లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ చేపట్టిన తెలుగుతేజం యాత్రకు అనంతపురంలో సమైక్యసెగ తగిలింది. నగరంలోని ఓ ప్రైవేటు కళ్యాణమండపంలో ఏర్పాటు చేసిన రౌండ్టేబుల్ సమావేశానికి హాజరైన జేపీని సమైక్యవాదులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు సమైక్యవాదులను చెదరగొట్టారు. రెచ్చిపోయిన సమైక్యవాదులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఈ క్రమంలో స్వల్ప తోపులాట జరిగింది. చివరకు భారీ పోలీస్ బందోబస్తు మధ్య జేపీ సమావేశానికి హాజరయ్యారు. సమైక్యవాదులు మాత్రం అక్కడే భైఠాయించి నిరసన తెలిపారు. సమైక్యాంధ్ర అన్న తర్వాతే ఈ ప్రాంతంలో సభలు, సమావేశాలు నిర్వహించుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో జయప్రకాష్ నారాయణ యాత్రను వాయిదా వేసుకున్నారు.
Published Sun, Sep 15 2013 3:06 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement