పాత పెద్ద నోట్ల రద్దుతో వ్యవసాయరంగం కుదేలయిందని, రైతాంగం సంక్షోభంలో కూరుకుపోయిందని వైఎస్సార్ సీపీ రైతు విభాగం నేతలు ఎంవీఎస్ నాగిరెడ్డి, శరత్ చంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... దేశానికి ఆహారభద్రత అందించే రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నగదు రహిత ఆర్థికవ్యవస్థ ఎలా సాధ్యమని ప్రశ్నించారు.