున్నారు? సొంత పార్టీ లో కల్లోలం లాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కూడా ఆయన ఎందుకు నోరెత్తడం లేదు? నెలరోజులకుపైగా గాంధీభవన్కు రాని ఆయన అసలేం చేయాలనుకుంటున్నారు... అనే విషయాలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమ య్యాయి. జగ్గారెడ్డి సన్నిహితులు మాత్రం ఆయన వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారని అంటున్నారు. నెల రోజులుగా మౌనవ్రతం చేస్తున్న జగ్గారెడ్డి నవంబర్ వరకు ఇదే వైఖరి కొనసాగిస్తారని, అప్పటివరకు పూర్తిస్థాయిలో నియోజకవర్గానికే పరిమితం అవుతారని, ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితిలో మార్పు రాకపోతే కొత్త మార్గాన్ని ఎంచుకుంటారని చెబుతున్నారు. ఏకంగా కాంగ్రెస్ పార్టీకి పోటీగా కొత్తపార్టీ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ మేరకు తెరవెనుక చేయాల్సిన పనులన్నింటినీ ఆయన చక్కబెట్టుకుంటున్నారని సమాచారం. మార్పు వస్తే ఓకే... లేదంటే ‘కొత్తపార్టీ’? జగ్గారెడ్డి మౌనం వెనుక కారణమేంటన్న దానిపై ‘సాక్షి’ఆరా తీయగా ఆయన కావాలనే రాజకీయ వ్యాఖ్యలు చేయడం లేదని తెలిసింది. పార్టీ పరిస్థితుల్లో మార్పు కోసం అటు అధిష్టానంతోపాటు ఇటు పార్టీ సీనియర్లతో ఆయన చర్చలు జరుపుతున్నారని, అదే సమయంలో పార్టీ పరిస్థితుల్లో మార్పు రాకపోతే కాంగ్రెస్కు పోటీగా మరో పార్టీ పెట్టేందుకు కూడా ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. ఇందుకోసం ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, అలవికాని పరిస్థితుల్లో ఆయన సొంత పార్టీ ఏర్పాటు ఖాయమని తెలుస్తోంది. తాను ఆశించిన మార్పు పార్టీలో వస్తే కాంగ్రెస్లో ఉంటానని, లేదంటే దసరా తర్వాత కీలక నిర్ణయం తీసుకుంటానని అనుచరులతో చెబుతున్నట్లు తెలుస్తోంది. అప్పటి నుంచీ నిందలే.. బీజేపీ, టీఆర్ఎస్లలో పనిచేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన జగ్గారెడ్డి తనదైన శైలిలో రాజకీయం నెరుపుతుంటారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయి, 2018లో సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వేదికగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. తన ఆహార్యంతోనే విలక్షణంగా కనిపించే జగ్గారెడ్డి ఏది చేసినా చర్చకు దారితీస్తుందనేది రాజకీయవర్గాల అభిప్రాయం. అప్పట్లో తెలంగాణ ప్రజలంతా ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తుంటే జగ్గారెడ్డి మాత్రం ‘జై సమైక్యాంధ్రప్రదేశ్’అని విమర్శల పాలయ్యారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇదే విషయాన్ని ఆయన పలుమార్లు మీడియా సమావేశాల్లో వెల్లడించారు కూడా. రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో కూడా ఆయన పలుమార్లు వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యవహారశైలిపై అనేక సందర్భాల్లో విమర్శలు చేసిన ఆయన పార్టీకి నష్టం కలిగిస్తున్నారనేంతవరకు వెళ్లారు. అయినా వెనక్కు తగ్గని జగ్గారెడ్డి తాను పార్టీ మంచి కోసమే చెబుతున్నానంటూ తనదైన శైలిలోనే ముందుకెళ్లారు. ఉన్నట్టుండి ఏమైందో కానీ... ఆయన మౌనం దాల్చారు. -
Jagga Reddy: రేవంత్రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు.. జగ్గారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు!
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై చేసిన ఘాటు వ్యాఖ్యలు అధిష్టానం దృష్టికి వెళ్లినట్టు తెలిసింది. పదేపదే పార్టీ లైన్ దాటుతూ వ్యవహరిస్తున్న జగ్గారెడ్డిపై చర్యలు కఠినంగా ఉంటాయనే చర్చ జరుగుతోంది. రెండు నెలల క్రితం రాష్ట్ర పర్యటనలో భాగంగా గాంధీభవన్కు వచ్చిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ కీలక సూచనలు చేశారు. పార్టీ లైన్ దాటి ఎవరూ మీడియా ముందు మాట్లాడకూడదని, పార్టీ నేతల గురించి వ్యాఖ్యలు చేయకూడదని హెచ్చరించారు. అప్పటి నుంచి ఎక్కడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయని జగ్గారెడ్డి శనివారం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన తీరు పార్టీ ఇన్చార్జిలను ఆగ్రహానికి గురిచేసినట్టు తెలుస్తోంది. రేవంత్రెడ్డి చేసిన ‘గోడకేసి కొడతాం..’ వ్యాఖ్యలపై పార్టీలో చర్చిస్తామని చెప్పాల్సింది పోయి నోటికి వచ్చినట్టు మాట్లాడటంపై సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయనపై చర్యలకు సిఫారసు చేస్తూ పార్టీ రాష్ట్ర ఇన్చార్జితో పాటు పొలిటికల్ కన్సల్టెంట్గా ఉన్న సునీల్ కనుగోలు సైతం నివేదిక అందించినట్టు తెలుస్తోంది. ఆయనతోపాటు పార్టీకి సమాచారం లేకుండా యశ్వంత్సిన్హాకు బేగంపేట ఎయిర్పోర్టులో టీఆర్ఎస్తో కలిసి స్వాగతం పలికిన వి.హనుమంతరావుకు సైతం షోకాజ్ నోటీసులివ్వాలని అధిష్టానం ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో.. ‘పార్టీ లైన్ దాటి మాట్లాడనని రాహుల్గాంధీకి ఇచ్చిన మాట తప్పినం’దుకు తానే సొంతంగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు చెబుతున్న జగ్గారెడ్డి.. దీనిపై సోమవారం సంచలన ప్రకటన చేయబోతున్నట్టు చెప్పారు. -
ఇది నీ జాగీర్ కాదు.. మేం నీ నౌకర్లం కాదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ పర్యటన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపింది. మాజీ ఎంపీ వి.హనుమంతరావు బేగం పేట ఎయిర్పోర్టులో సిన్హాను కలవడం వివాదాస్పదమైంది. వీహెచ్ వ్యవహారం తన దృష్టికి రాలేదని, పార్టీ నిబంధనలు దాటితే ఎంతటి వారినైనా గోడకేసి కొడతామంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యానించడం కలకలం రేపింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. ‘అసలు రేవంత్ ఎవడు? ఎవరిని కొడతావో కొట్టు చూద్దాం’అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కాంగ్రెస్ పార్టీని కొనుక్కున్నావా?.. పార్టీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు నీ నౌకర్లమేమీ కాదు..’అని మండిపడ్డారు. రేవంత్ వ్యాఖ్యల నేపథ్యంలో జగ్గారెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. సంబంధిత వార్త: కాంగ్రెస్లో కల్లోలం: వీహెచ్ వ్యవహారంపై రేవంత్రెడ్డి సీరియస్ మళ్లీ మాట్లాడాల్సి వస్తోంది ‘టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉండి రేవంత్ అలా ఎలా మీడియా ముందు టెంప్ట్ అయ్యారు. నేను గతంలో టెంప్ట్ అ యితే అనేక పంచాయితీలు వచ్చాయి. రాహుల్ గాంధీతో సమావేశం తర్వాత నేను ఎక్కడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు రేవంత్ మళ్లీ మా ట్లాడాల్సిన పరిస్థితి తెచ్చాడు. సీనియర్ నాయకులను కొడతా అని వ్యాఖ్యానిం చిన వ్యక్తి పీసీసీ పదవిలో కొనసాగకూడదు. దిగిపోవాలి. దీనిపై సోనియాగాంధీ, రాహుల్ గాం ధీలకు లేఖ రాసి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరతా..’అని జగ్గారెడ్డి తెలిపారు. సీఎల్పీని డమ్మీ చేశాడు... ‘పీసీసీ, సీఎల్పీ కాంగ్రెస్ పార్టీకి రెండు కళ్లు. కానీ సీఎల్పీ పోస్టును రేవంత్ రెడ్డి డమ్మీ చేశాడు. ఏమాత్రం విలువ ఇవ్వ కుండా ప్రవర్తిస్తున్నాడు. భట్టి విక్రమార్క ను ఆగం చేస్తున్నాడు. రేవంత్ చేస్తున్న తప్పులన్నీ పార్టీకి లేఖ ద్వారా వివరిస్తా..’అని తెలిపారు. మాపై కోవర్టులని ముద్రవేశాడు.. ‘గతంలో కోవర్టులని నా మీద, వీహెచ్ మీద ముద్రవేసి హైకమాండ్కు రేవంత్రెడ్డి అనేకసార్లు లేఖలు రాయించాడు. మాపై విషప్రచారం చేశాడు. అసమ్మతి వర్గానికి, కోవర్టులకు తేడా తెలియని వ్యక్తి రేవంత్రెడ్డి..’అని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు? ‘రేవంత్రెడ్డి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే పడేవాడు ఎవడూ లేడు. ఇది రేవంత్ జాగీర్ కాదు. మీడియా ముందు ఎలా నోరు పారేసుకుంటావు. నాకు వార్నింగ్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ఎవడు? రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు, ఆహ్వానంపై ఇప్పటివరకు టీపీసీసీ సమావేశం కానీ సీఎల్పీ సమావేశం కానీ ఏర్పాటు చేయలేదు. యశ్వంత్ సిన్హాను కలవాలని గానీ, కలవకూడదని గానీ ఎవరికీ ఎలాంటి సమాచారం లేదు. ఢిల్లీలో యశ్వంత్సిన్హా నామినేషన్ కార్యక్రమంలో రాహుల్గాంధీ, కేటీఆర్ పాల్గొంటే లేని అభ్యంతరం ఇప్పుడెందుకు? రేవంత్ తాను చేసిన వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణ చెప్పాలి’అని డిమాండ్ చేశారు. చదవండి: డైనమిక్ సిటీ హైదరాబాద్కు చేరుకున్నా: తెలుగులో మోదీ ట్వీట్ -
కన్ఫ్యూజన్లో పడ్డ ఎమ్మెల్యే జగ్గారెడ్డి..
-
బీజేపీ నేతలకు ధైర్యముంటే రాకేశ్ ఇంటికి రావాలి: జగ్గారెడ్డి
బీజేపీ నేతలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సవాల్ విసిరారు. జగ్గారెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కాల్పులకు బాధ్యులు ఎవరూ అంటూ ప్రశ్నించారు. బీజేపీ నేతలకు ధైర్యం ఉంటే వరంగల్ రాకేశ్ ఇంటికి రావాలని సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ రద్దు అయ్యే వరకు బండి సంజయ్, కిషన్రెడ్డిని అడ్డుకుంటామన్నారు. రాకేశ్ మృతదేహంపై టీఆర్ఎస్ జెండా ఎందుకు కప్పారు?. బీజేపీ ప్రభుత్వం రాకేశ్ మృతికి కారణమైతే.. టీఆర్ఎస్ శవయాత్ర రాజకీయం చేసింది’’ అని విమర్శించారు. ఇది కూడా చదవండి: బాసర ట్రిపుల్ ఐటీ వద్ద టెన్షన్.. టెన్షన్ -
ఆర్మీ ఉద్యోగార్థుల పోరాటంలో న్యాయముంది
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్మీ ఉద్యోగార్థుల పోరాటంలో న్యాయం ఉందని సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. కేసులు పెట్టి వారి బంగారు భవిష్య త్ను నాశనం చేయొద్దని రైల్వేశాఖకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయమే యువకుల కోపానికి కారణమైందని, తప్పుడు విధానాలతో యువకుల భవి ష్యత్తును అదానీ, అంబానీలకు అమ్మివేయొద్దంటూ శుక్ర వారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాజకీయ పార్టీల మద్దతు తీసుకోకుండా ఉద్యోగాల కోసం రాష్ట్ర రాజధానిలో ఇంత పెద్ద ఉద్యమం జరగడం ఇదే తొలిసారన్నారు. కేంద్రంతో మాట్లాడి సమస్యను పరిష్కరిం చా ల్సిన బీజేపీ నేతలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని మండిపడ్డారు. కిషన్రెడ్డి చేతులెత్తేస్తే, బండి సంజయ్ పెద్ద పెద్ద మాటలు నరికాడని ఎద్దేవా చేశారు. -
రాజకీయంగా ఎదుర్కోలేకనే ఈడీ దాడులు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేకనే బీజేపీ తన అధికారాన్ని ఉపయోగించుకుని ఈడీని ఉసిగొలుపుతోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసి బీజేపీ వైఫల్యాలను నిలదీసేందుకు రాహుల్గాంధీ సిద్ధమవుతున్న తరుణంలో బీజేపీ ఆయన పాదయాత్రను అడ్డుకునే కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో రాహుల్గాంధీని ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ వరుసగా మూడోరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగింది. బుధవారం ఉదయం నుంచే కాంగ్రెస్ శ్రేణులు, నేతలు గాంధీభవన్కు చేరుకుని దీక్షా శిబిరంలో కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్గాంధీని ప్రజల నుంచి దూరం చేయాలన్నదే బీజేపీ ఉద్దేశమని చెప్పారు. ఏఐసీసీ కార్యాలయంలోకి చొరబడి పోలీసులు తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, పార్టీ నేతలు నిరంజన్, అంజన్కుమార్ యాదవ్, రాములు నాయక్ మల్లు రవి, శివసేనారెడ్డి, నాగరిగారి ప్రీతం, నూతి శ్రీకాంత్గౌడ్, మెట్టు సాయికుమార్, వరలక్ష్మి, నీలం పద్మతో పాటు పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
హైదరాబాద్ ఈడీ ఆఫీస్ ముందు ఉద్రిక్తత
-
HYD: ఈడీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ విచారించడంపై పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. ఇక, హైదరాబాద్లో కూడా కాంగ్రెస్ నేతలు ఈడీ కార్యాలయం ఎదుట నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా మంగళవారం నిరసనల్లో భాగంగా.. ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు జగ్గారెడ్డి ప్రయత్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలు పెట్రోల్ బాటిల్స్తో వచ్చారు. ఈ క్రమంలో పోలీసులు.. జగ్గారెడ్డిని అడ్డుకున్నారు. అనంతరం కాంగ్రెస్ నేతలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఈడీ ఆఫీసు ఎదుట ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
ఈడీ విచారణపై.. కాంగ్రెస్ నిరసనలు
సాక్షి, హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. రాహుల్ విచారణ సందర్భంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయాలన్న ఏఐసీసీ పిలుపు మేరకు హైదరాబాద్లో భారీ ర్యాలీ నిర్వహించాయి. సోమవారం నెక్లెస్రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్దకు పార్టీ జెండాలు చేతబూని పెద్దఎత్తున చేరుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హల్చల్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, ఈడీకి వ్యతిరేకంగా సోనియా, రాహుల్కు మద్దతుగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. టీపీసీసీ పిలుపు మేరకు ఉదయం 10 గంటల నుంచే కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నెక్లెస్రోడ్డుకు చేరుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితోపాటు పార్టీ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్బాబు, జగ్గారెడ్డి, సీతక్క, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, మహేశ్కుమార్గౌడ్, అంజన్కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్రెడ్డి, పొన్నం ప్రభాకర్, షబ్బీర్అలీ, జెట్టి కుసుమకుమార్, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు సునీతారావు, బల్మూరి వెంకట్రావు, నూతి శ్రీకాంత్గౌడ్, మెట్టు సాయికుమార్లతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి చేరుకుని అక్కడ మూడు గంటలకు పైగా బైఠాయించారు. కాంగ్రెస్ అంటే భయంతోనే నోటీసులు: రేవంత్రెడ్డి గాంధీ కుటుంబానికి ఆస్తులు, పదవులు అక్కర్లేదని, ఆ కుటుంబం త్యాగాల కుటుంబమని అనేకమార్లు రుజువైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చెప్పారు. ఈడీ కార్యాలయం ముందు జరిగిన ఆందోళనలో ఆయన ప్రసంగిస్తూ రాహుల్, సోని యాలకు కావాలంటే రూ.50లక్షలు కాదని, రూ.5 వేల కోట్లయినా 24 గంటల్లో కాంగ్రెస్ కార్యకర్తలే సమకూరుస్తారని చెప్పారు. ‘ఇప్పటికే పలు చోట్ల జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందనే భయంతోనే అక్రమంగా ఈడీ నోటీసులిచ్చింది. ఏదైనా కేసులో పోలీ స్ స్టేషన్కు పిలిపించాలన్నా ఎఫ్ఐఆర్ నమోదై ఉం డాలని, నేషనల్ హెరాల్డ్ కేసులో కనీసం ఎఫ్ఐఆర్ కూడా లేకుండానే ఈడీ ఏకంగా విచారణకు పిలిపించడమంటే గాంధీ కుటుంబ ప్రతిష్టను దిగజార్చే యత్నమే’అని పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాను ఈడీ విచారణకు పిలిస్తే ఊరుకోని, సోనియా ఈడీ కార్యాలయంలో అడుగుపెడితే మోదీ పునాదులు కదులుతాయని హెచ్చరించారు. కాంగ్రెస్ భయపడదు: భట్టి సోనియా, రాహుల్ ఈడీ నోటీసులకు భయపడే వ్యక్తులు కాదని సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. 1980లో ఇందిరాగాంధీని కూడా అక్రమంగా జైలుకు పంపిస్తే ఏం జరిగిందో అందరికీ తెలుసునని, దేశ ప్రజలు అప్పటి జనతాపార్టీకి బుద్ధి చెప్పి ఇందిరాగాంధీని ప్రధానిని చేశారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ దేశం నుంచి బీజేపీని తరిమికొట్టేంతవరకు పోరాడతామని, రాహుల్, సోనియాలను కాంగ్రెస్ కార్యకర్తలే కాపాడుకుంటామని చెప్పారు. జగ్గారెడ్డి హల్చల్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనలో ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి హల్చల్ చేశారు. అందరికంటే ముందుగా నెక్లెస్రోడ్డుకు చేరుకున్న ఆయన చాలాసేపు ఇందిరాగాంధీ విగ్రహం ముందే బైఠాయించి నేతలతో కలిసి నినాదాలు చేశారు. అనంతరం ఇందిరాగాంధీ విగ్రహం ఫ్లాట్ఫారం వరకు ఎలాంటి నిచ్చెనా లేకుండా ఎక్కి తన నిరసన తెలిపారు. బీజేపీ అక్రమాలను ప్రశ్నిస్తూ ప్లకార్డులను ప్రదర్శించిన ఆయన ఆ తర్వాత కాంగ్రెస్ జెండాను పట్టుకుని కొంతసేపు హల్చల్ చేశారు. -
కాంగ్రెస్ ఉనికి లేదనడం అనాలోచితం: జగ్గారెడ్డి
సాక్షి,హైదరాబాద్: జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఉనికి లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు వ్యాఖ్యానించడం అనాలోచితమని, ఇదే విషయాన్ని రాజకీయ నేతలైన శరద్పవార్, దేవెగౌడ, మమతాబెనర్జీ, స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రేల పక్కన ఆయన కూర్చొని మాట్లాడ గలరా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఎనిమిది మంది ఎంపీలున్న టీఆర్ఎస్ పార్టీ నేతలు 57 మంది ఎంపీలున్న కాంగ్రెస్ పార్టీకి ఉనికేలేదని మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. గాంధీభవన్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ లేదా ప్రపంచ పార్టీ అయినా పెట్టుకోవచ్చని, అది ఆయన ఇష్టమని వ్యాఖ్యానించారు. కేసీఆర్ చేస్తున్న ప్రకటనలు, అస్పష్ట రాజకీయాలతో ఆయన ప్రజల్లో చులకనవడమే కాకుండా రాష్ట్రంలో బీజేపీకి ప్రాణం పోస్తున్నట్లుందని అభిప్రాయపడ్డారు. బీజేపీకి కేసీఆర్ వ్యతిరేకమా కాదా అన్నది త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో తేలిపోతుందన్నారు. మతతత్వ పార్టీ బీజేపీతో లౌకిక భావజాలం ఉన్న కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. -
గవర్నర్ పిలిస్తే సీఎస్, డీజీపీలే వెళ్లరు.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిర్వహిస్తున్న మహిళాదర్బార్ బీజేపీ డైరెక్షన్లో ఉందని ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి ఆరో పించారు. రాజకీయంలో భాగంగా ఈ దర్బార్ ఏర్పాటు చేస్తున్నారే తప్ప దీంతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. శుక్రవారం గాంధీభవన్లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ సమ్మక్క, సారలమ్మ జాతరలో గవర్నర్కు సంబంధించిన ప్రొటోకాల్ పాటించకుండా అవమానపర్చిన అధికారులపై చర్యలు తీసుకోలేకపోయిన తమిళిసై ఇప్పుడు మహిళలకు, రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేయగలరని ప్రశ్నించారు. గవర్నర్ కు ఎలాంటి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని, గవర్నర్ పిలిస్తే సీఎస్, డీజీపీలు వెళ్లరని, అలాంటప్పుడు తమిళిసైకి ఫిర్యాదు చేస్తే ఏం ప్రయోజనమని అన్నారు. కాగా, టీఆర్ఎస్–బీజేపీల రాజకీయ సంబం ధం ఏమిటో రాష్ట్రపతి ఎన్నికతో తేలిపోతుందని, తటస్థంగా ఉంటామని ప్రకటిస్తే బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లేనని అన్నారు. -
గవర్నర్ తమిళిసైపై జగ్గారెడ్డి సంచలన కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరారాజన్, టీఆర్ఎస్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు. జగ్గారెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ డైరెక్షన్లో గవర్నర్ తమిళిసై మహిళా దర్బార్పెట్టారు. ఈ దర్బార్ పెట్టడం వల్ల గవర్నర్కు వచ్చే లాభమేమీ లేదు. మహిళా దర్బార్ పెట్టడం రాజకీయమే. మహిళా దర్బార్తో మహిళలకు ఒరిగేదేమీ లేదు. గవర్నర్ తమిళిసై జిల్లాల్లో పర్యటిస్తే ప్రొటోకాల్ లేదు. ప్రొటోకాల్ ఉల్లగించిన వారిపై చర్యలే తీసుకోలేదు. గవర్నర్ పరిపాలన వస్తే.. బీజేపీ పాలనే సాగుతుంది. బీజేపీ పాలన కావాలి అనుకునేవారు గవర్నర్ పాలన కోరుకుంటారు. ప్రభుత్వం సమస్యలు వినట్లే కాబట్టే ప్రజలు గవర్నర్ను కలిసి దరఖాస్తులు ఇస్తున్నారు. తాను ఏమీ చేయలేనని గవర్నర్కు కూడా తెలుసు. బీజేపీ నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్.. గవర్నర్ అమలు చేస్తున్నారు. గవర్నర్ పిలిస్తే.. చీఫ్ సెక్రటరీ, డీజేపీ రాలేదు. తనకు జరిగిన అవమానంపై ఇంత వరకీ చర్యలు తీసుకోలేదు. ఇంకా ప్రజల సమస్యలను ఎలా పరిష్కరిస్తారు అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే తన మాటలు కేవలం తన వ్యక్తిగతమేనని క్లారిటీ ఇచ్చారు. టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బ్యాంక్ కాంగ్రెస్ రాకుండా గులాబీ పార్టీ ప్రయత్నిస్తోంది. మత విద్వేషాలతో ఓట్లు రాబట్టుకోవాలని బీజేపీ చూస్తోంది. వ్యూహాత్మకంగానే గవర్నర్తో టీఆర్ఎస్ పార్టీ గ్యాప్ను మెయింటెయిన్ చేస్తోంది. రానున్న రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ వ్యూహం తెలిసిపోతుంది. కాంగ్రెస్ నిలబెట్టే సెక్యులర్ రాష్ట్రపతి అభ్యర్థికి టీఆర్ఎస్ ఓటు వేస్తేనే గులాబీ పార్టీ సెక్యులర్ పార్టీ అని నిరూపితం అవుతుంది అని వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: ఒకరికి పబ్లు తప్పా ఏం తెల్వదు.. ఇంకొకరు విచిత్రమైన మనిషి: కేటీఆర్