'ప్రత్యేకం' కోసం వ్యక్తి ఆత్మహత్యాయత్నం | Man attempts suicide over special status for AP | Sakshi
Sakshi News home page

Published Wed, Aug 26 2015 12:19 PM | Last Updated on Thu, Mar 21 2024 8:17 PM

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగటూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. మండలంలోని చేబ్రోలు జాతీయ రహదారిపై బుధవారం ఉదయం సుందరపు దుర్గాప్రసాద్ అనే వ్యక్తి వంటిపై కిరోసిస్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఆ సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని నినాదాలు చేశాడు. స్థానికులు మంటలను ఆర్పి అతడ్ని చికిత్స కోసం తాడేపల్లి గూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రసాద్ చేబ్రోలులోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. ప్రత్యేక హోదా రావడం లేదనే మనస్ధాపంతో ఆత్మహత్మకు పాల్పడినట్టు దుర్గాప్రసాద్ చెబుతున్నాడు. ప్రస్తుతం దుర్గాప్రసాద్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement