nagi reddy
-
తాడేపల్లిలో నాగిరెడ్డి అనే యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
జడ్చర్ల కోనేరుకు వెయ్యేళ్ల చరిత్ర
జడ్చర్ల: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని కోనేరుకు వెయ్యేళ్ల చరిత్ర ఉందని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ శివనాగిరెడ్డి తెలిపా రు. ఆయన ఆదివారం కోనేరును సందర్శించి పలు ఆసక్తికర వివరాలను వెల్లడించారు. ఈ కోనేరును కల్యాణ చాళుక్యుల కాలంలో క్రీ.శ.11వ శతాబ్దిలో నిర్మించినట్లు మండపంలోని స్తంభాలు, శిథిల శిల్పాలను బట్టి తెలుస్తోందని వివరించారు. జడ్చర్లలో కల్యాణ చాళుక్యల శాసనం, కందూరు చోళుల శాసనం ఉన్నాయన్నారు. జడ్చర్ల పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఉన్న క్రీ.శ.1125, ఫిబ్రవరి 19 నాటి కల్యాణ చాళుక్య చక్రవర్తి భూలోక మల్ల మూడో సోమేశ్వరుడి శాసనంలో.. ఆయన కుమారుడైన మూడో తైలపుడు యువరాజుగా కందూరును పాలిస్తుండగా గంగాçపురంలో ఒక జైన చైత్యాలయాన్ని నిర్మించినట్లుందని తెలిపారు. ఆలయం వెలుపల క్రీ.శ.11వ శతాబ్దికి చెందిన సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాన్ని భద్రపరిచారన్నారు. రెండు వైపుల మెట్లు, మండపాలు కదిలిపోయాయని పేర్కొన్నారు. వీటికి మరమ్మతులు చేసి కోనేరుకు పూర్వ వైభవం తీసుకురావచ్చని, ఇందుకు స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. -
రాణి రుద్రమదేవి @ 1289
తెనాలి: కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమదేవి జీవిత అంశాలను గుంటూరు జిల్లాలోని మూడు శాసనాలు బహిర్గతం చేస్తున్నాయి. ఇటీవల వెలుగుచూసిన ప్రస్తుత పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం పుట్లగూడెం కొండపై గల శాసనం.. ఆమె మరణకాలంపై గల సందేహాలను తీరుస్తోంది. విజయవాడ కల్చరల్ సెంటర్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్వేషణలో అక్కడి పురాతన బౌద్ధస్థావరం బహిర్గతమైంది. అక్కడి ఆయక స్తంభంపై చెక్కిన శాసనంలో గల రాణి రుద్రమదేవి వివరాలను తెలంగాణ చరిత్రకారుడు శ్రీరామోజు హరగోపాల్ వెలుగులోకి తెచ్చారు. సూర్యాపేట జిల్లాలోని చందుపట్లలోని శాసనంపై గల కాలాన్నే నిజమైన మరణ తేదీగా ఎక్కువమంది భావిస్తారు. పుట్లగూడెం కొండపై వెలుగుచూసిన తాజా శాసనం ఆ కాలాన్ని బలపరిచేలా ఉందని హరగోపాల్ వెల్లడి చేశారు. క్రీ.శ 1289 డిసెంబర్ 15న వేసిన ఈ శాసనంలో రుద్రమదేవి మరణం తర్వాత, కొండపై గల ఆలయానికి భూమిని దానమిచ్చినట్టుంది. చందుపట్లలోని సోమనాథ దేవాలయ శాసనం(1289 నవంబర్ 25)లో రుద్రమదేవికి శివలోక ప్రాప్తి కోరుతూ దేవాలయానికి భూమిని దానం ఇచ్చినట్టుంది. రుద్రమదేవి మరణించాక, దశ దిన కర్మ జరిగేలోపు.. అంటే అందులోని తేదీకి దాదాపుగా పక్షం రోజుల ముందు ఆమె మృతిచెంది ఉంటారని చరిత్రకారుల అంచనా. గుంటూరు జిల్లా వినుకొండ దగ్గర్లోని ఈపూరులో నాగమయ్యస్వామి ఆలయంగా వ్యవహరించే గోపాలస్వామి ఆలయం ఎదుట గల స్తంభంపై 1289 నవంబర్ 28న చెక్కిన శాసనంలో రుద్రమదేవితో పాటు అంగరక్షకుడు బొల్నాయినికి పుణ్యంగా స్వామికి భూమిని సమర్పించినట్టుంది. ఈ రెండు శాసనాల్లో రాణి రుద్రమదేవితోపాటు ఆమె సైన్యాధిపతి మల్లికార్జుననాయుడు, అంగరక్షకుడు బొల్నాయినికి కూడా శివప్రాప్తి కోరారు. అంటే ముగ్గురూ ఒకేసారి మరణించారని చరిత్రకారులు చెబుతారు. చనిపోయే నాటికి ఆమె వయసు 80 ఏళ్లు! అంబదేవుడి తిరుగుబాటును అణిచివేసే యుద్ధంలో రుద్రమదేవి మరణించినట్టు చరిత్ర కథనం. చందుపట్ల, ఈపూరు శాసనాలు 1289 నవంబర్ 25, 28 తేదీల్లో వేయించినవి. అప్పటికి కొద్దిరోజుల ముందే ఆమె చనిపోయారు. పుట్లగూడెం కొండపై శాసనాన్ని అదే ఏడాది డిసెంబర్ 15న చెక్కారు. అంటే అప్పటికే రుద్రమదేవి జీవించి లేరని స్పష్టమైందని హరగోపాల్ వెల్లడించారు. చనిపోయేనాటికి ఆమె వయసు 80 ఉండొచ్చని ప్రముఖ చరిత్రకారుడు పీవీ పరబ్రహ్మశాస్త్రి అంచనా. 1289లో రుద్రమదేవి మరణించినందున ఆమె జన్మ సంవత్సరం 1209 అయివుండొచ్చు. తన 52 ఏళ్ల వయసులో రుద్రమదేవి పట్టాభిషిక్తులయ్యారని వెల్లడవుతోంది. రుద్రమదేవికి చెందిన కీలక శాసనాలు మూడూ ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే ఉండటం విశేషం. -
గాజువాకలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం
-
సీఎం జగన్ రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నారు: నాగిరెడ్డి
-
‘తాకట్టు పెట్టిన పుస్తెల తాడు ఇంటికి తెస్తానన్నావ్.. కానీ నువ్వు చేసిందేమిటి?’
సాక్షి, అమరావతి: చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రైతులను అణిచివేశారని ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కోనసీమలో ప్రతి రైతుకు ధాన్యం డబ్బులు చెల్లించామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందన్నారు. చదవండి: కింజరాపు వారి మైనింగ్ మాయ.. అచ్చెన్న ఫ్యామిలీ గ్రానైట్ బాగోతం ఇన్పుట్ సబ్సిడీని సకాలంలో చెల్లిస్తున్నామన్నారు. చంద్రబాబు హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకున్నామని తెలిపారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఆత్మహత్యలు తగ్గిపోయాయన్నారు. అధికారం కోల్పోయాకే చంద్రబాబుకు రైతులు గుర్తొస్తారని నాగిరెడ్డి దుయ్యబట్టారు. ‘‘రాష్ట్రంలో వ్యవసాయ రంగం నాశనం అయిందట.. చంద్రబాబు ఉన్నపుడు బాగుందట. కోనసీమలో క్రాప్ హాలిడే అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. తాకట్టు పెట్టిన పుస్తెల తాడు ఇంటికి తెస్తానని హామీ ఇచ్చారు చంద్రబాబు. కానీ ఆ రోజు ఇచ్చిన హామీలను ఒక్కటైనా అమలు చేశారా?. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆ రోజు చంద్రబాబును ప్రశ్నించారా?. చంద్రబాబు పెట్టిన బకాయిలు కూడా చెల్లించింది సీఎం వైఎస్ జగన్. 76 వేల కోట్ల రూపాయలు రైతులకు ఇప్పటికే అందించాం. ఎఫ్సీఐ నుంచి రూ.300 కోట్లకు పైగా రావాలి. పవన్ కల్యాణ్ ఎవరిని ప్రశ్నించాలి.? ఆ డబ్బు ఇప్పించాలని బీజేపీని పవన్ ఎందుకు ప్రశ్నించరు..?. కోనసీమలో ధాన్యం డబ్బు ప్రతి రైతుకు అందాయి. కోనసీమకు ఈ పని చేశానని చంద్రబాబు ధైర్యంగా చెప్పాలి. చంద్రబాబు హయాంలో కరువు మండలాలుగా ప్రకటిస్తే.. మేము వచ్చాక కరువు మండలాలే లేవు. రైతులకు పంటల బీమా, ఇన్ఫుట్ సబ్సిడీ విషయంలో టీడీపీ చేసిందేమిటి...? చంద్రబాబు 11 శాతం మేర వ్యవసాయ బడ్జెట్ పెడితే.. మేము మొన్నటి బడ్జెట్లో 16 శాతం పెట్టాం. నేను వెళ్లడం వల్లే రైతులకు ధాన్యం డబ్బులు వచ్చాయ్ అని పవన్ అంటున్నాడు. ఆయన వెళ్లడం వల్లనే రైతు భరోసా, అమ్మఒడి వంటి పథకాలు వచ్చాయా..?. కోనసీమ గొడవలు జరిగాక ఇప్పుడు మళ్లీ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని’’ నాగిరెడ్డి నిప్పులు చెరిగారు. -
రెండేళ్లలో పలు విశిష్ట సంక్షేమ పథకాలు
-
కరోనాతో మాజీ మంత్రి నాగిరెడ్డి కన్నుమూత
ధర్మవరం: కరోనాతో మాజీ మంత్రి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గరుడమ్మగారి నాగిరెడ్డి(68) శనివారం మృతి చెందారు. పదిరోజుల క్రితం కరోనాతో బాధపడుతున్న ఆయనను అనంతపురంలోని ఓప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. శనివారం సాయంత్రం పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గరుడమ్మగారి నాగిరెడ్డి ధర్మవరం నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా 1983, 1985, 1989లో టీడీపీ తరఫున ఎన్నికయ్యారు. తెలుగు సాహిత్యం మీద అవగాహన ఉన్న నాగిరెడ్డి సొంతంగా పత్రిక పెట్టి సంపాదకునిగా వ్యవహరించారు. ఈ పరిచయంతోనే టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు పార్టీలో చేర్చుకుని టీడీపీ టికెట్ ఇచ్చారు. మూడో దఫా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన చేనేత జౌళి, చిన్ననీటి పారుదల శాఖ మంత్రిగా పని చేశారు. భార్య సునీత, కుమారుడు సతీష్రెడ్డి ఉండగా.. కుమారుడు 2016లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. కుమారుని మరణంతో రాజకీయాలకు స్వస్తి పలికి ఆయన ఇంటికే పరిమితమయ్యారు. నాగిరెడ్డి మృతి పట్ల ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చదవండి: సినీ గేయ రచయిత అదృష్ట దీపక్ కన్నుమూత కానిస్టేబుల్ ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే దుద్దుకుంట -
పక్కా వ్యూహంతో ముందుకు..
సాక్షి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల సంచారం ఉన్న నేపథ్యంలో ఆదిలోనే నిలువరించేందుకు పోలీసులు పక్కా వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. డీజీపీ మహేందర్ రెడ్డి ఈ మేరకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండో రోజూ డీజీపీ పర్యటన కొనసాగింది. ఎస్పీ క్యాంపులోనే గురువారమంతా గడిపారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పలు అంశాలపై ఉన్నతాధికారులతో చర్చిస్తూ.. వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా పలు సూచనలు చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో మావోయిస్టులు రాష్ట్ర, డివిజన్, ఏరియాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసువర్గాలు గుర్తించాయి. మారుమూల, గిరిజన ప్రాంతాల్లో సానుభూతిపరులతో బలం పెంచుకునే క్రమంలో వారిని ఆదిలోనే అదుపు చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు డీజీపీ క్షేత్రస్థాయి పర్యటన సాగుతోంది. ముఖ్యంగా అంతర్రాష్ట్ర సరిహద్దుగా ఉన్న జిల్లాల్లో పర్యటిస్తూ.. స్థానికంగా ఉన్న పరిస్థితులు తెలుసుకుంటున్నారు. మావోల ప్రభావం లేకుండా చేసేందుకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా వ్యవహరించాలో పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రభావిత ప్రాంతాల్లో రోజుల తరబడి గడుపుతూ స్థానిక ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేస్తున్నట్లు కనిపిస్తోంది. స్థానిక పోలీసులు సరైన దిశలో వెళ్లేలా ప్రత్యేకంగా ఈ సమయం కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. కేబీఎం కమిటీ దళ సభ్యులను అదుపులోకి తీసుకోవాలన్న కృతనిశ్చయంతోనే ఉమ్మడి జిల్లా పోలీసు యంత్రాంగం పనిచేస్తోంది. ఇందుకోసం దళ సభ్యులకు ఏ వైపు నుంచీ సాయం అందకుండా పోలీసు ఇన్ఫార్మర్లను మరింతగా వాడుకోనున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా రెండురోజుల పాటు రాష్ట్ర పోలీస్ బాస్ ఆసిఫాబాద్ లాంటి మారుమూల ప్రాంతంలో గడపడం ఇదే తొలిసారి. ఇక మావోయిస్టు అగ్రనేత గణపతి, ఇతర కేంద్ర కమిటీ సభ్యుల లొంగుబాటు వార్తలు పూర్తిగా అ వాస్తవమని కేంద్ర కమిటీ నుంచి గురువారం ఓ ప్రకటన విడుదల కావడం అనుమానాలకు తెరదించినట్లయ్యింది. కాగా, వరంగల్ జోన్ ఐజీ నాగిరెడ్డి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు, సిరికొండ పోలీస్స్టేషన్లను తనిఖీ చేశారు. మావోల సంచారంపై ఆరా తీశారు. ఇలా రాష్ట్రస్థాయి పోలీసు ఉన్నతాధికారులు వరుసగా సందర్శించడం ఆసక్తిగా మారుతోంది. మావోయిస్టుల సంచారం నేపథ్యంలో పలుచోట్ల పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. -
కన్నా లేఖలోని అంశాలు.. పచ్చి అబద్దాలు
సాక్షి, అమరావతి: మొక్కజొన్నకు మద్దతు ధర రూ.2,550 కల్పించాలంటూ.. బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాసిన లేఖలోని అంశాలన్ని పచ్చి అబద్ధాలని మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.1,760 మాత్రమే అని గుర్తుచేశారు. కేంద్రం మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించి ఎలాంటి డబ్బు చెల్లించదన్నారు. ప్రజా పంపిణీ కోసం కొనుగోలు చేస్తేనే రూ.1760 మద్దతు ధర ఇస్తుందని చెప్పారు. వాస్తవాలు కాకుండా అవాస్తవాలను కన్నా ప్రచారం చేస్తున్నారని నాగిరెడ్డి మండిపడ్డారు. కేవలం విమర్శలు చేయాలనే ఉద్దేశంలోనే కన్నా ఇలాంటి లేఖలు రాస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి చర్యలు చేపట్టిందని ఆయన అన్నారు. ప్రకటించిన మద్దతు ధర ప్రకారం ప్రభుత్వం రైతుల నుంచి మొక్కజొన్న పంటను కొనుగోలు చేస్తోందని నాగిరెడ్డి పేర్కొన్నారు. -
రైతులకు అండగా వైఎస్ జగన్ సర్కార్
-
ఎన్నికల కోడ్ కఠినంగా అమలు
సాక్షి, హైదరాబాద్: పురపాలక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమా వళి అమల్లో కఠినంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్లను, ఎన్నికల ఇన్చార్జ్లను స్టేట్ ఎలక్షన్ కమిషనర్ వి.నాగిరెడ్డి ఆదేశించారు. ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడే వరకు ఎన్నికల కోడ్ను కచ్చి తంగా పాటించాలని, అధికార పార్టీతోసహా ఎవ రూ ఎక్కడా కోడ్ ఉల్లంఘనకు పాల్పడకుండా కచ్చితమైన చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు ఎక్కువగా ఓటింగ్కు రావడం లేదని, మున్సిపల్ ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణకు ముందు అభ్యర్థుల వివరాలు సరిగా చూసుకోవాలని, అలాగే, అభ్యర్థులకు ఎన్నికల గుర్తు కేటాయించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు, అధికారుల సంసిద్ధతపై ఎస్ఈసీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎన్నికల ఇన్చార్జ్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో నాగిరెడ్డి మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటరు జాబితాలు ఇంకా సిద్ధం చేయని మునిసిపల్ కమిషనర్లు వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. పోలింగ్ విధులు నిర్వర్తించే ఎన్నికల సిబ్బందికి రెండో విడత శిక్షణ కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే, పోలింగ్ రోజు ప్రజల చేతి వేలిపై సిరా గుర్తు వేసేటప్పుడు నిశితంగా పరిశీలించాలని నాగిరెడ్డి సూచించారు. కమిషన్ ప్రకటించిన గుర్తింపు కార్డులలో ఏదో ఒక గుర్తింపు కార్డును చూసిన తర్వాతే ఓటింగ్కు అనుమతించాలన్నారు. మున్సిపల్శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి, ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఎన్నికల షెడ్యూల్ సవరించాలి
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ రిజర్వేషన్లపై అభ్యంతరాలకు కనీసం వారం రోజుల సమయం ఉండేలా ఎన్నికల షెడ్యూల్ను సవరించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డికి బీజేపీ ప్రతినిధిబృందం విజ్ఞప్తి చేసింది. ఈ నెల 4, 5 తేదీల్లో మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లు ప్రకటించనుండగా, 7వ తేదీనే నోటిఫికేషన్ జారీచేస్తే రిజర్వేషన్లపై అభ్యంతరాలకు సమయం సరిపోదని పేర్కొంది. అనేక మున్సిపాలిటీల్లో వార్డు విభజనల లెక్కల్లో తప్పులు, వార్డులు వారీగా ఓటర్ల జాబితాల్లో, ఎస్సీ,ఎస్టీ,బీసీ జనగణనలో అక్రమాలు చోటుచేసుకున్నాయని తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ఎస్ఈసీ కార్యాలయంలో నాగిరెడ్డికి బీజేపీ ఉపాధ్యక్షుడు, మున్సిపల్ ఎన్నికల సమన్వయకర్త డా.ఎస్.మల్లారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్చందర్జీల ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఎస్టీ,ఎస్సీ,బీసీ,మహిళా రిజర్వేషన్ల విషయంలో పారదర్శకత పాటించాలని, నిజాంపేట, బడంగ్పేట,పెద్దఅంబర్పేట తదితర మున్సిపాలిటీలు,కార్పొరేషన్లలో వార్డులవారీగా ఓటర్ల జాబితాల్లో తప్పులు వెంటనే సరిదిద్దాలని కోరారు. తాము పేర్కొన్న అంశాలపై నాగిరెడ్డి సానుకూలంగా స్పందించారని మల్లారెడ్డి మీడియాకు తెలిపారు. -
సంక్రాంతి కానుకగా రైతు భరోసా
-
రసాభాసగా అఖిలపక్ష భేటీ
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికలపై శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో జరిగిన అఖిలపక్ష సమావేశం రసాభాసగా మారింది. సమావేశానికి హాజరయిన కాంగ్రెస్ పార్టీ నేతలు మధ్యలోనే వాకౌట్ చేశారు. అంతకు ముందు కాంగ్రెస్ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, నిరంజన్రావు ఎన్నికల కమిషనర్తో వాదనలకు దిగారు. తమ అభిప్రాయాలను పట్టించుకోలేదని, ఈసీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం ఇష్టప్రకారం నోటిఫికేషన్ విడుదల చేశారని, ఎన్నికల కమిషన్ అధికార పార్టీకి, ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తోందని శశిధర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అయితే కాంగ్రెస్ నేతలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్తో ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. దీంతో తాము వాకౌట్ చేస్తున్నామంటూ మర్రి శశిధర్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్, ఎంఐఎం మినహా.. మిగతా పార్టీలు రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశాయని తెలిపారు. అయితే వారి డిమాండ్లను ఈసీ పట్టించుకోలేదని అన్నారు. షెడ్యూల్లో మార్పులు చేసి సంక్రాంతి తర్వాత ఎన్నికలు నిర్వహించాలని కోరామని, దానిపై ఎన్నికల సంఘం ఎలాంటి సమాధానం ఇవ్వలేదన్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధి నిరంజన్రావు మాట్లాడుతూ... రిజర్వేషన్లు ప్రకటించకుండా ఎన్నికలు నిర్వహించడం మొదటిసారి చూస్తున్నామన్నారు. ఎన్నికల ప్రధాన అధికారి నాగిరెడ్డి అధికార పార్టీకి వత్తాసు పలికే విధంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ పార్టీలతో ఎన్నికల కమిషనర్ దురుసుగా ప్రవర్తించడం సరికాదన్నారు. ఎన్నికల కమిషన్ కార్యాలయం టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లా ఉందని తెలంగాణ లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు నాగరాజు వ్యాఖ్యానించారు. బీసీల రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లు తగ్గించి కుట్ర చేశారన్నారు. రిజర్వేషన్లు ప్రకటించకుండా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. మద్యం దుకాణాలు మూసివేయాలని చెప్పినా ఎన్నికల కమిషనర్ పట్టించుకోలేదని విమర్శించారు. దళిత బహుజన పార్టీ నేత కృష్ణ స్వరూప్ మాట్లాడుతూ... కుల దురహంకారం చూపించారని, రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని చెబితే తనపై దాడి చేశారన్నారు. తనపై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని ఆయన తెలిపారు. -
ఎన్నికల కోడ్ నిబంధనలపై కమీషనర్లకు నాగిరెడ్డి సూచనలు
-
సంతృప్త స్థాయిలో పథకం వర్తింపు
-
వైఎస్సార్ ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేశారు
సాక్షి, విశాఖపట్నం : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన పాలనతో పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని వైఎస్సార్ సీపీ గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. సోమవారం వైఎస్సార్ 10వ వర్ధంతి సందర్భంగా ఆసిల్ మెట్ట జంక్షన్లోని మహానేత విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వేమనసంక్షేమ సంఘ గౌరవాధ్యక్షులు సత్తి నాగేశ్వరరెడ్డి, అధ్యక్షులు ఎన్. వివేకానందరెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల మాజీ చైర్మన్ సత్తి రామకృష్ణారెడ్డి , వేమన సంఘం ప్రధాన కార్యదర్శి సత్తి రామకృష్ణారెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శి బోరా కుమార్ రెడ్డి, సంఘ నాయకులు సుబ్బారెడ్డి, కర్రి రామారెడ్డి, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ పేద ప్రజలకి అండగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు నెలల తన పాలనలోనే ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చారని తెలిపారు. అధికారంలోకి వచ్చి వంద రోజులు కాకుండానే లక్షకుపైగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్న ఘనత వైఎస్ జగన్దేనన్నారు. -
వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత కల్పించారు
-
మున్సిపల్ ఎన్నికలు.. ఎవరి గుర్తులు వారికే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో త్వరలో జరుగనున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలు, మున్సిపల్ శాఖ అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి సమావేశం నిర్వహించారు. సోమవారం జరిగిన ఈ భేటీలో రిజర్వేషన్లు, వార్డుల పునర్విభజన, ఓటర్ల తుది జాబితా వంటి అంశాలపై వారితో చర్చించారు. సమావేశం అనంతరం నాగిరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలకు సంబంధించిన డ్రాఫ్ట్ ఈనెల 10న సిద్ధమవుతుందని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్కు 15 రోజుల ముందు షెడ్యూల్ ప్రకటిస్తామని వెల్లడించారు. షెడ్యూల్ లోపే ఎన్నికలు జరుపుతామని.. సుమారు 50 లక్షల ఓటర్లు పొల్గొనే అవకాశం ఉందని చెప్పారు. సమావేశం అనంతరం నాగిరెడ్డి మాట్లాడుతూ.. పలు వివరాలను వెల్లడించారు. ‘‘మున్సిపల్, వార్డుల జాబితాను త్వరలోనే విడుదల చేస్తాం.12వ తేదీలోపు ఏమైనా ఫిర్యాదులు, సలహాలు ఉంటే మున్సిపల్ కమిషనర్కు ఇవ్వచ్చు. 14వ తేదీ వరకు ఎన్నికల ఓటర్ జాబితాను ప్రకటిస్తాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకొని నూతన జాబితా సిద్ధం చేస్తాం. ప్రతి వార్డులో ఎంత మంది ఉన్నారో తెలిశాక పోలింగ్ కేంద్రాల వారిగా ఓటర్ల జాబితాను విడుదల చేస్తాం. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 800 మంది ఓటర్లు ఉండే అవకాశం ఉంది. బ్యాలెట్ పేపర్తోనే ఎన్నికలను నిర్వహిస్తాం. దాదాపు పాత పోలింగ్ కేంద్రాలనే ఈ ఎన్నికలకు కూడా ఉపయోగిస్తాం. ఈ నెల11న అధికారులతో మరోసారి సమావేశం ఉంటుంది. 13వ తేదీన పోలింగ్ కేంద్రాలపై మున్సిపల్ కమిషనర్లతో సమావేశం అవుతాం. 14న రిజర్వేషన్లు ఖరారు అవుతాయి. ఆ తరువాత ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. గుర్తింపు పొందిన పార్టీల గుర్తులు వారికే కేటాయిస్తాం’’ అని తెలిపారు. నాగిరెడ్డితో భేటీలో హాజరైన రాజకీయ పార్టీల నేతలు.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, టీడీపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నిరంజన్, బీజేపీ మల్లారెడ్డి, సీపీఐ పళ్ల వెంకట్ రెడ్డి, సీపీఎం నంద్యాల నర్సింహారెడ్డి, ఎంఐఎం జాఫ్రీ మున్సిపల్. -
పరిషత్ ఫలితాలు వాయిదా వేయాలి
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల చివరివరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల వెల్లడిని వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డికి బుధవారం బీజేపీ బృందం విజ్ఞప్తి చేసింది. ఫలితాలు వెలువడ్డాక జెడ్పీపీ చైర్పర్సన్లు, ఎంపీపీ అధ్యక్షుల ఎన్నికకు నెలకుపైగా వ్యవధి ఉంటున్నందున పెద్దఎత్తున క్యాంప్ రాజకీయాలు, ప్రలోభాల పర్వానికి తెరతీసినట్టు అవుతుందని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చింది. బుధవారం ఎస్ఈసీ కార్యాలయంలో నాగిరెడ్డికి బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం వినతిపత్రం సమర్పించింది. రాష్ట్రంలో చిన్న జిల్లా పరిషత్లు ఏర్పడిన నేపథ్యంలో క్యాంప్ రాజకీయాలు పెరిగే అవకాశమున్నందున పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపును వాయిదా వేయాలని వారు కమిషనర్ను కోరారు. తమ విజ్ఞప్తిపై కమిషనర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. ప్రలోభాలకు అవకాశం: కె.లక్ష్మణ్ దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో బీసీ రిజర్వేషన్లను తుంగలో తొక్కి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారని లక్ష్మణ్ విమర్శిం చారు. కమిషనర్కు వినతిపత్రం ఇచ్చాక ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 27న పరిషత్ ఫలి తాలు వెలువడ్డాక, జూలై 12న జెడ్పీపీ చైర్పర్సన్ ఎన్నికలు ఉంటాయని అధికారులు చెబుతున్నారని, ఇంత వ్యవధి ఇస్తే పెద్దఎత్తున ప్రలోభాలకు అవకాశంతో పాటు గెలిచిన అభ్యర్థులను అధికార పార్టీకి అనుకూలంగా తిప్పుకునే అవకాశాలు పెరుగుతాయన్నారు. అందువల్ల స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపును జూన్ ఆఖరు వరకు వాయిదా వేయాలని కమిషనర్ ను కోరామన్నారు. కమిషనర్ను కలిసిన వారిలో ఎమ్మెల్సీ రామచంద్రరావు తదితరులున్నారు. -
కష్టాలు మాకు..కాసులు మీకా?
సాక్షి, అమరావతి: రైతులు రెక్కలు ముక్కలు చేసుకుని ప్రతికూల పరిస్థితుల్లోనూ పంట పండిస్తే గిట్టుబాటు ధర లేకుండా చేస్తారా? అన్నదాతా సుఖీభవా అంటూ రైతులకే శఠగోపం పెడతారా? అని మంగళవారం విజయవాడలో జరిగిన అఖిలపక్ష రైతు సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌర సరఫరాల అధికారులు, మిల్లర్లు మిలాఖత్ అయి ధాన్యానికి గిట్టుబాటు ధర దక్కకుండా చేస్తున్నారని మండిపడింది. ఒక బస్తా వడ్లు పండించడానికి రైతు రక్తమాంసాలను పణంగా పెడుతుంటే మిల్లర్లు అడుగు కదలకుండా అడ్డగోలు దోపిడీకి పాల్ప డుతున్నారని, అయినా ప్రభుత్వం చోద్యం చూస్తోందని ధ్వజమెత్తింది. ప్రభుత్వ దుర్నీతిని ఎండగట్టేందుకు, ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న మోసాల తీరును వివరించేందుకు ఈనెల 27న పౌరసరఫరాల శాఖ కమిషనర్ను కలవాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ అధ్యక్షతన సీపీఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్లో జరిగిన అఖిలపక్ష సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి, ప్రముఖ రైతు నాయకుడు ఎర్నేని నాగేంద్రనాధ్, ఏపీ రైతు సంఘం నేత ఆంజనేయులు, ఏపీ కౌలు రైతుల సంఘం నేత విద్యాధరరావు, రైతు నాయకులు అనుమోలు గాంధీ, కొలనుకొండ శివాజీ, అక్కినేని చంద్రరావు, వై.రమేష్, కె.శ్రీనివాసరావు, కొల్లా రాజమోహన్ తదితరులు హాజరయ్యారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతు నాయకులు ఈ సదస్సులో తమ స్వానుభవాలను వివరించారు. 75 కిలోల బస్తాకి 1200 గ్రాముల ధాన్యాన్ని తారం కింద వ్యాపారులు అదనంగా తీసుకునేది చాలదన్నట్టు టన్నుకి మరో 5 కిలోలు అదనంగా తీసుకుంటున్నారని వాపోయారు. భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ)ను ధాన్యం కొనుగోళ్ల నుంచి ఓ పథకం ప్రకారం తప్పించడం వల్లే సమస్యలు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఐకేపీ సెంటర్లకు వచ్చే ధాన్యాన్ని నేరుగా మిల్లులకు తరలించి రైతుకు దక్కాల్సిన రవాణా చార్జీలను కూడా మిల్లర్లే తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బియ్యాన్ని తిరిగి మరాడించి మిల్లర్లు లబ్ధి పొందుతుంటే పౌరసరఫరాల అధికారులు అసలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యంలో తేమ నిబంధన పేరిట రైతుల్ని ఐకేపీ సెంటర్లలో అష్టకష్టాలు పెడుతున్నందునే రైతులు దిక్కుతోచని స్థితిలో ధాన్యాన్ని అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు రైతులకు ఇస్తామని ప్రకటించిన మొత్తాన్ని ఈ ఖరీఫ్ నుంచే కౌలు రైతులకు కూడా ఇవ్వాలని పలువురు సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం నేత నాగిరెడ్డి మాట్లాడుతూ గత ఐదేళ్లలో వ్యవసాయ రంగ దుస్థితిని వివరించారు. 75 కిలోల బస్తాకి 175 నుంచి 180 రూపాయల మధ్య రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం రైతులు, రైతు సంఘాలతో ఎందుకు చర్చలు జరపడం లేదని నిలదీశారు. అక్రమాలకు పాల్పడే మిల్లర్లపై క్రిమినల్ కేసులు పెట్టి శిక్షించాలని డిమాండ్ చేశారు. ఒక్క ధాన్యం విషయంలోనే ఇలా జరగడం లేదని, రైతు పండించే ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సమగ్ర ప్రణాళిక ఉండాలని సూచించారు. రైతులు సమైక్యంగా ముందుకు కదిలితే అనుకున్నది సాధించవచ్చని పిలుపునిచ్చారు. సదస్సు తీర్మానాలు... – ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల దగాను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగాలి. – ఈ విషయాన్ని చర్చించేందుకు ఈనెల 27న పౌరసరఫరాల కమిషనర్ను కలవాలి. – రైతు సంఘాలు, మిల్లర్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల బాధ్యులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. – రైతులకు ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలి. – అక్రమాలకు పాల్పడుతున్న మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల అధికారులపై వేటు వేయాలి. రేపట్నుంచి బాబూ మా పక్కకే ధాన్యం కొనుగోళ్లలో ప్రస్తుత అవకతవకలకు ఇప్పటి వరకు ప్రథమ ముద్దాయిగా ఉన్న చంద్రబాబు రేపట్నుంచి తమ పక్కన చేరి పోరాడాల్సిందేనని రైతు నాయకుడు అనుమోలు గాంధీ అన్నారు. ఓడిపోయిన తర్వాత ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఉద్యమించక తప్పదన్నారు. 23వ తేదీ తర్వాత రాష్ట్రంలో పెద్ద మార్పు రాబోతోందని ఈనాటి మొదటి ముద్దాయి (ముఖ్యమంత్రి చంద్రబాబు) రేపొద్దున ప్రతిపక్ష నేతగా రైతు సమస్యలపై గళం విప్పక తప్పదన్నారు. ఎవరొచ్చినా కమ్యూనిస్టులు పోరాటం చేయాల్సిందేనని, వాళ్లతో కలిసి మున్ముందు ఇతర రైతు సంఘాలు, పార్టీలు పోరాడక తప్పదని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. -
రెండు ఎంపీటీసీలకు రీపోలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండు ఎంపీటీసీ స్థానా ల్లో రీపోలింగ్ జరగనుంది. సోమవారం జరిగిన మొదటి విడత పరిషత్ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల బ్యాలెట్ పత్రాలు కలసిపోవడంతో ఈ స్థానాల విష యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసు కుంది. రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండ లం అజీజ్నగర్ ఎంపీటీసీ, సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం అల్వాల్ ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 14 న మూడో విడత ఎన్నికల్లో భాగంగా రీపోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి ఆదేశించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక ఎంపీటీసీ స్థానంలో బ్యాలెట్పత్రాలు కలసిపోయినా, దీన్ని సకాలంలో గుర్తించడంతో సోమవారమే సరిచేసి ఎన్నికలు నిర్వహించారు. రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని ఈ రెండు ఎంపీటీసీ స్థానాల్లో ఓటర్లకు తప్పుడు బ్యాలెట్ పేపర్లను పంపిణీ చేసిన నేపథ్యంలో మళ్లీ ఎన్నికల నిర్వహణకు నోటి ఫికేషన్ జారీచేయాలని అధికారులను ఎస్ఈసీ ఆదేశించింది. ఈ స్థానాల్లోని ఓటర్లకు ఈ నెల 14న నిర్వహించే రీపోలింగ్ సందర్భంగా ఎడమ చేతి నాలుగో వేలిపై సిరాచుక్క వేయాలని సూచించింది. కాగా, పరిషత్ ఎన్నికల్లో భాగంగా తనిఖీల సందర్భంగా ఇప్పటివరకు రూ.1.6 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఒక్కరోజే రూ.3.95 లక్షల నగదు, రూ.1.6 లక్షల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు 86 ఫిర్యాదులందాయి. మొత్తం 190 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి వాటిపై చర్యలు చేపట్టినట్లు ఎస్ఈసీకి పోలీస్ శాఖ తెలిపింది. -
మంత్రి మల్లారెడ్డిపై చర్య తీసుకోవాలి: టీపీసీసీ
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డిపై చర్య తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డికి టీపీసీసీ ఫిర్యాదు చేసింది. వచ్చేనెల 27 వరకు రాష్ట్రంలో స్థానిక ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా మల్లారెడ్డి తన అధికార లెటర్హెడ్పై పార్టీ పదవి నియామకం చేస్తూ ఉత్తర్వు లు ఇవ్వడాన్ని తప్పుబట్టింది. ఇది ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడమేనని నాగిరెడ్డికి ఇచ్చిన ఫిర్యా దులో టీపీసీసీ ఎన్నికల కమిషన్ సమన్వయ కమిటీ కన్వీనర్ జి.నిరంజన్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ కీసర మండల అధ్యక్షుడిగా సుధాకరరెడ్డిని నియమిస్తూ మంత్రి ఇచ్చిన నియామకపత్రం ప్రతిని కూడా ఈ ఫిర్యాదుకు జతచేశారు -
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్
హైదరాబాద్: తెలంగాణాలో ఎన్నికల హడావిడి మళ్లీ మొదలైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ను తెలంగాణ ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి శనివారం విడుదల చేశారు. హైదరాబాద్లో నాగిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఈ ఎన్నికలను 3 దశల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణాలో మొత్తం 5,857 ఎంపీటీసీ స్థానాలు, 539 జెడ్పీస్థానాలు ఉన్నాయన్నారు. 47 ఎంపీటీసీ స్థానాలతో పాటు, మంగపేట జెడ్పీటీసీ స్థానానికి ఎన్నిక నిర్వహించడం లేదని వెల్లడించారు. నేటి నుంచి కోడ్ అమలులోకి రానుందని చెప్పారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా నామినేషన్ వేసే అవకాశం కల్పించామని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరుగుతాయని చెప్పారు. తెలుపు రంగులో ఎంపీటీసీల బ్యాలెట్ పేపర్, గులాబీ రుంగులో జెడ్పీటీసీల బ్యాలెట్ పేపర్లు ఉంటాయని తెలిపారు. ఎంపీటీసీలకు రూ 1.5 లక్షలు, జెడ్పీటీసీలకు రూ.4 లక్షల గరిష్ట వ్యవపరిమితిగా నిర్ధారించినట్లు వెల్లడించారు. మొత్తం 32 వేల 7 పోలింగ్ బూత్లలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. మొత్తం ఒక కోటి 56 లక్షల 11 వేల 320 మంది ఓటర్లు ఓటు హక్కును ఈ ఎన్నికల్లో వినియోగించుకోనున్నారని అన్నారు. మొదటి విడతలో 197 జెడ్పీటీసీలు, 2166 ఎంపీటీసీ స్థానాలకు, రెండో విడతలో 180 జెడ్పీటీసీలు, 1913 ఎంపీటీసీ స్థానాలకు, మూడో విడతలో 161 జెడ్పీటీసీలు, 1738 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని, ఈ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు లక్షా 47 వేల మంది సిబ్బందిని వినియోగిస్తున్నామని, అలాగే ఎన్నికల ఫలితాలను మే 27న వెల్లడిస్తామని చెప్పారు. తొలి దశలో(197 జెడ్పీటీసీలు..2166 ఎంపీటీసీలు స్ధానాలు) నామినేషన్: ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 24 వరకు నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 25న ఫిర్యాదులు: ఏప్రిల్ 27 నామినేషన్ ఉపసంహరణ: ఏప్రిల్ 28 వరకు పోలింగ్: మే 6న రెండో దశ(180 జెడ్పీటీసీలు..1913 ఎంపీటీసీలు స్ధానాలు) నామినేషన్: ఏప్రిల్ 26 నుంచి ఏప్రిల్ 28 వరకు నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 29న ఫిర్యాదులు: మే 1న నామినేషన్ ఉపసంహరణ: మే 2 వరకు పోలింగ్: మే 10న మూడో దశ(161 జెడ్పీటీసీలు..1738 ఎంపీటీసీలు స్ధానాలు) నామినేషన్: ఏప్రిల్ 30 నుంచి మే 2 వరకు నామినేషన్ల పరిశీలన: మే 3న ఫిర్యాదులు: మే 5న నామినేషన్ ఉపసంహరణ: మే6 వరకు పోలింగ్: మే 14 -
మీకు ఎప్పుడు అందుబాటులో ఉండే లోకల్ హీరో
-
ఓటమి భయంతోనే బాబు జిమ్మిక్కులు చేస్తున్నారు
-
‘అన్నదాత సుఖీభవ అంటూ రైతు ఉసురు తీశారు’
సాక్షి, విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ అంటూనే రైతు ఉసురు తీశారని వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎమ్వీఎస్ నాగిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు సభ కోసం ఓ రైతును అన్యాయంగా చంపిన ఘటనపై ఆయన స్పందించారు. మంగళవారం బాధిత కుటంబాన్ని పరామర్శించిన నాగిరెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం హెలిప్యాడ్ కోసం రైతు కోటయ్య పచ్చటి పొలాన్ని బలవంతంగా తీసుకున్నారని, తోటను మొత్తం చిందరవందగా తొక్కేసారన్నారు. దీన్ని ప్రశ్నించిన కోటయ్యను ఇష్టారీతిగా కొట్టారని, పోలీసుల దెబ్బలకే అతను చనిపోయాడని తెలిపారు. కోటయ్య లాంటి రైతు మరణంపై సీఎం చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా మాట్లాడరని, ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. సాక్షి లేకపోతే ఈ విషయం వెలుగు చూసేదా? అని నిలదీశారు. బీసీ కౌలు రైతు మీద జరిగిన దాడి ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని, చంద్రబాబుకు అన్నదాత సుఖీభవ అనే అర్హత లేదన్నారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు పురుగుల మంది తాగినట్లు చిత్రీకరించారని, ఈ కేసును హైకోర్టు సుమోటగా స్వీకరించి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.కోటయ్య కుటంబానికి రూ. 20 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. చారిత్రక కొండవీడు కోట ఘాట్ రోడ్డు ప్రారంభోత్సవం సందర్బంగా సోమవారం యడ్లపాడు మండలం కొత్తపాలెం గ్రామంలోని కొండకింద ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ సభను ఏర్పాటు చేశారు. చంద్రబాబు హెలికాప్టర్ దిగేందుకు వీలుగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ సమీపంలో గ్రామానికి చెందిన పిట్టల కోటేశ్వరరావు (40) సుమారు 14 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. ఇందులో బొప్పాయి, మునగ, కనకాబరం తోటలు సాగు చేస్తున్నాడు. సీఎం రాక నేపథ్యంలో పొలంలో కొంత భాగాన్ని దౌర్జన్యంగా పార్కింగ్ కోసం లాక్కున్నారు. ఈ విషయాన్ని ప్రశ్నించిన రైతుపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. -
అన్నదాత సుఖీభవ అనే అర్హత టీడీపీకి వుందా?
-
‘సెలవిచ్చింది ఎంజాయ్ చేయడానికి కాదు’
సాక్షి, హైదరాబాద్ : నేడు మెజారిటీ రంగాల్లో మన దేశం టాప్ 10లో ఉండటానికి ప్రజస్వామ్యమే కారణమన్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి. శుక్రవారం రవీంద్ర భారతిలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్తో పాటు నాగిరెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లిబియాలో అన్ని వనరులు, సంపద ఉన్నా.. ప్రజస్వామ్యం లేదని తెలిపారు. ఫలితంగా అక్కడ తిండి తినలేని దారుణ పరిస్థితులున్నాయన్నారు. గ్రామాల్లో ఏకంగా 90 శాతం ఓట్లు పోల్ అవుతుంటే.. జీహెచ్ఎంసీలో కనీసం 50 శాతం కూడా పోల్ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నగరాల్లో అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికి జనాలు ఓటు వేయడానికి ముందుకు రావడం లేదని తెలిపారు. ఓటే భవిష్యత్తును నిర్ణయిస్తుంది : గవర్నర్ ఈ కార్యక్రమంలో భాగంగా గవర్నర్ నరసింహన్ ఓటరు హెల్ప్ లైన్ పోస్టర్ని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడం అభినందనీయమన్నారు. ఎన్నికల రోజు సెలవు ఇచ్చింది ఎంజాయ్ చేయడానికి కాదు.. ఓటు వేయడానికని తెలిపారు. -
‘రైతు దినోత్సవాన్ని ఏపీ సర్కార్ మర్చిపోయింది’
సాక్షి, కర్నూలు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేశాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి మండిపడ్డారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీ సర్కార్ జాతీయ రైతు దినోత్సవాన్ని మర్చిపోయిందని అన్నారు. ఏపీలో వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాలుగున్నర సంవత్సర పాలన కాలంలో నాలుగు కరువులు, ఐదు తుపాన్లతో రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. రాష్ట్రంలో రైతులు పరిస్థితి దయనీయంగా ఉంటే చంద్రబాబు మాత్రం వ్యవసాయంలో ఏపీ రెండంకెల స్థానంలో ఉందని ప్రజలను మభ్యపెట్టేందుకు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తొమ్మిది గంటల ఉచిత విద్యుత్, రుణమాఫీ హామీలతో చంద్రబాబు రైతులను తీవ్రంగా మోసం చేశారని వ్యాఖ్యానించారు. -
జిల్లాల్లో పరిస్థితులపై ఐజీల పర్యటన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఉండేందుకు పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉత్తర, దక్షిణ తెలంగాణల్లోని పరిస్థితులను నార్త్జోన్ ఐజీ నాగిరెడ్డి, వెస్ట్జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నార్త్జోన్ ఐజీ నాగిరెడ్డి గత మూడు రోజులుగా ఖమ్మం, భద్రాద్రి, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. మావోల కదలికలు, వరుసగా వెలుగులోకి వస్తున్న పోస్టర్లు, బ్యానర్ల నేపథ్యంలో మావోయిస్టుల నియంత్రణకు చేపట్టాల్సిన కార్యాచరణపై ఆయా జిల్లాల ఎస్పీలకు నాగిరెడ్డి సూచనలు అందిస్తున్నారు. గత ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్ల దృష్ట్యా ఆయా ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లను సందర్శించి ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. మహారాష్ట్ర–తెలంగాణ, ఛత్తీస్గఢ్–తెలంగాణ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టులో తనిఖీలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు దక్షిణ తెలంగాణలోని రాజకీయ గొడవలు, ఫ్యాక్షన్ వాతావరణం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలీస్స్టేషన్ల వారీగా వెస్ట్జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఫీల్డ్ లెవల్ సమీక్ష నిర్వహిస్తున్నారు. నల్లగొండలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గతంలో జరిగిన గొడవల దృష్ట్యా ముందస్తు చర్యలపై స్థానిక అధికారులకు అవగాహన కల్పించారు. ఇక, శుక్రవారం మహబూబ్నగర్లోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అదనపు డీజీపీ జితేందర్తో కలసి పర్యటించారు. నామినేషన్ల ప్రక్రియ దగ్గర పడుతున్న నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై ఎస్పీలు, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, సబ్ఇన్స్పెక్టర్లతో స్టీఫెన్ రవీంద్ర సమీక్ష నిర్వహించారు. -
ఈ గుండె మీద పచ్చచొక్కా పడదు
నాలుగేళ్ల నుంచి.. ఐదువేళ్లూ నోట్లోకెళ్లడం లేదు! పెన్షన్ కోసం ఎక్కని గడప లేదు. మొక్కని అధికారీ లేడు! అయినా సరే.. జన్మ వెక్కిరించినా భూమి మింగేసినా తన గుండెపై పచ్చచొక్కా పడదంటున్నాడు నాగిరెడ్డి. ఎనభై ఏళ్లు పైబడిన వృద్ధుడు నాగిరెడ్డి. కాలు దెబ్బతిని, కంటిచూపూ పోవడంతో పాత ప్రభుత్వంలో ఆయనకు నెలనెలా దివ్యాంగుల పెన్షన్ వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చీ రాగానే దానిని రద్దు చేసింది. నాలుగేళ్లుగా పెన్షన్ కోసం తిరుగుతున్నాడు. కలెక్టర్ ఓకే చేసినా, జన్మభూమి కమిటీ కరుణ చూపకపోవడంతో ఈనాటికీ పెన్షన్ రాలేదు. ‘పార్టీ మారితే ఇస్తాం.. పెన్షన్ ఇస్తాం’ అంటున్నారు కానీ, పెన్షన్ కోసం పచ్చచొక్కా వేసుకునేది లేదని ధీమాగా చెబుతున్న నాగిరెడ్డిని ‘సాక్షి’ కలిసినప్పుడు అసలేం జరిగిందో వివరంగా చెప్పారు. ‘‘మాది తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం రాపర్తి గ్రామం. నాపేరు బోదవరపు నాగిరెడ్డి, నాకు 81 సంవత్సరాలు. నా భార్య లక్ష్మీదేవి. పిల్లలిద్దరూ పొట్ట నింపుకోవడానికి పనులు వెతుక్కుంటూ వెళ్లిపోయారు. నాకున్న కొద్దిపాటి వ్యవసాయభూమిలో తిండి గింజలు పండుతాయి. పెన్షన్ డబ్బుతో ఇతర ఖర్చులు గడిచిపోతుండేవి. ఓ రోజు పిఠాపురం నుంచి మా ఊరికి వస్తుండగా ఆటో ప్రమాదంలో నా కాలు విరిగిపోయింది. ఓ వారం హాస్పిటల్లో వైద్యం చేయించుకుని ఐదు నెలల పాటు మంచంలోనే ఉన్నాను. కాలు కొద్దికొద్దిగా బాగవుతూ వచ్చింది కానీ కళ్లు కనిపించడం మానేశాయి. ఉన్న భూమిని తాకట్టు పెట్టి కంటి ఆపరేషన్ చేయించుకున్నాను. ఐదు లక్షలు ఖర్చయ్యాయి. కానీ చూపు మాత్రం రాలేదు. డాక్టర్లు పరీక్షించి నూరుశాతం అంధత్వం అని, చూపు రాదని చెప్పారు. ఒక కాలు సరిగ్గా లేక, రెండు కళ్లకు చూపులేని స్థితిలో ఇక నేనే పని చేయగలను? అప్పుడున్న ప్రభుత్వం నా వృద్ధాప్య పెన్షన్ను దివ్యాంగుల పెన్షన్గా మార్చడంతో నెలకు ఐదువందలు వచ్చేవి. ఆ ఐదొందల్లోనే మందుల ఖర్చు జరిగిపోయేది. ఆశ అడియాసైంది దివ్యాంగుల పెన్షన్ వెయ్యి రూపాయలు చేస్తామని చెప్పిన నాయకుల మాటలు నమ్మాం. కొండంత ఆశతో ఎదురు చూశాం. అయితే కొత్త ప్రభుత్వం నా పెన్షన్ని రద్దు చేసింది. అప్పటి వరకు వస్తున్న ఐదొందలు కూడా రావడం లేదు. అదేంటని పంచాయితీ ఆఫీస్కెళ్లి అడిగాను. మళ్లీ కొత్తగా వేలిముద్రలు తీసుకుని, ‘పెన్షన్ వస్తుంది వెళ్లు’ అన్నారు. నేను, నా భార్య మూడు నెలల పాటు రోజూ పంచాయతీ ఆఫీస్ దగ్గర పడిగాపులు పడ్డాం. ఏడాది గడిచినా పెన్షన్ రాలేదు. పిఠాపురం మండలాఫీస్లో ఎన్నోసార్లు అర్జీలిచ్చాం. ఇలా కాదని, కాకినాడకు వెళ్లి కలెక్టర్ ఆఫీస్కెళ్లాం. గ్రీవెన్స్ సెల్లో ఇరవైకి పైగా అర్జీలిచ్చాం. ఓ రోజు కలెక్టర్గారు మా ఊరి అధికారికి ఫోన్ చేసి ‘అన్ని అర్హతలున్న ఇతడికి పెన్షన్ ఎందుకివ్వలేదు, వెంటనే ఏర్పాటు చేయండి’ అని మా కళ్ల ముందే చెప్పారు. అధికారితో మాట్లాడిన తర్వాత మాతో ‘మీ ఊరి అధికారికి చెప్పాను, పెన్షన్ ఇస్తారు వెళ్లండి’ అన్నారు. ‘స్వయంగా కలెక్టర్గారే చెబితే ఇక అడ్డేముంటుంది, నాకు పెన్షన్ వచ్చేస్తుంద’నే కొండంత నమ్మకంతో ఇంటికి వచ్చాం. అన్నట్లు మరుసటి రోజు పంచాయతీ ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది. సంతోషంగా వెళ్లాను. ‘కొత్త లిస్టులో తొలిపేరు నీదే’నంటూ లిస్టు చూపించారు. ఒకటో తేదీన వచ్చి పెన్షన్ డబ్బు తీసుకోమని కూడా చెప్పారు. అన్నట్లుగానే ఒకటో తేదీన వెళ్లాను. ‘డబ్బులు వచ్చాయి. అయితే గ్రామంలో జన్మభూమి కమిటీ సభ్యుల దగ్గరికి వెళ్లి వారి అనుమతి పొందాలి. వారి అనుమతితో వస్తే డబ్బులిస్తాం’ అన్నారు. అక్కడకు వెళ్తే.. జన్మభూమి కమిటీ సభ్యుల్ని కలిశాను. వాళ్లన్న మాట వినగానే మనసు చివుక్కుమన్నది. ‘నువ్వు వైఎస్ఆర్ పార్టీ కదా, నీకు పెన్షన్ ఇవ్వం, ఎమ్మెల్యేని కలువు పో’ అన్నారు. మరోమాటకు కూడా తావివ్వలేదు. నేను, నా భార్య పిఠాపురం ఎమ్మెల్యే వర్మను కలిసి మా పరిస్థితి చెప్పి ప్రాధేయపడ్డాం. ఆయనేమో ‘నీకు పెన్షన్ ఇస్తారు, ఎంపీడీవోను కలువు’ అన్నారు. అలాగే ఎంపీడీవోను కూడా కలిస్తే, పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ‘జన్మభూమి కమిటీ వాళ్లు చెబితేనే పెన్షన్ వస్తుంది. ఇక ఎంతమంది చుట్టూ తిరిగినా రాద’ని కరాఖండిగా అన్నారాయన. మళ్లీ పంచాయతీ కార్యదర్శి దగ్గరకెళ్లాను. ‘నువ్వు వైఎస్ఆర్సీపీ మనిషివట, నువ్వు తెలుగుదేశంలోకి వచ్చే వరకు నీకు పెన్షన్ ఇచ్చే అవకాశం లేదు’ అన్నాడు ఆయన. ఇలా నాలుగేళ్లు గడిచిపోయాయి. 2014 ఎన్నికల రోజుల్లో నా దగ్గరకు కొందరు వచ్చి ‘నీకు డబ్బిస్తాం, పార్టీ మారు’ అన్నప్పుడే వాళ్లకు కచ్చితంగా ఒకటే మాట చెప్పాను. ‘వైఎస్ఆర్ పాదయాత్ర చేసినప్పుడు ఆయనతో కలిసి అడుగులేసిన వాడిని, ఈ రోజు ఆయన లేకపోయినా ఆయన బాటలోనే నడుస్తాను’ అని. ఇప్పుడు పెన్షన్ ఇవ్వకుండా నన్ను ఏడిపించిన తర్వాత నేను పార్టీ మారుతానా? ఈ నాలుగేళ్లుగా కళ్లు, కాళ్లు సరిలేకపోయినా నా భార్య సహాయంతో ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. వాళ్ల కాళ్లు పట్టుకుంటే పెన్షన్ ఇస్తారు, లేకపోతే ఇవ్వరని చెబుతున్నారు. అయినా సరే నా పోరాటం ఇలాగే సాగుతుంది తప్ప నా సిద్ధాంతాన్ని మార్చుకునేది లేదు. డబ్బు లేకపోతే పస్తులుంటాం. ముసలోళ్లను ఏడిపించిన పాపం ఊరికే పోదు’’ అని ఎంతో ఆవేదనగా తన గోడు వెళ్లబోసుకున్నాడు నాగిరెడ్డి. పెద్ద పెద్ద మాటలు చెబుతున్న ఎ.పి. ప్రభుత్వం ఇంత చిన్న పని ఎందుకు చేయలేకపోతోందో స్పష్టంగా తెలిశాక.. వచ్చే ప్రభుత్వంలో తనకు తప్పకుండా పెన్షన్ వస్తుందన్న ధీమాతో ఉన్నాడీ పెద్దాయన. ఇక ఆ బిడ్డ చేత్తోనే తీసుకుంటాం వైఎస్ఆర్ బిడ్డ జగన్ పిఠాపురం వచ్చే రోజు కోసం ఎదురు చూసి, ఆయన్ని కలిసి మా గోడు చెప్పుకున్నాం. ఆయన మా బాధలు విని కన్న బిడ్డలాగే దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్పారు. ఇక పెన్షన్ ఇమ్మని ఎవరినీ అడగం, ఆ బిడ్డ చేత్తోనే తీసుకుంటాం. – లక్ష్మీదేవి, నాగిరెడ్డి భార్య సిఫార్సు లేకనే పెన్షన్ ఆగింది నాగిరెడ్డి పెన్షన్కు అన్నివిధాలుగానూ అర్హుడే. ఆయనకు పెన్షన్ మంజూరయ్యింది కూడా. అయితే జన్మభూమి కమిటీ.. ఆమోదం ఇవ్వడం లేదు. ఆయన వెళ్లి వారిని అడిగినా కూడా వారు సిఫార్సు చేయడం లేదు. దీంతో నాగిరెడ్డి పెన్షన్ ఆగిపోయింది. అధికారికంగా డబ్బులు విడుదలయ్యాయి. అయినా ఆ డబ్బును ఆయనకు ఇవ్వలేకపోతున్నాం. – కె. సుబ్బారావు, ఎంపీడీఓ, పిఠాపురం – వెలుగుల సూర్య వెంకట సత్య వరప్రసాద్, సాక్షి, పిఠాపురం -
రాష్ట్రంలో మళ్లీ కరువు పరిస్థితులు
-
నాలుగేళ్లలో బాబు రైతులకు చేసిందేమీ లేదు
-
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది: నాగిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో రాక్షస, నిరంకుశ పాలన సాగుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాక్షర భారత్ సమన్వయ కర్తలుగా పనిచేసే 20,500ల మందిని రాష్ట్ర ప్రభుత్వం తొలగించిందని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వారి స్థానంలో టీడీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చే ఆలోచనలో ఉందని మండిపడ్డారు. అన్యాయంగా ఉద్యోగులను తొలగించడం చాలా దారుణమని ఆయన పేర్కొన్నారు. బాబు పాలనలో సాగు తగ్గుతోంది.. ముంఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు పాలనలో సాగి తగ్గిపోతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 10 సాగునీటి ప్రాజెక్టులను బ్యాంకుల్లో తనఖా పెడుతోందని తెలిపారు. ఇప్పటివరకు సాగునీటి ప్రాజెక్టులను తనఖా పెట్టిన పరిస్థితి, దుస్థితి దేశ చరిత్రలోనే లేదని గుర్తుచేశారు. ఏపీ ప్రభుత్వం సోమశీల, వంశాధార, వెలుగొండ, గోదావరి, కృష్ణా డెల్టా ప్రాజెక్టులు, ఎస్ఆర్ఎస్సీ ప్రాజెక్టులను బ్యాంక్లలో తాకట్టు పెడుతోందన్నారు. ఇప్పటికే బాబు ప్రభుత్వం ప్రాజెక్టులను తానఖా పెట్టి 3 వేల కోట్లు రుణాలు తీసుకుంది.. మళ్లీ ఇప్పుడు 10 వేల కోట్లు రుణాలు తీసుకునేందుకు సిద్ధమవుతోందని తెలిపారు. ప్రపంచానికి పాఠాలు చెప్పిన అనుభవం ఉన్న వ్యక్తినని చెప్పుకున్న చంద్రబాబు ఇలాంటి పాలన సాగించడం సిగ్గుచేటని నాగిరెడ్డి పేర్కొన్నారు. బాబు ఖరీఫ్ సీజన్లో 2 కోట్ల ఎకరాలకు నీరు అందిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. 2014 నుంచి 2018 వరకు మెట్ట, సాగునీటి ప్రాంతాల భూమి మొత్తం కలిపి కనీసం కోటి ఎకరాలకు కూడా నీరు అందలేదని తెలిపారు.ఇంత నీటి కొరత ఉంటే రైతులు ఏ విధంగా పంటలు పండించగలరని ప్రశ్నించారు. రైతులకు చంద్రబాబు తీరని అన్యాయం చేస్తున్నాడని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తేనే రైతులకు మేలు జరుగుతుందని నాగిరెడ్డి పేర్కొన్నారు. -
ఆ స్కామ్లో లోకేష్, సోమిరెడ్డి పేర్లు
సాక్షి, విజయవాడ : కన్సల్టెన్సీల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వందల కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ధ్వజమెత్తారు. వ్యవసాయ శాఖ, కేపీఎంజీ ఏజెన్సీని కన్సల్టంట్గా నియమించిందని, రైతులకు కనీసం సలహాలు, సూచనలు ఇవ్వలేని ఒక ప్రైవేట్ ఏజెన్సీకి కోట్ల రూపాయలను ఎలా చెల్లిస్తారంటూ నిలదీశారు. చంద్రబాబుకు దోచుకోవడం అలవాటైపోయిందని, గతంలో ఇదే విధంగా మెకన్సీ సంస్థకు ఇలాగే ఇచ్చారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో ఏళ్ల అనుభవం ఉన్న శాష్త్రవేత్తలు, ఇంజినీర్లు ఉండగా ఏజెన్సీలకు కట్టబెట్టడం దారుణమని, కేవలం కమీషన్ల కోసమే బాబు ఈ పనులకు పూనుకున్నారని విమర్శించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వ్యవసాయం పండుగలా సాగిందని, కానీ చంద్రబాబు పాలనలో దండుగలా మారిందని నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. ఎప్పుడూ బాబు భజన చేసే మంత్రి సోమిరెడ్డి రైతు సమస్యల గురించి ఎప్పుడైనా చర్చించారా అని నిలదీశారు. దేశానికి వెన్నెముకగా ఉన్న రైతు మద్దతు ధర లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వారికి అందాల్సిన మద్దతు ధర గురించి ఎప్పుడైనా కేంద్రాన్ని నిలదీశారా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు, సోమిరెడ్డిలకు రైతు ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే ముఖ్యమని దుయ్యబట్టారు. నాలుగేళ్లపాటు కేంద్రంలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు ఏం చేశారని నాగిరెడ్డి నిలదీశారు. కేపీఎంజీ చరిత్ర బయటకు తీస్తే లోకేష్, సోమిరెడ్డి పేర్లు బయటికి వస్తాయని ఆయన విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ధరల స్థిరీకరణ నిధి ఏమైందంటూ ప్రశ్నించారు. రాష్ట్ర వృద్ధి రేటు బాగుందని చంద్రబాబు ప్రభుత్వం డప్పు కొట్టుకుంటోందని, అంత బాగుంటే అంతర్జాతీయ కన్సల్టెన్సీల అవసరం ఏందుకని నిలదీశారు. బాబు ఇప్పటికైనా స్వప్రయోజనాలు విడిచిపెట్టి, రైతుల కోసం కృషి చేయాలని హితవు పలికారు. -
జులైలోగా ఎన్నికలు పూర్తి చేయాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: జూలై నెలాఖరు కల్లా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి ప్రభుత్వానికి సూచించారు. విలేకరులతో మాట్లాడుతూ..వచ్చే ఏడాది ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ పెద్ద సవాల్తో కూడుకున్న విషయమని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో 1.5 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని వివరించారు. జీహెచ్ఎంసీలో ఉన్న ఓటర్ల కంటే పంచాయతీ ఎన్నికల్లో రెట్టింపు సంఖ్యలో ఓటర్లు ఉన్నారని చెప్పారు. పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నా 30 మంది చనిపోయారని వ్యాఖ్యానించారు. మన రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ చాలా సమర్థంగా ఉంటుందని అన్నారు. ఏడాది క్రితం నుంచే ఎన్నికల నిర్వహణ కసరత్తును ప్రారంభించామని, ఎట్టి పరిస్థితుల్లోనూ జూలైలోగా ఎన్నికలు పూర్తి చేయాల్సిందేనని ప్రభుత్వానికి విన్నవించారు. ఈ రెండు నెలల్లో కొత్తగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. అలాగే ముద్రణా సామగ్రి జూన్ 15 నాటికి సిద్ధమవుతుందని తెలిపారు. ఓటర్ల తుది జాబితా కూడా సిద్ధం చేశామని వెల్లడించారు. రిట్నరింగ్ అధికారులను గుర్తించి కలెక్టర్లు నియమించాలని సూచించారు. బ్యాలెట్ పత్రాలు జిల్లాలోనే ముద్రించాలని తెలిపారు. -
చంద్రబాబు ఒక్క ప్రాజెక్టు ప్రారంభించలేదు
-
‘మంద బలంతో అసెంబ్లీలో చట్టసవరణ’
సాక్షి, విజయవాడ: భూ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాలు విజయవాడలో ఏర్పాటు చేశారు. 2013 భూసేకరణ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఈ సమావేశాలు జరుగుతున్నాయి. వీటికి పెద్దసంఖ్యలో రైతు, ప్రజాసంఘల నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ రైతు విభాగం నేత నాగిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు తన మంద బలంతో అసెంబ్లీలో చట్టసవరణ చేశారు. ఈ సవరణ చట్టం రైతులకు తుట్లు పొడిచే విధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. పంటలు పండే పొలాలను రైతులకు ఇష్టం లేకపోయినా భూములను లాక్కోవాలని చూస్తోందని నాగిరెడ్డి అన్నారు. -
ప్రకృతి ప్రేమికుడు వైఎస్ఆర్
సింహాద్రిపురం : ప్రకృతి ప్రేమికుడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అని.. ప్రకృతి విధ్వంసకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని వైఎస్సార్సీపీ రైతు విభాగపు రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన సింహాద్రిపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతుల పాలిట ప్రకృతి జగనన్న అని, సకాలంలో సరిపడా వానలు కరుణిస్తేనే రైతాంగం సులువుగా బయటపడుతారన్నారు. ఇంతకమునుపు చంద్రబాబు పాలనలో ప్రకృ తి వైఫరీత్యాలు రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయన్నారు. వైఎస్సార్ హయాంలో ప్రకృతి కరుణించి సకాలంలో వర్షాలు కురిసి మంచి పంటలు పండాయని, లాభసాటి ధరలతో రైతాంగం సంతోషంగా ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. చంద్రబాబు హయాంలో గత మూడేళ్లు వర్షాలు లేక కరువు కాటకాలతో రాయలసీమ ప్రజలు పక్క రాష్ట్రాలకు వలస వెళ్లే దుస్థితి నెలకొందన్నారు. ఈ ఏడాది అధిక వర్షాల వల్ల ఖరీఫ్లో చాలావరకు పంటలు దెబ్బతిన్నాయన్నారు. ప్రకృతి ప్రేమికులైన వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్ పాదయాత్ర మొదలయ్యే తెల్లవారుజామున భారీ వర్షం కురవడం ఇందుకు నిదర్శనమన్నారు. ప్రకృతి దేవత స్వాగతం పలికందన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ ఎక్కడ కార్యక్రమం చేపట్టినా ప్రకృతి వర్షం ద్వారా స్వాగతిస్తూనే ఉందన్నారు. ప్రకృతి కరుణవల్ల వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యమన్నారు. రాబోవు రోజుల్లో తిరిగి వైఎస్సార్ పాలన చూస్తారన్నా రు. అంతకముందు వైఎస్ విగ్రహానికి ఆయన పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రైతు విభాగపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అరవిందనాథరెడ్డి, భరత్కుమార్రెడ్డి, కర్నూలు జిల్లా రైతు విభాగపు అధ్యక్షుడు శివరామిరెడ్డి, కర్నూలు జిల్లా రైతు విభాగపు జనరల్ సెక్రటరీ భాస్కర్రెడ్డి పాల్గొన్నారు. -
గ్రామీణ ప్రాంతాల్లో నగదు రహితం సాధ్యమా?
-
గ్రామీణ ప్రాంతాల్లో నగదు రహితం సాధ్యమా?
హైదరాబాద్: పాత పెద్ద నోట్ల రద్దుతో వ్యవసాయరంగం కుదేలయిందని, రైతాంగం సంక్షోభంలో కూరుకుపోయిందని వైఎస్సార్ సీపీ రైతు విభాగం నేతలు ఎంవీఎస్ నాగిరెడ్డి, శరత్ చంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... దేశానికి ఆహారభద్రత అందించే రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నగదు రహిత ఆర్థికవ్యవస్థ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు పడుతున్న కష్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలని సూచించారు. నోట్ల కష్టాలు తొలగించేందుకు సత్వరమే చర్యలు తీసుకోకుంటే రైతాంగం మరింత ఇబ్బందుల్లో కూరుకుపోతుందని తెలిపారు. -
మద్దతు ధరపై ప్రభుత్వం నోరెత్తదేం..
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నోరెత్తడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రశ్నించారు. గోధుమ, ఆవాలు, కుసుమ పంటలకు మద్దతు ధరను 8.2 శాతం నుంచి 16 శాతం వరకు పెంచుతూ కేంద్రం తీసుకుందని.. అయితే వరి విషయంలో మాత్రం అన్యాయం జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడటం లేదని అన్నారు. గోదుమ కంటే వరికి అయ్యే ఉత్పాదక వ్యయం ఎక్కువగా ఉందని.. రైతులకు ఆదాయం తక్కువగా ఉన్న వరికి గిట్టుబాటు ధరను పెంచే విషయంలో కేంద్రం పట్టించుకోలేదని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధాన్యానికి మొదటి సంవత్సరం రూ. 50, రెండో సంవత్సరం రూ. 50, మూడో సంవత్సరం రూ. 60(4.2 శాతం) ముష్టి వేసినట్లుగా పెంచినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదని నాగిరెడ్డి ప్రశ్నించారు. వరి మద్దుతు ధరపై కేంద్రం చూపుతున్న వివక్ష వలన ఆంధ్రప్రదేశ్ రైతులే ఎక్కువగా నష్టపోతున్నారన్నారు. ఉత్తరాదిన ఎన్నికలు ఉన్నాయని గోధుమకు ఈ సంవత్సరం రూ. 125 పెంచి, ధాన్యానికి మాత్రం రూ. 60 పెంచడం దక్షిణాది వరి రైతులపై వివక్ష చూపడమే అని ఆయన అన్నారు. ధాన్యానికి క్వింటాలుకు రూ. 300 బోనస్గా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. -
అన్నపూర్ణ.. కరువు పీడిత రాష్ట్రమైంది
వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి ధ్వజం సాక్షి, హైదరాబాద్: అన్నపూర్ణగా వెలుగొందిన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు పాలనలో కరువు పీడిత రాష్ట్రంగా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి విమర్శించారు. లక్షలాది ఎకరాలు బీళ్లుగా మారుతున్నా టీడీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని మండిపడ్డారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, తక్షణమే ధాన్యానికి రూ.300 బోనస్ ప్రకటించాలని, ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నూటికి 93 మంది రైతులు అప్పుల ఊబిలో చిక్కుకున్నారని, ఎక్కువ మంది ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి రుణాలు తెచ్చుకుంటున్నారని సెస్ నివేదికలో వెల్లడైందని చెప్పారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కంటే 30 శాతం అధిక రుణాలివ్వాలని సెస్ సూచించగా.. మరోవైపు ఎక్కువ రుణాలిస్తే బ్యాంకులపై ఏసీబీ రైడ్ చేయిస్తామని, బంగారం రుణాలివ్వొద్దని స్వయంగా ముఖ్యమంత్రే హెచ్చరించటం దారుణమన్నారు. బ్యాంకులు రుణాలివ్వనందువల్లే ఆర్థిక ఇబ్బందులు తలెత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పేర్కొనడాన్ని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా ఆహారధాన్యాల ఉత్పత్తి పెరుగుతుంటే రాష్ట్రంలో తగ్గడం దౌర్భాగ్యమని నాగిరెడ్డి అన్నారు. 2014లో చంద్రబాబు సీఎం అయ్యేనాటికి ఏపీలో 43.86 లక్షల హైక్టార్లలో పంట సాగవుతుంటే, ఇప్పుడు 38.28 లక్షల హెక్టార్లు మాత్రమే సాగులో ఉందన్నారు. -
గిట్టుబాటు ధర పోరాటం ఉధృతం
– వైఎస్సార్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి పెనుమంట్ర : వరి ధాన్యానికి తగిన గిట్టుబాటు ధర సాధించేందుకు వైఎస్సార్ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు చేస్తున్న పోరాటాన్ని మరింత ఉధృతం చేయనున్నట్టు పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరులో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతిపక్షాలు, రైతు సంఘాల నేతలను ఢిల్లీ తీసుకుకెళ్లి ధాన్యానికి మద్దతు ధర సాధించేందుకు కేంద్రంపై వత్తిడి తీసుకురావాలని సీఎం చంద్రబాబుకు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఆయనకు వ్యవసాయ రంగంపై ఉన్న చులకన భావనతో స్పందిచడం లేదన్నారు. రాష్ట్ర విభజన అనంతరం మన రాష్ట్రం దేశంలోనే వ్యవసాయానికి అనుకూలమైన పెద్దరాష్ట్రంగా అవతరించిందన్నారు. కానీ.. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో అన్నదాతలకు ఆకలి చావులు తప్పడం లేదన్నారు. వరి ధాన్యం ఉత్పత్తికి అయ్యే ఖర్చుకు క్వింటాల్కు రూ.300 కలిపి గిట్టుబాటు ధర కల్పిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు దానిని గాలికొదిలేశారన్నారు. క్వింటాల్కు రూ.1,900 ఖర్చవుతున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం ఆ మొత్తంపై బోనస్ ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరారు. కమీషన్లు ఇస్తేనే పవర్ టిల్లర్లు కొన్ని నియోజకవర్గాల్లో ఒక్కో పవర్ టిల్లర్కు రూ.10 వేలు తీసుకుని ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలు ఇస్తున్నారని నాగిరెడ్డి ఆరోపించారు. గ్రామ సభలు నిర్వహించి నిజమైన వ్యవసాయదారులను గుర్తించి పవర్ టిల్లర్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పెడచెవిన పెట్టి ఎమ్మెల్యేల లబ్ధే ప్రధాన ధ్యేయంగా పవర్టిల్లర్లు, ఇతర యంత్రాలు పంపిణీ చేస్తోందని విమర్శించారు. పట్టిసీమ నిధులు లోకేష్ ఖాతాలోకి.. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ను పూర్తి చేయకుండా పట్టిసీమ పేరుతో సీఎం తనయుడు లోకేష్ ఖాతాలోకి నిధులు మళ్లించారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేసిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం.. పార్టీ ఫిరాయించి ప్రజాస్వామాన్ని ఖూనీ చేసిన వారికి ఒక్క నోటీసు కూడా ఇవ్వలేదని ఆక్షేపించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులకు, డ్వాక్రా సంఘాలకు బ్యాంకు రుణాలు అందటం లేదన్నారు. రుణమాఫీ హామీ అమలుకాక, వడ్డీల భారం పెరిగిపోయి డ్వాక్రా సంఘాలు నిర్వీర్యమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ 15 అస్లెంబ్లీ స్థానాలను కానుకగా ఇచ్చిన పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టుమని 15 మందికి నిరుద్యోగులకు ఉపాధి కల్పించే పరిశ్రమ ఒక్కటైనా స్థ్ధాపించలేక పోయారని ధ్వజమెత్తారు. -
చంపేసి పాతిపెట్టారు
- నయామ్ చేతిలో హత్యకు గురైన వంట మనిషి నస్రీన్ మృతదేహం లభ్యం - మంచిరేవుల వద్ద గుర్తించిన పోలీసులు - నిద్ర మాత్రలిచ్చి చంపేశారు: సిట్ చీఫ్ నాగిరెడ్డి సాక్షి, హైదరాబాద్ : గ్యాంగ్స్టర్ నయీమ్ చేతిలో హతమైనవారి మృతదేహాలు బయటపడుతున్నాయి. తన సొంత అక్క భర్త నదీమ్ అలియాస్ విజయ్కుమార్ను మహబూబ్నగర్ జిల్లా సరిహద్దుల్లో పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు వెలుగు చూడగా.. తాజాగా వంట మనిషి నస్రీన్ (17) మృతదేహం బయటపడింది. నార్సింగ్ పోలీస్స్టేషన్ పరిధిలోని మంచిరేవుల గ్రామం వద్ద ఆమె మృతదేహం లభ్యమైనట్లు సిట్ ఛీప్ వై.నాగిరెడ్డి తెలిపారు. నయీమ్ సమీప బంధువుల ఫంక్షన్కు వారితో పాటు వస్తానని మారాం చేసినందుకే హత్య చేసినట్లు తమ విచారణలో తేలిందన్నారు. ఇంట్లో ఉండలేనంటూ ప్రాధేయపడినా వినకుండా నయీమ్ విచక్షణా రహితంగా కొట్టినట్లు ఆయన తెలిపారు. ఆ దెబ్బలకు తాళలేక సృ్పహ తప్పి పడిపోయిన నస్రీన్కు బలవంతంగా నిద్రమాత్రలు మింగించడంతో మృతి చెందిందని వివరించారు. ఆమె మరణించినట్లు నిర్ధారించుకొని మంచిరేవుల వద్ద పాతిపెట్టారన్నారు. అలాగే మిస్సింగ్గా భావిస్తున్న అలీముద్దీన్ భార్య, అతడి కూతురు ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. నస్రీన్ అస్థి పంజరం దొరికిన రోడ్డులోనే నెల రోజుల క్రితం నార్సింగ్ పోలీసులు ఐదెకరాల భూమిలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. శేషన్న కోసం గాలింపు గ్యాంగ్స్టర్ నయీమ్కు కుడిభుజంగా, గ్యాంగ్లో రెండో స్థానంలో కొనసాగిన శేషన్న కోసం సిట్ పోలీసులు గాలిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేటకు చెందిన శేషన్న కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అతన్ని అదుపులోకి తీసుకుంటే నయీమ్కు సంబంధించిన అనేక విషయాలు వెలుగు చూడవచ్చని భావిస్తున్నారు. నయీమ్ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు శేషన్న మూడో వ్యక్తికి తెలియకుండా పనిపూర్తి చేసేవాడు. అందుకే శేషన్న పట్టుబడితే అనేక అంశాలు వెలుగు చూస్తాయని పోలీసు లు భావిస్తున్నారు. అలాగే నయీమ్ గ్యాంగ్కు చెందిన మరో ఇద్దరిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగినట్లు సమాచారం. కుప్పలు తెప్పలుగా ఆస్తులు గ్యాంగ్స్టర్ నయీమ్కు సంబంధించిన ఆస్తులు కుప్పలు తెప్పలుగా వెలుగు చూస్తున్నాయి. సిట్ విచారణలో ఇప్పటి వరకు వెయ్యికి పైగా భూ లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. డాక్యుమెంట్ ప్రకారమే వాటి విలువ దాదాపు రూ.143 కోట్లు ఉన్నట్లు పోలీసు వర్గాల సమాచారం. వీటి బహిరంగ మార్కెట్ విలువ దాదాపు పది రెట్లకు పైగానే ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆస్తులన్నీ కూడా భార్య హసీనా, సోదరి సలీమా, ఇంట్లో పనిమనిషి ఫర్హానా పేరిట ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో భారీగా ఆస్తులున్నట్లు గుర్తించారు. త్వరలో వాటి విలువను మదింపు చేయనున్నారు. 34 మంది అరెస్టు రాష్ట్ర వ్యాప్తంగా నయీమ్పై నమోదవుతున్న కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా సోమవారం నల్లగొండలో మరో కేసు నమోదైంది. దీంతో ఇప్పటి వరకు నయీమ్పై నమోదైన కేసుల సంఖ్య 38కి చేరింది. అలాగే కేసుల దర్యాప్తులో భాగంగా పోలీసులు.. ఇప్పటి వరకు నయీమ్ అనుచరులను దాదాపు 34 మందిని అరెస్టు చేశారు. అతని భార్య హసీనా, సోదరి సలీమాతో పాటు సమీప బంధులు ముఖ్య అనుచరులందరినీ అరెస్టు చేస్తున్నారు. తాజాగా సోమవారం మరి కొందరిని అరెస్టు చేశారు. వీరిలో కరీంనగర్ జిల్లాకు చెందిన గోపి అలియాస్ నార్సింగ్ గోపి, అదే జిల్లాకు చెందిన రమేశ్ అలియాస్ రాంబాబు ఉన్నారు. -
ప్రజా సేవకే పోలీసులు అంకితం: ఐజీ నాగిరెడ్డి
సెంటినరికాలనీ : రాష్ట్రంలో ప్రజాసేవకు పోలీసులు అంకితమయ్యారని ఐజీ నాగిరెడ్డి అన్నారు. బుధవారం కమాన్పూర్ పోలీస్శాఖ ఆధ్వర్యంలో రత్నాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రామగిరిఖిల్లా ప్రాంతంలో చేపట్టిన హరితహారంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. రామగిరిఖిల్లా ఎంతో ప్రసిద్ధిగాంచిన ప్రాంతమని, పదిహేనేళ్లక్రితం పోలీసులు ఖిల్లాకు వచ్చేవారని, ప్రస్తుతం మొక్కలు నాటేందుకు వచ్చినట్లు తెలిపారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తొమ్మిది జిల్లాలో 74 లక్షల మొక్కలు నాటామని, పోలీస్స్టేషన్ల ఆవరణలో మూడు లక్షల మొక్కలు నాటగా, బయటి ప్రదేశాల్లో మిగతా మొక్కలు నాటినట్లు ఆయన పేర్కొన్నారు. ఎస్పీ జోయల్డేవిస్ మాట్లాడుతూ.. జిల్లాల్లో పోలీస్శాఖ ఆధ్వర్యంలో 14 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు. నియోజకవర్గంలో పోలీస్శాఖ ఏ కార్యక్రమం చేపట్టినా ఎమ్మెల్యే సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే పుట్ట మధు మాట్లాడుతూ ఒకప్పుడు మంథని ప్రాంతమంటే తుపాకుల మోతగా ఉండేదని, అలాంటిది పోలీసులు ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పోలీసులు ప్రజలతో మమేకమయ్యారని తెలిపారు. నిరుద్యోగయువతకు శిక్షణ శిబిరాలు, ఉద్యోగాలు సాధించడంలో తమవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. పోలీసులకు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ విష్ణు ఎస్.వారియర్, టూటౌన్ సీఐ దేవారెడ్డి, కమాన్పూర్ ఎసై ్స ప్రదీప్కుమార్, ఎంపీపీ ఇనగంటి ప్రేమలత, జెడ్పీటీసీ మేకల సంపత్యాదవ్, సర్పంచ్ బోగె లింగయ్య, ఎంపీటీసీలు పల్లె ప్రతిమ పీవీ.రావు, బూక్య ఆశాకుమారి, ముల్మూరి శ్రీనివాస్, ముస్త్యాల శ్రీనివాస్, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. -
'రైతులకు నష్టం కలిగించేలా వ్యవహరించొద్దు'
హైదరాబాద్ : పాస్ బుక్, టైటిల్ డీడ్ లేకుండా భూముల హక్కుల బదలాయింపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని టీడీపీ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్లో నాగిరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ప్రభుత్వం నిర్ణయం వల్ల ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కార్ నిర్ణయం వల్ల ప్రభుత్వ భూములన్నీ అన్యాక్రాంతం అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. అలా కాని పక్షంలో రైతు సంఘాలతో కలసి ఉద్యమిస్తామని నాగిరెడ్డి హెచ్చరించారు. రైతులకు నష్టం కలిగించే నిర్ణయంపై మొండిగా వ్యవహరించ వద్దని టీడీపీ ప్రభుత్వానికి నాగిరెడ్డి హితవు పలికారు. -
చంద్రబాబు రైతు ద్రోహి
వైఎస్సార్ సీపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి తాడేపల్లి రూరల్ : చంద్రబాబు రైతు ద్రోహి అని వైఎస్సార్ సీపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి మండిపడ్డారు. బలవంతపు భూ సేకరణకు వ్యతిరేకంగా వారం రోజుల నుంచి 25 ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు జాతాల సభ్యులు పర్యటించారు. సోమవారం రాత్రి ముగింపు సందర్భంగా ఉండవల్లి సెంటర్లో జరిగిన బహిరంగ సభలో నాగిరెడ్డి మాట్లాడారు. ఎన్నికల ముందు రైతన్నలకు మేలు చేస్తా... నేను పెద్ద కొడుకును అవుతా... మీ కష్టాలు తీరుస్తానంటూ... చంద్రబాబు అధికారం చేజిక్కుంచుకున్నారని చెప్పారు. తీరా గెలిచిన తరువాత రైతులకు రుణమాఫీ బదులు తల్లి లాంటి భూమిని లాక్కుంటున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మొదట రాజధాని పేరుతో 23 ఎకరాలు సేకరించారని తెలిపారు. భూ దాహం తీరనట్టు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల ఎకరాల భూమి సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులను వంచిస్తుదన్నారు. ఈ జాతాలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులే రైతులకు మద్దతు పలుకుతూ బహిరంగంగానే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేయడం గమనార్హమన్నారు. విశాఖపట్నం జిల్లా కసింకోట సర్పంచ్ బాబూరావు (టీడీపీ) భూ సమీకరణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని కేసులు పెడతామని తహశీల్దార్ను పంపించి బెదిరించారని తెలిపారు. తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు న్యాయం చేసేవిధంగా పోరాడతానని బాబూరావు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఇంత తంతు జరుగుతున్నా చంద్రబాబు నాయుడు మాత్రం తన పార్టీ బలోపేతం అవుతుందని ఎమ్మెల్యేలు అందరూ తనకు మద్దతు పలుకుతున్నారంటూ వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. -
'బాబు మాటలకు, చేతలకు పొంతన లేదు'
-
మోగింది రణభేరి
-
మోగింది రణభేరి
► ఫిబ్రవరి 2న ‘గ్రేటర్’ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల ► డివిజన్ల రిజర్వేషన్ ఉత్తర్వులు జారీ ► కొద్దిసేపటికే షెడ్యూల్ ప్రకటన.. అమల్లోకి కోడ్ ► 12న ఎన్నికల ప్రకటన.. ► 17 వరకు నామినేషన్ల స్వీకరణ ► 18న పరిశీలన.. 21 వరకు ఉపసంహరణ గడువు ► అనంతరం తుది జాబితా, ఎన్నికల గుర్తుల ప్రకటన ► ఫిబ్రవరి 2న పోలింగ్.. 5న ఓట్ల లెక్కింపు, ఫలితాలు ► 74 లక్షల మంది ఓటర్లు.. 7,757 పోలింగ్ కేంద్రాలు ► ఎన్నికల విధులకు 46,545 మంది అధికారులు, సిబ్బంది సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికల నగారా మోగింది. ప్రభుత్వ వ్యూహాలు, హైకోర్టు జోక్యం, హడావుడి మధ్య శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. అంతకు కేవలం గంటన్నర ముందే (మధ్యాహ్నం మూడున్నర సమయంలో) డివిజన్ల రిజర్వేషన్లను ప్రకటిస్తూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. ఈ ఎన్నికలకు 12వ తేదీన నోటిఫికేషన్ వెలువడనుంది. వచ్చే నెల 2న ఎన్నికలు జరుగుతాయి, 5వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి. అమల్లోకి ఎన్నికల కోడ్ జీహెచ్ఎంసీ కమిషనర్, ప్రత్యేకాధికారి బి.జనార్దన్రెడ్డితో కలసి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి.నాగిరెడ్డి శుక్రవారం ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించారు. హైకోర్టు విధించిన గడువులోగా ఎన్నికలను పూర్తిచేయాలని, ఒక్కరోజు సైతం వృధా చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం సూచించడంతో తక్షణమే షెడ్యూల్ను విడుదల చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి పేర్కొన్నారు. ఆ మరుక్షణం నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినట్లుగా ప్రకటించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసిన మూడు రోజుల వ్యవధిలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం ప్రత్యేక ప్రకటన జారీ చేస్తామని తెలిపారు. షెడ్యూల్ ప్రకారం... జీహెచ్ఎంసీలోని 150 డివిజన్ల పరిధిలో స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తమ డివిజన్ల పరిధిలో ఎన్నికల నిర్వహణకు 12వ తేదీన ప్రకటన జారీ చేస్తారు. అదే రోజు నుంచి ఈ నెల 17వ తేదీ వరకు అభ్యర్థుల నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ రోజుల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఈ స్వీకరణ జరుగుతుంది. భోగి, సంక్రాంతి సెలవులైన 14, 15వ తేదీల్లో నామినేషన్ల స్వీకరణకు విరామం ఇవ్వనున్నారు. 18వ తేదీన ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) జరుపుతారు. అనంతరం 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశమిస్తారు. ఈ గడువు ముగిసిన వెంటనే (3 గంటల తర్వాత) అభ్యర్థుల తుది జాబితాను, వారి ఎన్నికల గుర్తులను ప్రకటిస్తారు. వచ్చే నెల 2న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఒకవేళ ఎక్కడైనా అవసరమైతే 4వ తేదీన రీపోలింగ్ జరుపుతారు. 5న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. వెనువెంటనే ఫలితాలను ప్రకటిస్తారు. సుమారు 74 లక్షల మంది ఓటర్లు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే 70,67,934 మంది ఓటర్లు నమోదై ఉన్నారు. వారికి అదనంగా ఓటరు నమోదు కోసం వచ్చిన 4,42,712 దరఖాస్తుల్లో అర్హత గల 3,46,999 దరఖాస్తులను ఎంపిక చేశారు. అంటే మొత్తంగా ఓటర్ల సంఖ్య 74 లక్షలు దాటిపోనుంది. గ్రేటర్ ఓటర్ల మూడో అనుబంధ జాబితాలో ఈ కొత్త ఓటర్ల వివరాలను ప్రచురిస్తారు. ప్రస్తుత ఎన్నికల్లో ఓటేసేందుకూ అవకాశం కల్పిస్తున్నారు. చివరిసారిగా 2009లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేవలం 43 శాతం పోలింగ్ నమోదైంది. దాంతో పోలింగ్ను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తమ పోలింగ్ కేంద్రాన్ని సులభంగా కనుక్కునే విధంగా ఎన్నికల జాబితాను రూపొందించామన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ నుంచి సైతం ఓటర్లు తమ ఓటు, పోలింగ్ కేంద్రం వివరాల గల ‘ఓటరు రసీదు’ ప్రతిని పొందవచ్చని చెప్పారు. ఇప్పటి వరకు 7,757 పోలింగ్ కేంద్రాలను గుర్తించామని... స్థానికంగా ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని యాగ్జిలరీ పోలింగ్ కేంద్రాల ఏర్పాటును ఎన్నికల యంత్రాంగం పరిశీలిస్తోందని తెలిపారు. ఇంటి నుంచి కిలోమీటర్ దూరంలోనే పోలింగ్ స్టేషన్ ఉండేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఓటర్లలో చైతన్యం నింపేందుకు భారీ ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఓటర్లకు ఇబ్బంది కలగకుండా పోలింగ్ కేంద్రాల్లో కనీస సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈవీఎంలతో ఎన్నికలు.. ఈ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)ను వినియోగించనున్నారు. వీటిపై అభ్యర్థుల పేర్లు, చిహ్నాలు ఉంటాయి. అభ్యర్థుల ఫోటోలను ముద్రించడం లేదు. ఒకే చోట 64 మంది వరకూ పోటీలో ఉన్నా.. ఈవీఎంలను వినియోగించవచ్చు. అభ్యర్థులు అంతకు మించితే పేపర్ బ్యాలెట్ వినియోగించాల్సి ఉంటుంది. ఇక అభ్యర్థులెవరూ నచ్చకపోతే ‘నోటా (పైవారెవరూ కాదు)’ ఆప్షన్ను ఎంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి శుక్రవారమే సూచనలు అందాయని, ఈ అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. ఎన్నికల విధుల్లో 46,745 మంది అధికారులు, సిబ్బంది పాల్గొననున్నారు. అందులో 775 మంది పోలింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు 7,757, సహాయ ప్రిసైడింగ్ అధికారులు 7,787, అదనపు ప్రిసైడింగ్ అధికారులు 23,271 మంది ఉండనున్నారు. వీరికి అదనంగా 7,760 మంది పోలింగ్ సిబ్బందిని రిజర్వుడ్గా అందుబాటులో ఉంచనున్నారు. ‘బీసీ’ స్థానాల్లో పోటీకి ముస్లింలకు అవకాశం! బీసీల్లో ‘ఏ, బీ, సీ, డీ, ఈ’ వంటి వర్గీకరణలతో సంబంధం లేకుండా కుల ధ్రువీకరణ పత్రం గల వారందరికీ బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. ‘బీసీ-ఈ’ కేటగిరీలోని ముస్లిం అభ్యర్థులకు బీసీ రిజర్వు స్థానాల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తారా అని ప్రశ్నించగా.. ఈ సమాధానం ఇచ్చారు. జీహెచ్ఎంసీ పరిధిలో ముస్లింలు గణనీయ సంఖ్యలో ఉండడంతో ఈ అంశం కీలకంగా మారనుంది. ఇక హైదరాబాద్ నగరవ్యాప్తంగా అనధికారికంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్లను తొలగిస్తామని నాగిరెడ్డి చెప్పారు. జీహెచ్ఎంసీ, స్థానిక ప్రైవేటు ఆస్తి యజమాని అనుమతితో ప్రచార ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. మెట్రో రైలు పిల్లర్లపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎగ్జిట్ పోల్స్ విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనలనే తామూ అమలు చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల తేదీలివీ.. ఎన్నికల ప్రకటన : ఈ నెల 12 (మంగళవారం) నామినేషన్ల స్వీకరణ : 12 నుంచి 17వ తేదీ వరకు (ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు - సెలవుల నేపథ్యంలో 14, 15వ తేదీల్లో విరామం) నామినేషన్ల పరిశీలన : 18వ తేదీ ఉదయం 11 నుంచి.. ఉపసంహరణకు గడువు : 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థుల తుది జాబితా, ఎన్నికల గుర్తుల కేటాయింపు: 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత పోలింగ్ : ఫిబ్రవరి 2న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు రీపోలింగ్ (అవసరమైతే) : ఫిబ్రవరి 4న ఓట్ల లెక్కింపు : ఫిబ్రవరి 5న ఉదయం 8 నుంచి.. (ఈ ప్రక్రియ ముగిసిన మూడు రోజుల్లోగా (ఫిబ్రవరి 8లోగా) మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం ప్రత్యేక ప్రకటన జారీ) -
ఏపీ బీడుబారే పరిస్ధితి రాబోతుంది
-
బాబువన్నీ పచ్చి అబద్ధాలు
♦ రైతు రుణాలన్నీ మాఫీ అయ్యాయా? ♦ బ్యాంకుల్లో జమపడింది రూ.7,200 కోట్లే ♦ వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శంకుస్థాపన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పారని వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అలా కాదని అంటే ఎక్కడైనా, ఎప్పుడైనా తాను చర్చకు రావడానికి సిద్ధమేనని చెప్పారు. నాగిరెడ్డి సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుతో మాట్లాడారు. రూ.24,000 కోట్ల మేర రైతు రుణాలను మాఫీ చేసినట్లు ముఖ్యమంత్రి చెప్పుకున్నారని, అది తొలి అవాస్తవమని విమర్శించారు. తాకట్టులో ఉన్న మహిళల పుస్తెల తాళ్లు, దస్తావేజులను విడిపించి తెచ్చారా? రుణాలన్నీ మాఫీ అయ్యాయా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మొత్తం రైతు రుణాలు రూ.87,000 కోట్లు ఉండగా వాటిపై వడ్డీ రూ.13,000 కోట్లు అయిందన్నారు. ఇందులో ఇప్పటివరకు రుణమాఫీ కింద బ్యాంకుల్లో జమ పడింది రూ.7,200 కోట్లేనని వివరించారు. చంద్రబాబు చెబుతున్నట్లు రూ.24,000 కోట్ల మేర రుణాలు మాఫీ అయిన రైతుల జాబితాను ప్రకటించాలని నాగిరెడ్డి డిమాండ్ చేశారు. 4 లక్షల ఎకరాలకు భూసార పరీక్షలు చేసినట్లుగా మరో అబద్ధం చెప్పారని మండిపడ్డారు. పట్టిసీమ నుంచి జూలైలోనే కృష్ణా డెల్టాకు నీళ్లిస్తామని ఒకసారి, ఆగస్టు 15 నాటికి ఇస్తామని మరోసారి ప్రకటించారని గుర్తుచేశారు. వాస్తవానికి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ డెల్టాలో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. కృష్ణా డెల్టా రైతులు దారుణంగా నష్టపోతున్నట్లు చంద్రబాబు అనుకూల మీడియాలోనే వార్తలు వచ్చాయని వెల్లడించారు. కిలో కందిపప్పును చౌకదుకాణాల ద్వారా ప్రభుత్వం రూ.50కే ఇచ్చిం దని చంద్రబాబు పెద్ద అబద్ధం చెప్పారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఎక్కడా రూ.50కి కిలో కందిపప్పు అమ్మలేదన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీఓలోనే రూ.90కి కిలో కందిపప్పు విక్రయించాలని ఆదేశించారని, ఈ విషయం కూడా తెలుసుకోకుండా చంద్రబాబు అవాస్తవాలు మాట్లాడారని నాగిరెడ్డి విమర్శించారు. -
బాబు నిలువునా మోసం చేశాడు
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీల అమలులో పూర్తిగా విఫలమయ్యారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్రెడ్డి ఆరోపించారు. గురువారం అనంతపురం ఆర్డీవో కార్యాలయం వద్ద రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆగమేఘాలపై పట్టిసీమ నిర్మిస్తున్న చంద్రబాబుకు హంద్రీ - నీవా ప్రాజెక్టు కనిపించలేదా అని ఆయన ప్రశ్నించారు. ఈ ధర్నాలో పాల్గొన్న పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి మాట్లాడుతూ... ఓటుకు కోట్లు వ్యవహారంలో బిజీగా ఉన్న చంద్రబాబుకు రైతు సమస్యలు పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. రుణమాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళలను నిలువునా మోసం చేశారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు ఎత్తిపోతల పథకంపై ఎందుకు అభ్యంతరం చెప్పడం లేదని చంద్రబాబును నాగిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఈ మహాధర్నాలో జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా : కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు తీరుకు నిరసనగా వైఎస్ఆర్ సీపీ నాయకులు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, నాయకులు జక్కంపూడి విజయలక్ష్మి, ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా: వైఎస్ఆర్ సీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు తానేటి వనిత, తెల్లం బాలరాజుతోపాటు పార్టీ నేతలు వంకా రవీంద్రనాథ్, టి. వాసుబాబు, తలారి వెంకట్రావ్, కొఠారు రామచంద్రరావు, కారుమంచి రమేష్, తెల్లం గోళ్ల శ్రీలక్ష్మి, బండి అబ్బులు పాల్గొన్నారు. ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ఎడ్ల బండ్లపై వినూత్న ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ జిల్లా : కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల హామీలను నెరవేర్చాలని వైఎస్ఆర్ సీపీ నేతలు గురువారం డిమాండ్ చేశారు. అందుకోసం కడప కలెక్టరేట్ ఎదుట వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీకాంత్రెడ్డి, రవీంద్రనాథ్రెడ్డి, అంజాద్బాషా, ఎమ్మెల్సీలు గోవిందరెడ్డి, నారాయణరెడ్డి పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా: ప్రజా సమస్యలపై కలెక్టరేట్ ఎదుట వైఎస్ఆర్ సీపీ మహా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బి ముత్యాల నాయుడు, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు ఉషాకిరణ్, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్యదర్శులు, నియోజకవర్గ ఇంఛార్జ్లతోపాటు పార్టీకి చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శ్రీకాకుళం జిల్లా: శ్రీకాకుళం కలెక్టరేట్ ఎదుట వైఎస్ఆర్ సీపీ నేతలు ధర్నా నిర్వహించారు. పార్టీ నాయకులు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, రెడ్డి శాంతి, ఎమ్మెల్యేలు వి.కళావతి, కంబాల జోగులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. విజయనగరం జిల్లా: రైతుల సమస్యలపై విజయనగరం కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్ సీపీ మహాధర్నా నిర్వహించింది. ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్యే రాజేంద్ర దొర, కేంద్ర పాలక మండలి సభ్యులు పెనుమత్స సాంబశివరాజు, మాజీ ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, అప్పలనాయుడుతోపాటు నెల్లిమర్ల, గజపతినగరం కన్వీనర్లు డా.సురేష్ బాఉ, శ్రీనివాసరావు, అరకు నియోజకవర్గ పార్లమెంట్ పరిశీలకురాలు కల్యాణి పాల్గొన్నారు. కృష్ణాజిల్లా : విజయవాడ: రైతుల సమస్యలపై సబ్ కలెక్టరేట్ ఎదుట వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొడాలి నాని, మేకా ప్రతాప్ అప్పారావు, జలీల్ ఖాన్, ఉప్పులేటి కల్పనతోపాటు పార్టీ నేతలు కె.పార్థసారధి, గౌతంరెడ్డి పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోచిత్తూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆ ధర్నాలో ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సునీల్కుమార్, నారాయణస్వామి, చింతల రామచంద్రారెడ్డి, ఆదిమూలంతోపాటు నాయకులు భూమన కరుణాకర్రెడ్డి పాల్గొన్నారు.చిత్తూరు: 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తన స్వార్ధం కోసం చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టారని వైఎస్ఆర్ సీపీ నేతలు మండిపడ్డారు. ఏపీని ఓ దొంగ పరిపాలిస్తున్నారన్నారు. అబద్దాలతో సీఎం అయి ఇప్పటికీ రైతుల సమస్యలు తీర్చలేదని విమర్శించారు. 20 శాతం రైతులకు కూడా విత్తనాలు పంపిణీ చేయని ఘనత చంద్రబాబుకే దక్కిందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిగా ఉండి ఎమ్మెల్యేల కొనుగోలుకు పాల్పడ్డ ఘనత చంద్రబాబుదన్నారు. గుంటూరు జిల్లా : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వరంలో గుంటూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు ముస్తఫా, డా.గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
అమ్మో.. నల్లగొండ
నల్లగొండ విద్యుత్ శాఖ బదిలీల్లో నల్లగొండ డివిజన్ హాట్టాపిక్గా మారింది. ఈ డివిజన్ పరిధిలోని నాలుగు సబ్డివిజన్ల ఏడీఈ స్థానాలు ఖాళీ కానున్నాయి. దీంట్లో నల్లగొండ, నల్లగొండ రూరల్, మునుగోడు, రామన్నపేట స్థానాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న ఏడీఈలు వేర్వేరు ప్రాంతాలకు బదిలీ కానున్నారు. నల్లగొండ ఏడీఈగా పనిచేస్తున్న నాగిరెడ్డి హుజూర్నగర్ వెళ్లేందుకు సుముఖంగా ఉన్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఏడీఈ సూర్యాపేట వేళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే మిగిలిన స్థానాల్లో పనిచేస్తున్న ఏడీఈలు కూడా వేరొక ప్రాంతాలకు వెళ్లనున్నారు. చాలా కాలం తర్వాత బదిలీలు జరుగుతుండటంతో శాఖా పరంగా ఇదొక ప్రక్షాళన లాంటిదే. కానీ జిల్లా మొత్తం మీద నల్లగొండ డివిజన్ అంటేనే అధికారులు హడలెత్తిపోతున్నారు. ఈ సబ్ డివిజన్ పరిధిలోకి వచ్చే మండలాల్లో కాంట్రాక్టర్ల బెదిరింపులకు అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. కాంట్రాక్టర్లకు, అధికారులకు మంచి ఆదాయం తెచ్చిపెట్టే డివిజన్ కావడంతో ఇక్కడ పోటీ ఒకింత ఎక్కువగానే ఉంటుంది. అయితే రామన్నపేట, నల్లగొండ సబ్ డివిజన్లలో అధికారులకు, ఏఈలకు మధ్య సమన్వయం లేకపోవడంతో కాంట్రాక్టర్లు రాజ్యమేలుతున్నారు. అయితే ఈ బదిలీల్లో ఇప్పటి వరకు పనిచేసిన వారందరికీ స్థాన చలనం కలుగుతున్నప్పటికీ కాంట్రాక్టర్లు వ్యవహార శైలి, రాజకీయ ఒత్తిళ్లు యథావిధిగానే ఉంటాయన్న అభిప్రాయంతో ఈ డివిజన్కు కొత్తవారు వచ్చేందుకు జంకుతున్నారు. దీంతో ఈ స్థానాలకు జిల్లాతో సంబంధం లేని కొత్త వ్యక్తులను హైదరాబాద్ నుంచి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పైరవీల జోరు... ఈ నెల 8 తేదీన బదిలీల షెడ్యూల్ జారీ అయింది. తొలుత 15వ తేదీలోగా బదిలీల ప్రక్రియ పూర్తిచేయాలని నిర్ణయించారు. కానీ మూడేళ్లుదాటిన ప్రతి ఒక్కరినీ తప్పనిసరిగా బదిలీ చేయాలని చెప్పడంతో జిల్లా వ్యాప్తంగా 5 వందల మంది వరకు బదిలీ కానున్నారు. ఎస్ఈ స్థాయిలోనే నాలుగు వందల మంది బదిలీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి బదిలీల ప్రక్రియను ఈ నెల 30 వరకు పొడిగించారు. బదిలీ అయిన ఉద్యోగులు, అధికారులు జూన్ 6 తేదీలోగా తమ ప్రాంతాలకు వెళ్లాలి. కాగా బదిలీల షెడ్యూల్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు కేవలం దేవరకొండ డివిజన్ పరిధిలో పనిచేసే లైన్మన్లు, అసిస్టెంట్ లైన్మన్లు, హెల్పర్ల బదిలీలు మాత్రమే పూర్తయ్యాయి. కానీ ఎస్ఈ స్థాయిలో చేయాల్సిన ఏడీఈలు, ఏఈలు, జూనియర్ అసిస్టెంట్లు, జేఏఓల బదిలీల కసరత్తు ఇంకా జరుగుతోంది. ఎస్ఈ కొత్త వారు కావడంతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఏడీఈల విషయానికొస్తే...కోదాడ, బీబీనగర్, నకిరేకల్, రామన్నపేట సబ్ డివిజన్లు రెవెన్యూ కలిగిన ప్రాంతాలు కావడంతో ఇక్కడికి వచ్చేందుకు పోటీ ఎక్కుగానే ఉంది. ఏఈలు మిర్యాలగూడ రూరల్, కోదాడ రూరల్, టౌన్, చివ్వెంల, ఆత్మకూరు (ఎస్), చౌటుప్పుల్ మండలాల మీద కన్నేశారు. హైదరాబాద్ పరిధిలోకి వచ్చే కొండమడుగు ఏఈ స్థానానికే రాష్ట్ర వ్యాప్తంగా 74 మంది పోటీలో ఉంటే దాంట్లో మన జిల్లాకు చెందిన వారు కూడా ఉండటం విశేషం. ఇక ఎస్ఈ కంట్రోల్ ఉండే జిల్లా స్టోర్స్ కార్యాలయంలో ఏఈలుగా పనిచేసేందుకు కూడా పోటీ పడుతున్నారు. నాలుగు చేతులా సంపాదన ఉన్న ప్రాంతాలు కావడంతో విద్యుత్ శాఖ బదిలీలు రాజకీయ జోక్యంతో రసవత్తరంగా సాగుతున్నాయి. -
5, 6 తేదీల్లో జగన్ నిరశన
ఏడాది బాబు పాలన వైఫల్యంపై పోరు ⇒ గుంటూరు- విజయవాడ మధ్య దీక్ష ⇒ వైఎస్సార్ సీపీ నేతలు ఉమ్మారెడ్డి, నాగిరెడ్డి సాక్షి, హైదరాబాద్: ఏడాది కాలపు చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేందుకు రాష్ట్ర విపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి వచ్చేనెల 5, 6 తేదీల్లో నిరశన దీక్షకు దిగుతున్నారు. ఈ మేరకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ రైతు విభాగపు అధ్యక్షుడు ఎన్వీఎస్ నాగిరెడ్డిలు ఆదివారం హైదరాబాద్లో మీడియాకు వెల్లడించారు. వారు మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ప్రభుత్వం విజయోత్సవ యాత్రలు జరపాలన్న సన్నాహాల్లో ఉన్నట్టు తెలిసింది. ఏడాది పాలనలో వైఫల్యాల జాబితా తప్పితే విజయాలేవీ కనబడడం లేదు. మేనిఫెస్టోలో చెప్పినవి అమలు జరిపిన దాఖలాలూ లేవు. వాళ్లు విజయోత్సవ యాత్రగా కాకుండా వైఫల్యాల యాత్ర అని చెప్పకుంటే సమంజసంగా ఉండేది. పాలనలో ఎందుకు వైఫల్యం చెందారో ప్రజలకు వివరణ ఇచ్చుకుంటే ఇంకా హుందాగా ఉంటుంది. విజయోత్సవ యాత్రలని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం సరికాదు. అన్నీ వైఫల్యాలే ఉన్నప్పుడు.. విజయోత్సవ యాత్రలు జరుపుకోడానికి వారికి నైతిక అర్హత ఎక్కడుంది?. దీనిని ప్రశ్నించడానికే జగన్మోహన్రెడ్డి నిరాహార దీక్ష చేపట్టబోతున్నారు’ అని వివరించారు. పలువురు పార్టీ నేతలతో చర్చించిన తర్వాతే విజయవాడ- గుంటూరు ప్రాంతాల మధ్య దీక్ష చేపట్టాలని జగన్ నిర్ణయించారని, దీక్ష చేపట్టే ప్రాంతాన్ని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. ఫిర్యాదులు వెల్లువెత్తుతుంటే మాఫీ ఎక్కడ జరిగినట్టు? ‘‘రైతుల రుణాలన్నీ మాఫీ చేశాం అంటున్నారు. రుణమాఫీ అందని వారు ఫిర్యాదు చేసుకోమంటే కుప్పలు కుప్పలుగా బస్తాల్లో ఫిర్యాదులు అందుతున్నాయి. రెండు విడతల్లో రైతులకు ఇచ్చింది రూ. 7 వేల కోట్లు కూడా లేదు. రూ.23 వేల కోట్లు రుణమాఫీ చేశామంటున్నారు. ఎందుకు మభ్య పెడుతున్నారో అర్థం కావడంలేదు. రుణమాఫీ చేస్తున్న కొద్ది మందికీ ఏటా 20 శాతం కిస్తీల రూపేణా మీరు ఐదేళ్ల పాటు ఇస్తుంటే, బ్యాంకులు మాత్రం ఏటా 14 శాతం చొప్పున చక్రవడ్డీ వసూలు చేసే పరిస్థితి ఉంది. రుణమాఫీ అంటే రుణం పూర్తిగా మాఫీ కావడమన్నది ఈ రోజున ఎక్కడ జరిగింది?. డ్వాక్రా మహిళలను మోసం చేశారు. ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు. ఇప్పుడేమో ఒక్కొక్క మహిళ పేరున బ్యాంకులో రూ. 3 వేలు వేస్తామంటున్నారు. ఉద్యోగాలిస్తామని యువతను మోసం చేశారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యని.. ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదు. ప్రతి అంశంలోనూ వైఫల్యం చెందిన బాబు సర్కారుకి విజయోత్సవాలు జరుపుకొనే అర్హత లేదు. కృష్ణానది పైభాగంలో రికార్డుస్థాయిలో వర్షాలు కురిసి శ్రీశైలం, సాగర్లు నిండినా 90 శాతం మాత్రమే వరి పంటను సాగులోకి తేగలిగారు. వేరుశనగ సాగు 35 శాతం, పప్పుధాన్యాల సాగు 33 శాతం తగ్గిపోయిందని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. స్వామినాథన్ కమిటీ సిపార్సులను అమలు చేస్తానని ఎన్నికల ముందు చెప్పి, ఇప్పుడు కనీస మద్దతు ధరకు కూడా రైతుల నుంచి పంట కొనే పరిస్థితి కల్పించడం లేదు. మద్దతు ధర పెంచాలని కేంద్రంపై వత్తిడి తేలేకపోయారు. కనీసం కేంద్రానికి లేఖనైనా ఎందుకు రాయలేదు?. సాగునీటి రంగంలో.. హంద్రీనీవా పూర్తి చేయడానికి రూ.2 వేల కోట్లు కావాల్సి ఉంటే రూ. 200 కోట్లు బడ్జెట్లో పెట్టి దానిని ఈ ఏడాది పూర్తి చేస్తామంటారు. వెలుగొండ ప్రాజెక్టుకు రూ.1,550 కోట్లు కావాల్సి ఉంటే రూ.153 కోట్లు బడ్జెట్లో పెట్టి దానినీ ఈ ఏడాది పూర్తి చేస్తామంటారు. ఇవన్నీ మభ్యపెట్టే మాటలు కాదా?. వీటిని ప్రశ్నించేందుకే.. జగన్ దీక్షకు దిగుతున్నారు.’’ అని ఉమ్మారెడ్డి, నాగిరెడ్డిలు వివరించారు. -
నాయన మాటలు ఇప్పటికీ గుర్తే!
- బి. వెంకట్రామరెడ్డి, ప్రముఖ నిర్మాత - ‘విజయ’ నాగిరెడ్డి కుమారుడు బి. నాగిరెడ్డి... చెన్నైలో ‘విజయ- వాహినీ’ స్టూడియో అధినేతగా, సకుటుంబ చిత్రాల నిర్మాతగా, చందమామ - విజయచిత్ర పత్రికల యజ మానిగా, విజయ హాస్పిటల్ నిర్వాహకుడిగా ఆయనది అద్భుత చరిత్ర. ఆ దార్శనికుడి సినీ వారసత్వం కొనసాగేలా ప్రతి ఏటా ‘సకుటుంబ వినోదా త్మక చిత్రం’ కేటగిరీలో ఒక్కో తెలుగు, తమిళ చిత్రాన్ని ఎంపిక చేసి, ఆ నిర్మాతను గౌరవిస్తున్నారు - నాగిరెడ్డి ఆఖరి కుమారుడు - చిత్ర నిర్మాత బి. వెంకట్రామరెడ్డి (బాబ్జీ). 2014కి తెలుగులో ‘రేసు గుర్రం’ చిత్ర నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్, డాక్టర్ వెంకటేశ్వరరావులకు ‘బి. నాగిరెడ్డి స్మారక పురస్కారం’ ఈ ఆదివారం హైదరాబాద్లో అందిస్తున్నారాయన. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఆయన పంచుకున్న మనోభావాలు... మా ‘విజయా’ వారి చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించిన ఎమ్జీయార్, ఎన్టీఆర్, జయలలిత - ముగ్గురూ రాష్ట్ర ముఖ్యమంత్రులయ్యారు. అది మాకెంతో గర్వకారణమైన విషయం. అలాగే, కన్నడ సూపర్స్టార్ రాజ్కుమార్ సైతం మా సినిమాల్లో నటించారు. కొన్నేళ్ళ క్రితం అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను నేరుగా కలుసుకున్నాం. ‘విజయ సంస్థతో, నాగిరెడ్డి గారితో ఎన్నో తీపి జ్ఞాపకాలున్నాయి’ అని ఆమె గుర్తుచేసుకున్నారు. మా నాయనకూ, మా సంస్థకూ ఇవాళ్టికీ ఉన్న గౌరవానికి అది ఉదాహరణ. నాయనతో అనుబంధం ఉన్న సినిమా వ్యక్తులు, ఆ తరం క్రమంగా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతుంటే, బాధగా అనిపిస్తోంది. మా ‘విజయా’ సంస్థకు పర్మినెంట్ హీరో ఎన్టీఆర్ గారు. ఆయనతో మాది ప్రత్యేక బంధం. ఏయన్నార్ గారు మా ‘విజయా’ హీరో కాకపోయినా, నాయనతో ఆయన అనుబంధం అంతా ఇంతా కాదు. ఆయన పెళ్ళికి శుభలేఖలు ముద్రించింది మా నాయనే! దానికి, మా నాయన డబ్బు కూడా తీసుకోలేదట. అలాగే, ఏయన్నార్ 60 చిత్రాల పూర్తి వేడుకకు తగిన వేదిక ఏదీ ఆయనకు దొరకలేదు. దాంతో, మా నాయన అప్పటికప్పుడు ‘విజయా గార్డెన్స్’ వేదిక కట్టించారు. హైదరాబాద్లో ‘అన్నపూర్ణా స్టూడియో’ కడుతున్నప్పుడు ఆ డిజైనింగ్లో నాయన సలహాలిచ్చారు. అందుకే, ఏయన్నార్కు నాయనంటే అభిమానం. అలాగే, రామానాయుడు గారితో ప్రత్యేక అనుబంధం. నిజానికి, నాయన ఎప్పుడూ పార్ట్నర్షిప్లకు పోడు. ఆయనకు పెద్దగా ఇష్టం లేకపోయినా - నాగిరెడ్డి గారి పిల్లలమైన మేము, రామానాయుడి గారు కలసి ‘విజయా - సురేశ్ కంబైన్స్’ స్థాపించాం. అలా ‘పాప కోసం’తో మొదలుపెట్టి ‘సురేశ్ మూవీస్’, ‘సురేశ్ ఇంటర్నేషనల్’ లాంటి బ్యానర్లపై 20 చిత్రాలు నిర్మించాం. తెలుగు, తమిళ, హిందీల్లో ‘ప్రేమ్నగర్’ కూడా మేము కలసి తీసినదే. మా నాయనదీ, చక్రపాణి గారిదీ అపురూపమైన స్నేహబంధం. మా నాయన ఎప్పుడూ సకుటుంబంగా చూడదగ్గ, సందేశాత్మక చిత్రాలు తీయాలనేవారు. చక్రపాణి గారేమో ‘మెసేజ్ ఇవ్వడానికి సినిమా తీసే కన్నా, టెలిగ్రామ్ పంపితే చౌక కదా!’ అని ఛలోక్తి విసిరేవారు. అయితే, మూడో వ్యక్తి మాటల్లో ఈగ వాలనిచ్చేవారు కాదు. నాయనంటే చక్రపాణి గారికంత ప్రేమ. చక్రపాణి గారు పోయాక నాయనలో చిత్ర నిర్మాణంపై ఉత్సాహం తగ్గింది. నాయనను చూసి పెరిగిన నాకు, ఆయన లాగానే చిత్ర, భవన నిర్మాణాల మీద ఆసక్తి.ఆ పను ల్లోనే ఉన్నా. 1991లో ‘చందమామ - విజయా కంబైన్స్’పై చిత్రాలు తీయడం ప్రారంభించా. తెలుగులో రాజేంద్రప్రసాద్తో ‘బృందావనం’, బాలకృష్ణతో ‘భైరవద్వీపం’, ‘శ్రీకృష్ణార్జున విజయము’, తమిళంలో రజనీకాంత్తో ‘ఉళైప్పాళి’, కమలహాసన్తో ‘నమ్మవర్’, అలాగే ‘కరుప్పు వెల్లై’ లాంటి చిత్రాలు తీశాను. నాయన ఉండగా, నిర్మాతగా నా పేరు పడడం నాకిష్టం లేదు. అయితే, 2004లో నాయన చనిపోవడంతో, ఆయన ఆశయాలకు కొనసాగింపుగా ‘విజయా ప్రొడక్షన్స’ పేరు పెట్టి, తమిళంలో విశాల్తో ‘తామ్రపరణి’, ధనుష్తో ‘పడిక్కాదవన్’, ‘వేంగై’, ఇటీవలే అజిత్తో ‘వీరవ్ు’ చిత్రాలు తీశా. తెలుగులోనూ సినిమాలు తీయాలని ఉంది. కానీ, పెరుగుతున్న వ్యయం, పారితోషికాలు, మారుతున్న పరిస్థితుల మధ్య ఆలోచించాల్సి వస్తోంది. మద్రాసులో ప్రారంభించిన మొట్టమొదటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మాదే. 1972లోనే మా ‘విజయా హాస్పిటల్ ట్రస్ట్’ ప్రారంభించాం. తరువాత రెండేళ్ళకు ’74లో కేవలం 30 పడకలతో ప్రారంభమైన మా ఆస్పత్రి ఇవాళ 750 పడకలతో, దాదాపు 1800 మంది ఉద్యోగులతో నడుస్తోంది. ప్రతి ఏటా నాయన జయంతికి ఉచిత వైద్యశిబిరం ద్వారా వందలమందికి సేవలందిస్తున్నాం. మా ఆవిడ భారతీరెడ్డి ఆస్పత్రికి సి.ఇ.ఒ.గా బాధ్యతలు చూస్తోంది. మా నాయన నాగిరెడ్డి గారి పిల్లల్లో అందరి కన్నా చిన్నవాణ్ణయినా, ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నా. ‘‘ఉద్యోగుల క్షేమం చూడాలి, వాళ్ళకు ముందు జీతభత్యాలివ్వాలి. వర్కర్లను ఎప్పుడూ ‘మీరు’ అనే తప్ప, తక్కువ చేసి పిలవకూడదు. వినయం ఎంత ఉంటే, అంత మంచిది. ఎప్పుడూ ఒకరితో పోల్చుకోకూడదు. నీ పైన ఎంతమంది ఉన్నారనే దాని కన్నా, కింద ఎంత మంది ఉన్నారనేది చూసుకోవాలి’’ - ఇలా ఆయన చెప్పిన జీవిత సూత్రాలు ఇప్పటికీ నాకు గుర్తే. ఈ తరానికీ మార్గ దర్శకమైన జీవితం, సందేశం ఆయ నది. అందుకే, ఆయనపై మంచి కాఫీ టేబుల్ బుక్ తేనున్నాం. - రెంటాల జయదేవ -
సర్వీసు రూల్స్.. ఇక సరళతరం!
ఉద్యోగుల నిబంధనలసడలింపుపై ఉన్నతస్థాయి కమిటీ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి నేతృత్వంలో ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు నిబంధనలను సరళతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో తొలిదశలో భాగంగా ఆరు అంశాలను ప్రధాన ఎజెండాగా ఎంచుకుంది. ఉద్యోగుల ప్రమోషన్లకు ఉండాల్సిన కనీస సర్వీసు, అర్హతలు, కారుణ్య నియామకాలకు అర్హత విధానం, వైద్య బిల్లులు, అంతర్ జిల్లా, అంతర్ జోనల్ బదిలీలు, సొంత జిల్లాలు, సొంత సబ్ డివిజన్ల పరిధిలో పోస్టింగులకు ఉన్న నిబంధనల్లో సడలింపులు, మినహాయిం పులను తొలుత పరిశీలించనున్నారు. వీటితో పాటు రిటైర్డ్ అధికారుల నియామకాలు, వారి సేవల వినియోగించుకునే ప్రతిపాదనలను కూడా రూపొందిస్తారు. తెలంగాణ ముద్ర కనిపించేలా ఉద్యోగుల సర్వీస్ రూల్స్ను సరళతరం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు పలుమార్లు ప్రకటించిన విషయం తెలి సిందే. ఉమ్మడి రాష్ట్రంలోని సేవా నిబంధనలను సమూలంగా మార్చి కొత్తవి రూపొం దించాల్సి ఉందని అధికారులతోనూ ఆయన ప్రస్తావించారు. అందులో భాగంగానే తాజా కసరత్తు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. సర్వీస్ రూల్స్ను సరళతరం చేసే ప్రక్రియను చేపట్టేందుకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ పరిపాలనా విభాగం ముఖ్య కార్యదర్శి(రాజకీయ), కార్యదర్శి (సర్వీసెస్), వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉన్నారు. జీఏడీ డిప్యూటీ కార్యదర్శి(ఎస్ఆర్) కన్వీనర్గా వ్యవహరిస్తారు. ప్రతి 15 రోజులకోసారి ఈ కమిటీ సమావేశమవుతుంది. ఎజెండాలో ప్రస్తావిం చిన అంశాలకు సంబంధించిన నిబంధనల సడలింపులు, మినహాయింపుల ప్రతిపాదనలు, వాటిని సమర్థించే నివేదికలను అన్ని విభాగాలు కమిటీ సమావేశాలకు వారం రోజుల ముందే అందించాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని విభాగాల నుంచి అందిన ప్రతిపాదనల ఆధారంగా ఈ కమిటీ కొత్త సర్వీసు నిబంధనలకు రూపకల్పన చేస్తుంది. దీంతోపాటు ఉద్యోగ సంఘాలు, నిపుణులతో నూ ఈ కమిటీ చర్చలు జరిపే అవకాశం ఉంది. తెలంగాణ, ఏపీల మధ్య ఉద్యోగుల విభజన ప్రక్రియ మరో నెల రోజుల్లో ముగియనుండడంతో ప్రభుత్వం కొత్త సర్వీసు నిబంధనలపై దృష్టి సారించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘వైద్య బిల్లుల’పై దృష్టి.. హెల్త్ కార్డుల పథకాన్ని తెచ్చినప్పటికీ అది పూర్తిగా అమల్లోకి రాని నేపథ్యంలో... తాజాగా సర్వీసు నిబంధనలపై ఏర్పాటు చేసిన కమిటీకి మెడికల్ క్లెయిమ్ల అంశాన్ని అప్పగించడం ఉద్యోగులను ఆకర్షిస్తోంది. హెల్త్కార్డుల పథకం అమల్లోకి వస్తే తమకు నచ్చిన ఆసుపత్రిలో ఉద్యోగులు వైద్యం చేయించుకునే వీలుంది. కానీ రాష్ట్రంలో పేరొందిన కార్పొరేట్ ఆసుపత్రులు వాటిని ఆమోదించడం లేదు. దీంతో ప్రభుత్వం 1972 నుంచి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న మెడికల్ రీయింబర్స్మెంట్ విధానాన్నే కొనసాగిస్తోంది. ఈ విధానం ప్రకారం రూ. 50 వేలకు లోబడిన మెడికల్ బిల్లులను జిల్లా బోర్డుకు, అంతకు మించిన బిల్లులను రాష్ట్ర మెడికల్ బోర్డుకు పంపించాల్సి ఉంటుంది. అయితే అన్నిచోట్లా బిల్లుల రీయింబర్స్మెంట్ నెలల తరబడి పెండింగ్లో ఉంటోంది. దీంతోపాటు వైద్య చికిత్స బిల్లులను తగ్గిస్తుండడంతో ఇబ్బంది పడుతున్నామంటూ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కమిటీకి అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఉద్యోగుల అంతర్ జిల్లా, అంతర్ జోనల్ బదిలీలకు కొన్ని విభాగాలు పరిమితంగా అవకాశం కల్పిస్తున్నాయి. అయితే సాధారణ బదిలీలతో పాటు వీటికి అవకాశం కల్పించాలని ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. వీటితో పాటు సొంత జిల్లాలు, సొంత సబ్ డివిజన్ల పరిధిలో పోస్టింగులు ఇవ్వాలా, వద్దా? ఏయే శాఖలకు మినహాయింపులు ఇవ్వాలనే అంశాన్ని కమిటీ పరిశీలించనుంది. వివిధ విభాగాల్లో రిటైర్డ్ అధికారుల సేవలను వినియోగించుకునే ప్రతిపాదనలు, అందుకు మార్గదర్శకాలను సిద్ధం చేయనుంది. ఇబ్బందులన్నీ తప్పేనా? ఉద్యోగులకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో 57 ఏళ్ల కిందటి నిబంధనలు, దశాబ్దం కిందటి రాష్ట్ర సబార్డినేట్ సర్వీసు నిబంధనలే ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. కాలానుగుణంగా పలు ప్రత్యేక నిబంధనలను చేర్చినప్పటికీ... ఉద్యోగుల నియామకాలు, పదోన్నతులు వంటి పలు అంశాల్లో ఏకరూపత కరువైంది. ప్రత్యక్ష, పరోక్ష నియామకాలతో పాటు సీనియారిటీ ఆధారిత పదోన్నతులు, ప్రతిభ ఆధారిత పదోన్నతులకు ఇప్పటికీ స్పష్టమైన మార్గదర్శకాలు లేవు. 1996 రాష్ట్ర సబార్డినేట్ సర్వీసు నిబంధనల ప్రకారం... ఉద్యోగి పైకేడర్కు పదోన్నతి పొందాలంటే ప్రస్తుత కేడర్లో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలనే నిబంధన ఉంది. ఇక కారుణ్య నియామకాల అంశంపై గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పరిస్థితి గందరగోళంగా మారింది. గతంలో ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులకు కారుణ్య నియామకాల్లో జూనియర్ అసిస్టెంట్ స్థాయికి మించని ఉద్యోగం ఇచ్చే నిబంధన ఉంది. రాష్ట్ర విభజనకు ముందు ఇందుకు కనీస విద్యార్హతను డిగ్రీకి పెంచారు. కానీ అప్పటికే నాలుగేళ్లుగా అన్ని జిల్లాల్లో పెండింగ్లో ఉన్న వందలాది దరఖాస్తుల మాటేమిటనేదానిపై సర్కారు స్పష్టత ఇవ్వలేదు. -
ఖరీఫ్ అయినా రుణం దక్కలేదు:నాగిరెడ్డి
-
ఏపీ రైతులు సంక్షోభంలో ఉన్నారు: నాగిరెడ్డి
-
'పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదు'
విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదు వైఎస్ఆర్ సీపీ రైతు విభాగం కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి ఆరోపించారు. ఆదివారం విజయవాడలో నాగిరెడ్డి మాట్లాడుతూ... ఎగుమతులు, దిగుమతులు రైతులను సంక్షోభంలోకి పడేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ ఇప్పటి వరకు ఏ గ్రామంలో అమలైందో సర్వే చేయించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని అన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సు మేరకు పంటకు మద్దతు ధర కల్పించాని ప్రభుత్వాన్ని కోరారు. -
''రుణమాఫీపై ఇప్పటీ వరకు స్పష్టత లేదు''
-
కల్తీ ఆయిల్ గుట్టు రట్టు
ఆదిబట్ల/ఇబ్రహీంపట్నం: కల్తీ ఆయిల్ తయారీ గుట్టును అధికారులు రట్టుచేశారు. వాహనాల్లో వినియోగించిన ఆయిల్ తీసుకొచ్చి రీసైక్లింగ్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్న ఓ కంపెనీపై ఎస్ఓటీ అధికారులు దాడులు నిర్వహించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ ఇఫ్తికార్ అహ్మద్ కథనం ప్రకారం.. హయత్నగర్ మండలానికి చెందిన నాగిరెడ్డి, వెంకట్రావులు రాందాస్పల్లి శివారులో నాలుగేళ్లుగా ఓ పాత పౌల్రీ ఫామ్లో వివిధ ప్రాంతాల నుంచి వినియోగించిన ఆయిల్ను తీసుకొచ్చి గుట్టుగా రీసైక్లింగ్ చేస్తున్నారు. అనంతరం నగరంలోని బేగంబజార్ మార్కెట్లో ఆయిల్ను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. విశ్వసనీయ సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు శనివారం రాత్రి 11 గంటల సమయంలో కంపెనీపై దాడులు నిర్వహించారు. నిర్వాహకులు నాగిరెడ్డి, వెంకట్రావులను అరెస్టు చేవారు. వినియోగించిన పాత ఆయిల్ డ్రమ్ములు 31, రీసైక్లింగ్ చేసి తయారు చేసిన 12 ఆయిల్ డ్రమ్ములతో పాటు రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు అధికారులు కేసును ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. -
ముందు హామీలు అమలు చేయండి!
రైతులను మళ్లీమళ్లీ మోసపుచ్చకండి: సీఎంకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి హైదరాబాద్: రైతుల ప్రయోజనాల కోసమంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటిదాకా ఇచ్చిన ఏ హామీ అమలు చేసి చూపించారని కొత్తగా ‘హరిత’ పథకం ప్రకటిస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. సీఎం చంద్రబాబు దయచేసి ఆత్మవంచన చేసుకోకుండా ఆత్మవిమర్శ చేసుకొని పథకాల ప్రకటన చేయాలని పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి హితవు పలికారు. శుక్రవారం పార్టీ కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఇప్పటికే ఎన్నికల ముందిచ్చిన రైతు రుణాల మాఫీ హామీ అమలు పక్కకు పోయింది.. మేనిఫెస్టోలో ప్రకటించినట్టు స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలుకు నోచుకోలేదు.. ఐదు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు ఊసే లేదు.. ఎప్పటికప్పుడు ప్రజలను, రైతులను మోసం చేసే కార్యక్రమాలతో సీఎం ముందుకు సాగుతున్నారు’’ అని దుయ్యబట్టారు. రైతుల్ని అప్పులపాలుచేశారు.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రైతుల రుణాలు రద్దు కాకపోగా, వారు అప్పు కోసం ప్రైవేట్ వ్యాపారుల బారిన పడేలా చేశారని, మొన్నటి వరకు జీరో శాతంతో వడ్డీ రుణాలు పొందిన రైతు నెత్తిన ఇప్పుడు 14 శాతం వడ్డీ భారం పెట్టారని నాగిరెడ్డి దుయ్యబట్టారు. కొత్త రాజధాని ఏర్పాటు కోసం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కావాల్సినంత అటవీ భూమి అందుబాటులో ఉన్నప్పటికీ సన్న, చిన్నకారు రైతులకు చెందిన 30 వేల ఎకరాలు రాజధాని కోసమని బలవంతంగా లాక్కొంటున్నారని విమర్శించారు. తనను చూస్తేనే కరువు పారిపోతుందని బాబు చెప్పుకుంటుంటే ఆయన అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్రలో మూడు జిల్లాల్లో పంట తుపానుకు కొట్టుకుపోయిందని, మిగిలిన జిల్లాల్లో కరువు విలయతాండవం చేస్తోందని దుయ్యబట్టారు. -
రెండు నెలల బడ్జెట్కు ఓకే
గవర్నర్ ఆమోదం.. సంచిత నిధి నుంచి వినియోగం డిసెంబర్ 2 వరకు వినియోగించుకునే అవకాశం హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ రెండో తేదీ నుంచి డిసెంబర్ రెండో తేదీ వరకు సంచిత నిధి నుంచి రూ.16,890.85 కోట్లు వ్యయం చేయడానికి గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపారు. దీనితో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి వి.నాగిరెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విభజన తరువాత అప్పట్లో గవర్నర్ జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు దాదాపు రూ. 26,573 కోట్లను సంచిత నిధి నుంచి వినియోగించుకోవడానికి అనుమతించారు. అక్టోబర్ రెండో తేదీలోగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభను సమావేశపరిచి బడ్జెట్కు ఆమోదం పొందాల్సి ఉండింది. అయితే విభజన చట్టంలో ఆరు నెలల కాలానికి సంచిత నిధి నుంచి పాలన, వేతనాలు ఇతర వ్యయానికి గవర్నర్ అనుమతిస్తే చాలన్న వెసులుబాటు ఉంది. దీనితో ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు సెప్టెంబర్లో నిర్వహించాల్సిన బడ్జెట్ సమావేశాలను వాయిదా వేశారు. రెండు నెలల కాలానికి సంచిత నిధి నుంచి నిధులు తీసుకోవడానికి వీలుగా మంత్రివర్గ సమావేశం లేకుండా.. సర్క్యులేషన్ పద్ధతిలో మంత్రుల వద్ద సంతకాలు తీసుకుని గవర్నర్ ఆమోదం కోసం పంపించారు. ఈ రెండు నెలల వ్యయానికి గవర్నర్ అనువుతించడంతో ఆర్థిక శాఖ తదనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది. -
'నీటియుద్దాలు వస్తాయని వైఎస్ జగన్ ముందే చెప్పారు'
గుంటూరు: రాష్ట్ర విభజన జరిగితే రెండు రాష్ట్రాల మధ్య నీటి యుద్దాలు వస్తాయని వైఎస్ జగన్ ముందే చెప్పారని వైఎస్ఆర్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి తెలిపారు. అయినా వైఎస్ జగన్ హెచ్చరికల్ని పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విడగొట్టిందని నాగిరెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత సాగునీరే రాదు, తాగునీటికీ ఇబ్బందులు తలెత్తాయని నాగిరెడ్డి చెప్పారు. చంద్రబాబు ఢిల్లీ చుట్టూ తిరగటం తప్ప రైతుల కోసం చేసిందేమీలేదని నాగిరెడ్డి విమర్శించారు. ఆయన గతంలో సీఎంగా చేసినప్పుడు చోద్యం చూడబట్టే ఎగువ రాష్ట్రాలు అక్రమ ప్రాజెక్టులు కట్టాయని నాగిరెడ్డి ఆరోపించారు. గత ముప్పై ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా జూన్లో వర్షభావం ఏర్పడిందని నాగిరెడ్డి తెలిపారు. -
మానోళ్లకు పెద్ద పదవులు?
జోగిపేట, న్యూస్లైన్: తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లా వారికి కీలక పదవు లు దక్కే అవకాశం ఉంది. గజ్వేల్ అసెంబ్లీ నుంచి గెలిచిన టీ ఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలో సీఎం పగ్గాలు చేపట్టనున్న విషయం తెల్సిందే. అయితే ప్రభుత్వ పాలనలో ప్రధాన భూ మికను పోషించే ప్రధాన కార్యదర్శి పదవి లేదా సీఎం పేషీలోని ముఖ్యమైన పదవుల కోసం జిల్లాకు చెందిన సీనియర్ ఐఏఎస్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరిద్దరు కూడా జోగి పేట డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థులు కావడం గమనార్హం. జోగిపేట ప్రభుత్వ కళాశాలలో చదువుకుని ఐఏఎస్ పూర్తి చేసి ఉన్నత పదవుల్లో ఉన్న నర్సింగరావు, నాగిరెడ్డిల కు కొత్తగా ఏర్పడబో యే తెలంగాణ రాష్ట్రంలో కీలక పదవు లు దక్కనున్నట్టు సమాచారం. ప్రస్తుతం నర్సింగరావు కోల్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్గా పనిచేస్తున్నా రు. కాగా వి.నాగిరెడ్డి నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి గా కొనసాగుతున్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల గ్రామానికి చెందిన సింగాయిపల్లి నర్సింగ్రావు 1976-1979లో జోగిపేట ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. కాగా అందోల్ ని యోజకవర్గంలోని పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేటకు చెందిన నాగిరెడ్డి 1975లో జోగిపేటలో డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయం కావడంతో వీరిద్దరికి ముఖ్యమైన బాధ్యతలను అప్పగించేందుకు టీఆర్ఎస్ఎల్పీ నేత కె.చంద్రశేఖర్రావు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. వీరిద్దరు కూడా జిల్లా కు చెందిన వారు కావడం విశేషం. ఇటీవల కేసీఆర్ గవర్నర్ వద్దకు వెళ్లిన సమయంలో నర్సింగరావు కూడా వెంట ఉన్న ట్టు సమాచారం. ఆయన్ను రాష్ట్ర సర్వీసులోకి తీసుకొచ్చేం దుకు సాంకేతిక సమస్యలు ఏమైనా ఎదురైతే నాగిరెడ్డి పేరును పరిశీలించనున్నారు. నాగిరెడ్డికి సీఎస్ లేదా సీఎం పేషీలో ఏదైనా ముఖ్య పదవిని కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. జోగిపేట కళాశాలకు చెందిన వీరిద్దరికి రాష్ట్రస్థాయిలో ముఖ్యపదవులు లభించనుండడంతో స్థానికులతోపాటు వారి స్నేహితులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
'సంచి టీడీపీదైతే సరుకు కాంగ్రెస్ది'
హైదరాబాద్: చంద్రబాబుకు ఓటేస్తే విభజనకు ఓటేసినట్టేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ నాగిరెడ్డి అన్నారు. కాంగ్రెస్, టీడీపీ మ్యాచ్ ఫిక్సింగ్ భాగంగానే నాయకుల వలసలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. సంచి టీడీపీదైతే సరుకు కాంగ్రెస్దని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు మీరు టీడీపీ అధ్యక్షుడివా, సీమాంధ్ర కాంగ్రెస్ నేతవా అని ప్రశ్నించారు. 65 ఏళ్ల వయస్సులో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు నాయుడు హామీలు నకిలీ నోట్లలాంటివని అంతకుముందు విమర్శించారు. తన పాలన మళ్లీ తెస్తానని చంద్రబాబు చెప్పగలరా అని నాగిరెడ్డి ప్రశ్నించారు. -
చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదం
నాగులుప్పలపాడు, న్యూస్లైన్ : ఓట్ల కోసం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ర్ట కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులను ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవసాయం దండగని మాట్లాడిన ఆయన..ప్రస్తుతం ఓట్లు, అధికారం కోసం రైతు సంక్షేమమే ధ్యేయమని, తాను అధికారంలోకి రాగానే వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు సోమవారం జిల్లాకు వచ్చిన నాగిరెడ్డి.. నాగులుప్పలపాడు మండలంలోని బి.నిడమానూరు గ్రామంలో సాగుచేస్తున్న పంటలను పరిశీలించారు. పత్తి, పొగాకు, తదితర పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వ్యవసాయం చేయాలంటేనే రైతులు భయపడుతున్నారని పేర్కొన్నారు. పంటలు సాగుచేసేందుకు పెట్టుబడులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయని, చేతికొచ్చిన పంటకు గిట్టుబాటు ధరలు మాత్రం సగానికిపైగా పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఆరుగాలం కష్టపడిన రైతుల పరిస్థితి దయనీయంగా మారుతోందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 483 రూపాయలున్న డీఏపీ ఎరువుల బస్తా ధర ప్రస్తుతం 1,350 రూపాయలకు పెరిగిందన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు చూస్తే.. వైఎస్ఆర్ హయాంలో 6,000 రూపాయలున్న పత్తి ధర ప్రస్తుతం 3,000 రూపాయలకు పడిపోయిందన్నారు. దీన్నిబట్టి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతు సంక్షేమంపై ఏపాటి శ్రద్ధ ఉందో అర్థమవుతోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని నాగిరెడ్డి డిమాండ్ చేశారు. ఏమాత్రం భద్రత లేని రంగంగా వ్యవసాయరంగం మారిందని, ఇదే పరిస్థితి కొనసాగితే రైతులంతా వ్యవసాయం మానుకుని ఇతర రంగాలను ఎంచుకుంటారని పేర్కొన్నారు. అదే జరిగితే భవిష్యత్తులో ఆహార ధాన్యాల సమస్య తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 70 వేల కోట్ల రూపాయల పంట రుణాలతో పాటు రైతుమిత్ర, తదితర రుణాలు 1.25 లక్షల కోట్ల రూపాయలున్నాయని, వాటన్నింటినీ మాఫీ చేయడం సాధ్యమయ్యేపనికాదని నాగిరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు వాస్తవాలు తెలుసుకోకుండా ఓట్ల కోసం అలివిగాని హామీలిస్తూ రైతులను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్ సీపీ డిమాండ్ మేరకు ప్రకృతి వైపరీత్యాలు, ఇతర కారణాల వల్ల పంట నష్టపోయిన రైతుల రుణాలు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నాగిరెడ్డి వెంట వైఎస్ఆర్ సీపీ రైతు విభాగం జిల్లా కన్వీనర్ మారెడ్డి సుబ్బారెడ్డి, పలువురు రైతులు ఉన్నారు. -
ధర్మబద్ధంగా వ్యవహరించాలి
సత్తుపల్లి, న్యూస్లైన్: సింగరేణి ఓపెన్కాస్టు భూ నిర్వాసితులకు నూతన భూసేకరణ చట్టం వర్తించేలా ప్రభుత్వం ధర్మబద్ధమైన ఆలోచన చేయాలని వైఎస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి కోరారు. సత్తుపల్లిలో భూ నిర్వాసితులు చేపట్టిన దీక్షలకు ఆదివారం ఆరో రోజు ఆయన సంఘీభావం ప్రకటించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు నిర్వాసిత రైతులకు న్యాయం జరిగేవరకు పోరాడాలన్నారు. ఎవరి జేబులో సొమ్ము ఇవ్వటం లేదని.. లక్షకోట్లు దాటిన రాష్ట్ర బడ్జెట్లో భూ నిర్వాసితులకు ఇచ్చే పరిహారమెంత అని ప్రశ్నించారు. నిర్వాసిత కుటుంబాలు ఘోషిస్తూ శాపనార్ధాలు పెడుతున్నా.. భూమిని బలవంతంగా తీసుకునేందుకే హడావిడిగా జనరల్ అవార్డు పాస్చేసి డబ్బులు డిపాజిట్ చేయటం ఏమాత్రం న్యాయ సమ్మతం కాదన్నారు. ప్రభుత్వంలో బాధ్యులుగా ఉన్న మంత్రులు ప్రకటనలకు పరిమితం కాకుండా అవార్డు రద్దుచేసేలా ప్రభుత్వాన్ని ఒప్పించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎవరిని మోసం చేయని వ్యక్తి ఒక్క రైతు మాత్రమేనన్నారు. రైతు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు ఒక్క బస్తా ఎక్కువ దిగుబడి వచ్చినా అమితంగా ఆనందపడతాడన్నారు. నలుగురికి అన్నంపెట్టి ఆహారభద్రత ఇస్తున్న రైతులను మోసంతో బయటకు పంపించటం దారుణమన్నారు. నిర్వాసితుల పరిహారం పెంపు ఘనత వైఎస్ఆర్దే.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పోలవరం నిర్వాసిత రైతులకు ఇచ్చిన రూ.1.04 లక్షల పరిహారం సరిపోదని ఉద్యమిస్తే దాన్ని రూ.2.40 లక్షలకు పెంచి ఉత్తర్వులు జారీ చేశారని గుర్తు చేశారు. మానవతాదృక్పథం ఉన్న వ్యక్తులు అధికారంలో ఉంటే సమస్యలు సత్వరం పరిష్కారం అవుతాయని చెప్పారు. వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచన మేరకు నిర్వాసిత రైతుల పక్షాన ధర్మబద్ధంగా పోరాడేందుకే ఇక్కడికి వచ్చానన్నారు. భూ నిర్వాసితుల్లో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉన్నారని వారికి పునరావాసం చూపెట్టకుండా ఎలా జనరల్ అవార్డు చట్టబద్ధత అవుతుందో చెప్పాలని ప్రశ్నించారు. రాజకీయాలకు అతీతంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని భూ నిర్వాసితులకు సూచించారు. తాను భారతీయ వ్యవసాయ పరిశోధన మండలిలో రైతు ప్రతినిధిగా, పాలకవర్గ సభ్యుడిగా ఉన్నందున డిమాండ్లను కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. వైఎస్ఆర్సీపీ ఖమ్మంపార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల న్యాయపరమైన పోరాటానికి అ య్యే ఖర్చు భరించటానికి ముందుకు రావటం అభినందనీయమని నాగిరెడ్డి అన్నారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ సత్తుపల్లి నియోజకవర్గ సమన్వయకర్తలు నంబూరి రామలింగేశ్వరరావు, మట్టా దయానంద్విజయ్కుమార్, రైతు విభాగం జిల్లా కన్వీనర్ మందలపు సత్యనారాయణ, గోలి శ్రీనివాసరెడ్డి, కోటగిరి మురళీకృష్ణారావు, పాలకుర్తి యాకోబు, మలిరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, జ్యేష్ట లక్ష్మణ్రావు, ఎస్కె మౌలాన, మందపాటి ప్రభాకర్రెడ్డి, మలిరెడ్డి మురళీరెడ్డి, అట్లూరి సత్యనారాయణరెడ్డి, మందపాటి రాజేంద్రప్రసాద్రెడ్డి, ఎస్కె మౌలాలి, తన్నీరు జమలయ్య పాల్గొన్నారు. -
పంచాయతీలను తీర్చిదిద్దాలి: నాగిరెడ్డి
ఇందూరు, న్యూస్లైన్: నిర్దిష్ట ప్రణాళికతో గ్రామ పంచాయతీలను తీర్చిదిద్దాలని పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి అధికారులకు సూచించారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించి, సమస్య అనేదే లేకుండా పద్ధతి ప్రకారం నిధులు ఖర్చు చేయాలన్నారు. బుధవారం నిజామాబాద్లో ‘మెరుగైన స దుపాయాల కల్పన దిశలో గ్రామ పంచాయతీలు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, నల్లగొండ జిల్లాల డీపీఓలు, జడ్పీ సీఈఓలు, డీఎల్పీఓలు, ఈఓపీఆర్డీ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో నిర్దిష్ట ప్రణాళికలు లేకపోవడంతో సమస్యలను పరిష్కరించడం, సౌకర్యాలను కల్పించడం సాధ్యం కావడం లేదన్నారు. నిధులు ఎన్ని అవసరం అవుతున్నాయో కూడా తెలియడం లేదన్నారు. ప్రతి గ్రామంలో ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కావాలి? వాటికి ఎన్ని నిధులు ఖర్చవుతాయి? తెలిపే విధంగా సర్పంచుల సహాయంతో వార్షిక, పంచవర్ష ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను అదేశించారు. ఈ ప్రణాళికల ఆధారంగా పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు. నిర్ణీత కాల వ్యవధిలో ప్రజలకు సౌకర్యాలు సమకూరుతాయన్నారు. 50 రకాల విధులు, అధికారాలు పం చాయతీలకు ఉన్నాయని, వాటిని సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలంటే ఆదాయ వనరులను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నా రు. ప్రతి పంచాయతీ పరిధిలో వ్యాపారాలు జరుగుతున్నా, ప్రకటనలు ఇస్తున్నా, వాటికి పన్నులు వసూలు చేయడం లేదని, ఇక పై అన్ని పన్నులు పక్కాగా వసూలు చేయించాల ని సూచించారు. విద్య, ఆరోగ్యం, ఇతర పనులన్నీ గ్రామ పంచాయతీ పరిధిలోనే ఉంటాయని, చేసే ప్రతి పనికి తీర్మానం తప్పని సరిగా ఉండాలన్నారు. మున్సిపల్ శాఖలాగే, పంచాయతీరాజ్ శాఖ పని చేస్తుందన్నారు. పౌర సేవలు మెరుగుపడతాయి గ్రామ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయడం ద్వారా పౌర సేవలు మెరుగు పడతాయని పంచాయతీరాజ్ కమిషనర్ వరప్రసాద్ అన్నారు. పారిశుధ్యం, మంచినీటి సరఫరా, వీధి దీపాలు, రహదారులు, మురుగు కాలువలు, ఇతర సౌకర్యాలు కల్పించడంతో పాటు, వచ్చే ఐదేళ్లలో ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకోవడానికి ప్రతి జిల్లాలో సదస్సు నిర్వహిస్తున్నామన్నారు.ఇందుకు ఒక మండలాన్ని పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, మండలంలోని పలు గ్రామాలను గుర్తించి సందర్శిస్తున్నామని తెలి పారు. నిజామాబాద్ జిల్లాలో జక్రాన్పల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామాన్ని ఎంపిక చేశామన్నారు. గ్రామంలోని ప్రజలకు ఎలాం టి సౌకర్యాలు కావాలో అడిగి తెలుసుకుంటామని, అలాగే ఆదాయ వనరులను సమకూర్చుకోవడం ఎలాగో కూడా తెలియజేస్తామన్నారు. 13వ ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్, బీఆర్జీఎఫ్ ద్వారా పంచాయతీలకు మం జూరవుతున్న నిధులను ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. గుర్తించిన పనులకు అయ్యే ఖర్చుకు ప్రతి పైసా లెక్క ఉంటుందన్నారు. పంచాయ తీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి క్లస్టర్కు, పంచాయతీకి కార్యదర్శి ఉం టాడని తెలిపారు. కొందరికి పదోన్నతులు కూడా ఇవ్వనున్నామని వెల్లడించారు. సదస్సులో నిజామాబాద్ కలెక్టర్ ప్రద్యుమ్న తది తరులు పాల్గొన్నారు. -
'రైతుల ఆత్మాభిమానాన్ని కించపరచొద్దు'
భాగ్యనగరం వేదికగా నిన్న ప్రారంభమైన ప్రపంచ వ్యవసాయ సదస్సులో రైతు సంఘం నాయకులకు అవమానం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ నాగిరెడ్డి ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్లో నాగిరెడ్డి మాట్లాడుతూ... రైతు సంఘం నాయకులకు డిలిగేట్ పాస్ ఉన్న పోలీసులు లోపలికి అనుమతించకపోవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతుల ఆత్మాభిమానాన్ని కించపరచవద్దని నాగిరెడ్డి ఈ సందర్బంగా అటు ప్రభుత్వానికి ఇటు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. రైతుల పేరుతో సదస్సులు నిర్వహిస్తున్న ప్రభుత్వం రైతులనే అవమానపరచడం సరైన పద్దతి కాదని ఆయన వ్యాఖ్యానించారు. తమది రైతు ప్రభుత్వం అని కిరణ్ చెప్పుకుంటున్నారని, రైతు ప్రభుత్వం అంటే ఇదేనా అని నాగిరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రపంచ వ్యవసాయ సదస్సు పేరుతో రూ.2.50 కోట్లు మేర నిధులను ప్రభుత్వం దుర్వీనియోగం చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారికంగా తనను ఆహ్వానించారు, అయిన పోలీసులు తనను సదస్సు లోపలికి అనుమతించకపోవడం అత్యంత దారుణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. -
వైఎస్ఆర్ సిపి రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ నాగిరెడ్డితో సాక్షి వేదిక
-
వైఎస్ఆర్సిపి నేత నాగిరెడ్డితో సాక్షి వేదిక
-
వైఎస్ఆర్ సిపి రైతు విభాగం కన్వీనర్ నాగిరెడ్డితో సాక్షి వేదిక
-
వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కన్వీనర్ నాగిరెడ్డితో సాక్షి వేదిక
-
సమైక్యాంద్రకోరుతూ భూమా నాగిరెడ్డి దీక్ష
-
వైఎస్ఆర్ ఉండి ఉంటే రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చేది కాదు