వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడంతో ఎలాంటి వివాదం లేదని టీటీడీ ఈవో ఎంజీ గోపాల్ స్పష్టం చేశారు. వైఎస్ జగన్ హిందూ సంప్రదాయబద్ధంగానే స్వామివారిని దర్శించుకున్నారని ఆయన తెలిపారు. ఈ విషయంలో మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని టీటీడీ ఈవో గోపాల్ మండిపడ్డారు.