వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 22 న ఏలూరులో యువభేరి జరగనుంది. కాగా యువభేరి ఏర్పాట్లపై నియోజక వర్గ కన్వీనర్లతో పార్టీ ప్రధాన కార్యదర్శి, కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్లనాని సమావేశమయ్యారు. ఏపీకి హోదా ఇచ్చేవరకు వైఎస్ఆర్సీపీ పోరాటం ఆగదన్నారు. యువకులు, విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు.