వచ్చే నెల 11న అన్ని జిల్లాల కాపు నేతలతో భేటీ కానున్నట్లు కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చేవరకూ తాము నిద్రపోయేది లేదని స్పష్టం చేశారు. ఎన్నికల హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలబెట్టుకోవాలని ముద్రగడ డిమాండ్ చేశారు.