హర్యానాలో తాను కొనుగోలు చేసిన వ్యవసాయ భూమికి తన భర్త రాబర్ట్ వాద్రా డబ్బులు ఇవ్వలేదని, ఆ భూమికి తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రియాంక కార్యాలయం నుంచి ఓ అధికారిక ప్రకటన వచ్చింది. హర్యనాలోని ఫరిదాబాద్లో ప్రియాంక వ్యవసాయ భూమి కొనుగోలు చేశారని, దానికి వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ, డీఎల్ఎఫ్ సంస్థల నుంచి డబ్బులు వచ్చాయంటూ ఆరోపణలు వచ్చాయి.