కొత్త ప్రణాళిక సంఘం ఏర్పాటు అంశానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రణాళిక సంఘాన్ని పునర్వ్యవస్థీకరించడంపై చర్చించేందుకు ప్రధాని తన నివాసంలో ఆదివారం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగానే ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రాల వాదనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రులు కోరనున్నారు. ఆయా రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా నేరుగా నిధులనే అందించాలని తమ వాదన వినిపించేందుకు సన్నద్ధమయ్యారు. ఇదిలా ఉండగా కొత్త ప్రణాళిక సంఘ ఏర్పాటును వ్యతిరేకించే ఆలోచలనలో కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు ఉన్నారు.
Published Sun, Dec 7 2014 2:54 PM | Last Updated on Fri, Mar 22 2024 11:20 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement