ఆత్మహత్య చేసుకుంటానంటూ రైతు బెదిరింపు | waranga farmer climb on Tower Near Assembly | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 29 2015 2:48 PM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

అసెంబ్లీ సాక్షిగా మంగళవారం ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న సెల్ టవర్ ఎక్కి పైనుంచి దూకుతానంటూ బెదిరింపులకు దిగాడు. తనకున్న రూ.2 లక్షల అప్పును ఎలా తీర్చాలని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ చర్యకు పాల్పడ్డాడు. అతడిని వరంగల్ జిల్లా రైతు సమ్మయ్యగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని రైతును కిందకు దించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే తనకు ప్రభుత్వం నుంచి సరైన భరోసా లభిస్తేనే కిందకు దిగుతానంటూ రైతు స్పష్టం చేశారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement