అనంతపురంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇవాళ కనగానపల్లి ఎంపీపీ ఉప ఎన్నికను కవరరేజ్ చేయడానికి వెళ్లిన సాక్షి మీడియా వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. 8 కిలో మీటర్ల ముందే సాక్షి వాహనాన్ని ఎలా ఆపుతారంటూ ఎస్పీ రాజశేఖర్ బాబును వివరణ కోరేందుకు ఫోన్ చేస్తే కట్ చేస్తున్నారు. పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మామిళ్ల పల్లి దగ్గర ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణను పోలీసులు అడ్డుకున్నారు. రాప్తాడులో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేశారు.