13 ఏళ్ల పాపకు నిప్పంటించిన దుండగులు | miscreants-set-ablaze-13-years-student-in-sangareddy | Sakshi
Sakshi News home page

Published Mon, Jun 23 2014 7:28 PM | Last Updated on Wed, Mar 20 2024 3:54 PM

జిల్లాలోని సంగారెడ్డిలో సోమవారం దుండగులు దారుణానికి పాల్పడ్డారు. ఎనిమిదవ తరగతి చదువుతున్న స్వాతి అనే పాఠశాల విద్యార్ధిని కిరోసిన్ పోసి దుండగులు నిప్పంటించిన సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఈ ఘటనలో 80 శాతం గాయాలైన స్వాతిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. 13 ఏళ్లున్న స్వాతి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన సంగారెడ్డిలోని హనుమాన్ నగర్ లో చోటు చేసుకుంది. స్వాతిపై దారుణానికి ఒడిగట్టిన దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన వెనుక కారణాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement