alla nani
-
ఆళ్ల నాని చేరికను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: మాజీ మంత్రి ఆళ్ల నాని టీడీపీలో చేరికపై ఏలూరు టీడీపీ శ్రేణులు అధిష్టానానికి తీవ్ర నిరసన తెలపడంతో చేరిక వాయిదా పడింది. 9న తుది నిర్ణయం తీసుకుని అందరికి ఆమోదం ఉంటేనే చేర్చకుంటామని టీడీపీ అధిష్టానం స్పష్టం చేసింది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఏలూరు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఆళ్ల నాని పోటీ చేసి ఓడిపోయారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. అప్పటి నుంచి ఏలూరు రాజకీయాలకు దూరంగా ఉండటంతో పాటు స్థానికంగా కూడా అందుబాటులో లేకుండా విశాఖపట్నానికే పూర్తిగా పరిమితమయ్యారు. తాజాగా ఆళ్ళ నాని మనసు మార్చుకుని తెలుగుదేశంలో చేరడానికి సిద్ధమయ్యారు. విజయనగరానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే అనుసంధాన కర్తగా వ్యవహరించినట్లు సమాచారం. దానికనుగుణంగా మంగళవారం టీడీపీలో చేరుతున్నారని సోషల్ మీడియాతో పాటు నగరంలోని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలకు మంగళవారం సీఎంఓ నుంచి పిలుపువచ్చింది. సోమవారం సాయంత్రం ఏలూరు ఎంపీ, జిల్లా పరిషత్ చైర్మన్, మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు సీఎంఓకు రావాల్సిందిగా సూచించారు. ఆళ్ల నాని జిల్లా ఎమ్మెల్యేల సమక్షంలో చేరేలా అంతా సిద్ధం చేశారు. కట్చేస్తే... కేబినేట్ సమావేశం ఆలస్యం కావడం, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వర్గం తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు మంగళవారం ఉదయం నుంచి ఆళ్ల నానిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. సీఎంఓకు, మంత్రి లోకేష్కు, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్కు ఫిర్యాదులు చేసింది. స్థానిక ఎమ్మెల్యే నుంచి అభ్యంతరం రావడంతో సీఎంఓకు వెళ్ళిన ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, మంత్రి కొలుసు పార్థసారథి ఎవరినీ కలువకుండానే వెనుదిరిగారు. టీడీపీ శ్రేణుల ఇళ్లు ధ్వంసం చేశారని, 20 మందికిపైగా నాయకులపై కేసులు పెట్టి వేధించారని, వ్యాపారాలకు కూడా ఇబ్బందులు పెట్టారంటూ నానిపై చంటి వర్గం ఫిర్యాదుల చేసింది. దీంతో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యాక 9న అందరితో మాట్లాడి చేర్చుకుంటామని మాజీ మంత్రి ఆళ్ల నానికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. మరో వైపు పరిణామాలు చక్కదిద్ది అందరితో మాట్లాడాల్సిన బాధ్యతను మంత్రి అచ్చెన్నాయుడుకు అప్పగించారు. -
ఆళ్లనానిపై భగ్గుమంటున్న తెలుగుతమ్ముళ్లు
సాక్షి,ఏలూరుజిల్లా: ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని టీడీపీలో చేరతారన్న ఊహాగానాలతో ఏలూరు టీడీపీలో అసంతృప్తి సెగలు భగ్గుమంటున్నాయి.ఆళ్ల నాని టీడీపీలో చేరడాన్ని ఏలూరు తెలుగుతమ్ముళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.నాని రాకను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో తెలుగుతమ్ముళ్లు వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.తన 32 ఏళ్ల రాజకీయ జీవితం మొత్తం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అణగదొక్కిన వ్యక్తి ఆళ్ల నాని అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రాజకీయ జీవితాన్ని ఇచ్చిన వైఎస్ఆర్ కుటుంబానికే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఆళ్ల నాని అంటూ టీడీపీ కార్యకర్తలు గుర్తుచేస్తున్నారు.తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పకుండా నాని పార్టీలో చేరితే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. -
ఆలయ కార్యదర్శిపై అమానుష దాడి
ఏలూరు టౌన్ : ఏలూరు కండ్రికగూడెం ప్రాంతంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో దేవుని సొమ్మును కాజేశారని ప్రశ్నించిన ఆలయ కార్యదర్శిపై పాత ఆలయ కమిటీ సభ్యుడు, టీడీపీ కార్యకర్త రెడ్డి నాగరాజు అమానుష దాడికి తెగబడ్డాడు. నూతన ఆలయ కార్యదర్శి అచ్యుతకుమారిపై రాడ్డుతో దాడిచేసి, ఆమెను వివస్త్రను చేసేందుకు ప్రయత్నించడంతో బాధితురాలు తీవ్ర గాయాలపాలైంది. ప్రస్తుతం ఆమె ఏలూరు జీజీహెచ్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఏలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ళ నాని బాధితురాలిని బుధవారం ఆస్పత్రిలో పరామర్శించారు. దాడి వివరాలు తెలుసుకుని వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు. బాధితుల కథనం మేరకు.. ఏలూరు 27వ డివిజన్ కండ్రికగూడెం ప్రాంతంలో శ్రీ వేంకటేశ్వరస్వామి గుడికి ఇటీవలే కొత్త కార్యవర్గం ఏర్పాటైంది. రాజరాజేశ్వరినగర్కు చెందిన సావన్ అచ్యుతకుమారి ఆలయ నూతన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఆలయానికి సంబంధించి నిధులు భారీఎత్తున గోల్మాల్ అయ్యాయని ఆమె గుర్తించారు. సుమారు రూ.40 లక్షలు పక్కదారి పట్టినట్లు తెలుసుకుని పాత కార్యవర్గ సభ్యులను ఆమె ప్రశ్నించారు. దీంతో పాత, కొత్త కార్యవర్గాల మధ్య వివాదం మొదలైంది. ఇదిలా ఉంటే.. శ్రీవారి కళ్యాణ మహోత్సవాలను ఆచ్యుతకుమారి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తుండడంతో పాత కార్యవర్గ సభ్యుడు రెడ్డి నాగరాజు అతని భార్య ఇద్దరూ కలిసి ఆలయ ప్రాంగణంలో పుస్తక వ్యాపారం చేసుకునేందుకు అవకాశమివ్వాలని అచ్యుతకుమారిని కోరారు. ఆలయంలో వ్యాపారం చేయడానికి వీల్లేదని, అవసరమైతే ఉచితంగా పుస్తకాల పంపిణీకి అనుమతి ఉంటుందని ఆమె స్పష్టంచేశారు. ఈ విషయంలో వివాదం చెలరేగడంతో రెడ్డి నాగరాజు అచ్యుతకుమారిపై దాడికి తెగబడ్డాడు. రాడ్డు తీసుకుని ఆమెను తలపైన తీవ్రంగా కొట్టడంతో పాటు ఆమె చీరను లాగేసి వివస్త్రను చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో.. అక్కడున్న వారు అతనిని అడ్డుకున్నారు. తీవ్ర గాయాలతో అచ్యుతకుమారి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆమెను ఏలూరు జీజీహెచ్కు తరలించారు. నిధుల గోల్మాల్పై నిలదీయడంతో.. రెడ్డి నాగరాజుతో పాటు ఉమామహేశ్వరరావు, ప్రసాద్బాబు తదితరుల ఆధ్వర్యంలో ఆలయ నిధులను పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయని ఆస్పత్రిలో ఆమె చెప్పారు. లక్షలాది రూపాయల నిధులకు లెక్కలు లేకపోవడంతో వారిని నిలదీయగా.. రెడ్డి నాగరాజు సమయం కోసం వేచిచూసి దాడిచేశారన్నారు. -
ప్రతిపక్షాలు సీఎం జగను ఎదుర్కొలేక కుట్రలు చేస్తున్నాయి: ఆళ్ల నాని
-
3న ఏలూరులో ‘సిద్ధం’ బహిరంగ సభ!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావం బహిరంగసభ ‘సిద్ధం’కు ఏలూరు ముస్తాబవుతోంది. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని 50 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది పార్టీ కేడర్ సభకు రానున్న క్రమంలో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం సభా ప్రాంగణంలో జరుగుతున్న పనులను పార్టీ ముఖ్యులు పరిశీలించారు. గోదావరి జిల్లా రీజనల్ కో–ఆర్డినేటర్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, సీఎం ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆళ్ల నాని, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్కుమార్యాదవ్, చింతలపూడి అసెంబ్లీ అభ్యర్థి కంభం విజయరాజు తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం సభా ప్రాంగణంలో ‘సిద్ధం’ పోస్టర్లను ఆవిష్కరించారు. 110 ఎకరాల ప్రాంగణంలో.. ఏలూరు నగర సమీపంలో, దెందులూరు జాతీయ రహదారి వద్ద 110 ఎకరాల స్థలంలో సభావేదిక నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. భారీ వేదిక నిర్మాణం, పదుల సంఖ్యలో గ్యాలరీలు.. కార్యకర్తలందరికీ దగ్గరగా వెళ్లి అభివాదం చేసేందుకు సభా వేదిక నుంచి వాక్వే ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సభా ప్రాంగణం వెనుక భాగంలో హెలీప్యాడ్ను ఏర్పాటు చేశారు. 50 నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది రానున్న క్రమంలో వాహనాల పార్కింగ్తో సహా ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. సభా ప్రాంగణానికి సమీపంలోని దెందులూరు ఊరు ప్రారంభంలో 40 ఎకరాల ప్రాంగణాన్ని, అలాగే సభా ప్రాంగణానికి, ఆటోనగర్కు మధ్యలో 25 ఎకరాల ప్రాంగణం, మరో రెండు పార్కింగ్ స్థలాలు, ఆటోనగర్ లోపల, ఆశ్రం కళాశాల, ఏలూరు ప్రారంభంలోని రియల్ ఎస్టేట్ వెంచర్లో మొత్తం 150 ఎకరాల స్థలాన్ని పార్కింగ్ కోసం కేటాయించి జిల్లాల వారీగా వచ్చే వాహనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. బుధవారం ఎంపీ మిథున్రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని మాట్లాడుతూ ఏలూరు జిల్లా రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ‘సిద్ధం’ బహిరంగ సభ జరుగుతుందని, 3న మధ్యాహ్నం 2 గంటలకు సీఎం జగన్ సభా ప్రాంగణానికి చేరుకుని పార్టీ కేడర్కు దిశా నిర్దేశం చేస్తారని వివరించారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో కలెక్టర్ ప్రసన్నవెంకటేష్, ఎస్పీ డీ.మేరీప్రశాంతి తదితరులున్నారు. -
‘వలంటీర్ల వ్యవస్థపై విషం.. చంద్రబాబు, పవన్ కుట్రలను తిప్పికొట్టాలి’
సాక్షి, ఏలూరు జిల్లా: వలంటీర్ల వ్యవస్థపై కొంతమంది విషం చిమ్ముతున్నారని మాజీ మంత్రి ఆళ్ల నాని మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రతిపక్షాల కుట్రలను ప్రజలు అర్థం చేసుకుని తిప్పికొట్టాలన్నారు. గతంలో ఎప్పుడూ జరగని అభివృద్ధి రాష్ట్రంలో జరుగుతోందన్నారు. వలంటీర్ల వ్యవస్థను కూల్చడానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ను పవన్ చదువుతున్నాడు. వలంటీర్ వ్యవస్థ అధ్యయనం చేయకుండా దిగజారి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. వలంటీర్ల తల్లిదండ్రులు సైతం బాధ పడేలా పవన్ నీచంగా మాట్లాడుతున్నారు. మహిళల అక్రమ రవాణాకు, వలంటీర్లకు సంబంధం ఏంటి? అంటూ ఆళ్ల నాని ప్రశ్నించారు. చదవండి: బాబూ పవనూ.. నీ తొక్కలో లెక్క తప్పింది చూస్కో! ‘‘తణుకు సభలో పవన్ తీరు పరాకాష్టకు చేరింది. ఉన్మాదిలా,అసాంఘిక శక్తిలా మాట్లాడాడు. వలంటీర్ల ఆత్మ స్థైర్యం దెబ్బతినేలా మాట్లాడాడు. మామిడి పళ్ల బుట్టలో రెండు కుళ్లి పోతే వాటిని తేసి బయట పడేస్తారు.. బుట్ట మొత్తం పారేయరు. పవన్ రెండు నాలుకల ధోరణి ప్రజలు గమనించాలి. పవన్ కల్యాణ్ అసత్య ప్రచారాలు మనుకోవాలి. వలంటీర్ల జోలికొస్తే చూస్తూ ఊరుకోమని ఆళ్ల నాని హెచ్చరించారు. -
‘జన్మభూమి కమిటీల దోపిడీలు పవన్కు ఇష్టమేమో..?’
సాక్షి, ఏలూరు: పవన్ కల్యాణ్ పోరాటం.. ఆరాటం అంతా చంద్రబాబు కోసమేనని మాజీ మంత్రి ఆళ్లనాని మండిపడ్డారు. వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్.. వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం ఏలూరులో ప్రెస్మీట్ నిర్వహించిన ఆళ్ల నాని.. ‘ వాలంటీర్లపై నీచంగా మాట్లాడతావా?, పవన్ కన్నా క్రిమినల్ ఎవరున్నారు..?, నీ గెలుపు మీదే నీకు నమ్మకం లేకపోతే.. నీ పార్టీవాళ్ళు నిన్నెలా నమ్ముతారు?, పవన్ పోరాటం.. ఆరాటం.. అంతా బాబు కోసమే. జగన్ గద్దెదించి.. మరి ఎవర్ని గద్దెనెక్కిస్తాడో చెప్పే ధైర్యం లేని వ్యక్తి పవన్. చంద్రబాబు హయాంలో కాగ్ అక్షింతలు వేయని సంవత్సరం ఏదైనా ఉందా..?, జగన్ని ఏకవచనంతో పిలిచే అర్హత నీకెక్కడిది?,–వందజన్మలెత్తినా జగన్ స్థాయికి చేరుకోలేవు. బాబు అధికారం కోసం చేసే నీ పోరాటం వృథానే’ అని ఆళ్ల నాని ధ్వజమెత్తారు. ఆళ్ల నాని ఏమన్నారంటే.. రాజకీయ అవగాహన లేని నాయకుడు పవన్ వారాహి అపజయ యాత్రలో భాగంగా పవన్కళ్యాణ్ నిన్న ఏలూరులో కొంతమంది జనసేన కార్యకర్తలతో మీటింగ్ పెట్టాడు. రాజకీయపార్టీ పెట్టి పదేళ్లు దాటిన తరుణంలో తమ పార్టీ గురించి, తాము ఏ దశలో ఉన్నామో ఆపార్టీ అధినేతగా ఆయన కార్యకర్తలకు వివరిస్తారేమోనని అందరూ ఎదురు చూశారు. అయితే, పవన్కళ్యాణ్ మాత్రం ఎప్పటిలాగానే తన రాజకీయ అవగాహన లేమిని ప్రదర్శించుకున్నారు. ఆయనకు ఈ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై.. నియోజకవర్గాల్లోని ప్రజా సమస్యలపై ఏమాత్రం అవగాహన లేదు. కేవలం, ఆయన మిడిమిడి జ్ఞానంతో వారాహి యాత్ర మొత్తం బూతులు, దూషణలతోనే సాగుతుంది. ప్రభుత్వ పనితీరుపై బురదజల్లే ఆరోపణలు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డిపై వ్యక్తిగత దూషణలకే పవన్కళ్యాణ్ పరిమితమయ్యాడు. ప్రజాప్రతినిధులను నోటికొచ్చినట్లు తిట్టడమే కాకుండా.. చివరికి ప్రజల్ని కూడా ‘మీరు నాకు ఓట్లేయలేదు’ అని తన అక్కసు వెళ్లగక్కిన పవన్కళ్యాణ్ తీరు అందరూ చూస్తున్నారు. వారాహి యాత్రను ప్రజలు అసహ్యించుకుంటున్నారు మొదటి యాత్రంటే ఏదో తెలిసీ తెలియనితనంతో ముగించాడనుకుందాం. రెండోవిడత యాత్ర ప్రారంభంతోనే నిన్న పవన్కళ్యాణ్ మరింత దిగజారిపోయి ప్రవర్తించాడు. ఆయన మాటల్ని చూస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతీ వ్యక్తి అసహ్యించుకునే పరిస్థితికి వచ్చేశాడు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను తిడుతున్నాడు. మా నాయకుడు, గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని వ్యక్తిగతంగా ఏకవచనంతో మాట్లాడుతాడు. చివరికి ఈ రాష్ట్రంలో అత్యంత పవిత్రమైన ప్రజాసేవలందించే వాలంటీర్లను కూడా వదిలిపెట్టకుండా పవన్కళ్యాణ్ దూషిస్తున్నాడు. ఒక రాజకీయ సిద్ధాంతం, రాజకీయ లక్ష్యం లేకుండా వారాహి యాత్ర పేరుతో ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటున్న పవన్కళ్యాణ్ తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఏలూరు సభలో పవన్కళ్యాణ్ ఇక్కడి ప్రజల్ని ఉద్దరించే మాటలేమైనా చెబుతాడేమోనని అందరూ ఎదురుచూశారు. చంద్రబాబుతో కలిసి ఆయన రాబోయే కాలంలో ప్రజల్ని ఉద్ధరించడానికి ఎలాంటి మ్యానిఫెస్టోను ప్రకటించబోతున్నారోనని చూసినవాళ్లకు చివరికి నిరాశే మిగిలింది. ఏలూరు సభ నుంచే తాను ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో పిలుస్తానంటూ అదేదో ప్రజలకు మేలు చేసే మ్యానిఫెస్టో అంశంగా ప్రకటించడం ఆయన దిగజారుడుతనాన్ని తెలియజేసింది. పిచ్చిపిచ్చిగా నోటికొచ్చినట్లు వాగే పవన్కళ్యాణ్కు అసలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గారి పేరును ఉచ్ఛరించే అర్హత కూడా లేదని మనవి చేసుకుంటున్నాను. మా నాయకుడ్ని ఏకవచనంతో పిలవడానికి పవన్కళ్యాణ్ ఎవరు..? అసలు, నీ స్థాయి.. నీ అర్హతలేంటని ప్రశ్నిస్తున్నాను. గ్లామర్ తగ్గుతుందనే పాదయాత్ర చేయలేదా..? గతంలో ఒకసారి ఇదే పవన్కళ్యాణ్ పాదయాత్ర చేస్తానన్నాడు. కొంతకాలానికి నేను పాదయాత్ర చేస్తే శాంతిభద్రతల సమస్య వస్తుంది. నా పాదయాత్రతో ప్రజలకు నష్టం కలిగే ప్రమాదముందని ఆయన నోటితో కుంటిసాకులు చెప్పాడు. పాదయాత్ర ప్రతిపాదనను విరమించుకున్నాడు. నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్న విషయమేంటంటే, ‘నువ్వు ప్రజల మధ్యకు వెళ్లే సువర్ణావకాశమైన పాదయాత్రను ఎందుకు కాదనుకున్నావు..? ఎండలో, వానలో తిరిగి ప్రజల మధ్య నలిగి నల్లగా నువ్వు కమిలిపోతే.. నీకు సినిమా అవకాశాలు రావనే భయంతోనే పాదయాత్ర చేయంది..? అంటే, నీకు ప్రజాసేవ చేయాలనే తపన లేదు కనుకనే ప్రజల మధ్య తిరిగే సువర్ణావకాశాన్ని గ్లామర్ కోసం వదులుకున్నావు.’ దీన్నిబట్టి చూస్తే నీకు ప్రజల మేలు కంటే... నీకు డబ్బు తెచ్చిపెట్టే సినిమాలే ఎక్కువని అందరికీ అర్ధమవుతుంది కదా..? వందజన్మలెత్తినా జగన్ గారి స్థాయికి చేరుకోలేవు 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలపై అవగాహన చేసుకున్న నాయకుడు జగన్మోహన్రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలకు ఏం చేస్తారో చెప్పారు. మ్యానిఫెస్టోలో ప్రకటించిన ప్రతీ హామీని నెరవేర్చారు. ఇప్పటికే 99.5 శాతం మ్యానిఫెస్టో హామీల్ని అమలు చేసిన గొప్ప ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గారితో పవన్కళ్యాణ్కు ఎక్కడ పోలిక ఉంది..? నువ్వు వందజన్మలెత్తినా మా నాయకుడు జగన్ గారి స్థాయికి చేరుకోలేవు. లేనిపోని వ్యక్తిగత ఆరోపణలతో రాజకీయ లబ్ధిని పొందాలనుకునే వపన్కళ్యాణ్ ప్రయత్నాలు ఆకాశం మీద ఉమ్మేసిన చందంగా ఉంటాయనడంలో సందేహమేదీలేదు. పవన్ అబద్ధాలకు అంబేద్కర్ ఆత్మక్షోభిస్తుంది? పట్టుమని పది అసెంబ్లీ నియోజవర్గాల్లో పర్యటించక ముందే పవన్కళ్యాణ్లో అంత నిరాశా నిస్పృహలెందుకు..? ఎవరి మీద ఆయన అక్కసు..? ఈరోజు ఆయన సభకొచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా మా జగన్గారికే ఓటేస్తామని బహిరంగంగా చెబుతుంటే.. తనను ఎందుకు గెలిపించరని పవన్కళ్యాణ్లో అసహనం పెరిగిపోతుంది. అంబేద్కర్ మహానుభావుడి సాక్షిగా అన్నీ నిజాలే మాట్లాడుతానని చెబుతూ.. అన్నీ అబద్ధాలే మాట్లాడాడు నిన్న పవన్కళ్యాణ్. అయన మాట్లాడిన దూషణలకు ఆ అంబేద్కర్ మహానుభావుడే చిన్నబుచ్చుకుని ఆయన ఆత్మ క్షోభించి ఉంటుందని ప్రజలంతా అనుకున్నారు. వాలంటీర్లపై నీచపు మాటలా? వాలంటీర్ వ్యవస్థ పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా నీచాతీ నీచంగా మాట్లాడిన పవన్కళ్యాణ్ వ్యాఖ్యల్ని మేం ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టిన అద్భుతమైన సంస్కరణల్లో సచివాలయాలు- వాలంటీర్ వ్యవస్థ ఒకటి. మహాత్మ గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని నెరవేరుస్తున్న ఈ వాలంటీర్లు ప్రభుత్వ సేవలన్నింటినీ ఇంటి గడప వద్దకే తీసుకొస్తూ.. ప్రతీ ఇంటిలో ఒక అక్క, చెల్లెలు, తమ్ముడు, అన్నగా కనిపిస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారు. అలాంటి పవిత్రమైన వాలంటీర్ వ్యవస్థను అగౌరవపరచడానికి నీకు సిగ్గుందా.. పవన్కళ్యాణ్..? ఈరోజు ఎక్కడా పైసా అవినీతి లేకుండా ప్రభుత్వసేవల్ని పారదర్శకంగా అందిస్తున్న వ్యవస్థే ఈ వాలంటీర్ వ్యవస్థ. ఇప్పటికైనా నీ మాటలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని హితవు పలుకుతున్నాను. జన్మభూమి కమిటీల దోపిడీలు పవన్కు ఇష్టమేమో..? చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలంటూ... ప్రతీ పనికీ లంచం సమర్పించాలంటూ హుకుం చేసిన గత జ్ఞాపకాలు ప్రతీ ఒక్కరికీ తెలుసు. చివరికి వృద్ధులకు పింఛన్లు ఇవ్వాలన్నా కూడా గంటల తరబడి పడిగాపులుతో లంచాలిచ్చుకుని పింఛన్లు తీసుకున్న పరిస్థితి. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలోనూ జన్మభూమి కమిటీల అవినీతి అంతా ఇంతా కాదు. ఇవన్నీ అప్పట్లో ఈ పవన్కళ్యాణ్కు బాగా ఇష్టమైన కార్యక్రమాలుగా ఉన్నాయేమో..ఇవన్నీ ఏమీలేకుండా అత్యంత పారదర్శకంగా నడుస్తున్న ఇప్పటి వాలంటీర్ వ్యవస్థంటే పవన్కు ఎందుకు నచ్చడంలేదు..? అత్యంత నిస్వార్థంగా జగన్ గారి స్ఫూర్తితో ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతూ మహత్తరమైన ప్రజాసేవ చేసే వాలంటీర్లంటే మీకెందుకు కక్ష అని ప్రశ్నిస్తున్నాను. ఇందుకు పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలి. పవన్కళ్యాణే పెద్దక్రిమినల్ కోవిడ్ సమయంలో ఇక్కడ ప్రజల్ని పట్టించుకోకుండా చంద్రబాబు, పవన్కళ్యాణ్ లు.. హైదరాబాద్లో తమ ప్యాలెస్లలో కూర్చొన్నారు. అయితే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల్ని కోవిడ్ సమయంలో ఆదుకునే కార్యచరణ ప్రణాళికలో ఈ వాలంటీర్ల వ్యవస్థ భాగస్వామ్యం అయింది. వాలంటీర్లు అందరూ తమ ప్రాణాల్ని లెక్కచేయకుండా ఇంటింటా సర్వేలు చేశారు. వైద్యసాయం అందించారు. ఆనాడు వాలంటీర్ల చొరవ కారణంగా ఇంటింటా ప్రభుత్వసేవలందాయి. అలాంటి వాలంటీర్లను పట్టుకుని మీరు మెచ్చుకోకపోయినా పర్వాలేదు. వాలంటీర్లను బ్రోకర్లు, క్రిమినల్స్ అంటూ పవన్కళ్యాణ్ మాట్లాడటానికి సిగ్గుందా..లేదా..? అని అడుగుతున్నాను. నిజానికి ఈ రాష్ట్రంలో అన్ని విధాలుగా ప్రజల్ని రెచ్చగొడుతున్న పవన్కళ్యాణ్ అనే వ్యక్తే పెద్ద క్రిమినల్ అని చెబుతున్నాను. వాలంటీర్లకు క్షమాపణలు చెప్పాలి పవన్కళ్యాణ్ మాట్లాడుతూ.. తనను, తన భార్యాబిడ్డల్ని ఎవరో అసభ్యంగా మాట్లాడుతున్నారని మొసలికన్నీరు పెడుతున్నారే.. మరి, ఈరోజు మీరు వాలంటీర్లను పట్టుకుని బ్రోకర్లు, క్రిమినల్స్ అంటే వారి కుటుంబాలు రోధించవా..? వారి ఏడుపు మీకు శాపంగా మారదా..? అని ప్రశ్నిస్తున్నాను. కనుక, ఇప్పటికైనా నువ్వు ఫ్రస్టేషన్లో మాట్లాడిన మాటల్ని వెనక్కితీసుకుని వాలంటీర్లకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. చంద్రబాబు కోసం చేసే నీ పోరాటం వృథానే పట్టుమని పది నియోజకవర్గాల సమస్యలపై కూడా అవగాహన లేని పవన్కళ్యాణ్ ఎవరికోసం పోరాటం చేస్తున్నాడు. ఆయన ఎక్కడ పోటీ చేస్తాడో.. ఎక్కడ గెలుస్తాడో.. ఆయనకే దిక్కులేదు. మాటకొస్తే ప్రతీచోటా జగన్గారిని గద్దె దించాలంటూ పిలుపునిస్తున్నాడు కదా..? మరి, జగన్గారిని గద్దె దించితే.. ఆ తర్వాత గద్దెనెక్కేది ఎవరు..? పవన్కళ్యాణ్ మనసులో ఉన్నదేంటో బయటపెట్టాలి కదా..? చంద్రబాబును ఎక్కిస్తాడా..? లేదంటే, లోకేశ్ను గద్దెనెక్కిస్తాడా..? చంద్రబాబు అనే ప్రజాకంటకుడ్ని, దుర్మార్గుడ్ని అధికారంలోకి తెచ్చేదాకా పోరాటం చేస్తానని ఆరాటపడుతున్నాడు. ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలతో బురదజల్లినా.. మా జగన్గారిని వ్యక్తిగతంగా దూషించినా.. ఊగినా తూగినా కూడా పవన్కళ్యాణ్ ప్రయత్నాలన్నీ వృథాప్రయాసే. ఎందుకంటే, గతంలో చంద్రబాబుతో జతకట్టి, అధికారంలోకి వచ్చాక, టీడీపీ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలపై నోరుమెదపని పవన్కళ్యాణ్ అంటేనే ప్రజలకి విరక్తి కలిగింది. కనుక, ఇప్పుడు ఆయన ఎన్ని యాత్రలతో ప్రజల్ని నమ్మించాలని చూస్తే వారు నమ్మరుగాక నమ్మరని స్పష్టంచేస్తున్నాను. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు 175 చోట్లా వైఎస్ఆర్సీపీకే ప్రజా మద్ధతు ఉంటుందని, మరలా శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారని ధీమాగా చెబుతున్నాను. ఏలూరు అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నా నేను ఏలూరు ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తుంటే.. నామీద పవన్కళ్యాణ్ ఏవేవో గాలిపోగేసి మాట్లాడినంత మాత్రానా ఎవరూ నమ్మరు. అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనుల నిమిత్తం ఇప్పటికే రూ.150 కోట్లతో ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి పంపాం. సుమారు రూ.500 కోట్లతో ఏలూరు మెడికల్ కళాశాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక్కడేదో అంతుచిక్కని వ్యాధులు ప్రబలుతున్నాయంటూ పవన్కళ్యాణ్ ఏవేవో అవగాహరాహిత్యంతో మాట్లాడుతున్నాడు. గతంలో ఇక్కడ ఒక అంతుచిక్కని వ్యాధి ప్రబలినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారు తరచూ సమీక్షలు జరిపి, ఢిల్లీనుంచి ఐసీఎంఆర్ నిపుణుల్ని పిలిపించి సర్వే చేయించి వారిచ్చిన నివేదిక ప్రకారం రూ.300 కోట్లతో ఏలూరుకు గోదావరి జలాల్ని తెచ్చే ప్రాజెక్టును కూడా త్వరలో ప్రారంభించనున్నాం. ఇప్పటికైనా పవన్కళ్యాణ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే.. ప్రజలు వారాహిని అడ్డుకుని మీకు తగిన బుద్ధిచెబుతారని హెచ్చరిస్తున్నాను. -
సీఎం జగన్పై బురద చల్లేందుకే పవన్ యాత్ర: ఆళ్ల నాని
సాక్షి, అమరావతి: పవన్ భాష చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని, సీఎం జగన్పై బురద చల్లేందుకే పవన్ యాత్ర అంటూ మాజీ మంత్రి ఆళ్ల నాని దుయ్యబట్టారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎవరైనా ప్రజల దగ్గరకు వెళ్లి మాకు అధికారం ఇస్తే పలానా మేలు చేస్తామని చెప్పుకుంటారు. కానీ పవన్ మాత్రం సీఎం జగన్ను దూషించటానికే యాత్ర చేస్తున్నారు’’ అని ఆళ్ల నాని మండిపడ్డారు. ‘‘చంద్రబాబుని ఎలాగైనా సీఎం చేయాలనే ఉద్దేశంతో పవన్ పని చేస్తున్నారు. ఎన్నిరకాలుగా మమ్మల్ని దూషిస్తున్నా మేము సహనంతో ఉన్నాం. అంతేతప్ప చేతగానితనం కాదు. మా నాయకులేనే కాదు.. ప్రజలను కూడా దూషిస్తున్నారు. గత ఎన్నికలలో తనను ఓడించారనే అక్కసుతో మాట్లాడుతున్నారు. ప్రశాంతమైన గోదావరి జిల్లాల్లో అలజడి సృష్టిస్తున్నారు. కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. రాయలసీమ గూండాలు అంటూ ప్రాంతాల మధ్య గొడవలు పెడుతున్నారు. రాయలసీమలో ఫ్యాక్షన్ అనేదే లేదన్న సంగతి రాష్ట్రమంతటా తెలుసు. కానీ తన స్వార్దం కోసం కులాలు, ప్రాంతాలను వాడుకుంటున్నారు’’ అంటూ ఆళ్ల నాని నిప్పులు చెరిగారు. ‘‘అంతర్వేదిలో రథం దగ్ధమైతే సీబిఐ విచారణకు జగన్ ఆదేశించారు. అంతేకాదు కొత్త రథాన్ని తయారు చేయించి ఆయనే స్వయంగా ప్రారంభించారు. టీడీపీ హయాంలో ధ్వంసం చేసిన ఆలయాలను జగన్ పునఃనిర్మించారు. అంతర్వేది రథం టీడీపీ హయాంలో దగ్ధం అయితే దాన్ని నిస్సిగ్గుగా జగన్ మీద వేసేవాడు. కానీ మేము ఇప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ మీద వేయలేదు. వారాహి యాత్రని ఇలాగే కుట్రలతో కొనసాగితే మీకు గోదావరి జిల్లాల్లో ఒక్క సీటు కూడా జనం గెలవనీయరు’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘ఒకోసారి ఒక్కడినైనా గెలిపించండి అంటాడు. ఇంకోసారి జగన్ను దించటమే లక్ష్యం అంటాడు. ఆ మర్నాడే తానే సీఎంని అంటాడు. ఇలాంటి నిలకడలేని మాటలు పవన్ కళ్యాణ్ కే సాధ్యం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లది ఒకే గొంతు, ఒకే నాలుక. ఇద్దరూ కూడబలుక్కునే ఒక ప్రణాళిక ప్రకారం మాట్లాడుతున్నారు. జనసేన పార్టీ అనేది కేవలం ఉభయగోదారి జిల్లాకే పరిమితమా?. మిగతా రాష్ట్రంతో పనిలేదా?. వైసీపీ ఓట్లు చీల్చటానికి పవన్, చంద్రబాబు గోదావరి జిల్లాలో ఎన్ని కుట్రలు చేసినా జగన్ గెలుపును ఆపలేరు’’ అని ఆళ్ల నాని స్పష్టం చేశారు. చదవండి: నిసిగ్గుగా చందబ్రాబు, లోకేష్ శవ రాజకీయాలు.. ఇదీ అసలు వాస్తవం.. ‘‘పోలవరం ప్రాజెక్టు పురోగతి లేదని పవన్ ఎలా మాట్లాడతారు?. అసలు పోలవరమే కాదు, ఏ విషయం గురించి మీకు పూర్తిగా తెలుసు?. ఏదైనా అధ్యయనం చేసి పవన్ మాట్లాడితే బాగుంటుంది. చంద్రబాబు హయాంలో ఆగిపోయిన పోలవరాన్ని జగన్ పరుగులు పెట్టిస్తున్నారు. గాంధీ సిద్దాంతాలను అవమానించేలా పవన్ మాట్లాడతారు. పవన్ తన తీరు మార్చకోకపోతే ప్రజలే తగిన బుద్ది చెప్తారు’’ అని ఆయన పేర్కొన్నారు. అన్నదమ్ముల్లాగా గోదావరి జిల్లాలో ప్రజలు ఉన్నారు. కానీ వారి మధ్య చిచ్చు పెట్టి, ఓట్లను చీల్చాలనే లక్ష్యంతోనే పని చేస్తున్నారు. పవన్ మీద రెక్కీ నిర్వహించాల్సిన అవసరం ఎవరికి ఉంది?. సానుభూతి కోసమే ఇలాంటి మాటలు మాట్లాడున్నారు.పవన్ ఇలాంటి యాత్రలు ఎన్ని చేసినా జగన్ని ఆపలేరు. గతంలో కూడా జగన్ని సీఎంని కానివ్వను అన్నారు ఏమైందో జనం చూశారు. ఈసారి కూడా అలాగే జరుగుతుంది ఇది ఖాయం’’ అని ఆళ్ల నాని చెప్పారు. చదవండి: ఏపీలో వింతరాజకీయం.. పొత్తుల్లేని చెట్టాపట్టాల్ -
గంజి ప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించిన హోంమంత్రి
సాక్షి, ఏలూరు జిల్లా: ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లి గ్రామంలో హత్యకు గురైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గంజి నాగప్రసాద్ కుటుంబ సభ్యులను హోంమంత్రి తానేటి వనిత, మాజీ మంత్రి ఆళ్ల నాని, ఎంపీ మార్గాని భరత్రామ్తో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. పార్టీ కోసం గంజి ప్రసాద్ ఎంతో సేవ చేశారు. ఎవరైతే హత్యకు పాల్పడ్డారో ఆ ముగ్గురు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. కుటుంబ సభ్యులు చెప్తున్న బజారీ అనే వ్యక్తిపై విచారణ జరుగుతోంది. బాధిత కుటుంబానికి కచ్చితంగా న్యాయం చేస్తాం. ఈ హత్యకు కారకులు, ప్రేరేపించినవారిపై కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము. పార్టీ వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటుదని హోం మంత్రి భరోసా ఇచ్చారు. మాజీ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. హత్యకు సంబంధించిన వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోంది. ఢిల్లీలో ఉన్న సీఎం దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లాము. ఏ పార్టీ అయినా నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుంది. వారి కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది. అసలైన నిందితులకు శిక్ష పడేలా చూస్తాము. గ్రామంలోని నాయకులు సంయమనం పాటించాలి. వారి కుటుంబానికి న్యాయం చేయడం మా బాధ్యత' అని మాజీ మంత్రి ఆళ్ల నాని అన్నారు. చదవండి👉 (వైఎస్సార్సీపీ నేత దారుణ హత్య) ఇదిలా ఉంటే శనివారం ఉదయం.. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గంజి నాగప్రసాద్ (55) దారుణ హత్యకు గురయ్యారు. పాత కక్షల నేపథ్యంలో అదే పార్టీకి చెందిన ముగ్గురు యువకులు కత్తులతో దాడిచేసి ఆయనను హత్యచేశారు. అనంతరం వారు పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై గ్రామస్తుల ముసుగులో టీడీపీ వర్గీయులు పథకం ప్రకారం దాడికి పాల్పడ్డారు. అనంతరం ఎమ్మెల్యేను పక్కనే ఉన్న పాఠశాలలో నిర్బంధించారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో.. జిల్లా పోలీస్ యంత్రాంగం రంగప్రవేశం చేసి, నాలుగు గంటల అనంతరం ఎమ్మెల్యేను ఇంటికి పంపించారు. -
తప్పుదోవ పట్టిస్తారా?
సాక్షి, అమరావతి: వివిధ కారణాలతో చనిపోయిన వారిని కల్తీ సారా మృతులంటూ సభను టీడీపీ తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణశ్రీనివాస్ (నాని) మండిపడ్డారు. ప్రతిపక్షం పదేపదే సభను అడ్డుకోవడంతో బుధవారం అసెంబ్లీలో ఈ ప్రకటన చేశారు. ఇదీ వాస్తవం.. ఈ నెల 11న జంగారెడ్డిగూడెంలో వరదరాజులు అనే వ్యక్తి అనారోగ్యానికి గురి కావడంతో ఏలూరు అక్కడ నుంచి గుంటూరు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలియగానే నేను 12వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు గుంటూరు ఆస్పత్రి వైద్యులతో మాట్లాడా. వరదరాజులు బ్రెయిన్ హెమరేజ్తో మెదడులో రక్తస్రావం జరుగుతోందని ఆస్పత్రి సూపరింటెండెంట్ చెప్పారు. అతడిని బతికించేందుకు వైద్యులు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం దక్కలేదు. బాధితుడు మంగళవారం రాత్రి 7 గంటలకు చనిపోయాడు. ఇప్పటికే ఎంఎల్సీ ప్రాథమిక నివేదిక రాగా పూర్తి స్థాయి రిపోర్టు రావాల్సి ఉంది. ఈలోగానే టీడీపీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. లక్షణాలన్నీ ఒకేలా ఉండాలి కదా? అవి నిజంగా కల్తీ సారాకు సంబంధించిన మరణాలే అయితే ఒకే రకమైన లక్షణాలుండాలి కదా? జంగారెడ్డిగూడెంలో చనిపోయిన వారందరి లక్షణాలు ఒకేలా లేవు. కొందరు కిడ్నీ వ్యాధులతో మరణిస్తే మరికొందరు కాలేయ సంబంధ జబ్బులతో మరికొందరు గుండెపోటు వల్ల మృతి చెందారు. వినే ఓపికా లేదా?: బుగ్గన టీడీపీ సభ్యులు రోజూ రెండు మరణాలను పెంచుతూ శవ రాజకీయాలు చేస్తున్నారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజమెత్తారు. కనీసం అడిగిన ప్రశ్నలకు సమాధానం వినే ఓపిక కూడా వారికి లేదని విమర్శించారు. అప్పుడు ఎందుకు వెళ్లలేదు?: కన్నబాబు రాష్ట్రంలో ఏ సమస్యలు కనపడకపోవడంతో టీడీపీ సభ్యులు ఈ అంశాన్ని ఎత్తుకున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు దుయ్యబట్టారు. అధికారంలో ఉండగా ప్రచార వ్యామోహంతో గోదావరి పుష్కరాల్లో 29మంది, ఏర్పేడులో ఇసుక మాఫియా 16మందిని చంపినప్పుడు పరామర్శించని చంద్రబాబు ఇప్పుడు ఓట్ల కోసం జంగారెడ్డిగూడెం పరుగెత్తుకెళ్లారని చెప్పారు. -
టీడీపీ సభ్యులపై కొయ్యే మోషేన్రాజు సీరియస్
-
సహజ మరణాలపై శవ రాజకీయాలా?
సాక్షి, అమరావతి: సహజ మరణాలపై ప్రతిపక్ష పార్టీ శవ రాజకీయాలు చేస్తోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) మండిపడ్డారు. జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకున్నవి సారా మరణాలని వక్రీకరించి ప్రచారం చేస్తున్నారన్నారు. ఘటనపై సోమవారం ఆయన శాసనసభలో ఒక ప్రకటన చేశారు. విషయం తెలియగానే సీఎం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్, ఎస్పీతో కలిసి స్వయంగా అక్కడికి వెళ్లామని చెప్పారు. పరిస్థితి చూసి వెంటనే తగిన చర్యలు తీసుకున్నా విపక్షం దుష్ప్రచారం చేస్తోందన్నారు. ఈనాడు దినపత్రిక లేనిపోని అవాస్తవాలు రాస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందన్నారు. గుండెనొప్పితో ఉపేంద్ర మృతి.. రాజకీయంగా లబ్ధి పొందాలన్న చంద్రబాబు కుట్రలకు ఆ పత్రిక వంత పాడుతోందని మంత్రి నాని ధ్వజమెత్తారు. ఈ నెల 12న అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఉపేంద్రకు ఛాతీ నొప్పి రావడంతో వెంటనే ఈసీజీ తీశారని తెలిపారు. ఉపేంద్ర గుండెనొప్పితో చనిపోయాడని డాక్టర్లు స్పష్టంగా చెప్పినా ఈనాడు పత్రిక అవాస్తవాలు రాసిందన్నారు. తన భర్త నాలుగైదు రోజులుగా మద్యం తాగలేదని ఉపేంద్ర భార్య చెప్పారని, ఈమేరకు ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఆస్పత్రిలో, పోలీసు రికార్డుల్లోనూ ఉందన్నారు. మృతుల జాబితా సేకరించి.. వాస్తవానికి జంగారెడ్డిగూడెంలో అందరూ ఒకేసారి చనిపోలేదని, వారం రోజుల్లో ఆ మరణాలు చోటు చేసుకున్నాయని మంత్రి నాని తెలిపారు. తొలుత 16 మంది మరణించగా అందులో 15 మంది తమ ఇళ్లలోనే చనిపోయారన్నారు. దహన సంస్కారాలు జరిగాక టీడీపీ నాయకులు శ్మశానం వద్దకు వెళ్లి వారం రోజుల్లో చనిపోయిన వారి జాబితా సేకరించి సారా మరణాల్లో చేర్చారని వెల్లడించారు. నాడు ఏరులైన మద్యం... నిజానికి చంద్రబాబు హయాంలో మద్యం ఏరులై పారిందని, విచ్చలవిడిగా వైన్ షాపులు, బార్లు వెలిశాయని మంత్రి నాని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం రాగానే మద్యాన్ని నియంత్రిస్తూ అనేక చర్యలు తీసుకున్నామన్నారు. మద్యం రేట్లు షాక్ కొట్టే విధంగా ఉంటే వినియోగం తగ్గుతుందని సీఎం భావించారని తెలిపారు. ఆ తర్వాత మద్యం రేట్లు తగ్గించాలని అందరూ కోరడంతో అంగీకరించారన్నారు. జీలుగుకల్లు మరణాలపై మాట్లాడరేం? కొద్ది రోజుల క్రితం తూర్పు గోదావరి జిల్లాలో జీలుగుకల్లు తాగి ఐదుగురు చనిపోతే చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు శవ రాజకీయం చేశారని తెలిపారు. టీడీపీ ఇన్చార్జి సోదరుడే కల్లులో విషం కలిపాడని తేలడంతో తర్వాత ఆ పార్టీ నేతలు ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. వాస్తవాలు వెలుగులోకి రావడంతో యనమల ఆధ్వర్యంలో చంద్రబాబు నియమించిన నిజ నిర్ధారణ కమిటీ పత్తా లేకుండా పోయిందన్నారు. ఎక్కడ అక్రమ మద్యం ఉన్నా, దాని వెనక ఎవరున్నా ఉపేక్షించవద్దని సీఎం గట్టిగా చెప్పారన్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) కూడా ఏర్పాటైందన్నారు. సారా వల్ల ఏ కుటుంబానికీ హాని కలగకూడదనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. వారం రోజులుగా తినకుండా తాగడంతో.. జంగారెడ్డిగూడెంలో చనిపోయిన వారిలో ఒక వ్యక్తి వారం రోజుల నుంచి ఏమీ తినకుండా మద్యం తాగడంతో మరణించాడని, ఈ విషయాన్ని స్వయంగా ఆయన కుటుంబ సభ్యులే చెబుతున్నా విపక్షం రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తారు. శ్మశానానికి ఏ శవం వచ్చినా సారాతోనే చనిపోయారంటూ టీడీపీ నేతలు శవ రాజకీయం చేస్తున్నారన్నారు. అవసరమైతే ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే, వైద్య శిబిరాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారన్నారు. పరామర్శా.. బల ప్రదర్శనా? ప్రతిపక్ష నేత చంద్రబాబు పరామర్శ కోసం కాకుండా బల ప్రదర్శన మాదిరిగా అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యకర్తలను తరలించి ఒక యుద్ధానికి వెళ్లినట్లుగా జంగారెడ్డిగూడెం వెళ్లారని మంత్రి నాని పేర్కొన్నారు. నిజంగా ప్రజలను ఓదార్చేందుకు వెళ్లే పద్ధతి ఇదేనా? అని ప్రశ్నించారు. సభలోనూ టీడీపీ సభ్యులు అనైతికంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. అదే నిజమైతే పోస్టుమార్టం చేస్తారా? అప్పారావు అనే వ్యక్తిని ఆస్పత్రికి తీసుకొస్తే అరగంటలో చనిపోయాడని, ఆ వెంటనే అంత్యక్రియలు నిర్వహించారని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులు ఆస్పత్రిపై ఫిర్యాదు చేయలేదన్నారు. అంత్యక్రియలు పూర్తైన 24 గంటల తర్వాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి పూడ్చిపెట్టిన శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టమ్ చేశారని చెప్పారు. ఆ నివేదిక ఇంకా రావాల్సి ఉందన్నారు. అది 16వ మరణం కాగా ఆ తర్వాత మరో రెండు మరణాలు ఆస్పత్రిలో నమోదైనా ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు. వారి కుటుంబ సభ్యులతో స్వయంగా మాట్లాడి పోస్టుమార్టం చేయించామని, తమ ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమన్నారు. ఒకవేళ మరణాలకు సారా కారణమైతే తామే ఎందుకు పోస్టుమార్టమ్ చేయిస్తామని ప్రశ్నించారు. ఆ నివేదికలు రాగానే టీడీపీ కుట్రలు వెలుగులోకి వస్తాయన్నారు. -
సహజ మరణాలపై కూడా అపోహలు సృష్టిస్తున్నారు: మంత్రి ఆళ్లనాని
-
సహజ మరణాలపై టీడీపీ అపోహలు
-
Andhra Pradesh: మా ఆస్పత్రి మారింది
రాష్ట్రంలో ప్రజారోగ్యానికి మంచి రోజులొచ్చాయి. ప్రభుత్వ వైద్య రంగంలో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మౌలిక వసతులకు ఏ కొరతా లేకుండా నాడు–నేడు కింద ఆస్పత్రులు సకల హంగులతో రూపు మార్చుకుంటున్నాయి. ప్రాథమిక ఆరోగ్య రంగం బలోపేతం అయిందని ఏ మారుమూల గ్రామంలోకి వెళ్లి.. ఏ పీహెచ్సీని చూసినా ఇట్టే తెలుస్తోంది. ఇది వరకు ఆయా గ్రామాల్లోని ఆస్పత్రులు ఎప్పుడు తెరుచుకునేవో.. ఎప్పుడు వైద్యుడుంటాడో ఎవరికీ తెలిసేది కాదు. వైద్యుడి సంగతి అటుంచితే కనీసం నర్సు కూడా అందుబాటులో లేని దుస్థితి ఇప్పుడు సమూలంగా మారిపోయింది. ఆరోగ్య పరంగా ఏ చిన్న సమస్య వచ్చినా నిమిషాల వ్యవధిలో వైద్యం అందుతోందని గ్రామీణ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరుకు చెందిన ఎస్.శిరీషది మధ్యతరగతి కుటుంబం. ఇటీవల ఇంటి వద్ద ఆడుకుంటుండగా శిరీష కుమారుడిని కుక్క కరిచింది. పిల్లవాడికి ఉప్పులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేయించడానికి వచ్చారు. వైద్య సిబ్బంది వేగంగా వివరాలు నమోదు చేసుకుని టీకా వేశారు. 15 నిమిషాల్లో వైద్య ప్రక్రియ ముగించారు. ఈ నేపథ్యంలో పీహెచ్సీలో వైద్య సేవలపై ఆమెను ప్రశ్నించగా.. ‘ఈ మధ్యే మా ఆస్పత్రి మారింది. కొన్నేళ్ల క్రితం ఇలా ఉండేది కాదు. ఆస్పత్రి లోపలంతా అపరిశుభ్ర వాతావరణం ఉండేది. రోగులు కూర్చోడానికి వీలుండదు. తాగునీరు, మరుగుదొడ్లు కూడా ఉండేవి కాదు. సిబ్బంది కొరత ఉండేది. చిన్న చిన్న జబ్బులకు, వైద్య పరీక్షలకు కంకిపాడు ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేసే వారు. అక్కడికి వెళ్లినా లాభం ఉండేది కాదు. దీంతో 20 కిలోమీటర్ల మేర ప్రయాణించి వ్యయ ప్రయాసల కోర్చి విజయవాడకు వెళ్లే వాళ్లం. కుక్క కరిచి ఎవరైనా వస్తే ఇక్కడ టీకాలు ఉండేవి కావు. ఇక్కడి నుంచి కంకిపాడుకు వెళితే.. అక్కడా కొన్ని సార్లు టీకాలు ఉండవు. దీంతో విజయవాడకు వెళ్లక తప్పేది కాదు. కానీ ప్రస్తుతం ఆస్పత్రిని బాగా అభివృద్ధి చేశారు. తగినన్ని మందులు, ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్య సమస్యలకు బయటకు వెళ్లే అవస్థ తప్పింది’ అని శిరీష సంతోషం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు పీహెచ్సీలో గతంలో కేవలం ఒకే ఒక్క నర్సు తప్ప ఎవరూ ఉండే వారు కాదని.. ఒంట్లో బాగోలేదని చూపించుకోవడానికి ఆస్పత్రికి వచ్చిన కె.శ్యామ్ చెప్పాడు. ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమం కింద ఆస్పత్రిని బాగా అభివృద్ధి చేసిందన్నాడు. ఇప్పుడు ముగ్గురు నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఎంఎన్వో/ఎఫ్ఎన్వో, ఇతర సిబ్బంది ఉన్నారన్నాడు. ‘గతంలో డాక్టర్లు వేళకు వచ్చే వారు కాదు. వచ్చినప్పుడు కొద్దిసేపు ఉండి వెళ్లిపోయేవారు. దీంతో వైద్యం కోసం వచ్చిన వాళ్లు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. ఈ కష్టాలు పడలేక కంకిపాడు, విజయవాడకు వెళ్లాల్సి వచ్చేది. చాలా మంది ఆర్ఎంపీల వద్దకు వెళ్లేవారు. ఇప్పుడా బాధలన్నీ తప్పాయి’ అని తెలిపాడు. – సాక్షి, అమరావతి అనూహ్య రీతిలో వసతుల కల్పన ప్రతి పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్ సహా 12 మంది స్టాఫ్ ప్యాట్రన్ను ఏర్పాటు చేశారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం భారీగా నియామకాలు చేపట్టింది. కృష్ణా జిల్లా ఉప్పులూరు పీహెచ్సీనే తీసుకుంటే ఇద్దరు నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఎఫ్ఎన్వో, ఫార్మసిస్ట్ పోస్టులు భర్తీ అయ్యాయి. అన్ని వసతులు కల్పించారు. దీంతో ఓపీ (ఔట్ పేషెంట్) సంఖ్య పెరిగింది. త్వరలో దీనికి నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ (ఎన్క్వాస్) గుర్తింపు రానుంది. యూపీహెచ్సీల్లోనూ ఉత్తమ వైద్యం గతంలో 259 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (యూపీహెచ్సీ) ఉండేవి. ప్రస్తుతం ఈ కేంద్రాలకు అదనంగా మరో 301 కేంద్రాలు.. మొత్తంగా 560 వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి కేంద్రానికి సొంతంగా భవనం ఉండేలా చర్యలు తీసుకుంటోంది. నాడు–నేడులో భాగంగా కొత్త భవనాలు, మరమ్మతుల కోసం రూ.399.2 కోట్లు ఖర్చు చేస్తోంది. 499 మంది వైద్యులను ఇప్పటికే నియమించారు. ఇతర సిబ్బందిని నియమిస్తున్నారు. ప్రస్తుతం 10 పడకలతో ఇన్ పేషెంట్ విభాగం అందుబాటులోకి వచ్చింది. పీహెచ్సీల తరహాలోనే యూపీహెచ్సీల్లోనూ డాక్టర్లు, నర్సులు, సిబ్బంది, మందులు, వైద్య పరీక్షలకు కొరత లేకుండా చర్యలు తీసుకుంది. కాగా, రూ.16,255 కోట్ల భారీ నిధులతో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన.. 16 కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణం, 5 గిరిజన మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో పాటు మరికొన్ని ఆస్పత్రులను ప్రభుత్వం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రూ.663 కోట్లతో నాడు–నేడు పీహెచ్సీల బలోపేతానికి ప్రస్తుత ప్రభుత్వం నాడు–నేడు కింద రూ.663 కోట్లు ఖర్చు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,145 పీహెచ్సీలు ఉండగా, 1,125 ఆస్పత్రుల్లో నాడు–నేడు పనులు చేపడుతున్నారు. 977 పీహెచ్సీలకు మరమ్మతులు, 148 పీహెచ్సీలకు కొత్త భవనాల నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పటికే 580 పీహెచ్సీలలో మరమ్మతులు, వసతుల కల్పన పూర్తయింది. ఈ ఏడాది ఏప్రిల్లోపు మరమ్మతులు, వచ్చే ఏడాది జూన్లోపు కొత్త భవనాల నిర్మాణం పూర్తి కానుంది. నాడు–నేడు కింద జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వసతులు కల్పిస్తున్నారు. దీంతో దేశంలోనే అత్యధిక పీహెచ్సీలకు ఎన్క్వాస్ (నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ – కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలో ఉంటుంది) గుర్తింపు ఉన్న రాష్ట్రంగా ఏపీ సత్తా చాటింది. 320 పీహెచ్సీలకు ఈ గుర్తింపుతో ఏపీ తొలి స్థానంలో, 191తో గుజరాత్ రెండో స్థానంలో, 134తో కేరళ మూడో స్థానంలో ఉంది. అందుబాటులో స్పెషలిస్ట్ వైద్యం ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజల కోసం స్పెషలిస్ట్ వైద్య సేవలను సైతం అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా 9 స్పెషాలిటీల్లో 1,278 మంది వైద్యులను నియమిస్తోంది. వీరు వారంలో ఆరు రోజుల పాటు రోజుకు రెండు పీహెచ్సీలకు వెళ్లి స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పటికే 276 పోస్టులు భర్తీ అయ్యాయి. ‘నాడు–నేడు’తో మార్పులు ఇలా.. ► ప్రతి ఆస్పత్రిలో సిటిజన్ చార్టర్ విధిగా అమలవుతోంది. దీని ప్రకారం ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ వైద్య సేవలు సమయానికి అందుతున్నాయి. ఆస్పత్రిలో వసతులు/గదులకు సంబంధించిన సైన్ బోర్డులు ఏర్పాటయ్యాయి. ► నిబంధనల మేరకు అగ్నిమాపక ధ్రువీకరణ పత్రాలు, కాలుష్య నియంత్రణ మండలి సర్టిఫికెట్లు ఉన్నాయి. రక్త పరీక్షలన్నీ అక్కడే జరిగేలా అన్ని ఆస్పత్రుల్లో మౌలిక వసతులతో కూడిన ల్యాబ్లు ఏర్పాటయ్యాయి. ప్రతి 3–4 గంటలకు ఒకసారి పారిశుధ్య పనులు కొనసాగుతున్నాయి. ► గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అత్యవసర మందులు అందుబాటులో ఉండేవి కాదు. ప్రస్తుతం 240 రకాల ఎసెన్షియల్ మందులు పీహెచ్సీల్లో అందుబాటులో ఉంటున్నాయి. ► చాలా ఆస్పత్రుల్లో గతంలో ఒకే వైద్యుడు ఉండేవాడు. ప్రస్తుత ప్రభుత్వం ప్రతి ఆస్పత్రిలో ఇద్దరు వైద్యులను తప్పనిసరి చేసింది. ఇందుకు తగ్గట్టుగా ఇప్పటికే 645 మంది డాక్టర్లు, 1,113 నర్సులు, 403 ల్యాబ్ టెక్నీషియన్లు సహా 2,964 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. మరో 264 డాక్టర్, 1,269 ల్యాబ్ టెక్నీషియన్, ఎఫ్ఎన్వో, ఇతర సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తోంది. నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ► గతంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పనివేళలు ఉండేవి. ప్రస్తుతం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఒకరు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు ఒకరు ఓపీ చూస్తారు. రాత్రి 8 గంటల తర్వాత అత్యవసర సేవల్లో భాగంగా ఫోన్ చేస్తే ఆస్పత్రికి వస్తారు. ► వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్లకు మందుల సరఫరా, వైద్య పరీక్షల శ్యాంపిల్స్ సేకరించి పీహెచ్సీలకు తరలించడం కోసం ప్రతి పీహెచ్సీకి ఒక స్కూటీని త్వరలో అందుబాటులోకి తెస్తున్నారు. ► మండలానికి రెండు పీహెచ్సీలు ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 176 కొత్త పీహెచ్సీలు ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం చిన్నఓగిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం ఈ ఫొటోలో కనిపిస్తున్న గిరిజనుడు మల్లూరి రాముకు 65 ఏళ్లు. విజయనగరం జిల్లా పార్వతీపురం వాసి. రిక్షా నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. వయసు రీత్యా పలు అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం వెళ్లాలంటే 150 కిలోమీటర్లు ప్రయాణించాలి. వృద్ధాప్యంలో అంత దూరం ప్రయాణించడం ప్రయాసే. రాము తరహాలో మరెవ్వరూ ఇబ్బంది పడకూడదని రాష్ట్రంలో ఐదు గిరిజన మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలకు ప్రభుత్వం పూనుకుంది. రూ. 246 కోట్లతో శ్రీకాకుళం జిల్లా సీతంపేట, విజయనగరం జిల్లా పార్వతీపురం, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం, పశ్చిమగోదావరి జిల్లా కేఆర్పురం ఐటీడీఏ పరిధిలోని బుట్టాయగూడెం, కర్నూలు జిల్లా శ్రీశైలం ఐటీడీఏ పరిధిలోని ప్రకాశం జిల్లా దోర్నాలల్లో ఈ ఆస్పత్రుల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. గిరిజన ప్రాంతాల్లో అందుబాటులో ఉండే వైద్యులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చేలా ఆదేశాలు జారీ అయ్యాయి. వైద్యులు, సిబ్బంది కోసం క్వార్టర్స్ కూడా నిర్మిస్తున్నారు. ఇబ్బందులు ఉండవు మా ప్రాంతంలోనే అన్ని వసతులతో ఆస్పత్రులు అందుబాటులోకి రాబోతుండటం శుభ పరిణామం. తద్వారా రోడ్డు ప్రమాదాలు, ఇతర అనారోగ్య పరిస్థితుల్లో సరైన సమయంలో మెరుగైన వైద్యం అందక సంభవించే మరణాలు తగ్గుతాయి. – కొవ్వాసి నారాయణ, బుట్టాయగూడెం, పశ్చిమగోదావరి జిల్లా వేగంగా పూర్తి చేస్తాం రాష్ట్రంలో ఐదు చోట్ల గిరిజన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయి. కాంట్రాక్టర్లకు పనులు అవార్డ్ చేశాం. వాళ్లు పనులు ప్రారంభించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. – మురళీధర్రెడ్డి, ఏపీఎంఎస్ఐడీసీ వైస్ చైర్మన్, ఎండీ ఏపీ రోల్ మోడల్ అవ్వాలన్నదే లక్ష్యం ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్యం అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. వైద్య రంగంలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండేలా అడుగులు ముందుకు వేస్తున్నాం. నాడు–నేడు కింద ప్రభుత్వం తీసుకున్న చర్యలతో అత్యధిక ఎన్క్వాస్ గుర్తింపు కలిగిన పీహెచ్సీలతో రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ఉంది. జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దుతున్నాం. దేశానికి ఏపీ రోల్ మోడల్ అవ్వాలన్న సీఎం లక్ష్యానికి అనుగుణంగా ముందుకు సాగుతున్నాం. – ఆళ్ల నాని, ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఇప్పుడు మా ఊళ్లోనే మంచి వైద్యం నాకు 70 ఏళ్లు. మా గ్రామంలోనే పీహెచ్సీ ఉంది. గతంలో ఇక్కడ సేవలు సరిగా లేనందున ఉయ్యూరులో ఓ ప్రైవేట్ వైద్యుడి వద్దకు వెళ్లే వాడిని. డాక్టర్ ఫీజు, మందులు కలిపి రూ.500 అయ్యేది. ఇప్పుడు మా ఊళ్లోనే ప్రభుత్వ ఆస్పత్రి బాగుండటంతో మంచి వైద్య సేవలు అందుతున్నాయి. క్రమం తప్పకుండా ఇక్కడికే వచ్చి, మధుమేహం, ఇతర వైద్య పరీక్షలు చేయించుకుని మందులు తీసుకువెళ్తున్నాను. వైద్యులు, సిబ్బంది బాగా చూస్తున్నారు. – బి.కోటేశ్వరరావు, చినఓగిరాల, కృష్ణా జిల్లా ఇదివరకు ఆర్ఎంపీ వైద్యమే గతి గతంలో మా ఊరికి సమీపంలోని రాకోడు పీహెచ్సీలో వైద్యుడు అందుబాటులో ఉండేవాడు కాదు. దీంతో పెద్దాస్పత్రులకు వెళ్లాల్సి వచ్చేది. అంత దూరం వెళ్లలేక ఊర్లోనే ఆర్ఎంపీతో చూపించుకునే వాళ్లం. ఈ ప్రభుత్వం వచ్చాక ఇద్దరు వైద్యులను నియమించారు. ఎప్పుడూ ఎవరో ఒకరు అందుబాటులో ఉంటున్నారు. ఆస్పత్రికి వెళితే ప్రేమగా పలకరిస్తూ వైద్యం చేస్తున్నారు. – పి.అప్పలనాయుడు, పెదవేమలి, విజయనగరం -
పెనుమూరులో 50 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన
పెనుమూరు/కార్వేటినగరం (చిత్తూరు): ప్రజారోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్య శాఖ) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) చెప్పారు. ఆయన శనివారం డిప్యూటీ సీఎం నారాయణస్వామితో కలిసి చిత్తూరు జిల్లా కార్వేటినగరంలో 50 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రభుత్వ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహాసముద్రం దయాసాగరరెడ్డి ఏర్పాటు చేసిన వైఎస్సార్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. నాని మాట్లాడుతూ ప్రభుత్వాస్పత్రుల బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా స్థానిక పీహెచ్సీ ఆవరణలో రూ.13.5 కోట్లతో నూతనంగా ఆస్పత్రిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డి మాట్లాడారు. జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, కోనేటి ఆదిమూలం, ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎంసీ విజయానందరెడ్డి, కలెక్టర్ హరినారాయణన్ పాల్గొన్నారు. -
కోవిడ్ నివారణ, వైద్య ఆరోగ్యశాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయండి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: కోవిడ్ నివారణ, వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటి సీఎం ఆళ్ల నాని, కోవిడ్ టాస్క్ ఫోర్స్ అధికారులు, వైద్యారోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. కోవిడ్ వల్ల తలెత్తే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొవడానికి అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రులే కాకుండా ప్రైవేటు ఆస్పత్రులను కూడా కరోనా చికిత్సకు సిద్ధంగా ఉంచాలని, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. ఫీవర్ సర్వే చేసే సమయంలోనే వ్యాక్సినేషన్ చేయించుకోనివారు ఎవరైనా ఉంటే.. వారందరికీ టీకాలు వేయాలని సీఎం సూచించారు. ప్రస్తుతం, ఏపీలో 6 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని అధికారులు సీఎంకు తెలిపారు. వారందరిని ప్రత్యేకంగా ఐసోలేషన్లో ఉంచినట్లు పేర్కొన్నారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని.. రాష్ట్రంలో కేసులు తక్కువగా ఉన్నా.. ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు కొనసాగుతున్నందున పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. టెస్ట్ ఎర్లీ, ట్రేస్ఎర్లీ, ట్రీట్ ఎర్లీ పద్ధతులలో పరీక్షలు నిర్వహించాలని సీఎం జగన్ సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ, పరిశీలన ఉండాలి అదే విధంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ, పరిశీలన పటిష్టంగా కొనసాగాలన్నారు. సచివాలయం స్థాయి నుంచి అధికారులు డేటాను తెప్పించుకోవాలని తెలిపారు. దీనిపై వచ్చే వారం మరోసారి సమావేశమై పరిస్థితిని సమీక్షిద్దామని అధికారులతో సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రస్తుతం 13 జిల్లాల్లో 98.96 శాతం మొదటి డోస్ టీకాలు, 71.76 శాతం రెండో డోస్ టీకా వేసినట్లు ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. నెల్లూరు, విజయనగరం, ప్రకాశం, అనంతపురం, ప.గో, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో నూటికి నూరుశాతం మొదటి డోస్ను పూర్తి చేశారు. కడపలో 98.93, విశాఖపట్నం 98.04, గుంటూరు 97.58, తూ.గో 97.43, కృష్ణా 97.12, శ్రీకాకుళంలో 96.70 శాతం మేర మొదటి డోస్ వేశారు. కేంద్ర ప్రభుత్వం బూస్టర్ డోస్ ప్రకటన నేపథ్యంలో అన్నిరకాలుగా సిద్ధం కావాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. బూస్టర్డోస్లపై ప్రత్యేక దృష్టి పెట్టండి ఫ్రంట్లైన్ వర్కర్స్తోపాటు దీర్ఘకాలిక వ్యాధులున్నవారిపైన, వృద్ధులపైన బూస్టర్డోస్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం సూచించారు. 15 నుంచి 18 ఏళ్లవారితో కలుపుకుని దాదాపు 75 లక్షల మందికి బూస్టర్ డోస్ అవసరమున్నట్లు ప్రాథమికంగా అంచనావేశామని అధికారులు తెలిపారు. ఆర్టీపీసీఆర్ పద్ధతిలోనే కోవిడ్ గుర్తించే పరీక్షలు చేయాలని, విదేశాల నుంచి వచ్చేవారికి పరీక్షలతో పాటు వారిని ట్రేస్ చేయాలని సీఎం అధికారులకు సూచించారు. పర్యాటకులను రెగ్యులర్గా పరీక్షలు జరపాలన్న సీఎం జగన్.. పాజిటివ్ అని తేలితే ప్రైమరీ కాంటాక్ట్స్ను కూడా వెంటనే ట్రెసింగ్ చేయాలన్నారు. అదే విధంగా, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాడు – నేడు పనుల ప్రగతిని సీఎం జగన్ సమీక్షించారు. రాష్ట్రంలో కొత్త మెడికల్ కళాశాల పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇవి పూర్తికాగానే అత్యాధునిక వసతి సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ క్రమంలో.. మెడికల్ సీట్లు పెరగడమే కాదు.. మంచి వైద్యం కూడా అందుబాటులోకి వస్తుందన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం పనులను ముందుకు తీసుకెళ్లాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఒకవైపు నాడు–నేడు ద్వారా ఇప్పుడున్న ఆస్పత్రులను ఆధునీకరించడం, ఇప్పటికే ఉన్న 11 బోధనాసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతోపాటు, ఈ కొత్త మెడికల్కాలేజీల నిర్మాణాలనూ ముందుకు తీసుకెళ్లాలని సీఎం అధికారులను సూచించారు. మెడికల్ హబ్స్ ఏర్పాటు ప్రగతిపైనా అధికారులతో చర్చించారు. వీలైనంత త్వరగా ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ప్రైవేటు రంగంలో కూడా అత్యాధునిక వైద్య సదుపాయాలు రావాలన్నదే ఈ హబ్స్ ముఖ్య ఉద్దేశమని సీఎం జగన్ పేర్కొన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో ఆస్పత్రిలో అవసరమైన సిబ్బందిని కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకోవాలని సీఎం జగన్ అధికారులను సూచించారు. -
ఆరోగ్యశ్రీ సేవలకు ప్రత్యేక యాప్: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. కేంద్రంతో సమన్వయం చేసుకుని జనవరిలోగా నిర్దేశించిన వయస్సుల వారందరికీ డబుల్ డోస్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాక్సినేషన్ను త్వరగా పూర్తి చేయడమే కోవిడ్ నివారణకు పరిష్కారమని సీఎం అన్నారు. వైద్య ఆరోగ్య శాఖపై తాడేపల్లిలోని తాన క్యాంప్ కార్యాలయంలో ఆయన సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: ‘ఈనాడు’ ఏనాడూ చెప్పని నిజం.. రైతు భరోసాలో ఇదో చరిత్ర ఎయిర్పోర్టుల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఒమిక్రాన్ నేపథ్యంలో ఆంక్షలు విధించామన్నారు. మరో వారం రోజుల్లో జీన్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఫీవర్ సర్వే కంటిన్యూ చేస్తామని అధికారులు తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఈనెలాఖరు నాటికి 144 పీఎస్ఏ ప్లాంట్లు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. నాడు– నేడు పనుల ప్రగతిపై సీఎం సమీక్ష ►విలేజ్, అర్బన్ క్లినిక్స్ నిర్మాణం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాడు– నేడు పనుల ప్రగతిని సమీక్షించిన సీఎం ►నాడు – నేడు కింద చేపడుతున్న ఏ కార్యక్రమమైనా గతానికీ, ఇప్పటికీ తేడా స్పష్టంగా కనిపించాలి: సీఎం ►గతంలో ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉందో.. ఫొటోగ్రాఫ్లను చూపాలి: సీఎం ►కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సీఎం ఆదేశం ►ఎప్పటికప్పుడు సమీక్షచేసుకుంటూ పనులు జోరుగా నడిపించాలన్న సీఎం ►ఆరోగ్య శ్రీ సేవలు ఏ ఆస్పత్రిలో దొరుకుతాయనే విషయమై అందరికీ అవాగాహన కల్పించాలి ►గ్రామ సచివాలయాల్లో దీనికి సంబంధించిన హోర్డింగ్స్ పెట్టాలి ►ఆరోగ్య శ్రీ సేవలందాలంటే ఎక్కడకు వెళ్లాలన్నదానిపై వారికి అందుబాటులో సమాచారం ఉండాలి ►విలేజ్ క్లినిక్స్ అనేది రిఫరల్ పాయింటల్ కావాలి ►విలేజ్ క్లినిక్స అందుబాటులోకి వచ్చేంతవరకూ గ్రామ సచివాలయంలో ఏఎన్ఎం ఈ బాధ్యత తీసుకోవాలి ►ఏ ఆస్పత్రికి వెళ్లాలి, ఎక్కడ ఆరోగ్య శ్రీ సేవలు చేయించుకోవాలన్నదానిపై వారికి సరైన సమాచారం, మార్గదర్శకత్వం ఇవ్వాలి ►108 ఆస్పత్రుల్లో కూడా ఇలాంటి సమాచారం ఉండాలి ►ఇలాంటి సేవలకు కూడా 104ను డెవలప్ చేయాలి ►ఆరోగ్య శ్రీలో రిఫరెల్ అన్నది చాలా కీలకమైన విషయం ►ఇది పథకాన్ని మరింత బలోపేతం చేస్తుంది ►అధికారులు దీనిపై దృష్టిపెట్టాలి ►క్యాన్సర్ రోగులకు సూపర్స్పెషాల్టీ సేవలు అందాలి: సీఎం ►మూడు ప్రాంతాల్లో కనీసం మూడు స్పెషాల్టీ ఆస్పత్రులు ఉండాలి: సీఎం ►దీనివల్ల ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం రోగులకు ఉండదు ►అంతేకాకుండా క్యాన్సర్ రోగులకు చికిత్సలు పూర్తిస్థాయిలో ఆరోగ్య శ్రీ కింద సేవలు అందాలి ►కొత్తగా తీసుకు వస్తున్న 16 మెడికల్కాలేజీల్లో సూపర్ స్పెషాల్టీ సేవలు అందుతాయి ►అవి కాకుండా క్యాన్సర్ చికిత్సకోసం మరో మూడు సూపర్ స్పెషాల్టీ సేవలు అందాలి ►వీటితో పాటు ఇదివరకే చెప్పిన విధంగా చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా మూడు ఆస్పత్రులను తీసుకు వస్తున్నాం: ►ఆస్పత్రుల్లో పెట్టిన ఆరోగ్య మిత్ర వ్యవస్థను బలోపేతం చేయాలి ►రోగులకు సమర్థవంతంగా సేవలు అందేలా వ్యవస్థ అందాలి ►108, 104 వాహనాలు అత్యంత సమర్థవంతంగా ఉండాలని సీఎం ఆదేశం ►నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావు ఉండకూడదన్న సీఎం ►రోగులకు సమర్ధవంతంగా సేవలు అందించడంలో వాహనాల నిర్వహణ కీలకమన్న సీఎం ►జిల్లాను ఒక యూనిట్గా తీసుకుని బఫర్ వెహికల్స్ పెట్టుకుని, ఎప్పటికప్పుడు వాహనాలను మెయింటినెన్స్ చేయాలన్న సీఎం ►ఆరోగ్య ఆసరా కింద డిశ్చార్జి అయిన రోజునుంచే వారికి డబ్బు అందాంటూ పునరుద్ఘాటించిన సీఎం. ►విశాఖపట్నంలో కొత్త ఎంఐఆర్ఐ, కాకినాడలో ఎంఐఆర్ఐ, కాథ్ ల్యాబ్, కర్నూలులో క్యాథ్ల్యాబ్పపాడేరు, అరుకుల్లో అనస్తీషియా, ఆప్థాలమిక్ మరియు ఈఎన్టీ ఏర్పాటుకు సీఎం గ్రీన్సిగ్నల్ ►దాదాపు రూ. 37.03 కోట్లు ఖర్చుచేయనున్న ప్రభుత్వం ►సమర్థవంతంగా ఆరోగ్య శ్రీ సేవలకు ప్రత్యేక యాప్ ►ఇందులో సందేహాలను నివృత్తిచేసే ఏర్పాటూ ఉండాలన్న సీఎం ►యాప్ను ఆరోగ్య మిత్రలకు ఇవ్వనున్న ఆరోగ్య శ్రీ ట్రస్ట్ ►వారికి సెల్ఫోన్లు సమకూర్చేందుకు సీఎం గ్రీన్సిగ్నల్ ►విలేజ్ క్లినిక్స్ ద్వారా ఎప్పటికప్పడు గాలి, నీరు, పరిసరాల పరిస్థితులపైన నిరంతరం నివేదికలు రావాలన్న సీఎం ►ఈ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి ►కలెక్టర్లు, జేసీలను భాగస్వాములుగా చేయాలన్న సీఎం ►రక్త హీనతను నివారించడానికి తీసుకుంటున్న చర్యలను వివరించిన అధికారులు ►ఆరు రకాల చర్యలను తీసుకుంటున్నామన్న అధికారులు ►రక్త హీనత నివారణా చర్యల్లో దేశంలోనే ఏపీ నంబర్ ఒన్గా నిలిచిందన్న అధికారులు ►75.3 పాయింట్లతో ఇండెక్స్లో ప్రథమస్థానంలో నిలిచిందన్న అధికారులు ►అంగన్వాడీలు, విలేజ్క్లినిక్స్ .. వీటన్నింటి ద్వారా రక్తహీనత నివారణా కార్యక్రమాలు చురుగ్గా సాగాలన్న సీఎం ►డీ వార్మింగ్కు వినియోగించే మందుల నాణ్యతపై అధికారులు దృష్టిపెట్టాలన్న సీఎం ►జీఎంపీ ప్రమాణాలు ఉండాలన్న ముఖ్యమంత్రి ►ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది నియామకానికి తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగిన సీఎం ►ఫిబ్రవరి చివరికల్లా మొత్తం ప్రక్రియ ముగుస్తుందన్న అధికారులు ►ప్రతి ఆస్పత్రిలో బెడ్ల సంఖ్య, వైద్యుల సహా సిబ్బంది సంఖ్యపై బోర్డులు కూడా ఉంచాలన్న సీఎం ►సిబ్బంది లేమి వల్ల ఈ సేవలు అందలదేన్న మాట వినిపించకూడదన్న సీఎం ►ఆసత్పుల్లో మౌలిక సదుపాయాలను జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం, తగిన సిబ్బంది ఉండచడం.. ఈరెండు అత్యంత ముఖ్యమైన అంశాలని అధికారులకు స్పష్టంచేసిన సీఎం ►ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలపట్ల ప్రజలకు విశ్వాసం, నమ్మకం ఉండేలా వాటిని తీర్చిదిద్దాలన్న సీఎం ►అధికారులు ప్రత్యేక ధ్యాస, శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందన్న సీఎం ►ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలను ప్రజలకు అందించడంలో సిబ్బంది సహకారం, భాగస్వామ్యం చాలా అవసరమన్న సీఎం ►ప్రభుత్వ ఉద్దేశాలను, ప్రజలకు సేవలందించడంలో లక్ష్యాలను వారికి వివరించాలన్న సీఎం ►వారి సహకారంతో మంచి ఫలితాలు సాధించాలన్న సీఎం -
తుపాను గండం: అధికారులతో మంత్రి ఆళ్ల నాని టెలికాన్ఫరెన్స్
సాక్షి, అమరావతి: తుపాన్ నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని శుక్రవారం ఉదయం ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల అధికారులు, డీఎంహెచ్వోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను ప్రభావంపై ఉత్తరాంధ్ర, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. తుపాన్ నేపథ్యంలో ముందోస్తు జాగ్రత్తలపై ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అదేశాలు ఇచ్చినట్టు మంత్రి వెల్లడించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండంతో ఈ జిల్లాల్లో ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందోస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేటప్పుడు అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. పునరావాస కేంద్రాలు వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. మూడు షిఫ్ట్ల్లో వైద్య బృందాలు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని మంత్రి ఆళ్ల నాని సూచించారు. సీనియర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిరంతరం వైద్య శిబిరాలు నిర్వహణలో మానిటరింగ్ చేయాలన్నారు. తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న విశాఖపట్నం, విజయనగరం, శ్రీ కాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల డీఎంహెచ్వోలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. -
ఒమిక్రాన్’పై ఏపీ అప్రమత్తం: విదేశాల నుంచి వస్తే ‘ఆర్టీపీసీఆర్’ తప్పనిసరి
సాక్షి, అమరావతి: ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు సృష్టిస్తున్న ‘ఒమిక్రాన్’పై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించినట్టు డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం కోవిడ్పై సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియా పాయింట్లో మంత్రి మాట్లాడుతూ కొత్త వేరియంట్ విషయంలో విదేశాల నుంచి వచ్చే వారికి తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించి, పాజిటివ్ వచ్చిన వారిని వెంటనే క్వారంటైన్కు పంపిస్తామన్నారు. 104 సహా అవసరమైన సహాయ చర్యల సన్నద్ధతపై చర్చించారని, అలాగే జనవరి 15లోగా రెండు కోట్ల మందికి వ్యాక్సిన్లు వేయాలని సీఎం ఆదేశించినట్టు చెప్పారు. ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు మాస్కులు ధరించని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రం ఆదేశాలు, సూచనలను తప్పనిసరిగా అమలు చేస్తామని, ఇప్పటి వరకు రాష్ట్రంలో కొత్త వేరియంట్ కేసు నమోదు కాలేదని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. చదవండి: (వణికిస్తున్న చలి.. మరోవైపు ఒమిక్రాన్.. లైట్ తీసుకోవద్దు ప్లీజ్!) -
వేవ్ వచ్చినా.. వేరియంట్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం
గుంటూరు మెడికల్: మన రాష్ట్రానికి ఏ వేవ్ వచ్చినా, ఎలాంటి వేరియంట్ వచ్చినా ఎదుర్కొనేందుకు వైద్య, ఆరోగ్యశాఖ సిద్ధంగా ఉందని ఆ శాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు చెప్పారు. వైద్య కళాశాల ప్రారంభమై 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా త్వరలో జరగనున్న ప్లాటినం జూబ్లీ వేడుకలకు గుర్తుగా కళాశాలలో సోమవారం పైలాన్కు శంకుస్థాపన చేశారు. ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ పైలాన్కు శంకుస్థాపన చేయడం వైద్య, ఆరోగ్యశాఖలో చరిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఈ పైలాన్ను సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభింపజేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. 1946లో టంగుటూరి ప్రకాశం పంతులు చొరవతో గుంటూరు వైద్య కళాశాల ఏర్పడిందని, ఇక్కడ వైద్య విద్యను అభ్యసించిన ఎంతో మంది దేశ, విదేశాల్లో ప్రముఖ వైద్యులుగా స్థిరపడిపోయి దేశానికి మంచి పేరు తెస్తున్నట్టు తెలిపారు. వైద్య కళాశాల, జీజీహెచ్పై సీఎం ప్రత్యేక దృష్టి గుంటూరు వైద్య కళాశాల, జీజీహెచ్పై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారని చెప్పారు. నాడు–నేడు కార్యక్రమంలో కళాశాల, ఆస్పత్రిలో పలు వార్డుల ఆధునికీకరణ, నూతన వైద్య విభాగాల నిర్మాణం కోసం సీఎం రూ.500 కోట్లు కేటాయించి.. నిర్మాణాలు చేయిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి టీచింగ్ ఆస్పత్రుల వరకూ రూ.1,600 కోట్లతో అభివృద్ధి చేసేందుకు సీఎం శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యేలు మద్దాళి గిరిధర్, మహమ్మద్ ముస్తఫా, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కేఎస్ లక్ష్మణరావు, మేయర్ మనోహర్నాయుడు, డెప్యూటీ మేయర్ షేక్ సజీలా, జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెన్రీ క్రిస్టీనా తదితరులు పాల్గొన్నారు. -
వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ఉండటానికి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. కోవిడ్ టీకాల పురోగతి, ఆక్సిజన్ బెడ్స్ సామర్థ్యంపై సీఎం జగన్ సమీక్ష నిర్వాహించారు. సమీక్ష అనంతరం మంత్రి ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ.. విదేశాల నుంచి రాష్ట్రాని వచ్చే ప్రయాణికులకు ఎయిర్పోర్టుల్లోనే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని సీఎం సూచించారని తెలిపారు. చదవండి: వరదబాధిత జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. డిసెంబర్ నెలాఖరు నుంచి జనవరి 15లోపు రెండు డోసుల వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారని తెలిపారు. ఆస్పత్రుల్లో వసతులు, సౌకర్యాలు పెంచుతూ.. కోవిడ్ పరీక్షల సంఖ్యను పెంచాలని తెలిపారని చెప్పారు. కోవిడ్ విషయంలో గతంలో తీసుకున్న అన్ని చర్యలను అధికారులు అమలు చేయాలని సీఎం జగన్ ఆదేశించానట్లు పేర్కొన్నారు. అదే విధంగా ప్రజలంగా కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని మంత్రి ఆళ్ల నాని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసి, కొన్ని గైడ్ లైన్స్ విడుదల చేసిందని తెలిపారు. ఇప్పటివరకు ఒక్క ఒమిక్రాన్ కేసు ఏపీలో నమోదు కాలేదని చెప్పారు. కేంద్ర మార్గదర్శకాలు పాటించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, కొత్త వేరియంట్ వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. త్వరలో అన్ని గైడ్ లైన్స్ విడుదల చేస్తామని మంత్రి ఆళ్లనాని పేర్కొన్నారు. -
వరద బాధితులకు మెరుగైన సేవలందించండి
సాక్షి, అమరావతి: వరద బాధితులకు మెరుగైన వైద్య సేవలందించాలని డిప్యూటీ సీఎం, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో శనివారం వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో వరద ముంపు జిల్లాల్లో అందుతున్న వైద్య సేవలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో పరిస్థితులను ఆయా జిల్లాల వైద్యారోగ్య శాఖ అధికారుల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. వరద ప్రభావిత ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి, ప్రతి క్యాంపులో సీనియర్ వైద్యుల బృందం అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్, అనంతపురం, చిత్తూరు జిల్లాలు సహా వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య బృందాలు 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ వరద బాధితులకు అవసరమైన వైద్య సేవలు అందించేలా వైద్య సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అలాగే శానిటేషన్పై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. వరద తగ్గిన ప్రాంతాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిపై వివరాలు సేకరించాలని, అవసరమైన మందులు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఆయా జిల్లాల వైద్యారోగ్య శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. అన్ని జిల్లాల్లోని వైద్యారోగ్య శాఖ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాగే మెడికల్ క్యాంపుల వద్ద 108 అంబులెన్స్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సమీక్షలో వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈవో వినయ్ చంద్ పాల్గొన్నారు. -
వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ పనులు వేగవంతం చేయాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ పనులు వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖలో నాడు–నేడు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్, కంటివెలుగుతో పాటు ప్రాధాన్య కార్యక్రమాలపై తాడేపల్లిలోని తాన క్యాంప్ కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. హెల్త్ క్లినిక్స్ పనులకు సంబంధించి ఇప్పటికే ఇవ్వాల్సిన నిధులు ఇచ్చామని అధికారులు తెలిపారు. చదవండి: Andhra Pradesh: 60 ఏళ్లకు కదలిక ►రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,011 వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణం ►ఇప్పటికే 8585 చోట్ల పనులు మొదలయ్యాయన్న అధికారులు ►పీహెచ్సీల్లో నాడు – నేడు కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతున్నాయన్న అధికారులు ►డిసెంబర్ నాటికి మరమ్మతు పనులు పూర్తవుతాయన్న అధికారులు ►అవసరమైన చోట 146 కొత్త భవనాల నిర్మాణం మార్చి 2022 నాటికి పూర్తిచేస్తామన్న అధికారులు ►వీటి నిర్మాణాలు కూడా మరింత వేగంగా పూర్తి చేయాలన్న సీఎం ►సీహెచ్సీల్లో, ఏరియా ఆస్పత్రుల్లో నాడు – నేడు పనులు చురుగ్గా సాగుతున్నాయన్న అధికారులు ►అత్యవసర పనులను ఇప్పటికే పూర్తిచేశామన్న అధికారులు ►మిగిలిన పనులుకూడా వేగంగా ముందుకు తీసుకెళ్లాలన్న సీఎం 16 కొత్త మెడికల్కాలేజీల్లో పనుల ప్రగతినీ సమీక్షించిన సీఎం ►ఇప్పటికే నాలుగు చోట్ల పనులు మొదలయ్యాయని, మిగిలిన చోట్ల నిర్మాణాలకు సన్నాహలను పూర్తిచేస్తున్నామని తెలిపిన అధికారులు ►కర్నూలు జిల్లా నంద్యాల, విశాఖజిల్లా అనకాపల్లి మెడికల్ కాలేజీ స్థలాలపై కోర్టులో పిటిషన్లు దాఖలు ►వీటిని త్వరగా పరిష్కరించేలా చూడాలని సీఎం ఆదేశాలు ►ఇవికాకుండా 9 చోట్ల జరుగుతున్న సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణ పనుల ప్రగతిపైనా సీఎం సమీక్ష గణనీయంగా పెరిగిన వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలు: ♦2019 జూన్కు ముందు ఆరోగ్య శ్రీ కింద ఉన్న వైద్య ప్రక్రియలు 1059 ♦2019 జూన్ తర్వాత 2446 వైద్య ప్రక్రియలకు పెంపు ♦2019 జూన్కు ముందు ఆరోగ్యశ్రీ కింద ఉన్న కవరేజీ ఆస్పత్రులు 919, తర్వాత 1717 ఆస్పత్రులకు పెంపు. ♦కొత్తగా 3,18,746 మందికి ఆరోగ్యశ్రీ కింద లబ్ధి ♦2019 జూన్కు ముందు ఆరోగ్య శ్రీద్వారా సగటున రోజుకు లబ్ధి 1570 మందికి జరిగితే.. ప్రస్తుతం 3300 మందికి లబ్ధి. ♦బధిర, మూగ వారికి పూర్తి ఖర్చులతో శస్త్రచికిత్సలు. ♦ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన రోజునే ఆరోగ్య ఆసరా కింద డబ్బు చెల్లింపు. ♦ఇప్పటివరకూ 7,82,652 మందికి ఆరోగ్య ఆసరా కింద రూ. 439.4 కోట్లు చెల్లింపు ♦శస్త్రచికిత్స చేయించుకున్నవారికి విశ్రాంతి సమయంలో ఆరోగ్య ఆసరా కింద రోజుకు రూ.225లు ఇస్తున్న ప్రభుత్వం. ♦కాన్సర్ రోగులకూ పూర్తిస్థాయిలో ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించాలన్న నిర్ణయం అమల్లోకి తెచ్చామని, దీన్ని పటిష్టంగా అమలు చేయాలన్న సీఎం. వైఎస్సార్ కంటి వెలుగుపైనా సీఎం సమీక్ష ♦ఇంతకుముందు ఎవరైనా పరీక్షలు చేయించుకోనివారికి పరీక్షలు చేయించాలన్న సీఎం ♦కంటి సమస్యలు గుర్తించిన వారికి కళ్లజోడు ఇవ్వాలని, అవసరమైనవారికి శస్త్రచికిత్సలు చేయించాలన్న సీఎం ♦కంటి వెలుగు కార్యక్రమాన్ని పూర్తిచేయాలని సీఎం ఆదేశాలు ♦దీనికోసం ఒక వారంరోజులపాటు డ్రైవ్ నిర్వహించాలన్న సీఎం ♦ఇప్పటికే 66,17,613 మంది పిల్లలకు పరీక్షలు చేశామని, వారిలో 1,58,227 మంది కంటి అద్దాలు ఇచ్చామని తెలిపిన అధికారులు ♦60 ఏళ్ల పైబడ్డ వారికి 13,58,173 మందికి పరీక్షలు చేశామన్న అధికారులు ♦ఇందులో 7,60,041 మందికి కంటి అద్దాలు ఇవ్వాల్సి ఉండగా 4,69,481 మందికి కంటి అద్దాలు ఇచ్చామన్న అధికారులు, మరో 1,00,223 మందికి శస్త్రచికిత్సలు చేయించామన్న అధికారులు. మరో 26,437 మందికి కాటరాక్ట్ సర్జరీలు చేయించాలన్న అధికారులు ♦కోవిడ్ పరిస్థితులు కారణంగా కంటివెలుగు కార్యక్రమానికి అవాంతరాలు ఏర్పడ్డాయన్న అధికారులు. ♦కంటి వెలుగు కార్యక్రమాన్ని విలేజ్ హెల్త్ క్లినిక్స్కు, 104కు అనుసంధానంచేసి.. నిరంతర ప్రక్రియగా కొనసాగించాలన్న సీఎం. హెల్త్ హబ్స్ ఏర్పాటుపైనా సీఎం సమీక్ష ♦వైద్యంకోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అందుబాటులో అత్యాధునిక వైద్యం ♦జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లలో ఏర్పాటు కానున్న హెల్త్ హబ్స్ ♦మొత్తం 16 చోట్ల ఏర్పాటు కానున్న హెల్త్ హబ్స్ ♦ఇప్పటికే 13 చోట్ల స్థలాలు గుర్తింపు ♦జిల్లాలో స్పెషాల్టీ సేవల అవసరం మేరకు ఏర్పాటు కానున్న హెల్త్ హబ్స్ కోవిడ్ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్పై సీఎంకు వివరాలందించిన అధికారులు ♦మొత్తం పాజిటివ్ కేసులు 3366 ♦పాజిటివిటీ రేటు 0.7 శాతం ♦పాజిటివిటీ రేటు 0 నుంచి 2 లోపు ఉన్న జిల్లాలు 12 ♦పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందన్న వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ♦2 కంటే పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లా 1 ♦అందుబాటులో ఉన్న మొత్తం ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ 23,457 ♦అందుబాటులో ఉన్న ఆక్సిజన్ డీ–టైప్ సిలిండర్లు 27,311 ♦ఆక్సిజన్ జనరేషన్ (పీఎస్ఏ) ప్లాంట్లు మొత్తం 140 ♦15 డిసెంబరు నాటికి పీఏస్ఏ ప్లాంట్లు ఏర్పాటు పూర్తిచేస్తామన్న అధికారులు వ్యాక్సినేషన్ ♦సింగిల్ డోసు వ్యాక్సినేషన్ పూర్తయినవారు 1,17,71,458 ♦రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయినవారు 2,17,88,482 ♦మొత్తం వ్యాక్సినేషన్ చేయించుకున్నవారు 3,35,59,940 ♦మొత్తం వ్యాక్సినేషన్ కోసం ఉపయోగించిన డోసులు 5,53,48,422 ఈ సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజిమెంట్ అండ్ వ్యాక్సినేషన్) ఎం రవిచంద్ర, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, 104 కాల్ సెంటర్ ఇంఛార్జి ఎ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి జిఎస్ నవీన్కుమార్, ఏపీఎంస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధర్రెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్ డాక్టర్ వి వినోద్ కుమార్, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ జేవియన్ సుబ్రమణ్యం ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
విషజ్వరాలూ ఆరోగ్యశ్రీలోకి..
సాక్షి, విశాఖపట్నం: సీజనల్ వ్యాధులైన డెంగీ, మలేరియాతో పాటు విషజ్వర పీడితులకు కూడా ఆరోగ్యశ్రీలో వైద్యం అందించనున్నట్లు ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. విశాఖ జిల్లాలో సీజనల్ వ్యాధులపై వైద్యాధికారులు, వైద్యులతో మంగళవారం ఆయన ఇక్కడ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. (చదవండి: ఉపాధ్యాయుడికి దేహశుద్ధి) రాష్ట్రవ్యాప్తంగా విశాఖ జిల్లాలోనే అత్యధిక మలేరియా, డెంగీ కేసులు నమోదయ్యాయన్నారు. విశాఖ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 462 డెంగీ, 708 మలేరియా, 24 చికున్గున్యా కేసులు నమోదయ్యాయని తెలిపారు. లోతట్టు, నీటి నిల్వలున్న ప్రాంతాలు, దోమల లార్వా నిల్వ ప్రాంతాల్లో ప్రతిరోజూ శానిటైజేషన్ చేయడమే కాకుండా వైద్య శిబిరాలు నిర్వహించేలా జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేశామని మంత్రి నాని చెప్పారు. అలాగే, ఐటీడీఏ పరిధిలోని పీహెచ్సీ, సీహెచ్సీ, ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో వైద్యులు, వైద్య పరికరాలు, పరీక్షలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. హాట్స్పాట్ ప్రాంతాల గుర్తింపు విషజ్వరాలు, డెంగీ, మలేరియాతో పాటు సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్న ప్రాంతాలను ‘హాట్ స్పాట్’ ప్రాంతాలుగా గుర్తించి.. అక్కడే వైద్య సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆళ్ల నాని వెల్లడించారు. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాలతో పాటు అర్బన్ ప్రాంతాల్లో డెంగీ ప్రబలుతున్న ప్రాంతాల్లో నిరంతరంగా ఫాగింగ్, స్ప్రే చేయిస్తున్నామని, ఏజెన్సీలో దోమ తెరలు పంపిణీ ప్రక్రియను వేగవంతంగా చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ప్రజలు కూడా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని.. పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మంత్రులు కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. (చదవండి: Bigg Boss 5 Telugu: జనాలను పిచ్చోళ్లను చేసిన లోబో, సిరి) -
సీజనల్ వ్యాధులను నిరోధిస్తాం
సాక్షి అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్లో సీజనల్ వ్యాధులను నియంత్రించడానికి ప్రభుత్వం పూర్తి సన్నద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని తెలిపారు. సోమవారం గుంటూరు కలెక్టరేట్లో సీజనల్ వ్యాధులపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి వర్షాకాలంలో మలేరియా, డెంగీ, చికున్గున్యాలను ప్రజలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎక్కువగా ఐదు జిల్లాల్లో సీజనల్ వ్యాధులు నమోదవుతున్నాయన్నారు. ప్రధానంగా.. గుంటూరు, విశాఖ, తూర్పు, పశ్చిమగోదావరి,కృష్ణా జిల్లాల్లో 1,575 డెంగీ కేసులు నమోదయ్యాయని తెలిపారు. గుంటూరు జిల్లాలో కూడా 276 డెంగీ కేసులు, 13 మలేరియా కేసులు నమోదయ్యాయన్నారు. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ వైద్య ఆరోగ్య శాఖతోపాటు మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారన్నారు. ఆయా జిల్లాలకు వెళ్లి ఎక్కువ కేసులు నమోదైన చోట నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే గుంటూరులో సమీక్ష నిర్వహించామని.. మంగళవారం విశాఖలో సమీక్ష నిర్వహించనున్నామని ఆళ్ల నాని తెలిపారు. దోమల వల్ల ఈ వ్యాధులు వస్తున్న నేపథ్యంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. వైద్య సేవల పరంగా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కోవిడ్ మూడో వేవ్కు సంబంధించి కేంద్రం నుంచి స్పష్టమైన సంకేతాలు ఏమీ రాలేదని చెప్పారు. అయినా సీఎం వైఎస్ జగన్ పూర్తి సన్నద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. అన్ని ఆస్పత్రుల్లో సీఎస్ఐ, ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. వైద్యుల నియామకం పూర్తి చేశామన్నారు. చిన్న పిల్లలకు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులపై అధికారులతో ఆళ్ల నాని సమీక్ష
సాక్షి, గుంటూరు: సీజనల్ వ్యాధులపై ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాలి గిరిధర్, కిలారి రోశయ్య, ఉండవల్లి శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వం సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంది. ఎక్కడైతే డెంగ్యూ, మలేరియా వ్యాధులు ఎక్కువ వస్తున్నాయో.. అక్కడ ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రత్యేకంగా శానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలి’’ అన్నారు. ‘‘జ్వరాలకు సంబంధించిన సర్వే చేయాలి. ఏ ప్రాంతంలో అయితే ఎక్కువగా వ్యాధులు నమోదవుతున్నాయో ఆ ప్రాంతంలో జ్వరాలకు సంబంధించిన నిర్ధారణ పరీక్షల శిబిరాలను ఏర్పాటు చేయాలి. ఆ ప్రాంతంలోనే ప్రత్యేకంగా జ్వరాల ట్రీట్మెంట్కి సంబంధించిన స్పెషల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్యం అందించాలి’’ అని ఆళ్ల నాని సూచించారు. (చదవండి: థర్డ్వేవ్ హెచ్చరికలు: ఏపీ సర్కార్ ముందస్తు ప్రణాళిక) ‘‘మురికివాడలు, ఏజెన్సీ ప్రాంతాల్లో అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు నీరు నిల్వ ఉండకుండా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలి. సీజనల్ వ్యాధులను మానిటరింగ్ చేయడానికి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారి నియమించాం. ఆరోగ్యశాఖ మున్సిపల్ పంచాయితీ శాఖలకు సంబంధించిన అధికారులు సమన్వయంతో పనిచేయాలి. మందులు అందుబాటులో ఉంచాలి. ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్స్లో అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం’’ అని ఆళ్ల నాని తెలిపారు. చదవండి: పకడ్బందీ ప్రణాళికతో కరోనాకు చెక్ -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆస్పత్రుల్లో వైద్య సేవలపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని సూచించారు. కోవిడ్ నివారణ చర్యలపై సీఎం వైఎస్ జగన్ గురువారం తాడేపల్లి క్యాపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డబ్ల్యూహెచ్ఓ, జీఎంపీ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన మందులు అందించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వాస్పత్రికి వెళ్తే రోగం తగ్గుతుందనే భరోసా ప్రజలకు రావాలని అధికారులకు తెలిపారు. వ్యాక్సినేషన్ తర్వాత అధ్యయనం వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కోవిడ్ ప్రభావాన్ని తెలుసుకునేందుకు అధ్యయనం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. బూస్టర్ డోస్ కూడా తీసుకోవాలంటూ వస్తున్న సమాచారం నేపథ్యంలో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలనే దానిపై ఒక ఆలోచన కూడా చేయాలని అధికారులకు సూచించారు. రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తైన తర్వాత ఏ రకంగా అడుగులు ముందుకేయాలనే దానిపై సరైన ఆలోచనలు చేయాలన్నారు. నవంబర్ చివరి నాటికి 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కనీసం సింగిల్ డోస్ వ్యాక్సినేషన్ ఇస్తామమని అధికారులు సీఎం జగన్కు వివరించారు. కర్ఫ్యూ కొనసాగింపు రాత్రి 11 గంటలనుంచి ఉదయం 6 గంటలవరూ కర్ఫ్యూ కొనసాగింపు అమల్లో ఉంటుందని సీఎం జగన్ తెలిపారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తప్పవని సీఎం అన్నారు. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేయాలని వైద్య ఆరోగ్యశాఖను సీఎం ఆదేశించారు. సిబ్బంది లేరనే మాట వినిపించకూడదు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తైన తర్వాత వైద్యులు లేరు, సిబ్బంది లేరనే మాటలు ఎక్కడా వినిపించకూడదని సీఎం జగన్ అన్నారు. బయోమెట్రిక్తో పక్కాగా హాజరు, పనితీరుపై పర్యవేక్షణ ఉండాలని అధికారులకు సూచించారు. ప్రజలకు వైద్య సేవలు అందడంలో ఎలాంటి ఇబ్బందుల రాకూడదని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ ద్వారా సమర్థవంతమైన సేవలు అందాలని, ప్రభుత్వ ఆసత్పుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందాలని తెలిపారు. డబ్ల్యూహెచ్ఓ, జీఎంపీ ప్రమాణాలున్న మందులు మాత్రమే ప్రభుత్వం ఆస్పత్రుల్లో ఉండాలని అధికారులకు సీఎం సూచించారు. ఈమేరకు నిరంతర తనిఖీలు, పర్యవేక్షణ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని), డీజీపీ గౌతమ్ సవాంగ్, కోవిడ్ టాస్క్ఫోర్స్ కమిటీ చైర్మన్ ఎం టీ కృష్ణబాబు, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకారదర్శి అనిల్కుమార్ సింఘాల్, ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈవో వి.వినయ్చంద్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి.మురళీధర్ రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ డైరెక్టర్ (డ్రగ్స్) రవిశంకర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: మీ స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది నాన్న: సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్ -
‘వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి’
సాక్షి, చిత్తూరు: పేద ప్రజల గుండె చప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొనియాడారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మంత్రి పెద్దిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని గుర్తుచేశారు. అన్ని వర్గాలకు మేలు చేసిన ఘనత వైఎస్సార్కే దక్కుతుందన్నారు. వైఎస్సార్ చూపిన బాటలో సీఎం వైఎస్ జగన్ నడుస్తున్నారని పెద్దిరెడ్డి తెలిపారు. సాక్షి, పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లాలోని దుగ్గిరాల గ్రామంలో అంబేద్కర్, వైఎస్సార్ విగ్రహాలను మంత్రి ఆళ్ల నాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తర్వాత పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్న నాయకుడు సీఎం జగన్మోహన్రెడ్డి అని అన్నారు. కరోనాను కట్టడి చేస్తూ సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారమే సీఎం జగన్ పేదలకు సంక్షేమన్ని చేరువచేశారని కొనియాడారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి మనందరికీ దూరమై నేటికీ 12ఏళ్లు గడిచాయని, ఆయన ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలన్నారు. రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పధకాలతో చెరగని ముద్ర వేశారని గుర్తుచేశారు. పేదలకు కుల, మత, పార్టీ, బేధం లేకుండా సంక్షేమ పాలన అందించారని కొనియాడారు. భావితరాల భవిష్యత్ను ఉద్దేశించి సీఎం జగన్ పాలన అందిస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ అంబేద్కర్ ఆశయాల అనుగుణంగా పాలన సాగిస్తున్నారని తెలిపారు. మేనిఫెస్టోలో 90 శాతం పథకాలు అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్కు దక్కుతుందని పేర్కొన్నారు. దెందులూరు నియోజకవర్గంలో రూ. 750 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని, రూ.100కోట్లతో రూర్బన్ కింద 15కొల్లేరు గ్రామాల రూపురేఖలు మారబోతోన్నాయని తెలిపారు. రూ.240 కోట్లతో ఆర్అండ్బీ కింద పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ మోషేన్ రాజు మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాల సాధనకు అనుగుణంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగిస్తున్నారని అన్నారు. పేదల గుండె చప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి బాటలో.. బడుగు, బలహీన వర్గాలకు సీఎం జగన్ అండగా నిలుస్తున్నారని చెప్పారు. అదేవిధంగా ఎమ్మెల్యే వాసుబాబు మాట్లాడుతూ.. దుగ్గిరాల గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, వైఎస్సార్ విగ్రహన్ని ప్రారంభించడం శుభపరిణామమని అన్నారు. సంక్షేమ పాలనలో సువర్ణ అధ్యాయం వైఎస్సార్ పాలన అని కొనియాడారు. -
ప్రభుత్వాస్పత్రుల్లో 90 రోజుల్లోగా రిక్రూట్మెంట్ పూర్తి చేయాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: స్కూళ్లల్లో కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయాలని సూచించారు. సీఎం వైఎస్ జగన్ మంగళవారం కోవిడ్ నివారణ చర్యలపై తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్లో గ్రామ, వార్డు సచివాలయాన్ని యూనిట్గా తీసుకోవాలని తెలిపారు. ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్ వేసుకుంటూ వెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ♦స్కూళ్లు తెరిచినందున అక్కడ కోవిడ్ ప్రోటోకాల్స్ సమర్థవంతంగా పాటించేలా చర్యలు తీసుకోవాలి.. అధికారులకు స్పష్టం చేసిన సీఎం జగన్ ♦వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను పాటించేలా అధికారులు దృష్టిపెట్టాలన్న సీఎం ♦దీనిపై ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం ♦మాస్క్లు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం ♦స్కూళ్లలో టెస్టింగ్కు కూడా చర్యలు తీసుకోవాలన్న సీఎం ♦ఒకవేళ ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేసేలా చూడాలన్న సీఎం థర్డ్వేవ్ నేపథ్యంలో ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపైనా సీఎం సమీక్ష ♦వ్యాక్సినేషన్లో గ్రామ, వార్డు సచివాలయాన్ని ఒక యూనిట్గా తీసుకోవాలన్న సీఎం ♦ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్ ఇచ్చుకుంటూ వెళ్లాలన్న సీఎం ♦ఉదయం 6 గంటలనుంచి రాత్రి 11 గంటలవరకూ కర్ఫ్యూ సడలింపులు ♦తెల్లవారు జామున పెళ్లిళ్లు ఉంటే... ముందస్తుగా అనుమతి తీసుకోవాలి ♦పెళ్లిళ్లలో 150 మందికే అనుమతి ♦కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించేలా అధికారులు స్వయంగా పర్యవేక్షించాలన్న సీఎం ♦ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం ♦కోవిడ్ నివారణ, నియంత్రణ చర్యలతో పాటు వ్యాక్సినేషన్ పై సీఎంకు వివరాలందించిన అధికారులు ♦యాక్టివ్ కేసులు 17,218 ♦రికవరీ రేటు 98.45 శాతం ♦పాజిటివిటీ రేటు 1.94 శాతం ♦3 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు నమోదైన జిల్లాలు 10 ♦3 నుంచి 6 శాతంలోపు పాజిటివిటీ నమోదైన జిల్లాలు 3 ♦నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న బెడ్లు 93.98శాతం ♦ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న బెడ్లు 74.82 శాతం ♦104 కాల్ సెంటర్కు వచ్చిన ఇన్ కమింగ్ కాల్స్ 571 థర్డ్ వేవ్ సన్నద్దత ♦అందుబాటులో ఉన్న ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ 20,464 ♦డి టైప్ ఆక్సిజన్ సిలిండర్లు 27,311 ♦ఆగష్టు నెలాఖరునాటికి 104 చోట్ల ఆక్సిజన్ జనరేషన్ (పీఎస్ఏ) ప్లాంట్లు ఏర్పాటు పూర్తి ♦మరో 36 చోట్ల సెప్టెంబరు రెండోవారానికి పూర్తి చేయనున్నట్లు తెలిపిన అధికారులు వ్యాక్సినేషన్ ♦మొత్తం వాక్సినేషన్ తీసుకున్నవారు 1,82,00,284 ♦సింగిల్ డోసు వ్యాక్సిన్ తీసుకున్నవారు 1,15,98,720 ♦రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిన వారు 66,01,563 ♦ఉపయోగించిన మొత్తం వ్యాక్సిన్ 2,48,01,847 డోసులు ఔషధ నియంత్రణశాఖపైనా సీఎం సమీక్ష ♦సమర్థవంతమైన ఔషధ నియంత్రణ, పరిపాలన కోసం వెబ్సైట్ ♦ఔషధాల నాణ్యత, ప్రమాణాలను పాటించేలా చేయడంలో దోహదకారిగా కంప్యూటర్ ఎయిడెడ్ సెలక్షన్ ఆఫ్ ఇన్స్ఫెక్షన్ – ‘సీఏఎస్ఐ’ పేరిట నూతన వెబ్సైట్ ♦వెబ్సైట్లోని అంశాలను సీఎంకు వివరించిన అధికారులు ♦తయారీ సంస్థలనుంచి రిటైల్ దుకాణాల వరకూ కూడా దీని పరిధిలోకి వస్తాయన్న అధికారులు ♦టెలిఫోన్, వాట్సాప్, మెయిల్.. ఇతరత్రా మార్గాల ద్వారా కూడా ఫిర్యాదులను స్వీకరిస్తామన్న అధికారులు ♦తనిఖీల్లో పారదర్శకత, నాణ్యత, నిరంతర ఫాలోఅప్ కోసమే కొత్త వెబ్సైట్ అని తెలిసిన అధికారులు ♦డ్రగ్స్ తనిఖీల్లో గుర్తించిన అంశాలపై ఫాలో అప్ ఉండాలన్న సీఎం ♦నిర్దేశిత సమయంలోగా ఇచ్చిన సూచనలు, ఆదేశాలను అమలు చేశారా? లేదా? అన్నదానిపై నిర్ణీత కాలం తర్వాత మళ్లీ తనిఖీలు చేయాలన్న సీఎం ♦వెబ్సైట్ నిర్వహణపై సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్న సీఎం ♦ప్రభుత్వ ఆస్పత్రుల్లోని మందులపైనా కూడా నిరంతరం తనిఖీలు చేయాలన్న సీఎం ♦జీఎంపీ ప్రమాణాలు పాటిస్తున్నారా?లేదా? అన్నదానిపై నిరంతరం తనిఖీలు చేయాలన్న సీఎం ♦ప్రభుత్వ ఆస్పత్రుల్లోని డ్రగ్స్టోర్లను కచ్చితంగా తనిఖీలు చేయాలన్న సీఎం ♦మందులు నాణ్యతతో లేకపోతే ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుందన్న సీఎం ♦ఔషధాల్లో కల్తీలను నివారించడానికి ప్రివెంటివ్ యాక్షన్ థ్రూ డ్రగ్ సర్వేలెన్స్– ‘పీఏడీఎస్’ (పాడ్స్) పేరిట మరొక వెబ్సైట్ ♦డ్రగ్స్ తయారీ దారులు నుంచి పంపిణీదారుల వరకూ ట్రాకింగ్ ♦ఏ కంపెనీ నుంచి డ్రగ్ తయారీ అవుతుంది, లైసెన్స్లు ఉన్నాయా? లేవా తదితర అంశాలన్నింటిపైనా కూడా తనిఖీ ఉంటుందన్న అధికారులు ♦గతంలో అజిత్రోమైసిన్ మందును ఉత్తరాఖండ్ లో ఒక కంపెనీ తయారు చేసినట్టుగా చెప్పారని, ఆరా తీస్తే అలాంటి కంపెనీ ఏమీ లేదని, వారు తయారుచేసిన టాబ్లెట్లలో ఎలాంటి డ్రగ్లేదని తెలిపిన అధికారులు ♦ఇలాంటి వాటి నివారణకు ఈ వెబ్సైట్ ఉపకరిస్తుందని తెలిపిన అధికారులు ♦అంతేకాకుండా ప్రభుత్వం వద్ద ఔషధ కంపెనీల రిజిస్ట్రేషన్ అంశాన్ని కూడా పరిశీలించాలన్న సీఎం ♦క్రమం తప్పకుండా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగేలా చూసే అవకాశాన్ని పరిశీలించాలన్న సీఎం ♦దీనివల్ల వారి ఉత్పత్తులపై ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతాయన్న సీఎం ♦డ్రగ్ డీలర్లు పంపిణీచేస్తున్న మందులకు సంబంధించి ఒక వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చామని, దీనివల్ల ట్రాకింగ్ సులభం అవుతుందని తెలిపిన అధికారులు పిల్లల్లో న్యుమోనియా మరణాల నివారణకు వ్యాక్సినేషన్పై సీఎం సమీక్ష ♦న్యూమోనియా నివారణకు ఇకపై న్యూమోకోకల్ కాంజ్యుగట్ వ్యాక్సిన్ను (పీసీవీ) ఇవ్వనున్నట్లు తెలిపిన అధికారులు ♦పిల్లలకు ఈ వ్యాక్సిన్ ఇచ్చేందుకు తీసుకుంటున్న చర్యలను సీఎంకు వివరించిన అధికారులు ♦ఇప్పటివరకు పిల్లలకు 9 రకాల వ్యాక్సిన్లు అందిస్తున్న ప్రభుత్వం ♦కొత్తగా ఇస్తున్న న్యూమోకోకల్తో కలిపి మొత్తంగా 10 రకాల వ్యాక్సిన్లు పిల్లలకు ఇవ్వనున్నట్టు తెలిపిన అధికారులు ♦వ్యాక్సినేషన్ కోసం గ్రామ, వార్డు సచివాలయాలను వినియోగించుకోవాలన్న సీఎం ♦విలేజీ, వార్డు క్లీనిక్లు ఏర్పాటైన తర్వాత అక్కడ నుంచి పిల్లలకు సమర్థవంతంగా వ్యాక్సినేషన్ అందించాలని సీఎం ఆదేశం ♦నిర్దేశించిన విధంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో రిక్రూట్మెంట్ పూర్తిచేయాలన్న సీఎం ♦పీహెచ్సీలు మొదలుకుని సీహెచ్సీలు బోధనాసుపత్రుల వరకు రిక్రూట్మెంట్ పూర్తిచేయాలన్న సీఎం ♦90 రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేసిన సీఎం ♦ఆతర్వాత ఎక్కడా కూడా సిబ్బంది లేరన్న మాట వినిపించకూడదన్న సీఎం ♦ప్రజలకు వైద్య సేవలు అందడంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదని స్పష్టంచేసిన సీఎం ♦ఆస్పత్రుల్లో నాడు – నేడు పనులను కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లాలని సీఎం ఆదేశం ఈ సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, కోవిడ్ టాస్క్ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజిమెంట్ అండ్ వ్యాక్సినేషన్) ఎం రవిచంద్ర, 104 కాల్ సెంటర్ ఇంఛార్జి ఎ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్ చంద్, ఏపీఎంస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ (డ్రగ్స్) రవి శంకర్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
డిజిటల్ హెల్త్ పై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
మహిళలకు ఇదొక ఆయుధం
-
‘సీఎం జగన్ జనరంజక పాలనకు నిదర్శనమే ఈ విజయం’
సాక్షి, ఏలూరు: ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించిందని.. సీఎం జగన్ జనరంజక పాలనకు నిదర్శనమే ఈ విజయం అని మంత్రి ఆళ్ల నాని అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కరోనా పరిస్థితుల్లో కూడా చంద్రబాబు శవరాజకీయాలు చేశారని.. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలను ప్రజలు తిప్పికొట్టారన్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ సీఎం జగన్ సంక్షేమాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధికి చంద్రబాబు అడ్డుపడితే భవిష్యత్తులో ఏ ఎన్నికలు జరిగినా టీడీపీకి ఇవే ఫలితాలు వస్తాయని ఆళ్ల నాని అన్నారు. -
థర్డ్వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: కోవిడ్ నివారణ, వ్యాక్సినేషన్పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, సమర్థ నిర్వహణ ద్వారా ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ ఇవ్వగలిగామన్నారు. గర్భిణీలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా కొనసాగాలన్నారు. థర్డ్వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. ‘‘పీడియాట్రిక్ సూపర్కేర్ ఆస్పత్రుల పనులను వేగవంతం చేయాలి. పోలీస్ బెటాలియన్స్లో కూడా కోవిడ్కేర్ ఎక్విప్మెంట్తోపాటు వైద్యులను నియమించాలి. కమ్యూనిటీ ఆస్పత్రుల స్థాయివరకు ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.పీహెచ్సీల్లో కూడా ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సన్ట్రేటర్లు అందుబాటులో ఉండాలి. సబ్ సెంటర్ల వరకు టెలీమెడిసిన్ సేవలు, ఇంటన్నెట్ సౌకర్యం ఉండాలని’’ సీఎం జగన్ ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే....: ►రాష్ట్రానికి ఇప్పటివరకు వచ్చిన వ్యాక్సిన్ డోసులు 1,80,82,390 ►ఇంకా (బ్యాలెన్స్డు డోసులు) వినియోగించాల్సిన డోసులు 8,65,500 ►ఇప్పటివరకు ఇచ్చిన డోసులు సంఖ్య 1,82,49,851 ►సమర్ధ నిర్వహణ ద్వారా దాదాపుగా 11 లక్షల డోసులు ఆదా ►ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులందరికీ 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది ►విదేశాలకు వెళ్లే వారిలో ఇప్పటివరకు 31,796 మందికి వ్యాక్సినేషన్ ►సమర్ధ నిర్వహణద్వారా ఆదా చేయడం సాధ్యమైంది ►45 సంవత్సరాల దాటిన వారికి వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాత ప్రయారిటీగా ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలి ►గడిచిన మే నెల నుంచి ప్రైవేటు ఆస్పత్రులకు కేటాయించిన వ్యాక్సిన్ డోసులు 35 లక్షలు ►కేవలం సుమారు 4,63,590 డోసులు మాత్రమే వినియోగం ►ఆ కోటాను రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయం ►గర్భిణీ స్త్రీలకు వాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా కొనసాగాలి ►వాక్సినేషన్పై వారికి అవగాహన కలిగించాలి ►అధికారులకు స్పష్టం చేసిన సీఎం థర్డ్ వేవ్ సన్నద్దత ►థర్డ్ వేవ్ వస్తుందన్న సమాచారం నేపధ్యంలో సన్నద్ధంగా ఉండాలి ►విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో నిర్మించదలచిన పీడియాట్రిక్ సూపర్ కేర్ ఆస్పత్రుల పనులను వేగవంతం చేయాలని సూచన ►పోలీస్ బెటాలియన్స్లో కూడా కోవిడ్ కేర్ ఎక్విప్మెంట్ ఏర్పాటుతో పాటు వైద్యులను నియమించాలి ►కమ్యూనిటీ ఆస్పత్రులు స్ధాయివరకు ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి ►పీహెచ్సీల్లో కూడా ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందుబాటులో ఉంచాలి ►సబ్సెంటర్ల వరకు టెలీమెడిసిన్ సేవలు, ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉండాలి ►అప్పుడే వారితో పీహెచ్సీల వైద్యులు కూడా వీసీ ద్వారా అందుబాటులోకి వస్తారు ►కోవిడ్ అంక్షల్లో భాగంగా మరో వారం రోజుల పాటు నైట్ కర్ఫ్యూ కొనసాగించాలి ►రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు ►కోవిడ్ ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలి ►జనసమూహాలపై ఆంక్షలు కొనసాగుతాయి ప్రైవేటు ఆసుపత్రులు – ఆక్సిజన్ (పీఎస్ఏ) ప్లాంట్లు ►50 పడకలు దాటి ఉన్న ప్రతి ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు ఏర్పాటు విషయంలో పురోగతిని అడిగి తెలుసుకున్న సీఎం ►జిల్లా కలెక్టర్లు సంబంధిత జిల్లాల్లో ప్రైవేటు ఆస్పత్రులకు ఆదేశాలు ఇచ్చారన్న అధికారులు ►ఈ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం ఇన్సెంటివ్ ఇస్తున్నామని స్పష్టం చేసిన సీఎం ►కోవిడ్ 19 నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్, థర్డ్ వేవ్ సన్నద్ధతపై సీఎంకు వివరాలందించిన అధికారులు ►యాక్టివ్ కేసులు 24,708 ►పాజిటివిటీ రేటు 2.83 శాతం ►3 కంటే తక్కువ పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాలు 8 ►3 నుంచి 5 మధ్యలో పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాలు 5 ►రికవరీ రేటు 98.05 శాతం ►నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న బెడ్లు 94.19 శాతం ►ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న బెడ్లు 76.07 శాతం ►13వ దఫా ఫీవర్ సర్వే కూడా పూర్తయింది. ►104 కాల్ సెంటర్కు వస్తున్న రోజువారీ కాల్స్ 1000 లోపు బ్లాక్ ఫంగస్ ►తగ్గుముఖం పట్టిన బ్లాక్ ఫంగస్ కేసులు ►గత వారంలో నమోదైన కేసులు 15 ►మొత్తం కేసులు 4075 ►చికిత్స పొందుతున్నవారు 863 వ్యాక్సినేషన్ ►మొత్తం వ్యాక్సినేషన్ పూర్తయినవారు 1,41,42,094 ►సింగిల్ డోసు పూర్తయినవారు 1,00,34,337 ►రెండు డోసులు పూర్తయినవారు 41,07,757 -
సచివాలయ వ్యవస్థతో మెరుగైన సేవలు: ఆళ్ల నాని
సాక్షి,జంగారెడ్డిగూడెం రూరల్: సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని, సచివాలయాల సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం పంచాయతీ రామచర్లగూడెంలో విజయ హాస్పిటల్స్ ఐకేర్ ఆస్పత్రిలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలను మంత్రి ప్రారంభించారు. అనంతరం శ్రీనివాసపురంలో రూ.40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయాన్ని నాని ప్రారంభించారు. సచివాలయ ఆవరణలో మంత్రి మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందుతున్నాయన్నారు. కరోనా థర్డ్ వేవ్పై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎన్ని వేవ్లు వచ్చినా గత అనుభవవాలను దృష్టిలో పెట్టుకుని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నారన్నారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థతో రాష్ట్రంలో పరిపాలనలో వినూత్న మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే ఆ సమస్య నెల రోజుల్లో పరిష్కారం చూపి పథకాల లబ్ధి చేకూరుతుందన్నారు. చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా, జెడ్పీటీసీ అభ్యర్థి పోల్నాటి బాబ్జి, సర్పంచ్ యడ్లపల్లి దుర్గారావు, మండల పార్టీ అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు, పట్టణ పార్టీ అధ్యక్షులు పీపీఎన్ చంద్రరావు, ఏలూరు పార్లమెంటరీ జిల్లా కార్యదర్శి చిలుకూరి జ్ఞానారెడ్డి, విజయ హాస్పటల్స్ ఐకేర్ వైద్యులు విజయభాస్కరరెడ్డి, మున్సిపల్ చైర్మన్ బత్తిన నాగలక్ష్మి పాల్గొన్నారు. -
బాబు దొంగ దీక్షలను ప్రజలు నమ్మరు
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు దొంగ దీక్షలను ప్రజలు నమ్మే పరిస్థితిలేదని.. ఆయన రోజురోజుకీ దిగజారిపోతున్నారని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని దుయ్యబట్టారు. మంగళవారం ఆయన చేపట్టిన 3 గంటల దీక్షతో ఏం సాధించారని ప్రశ్నించారు. చంద్రబాబులా సీఎం జగన్ ఎప్పుడూ దొంగ దీక్షలు చేయలేదన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంపై తప్పుడు విమర్శలకే బాబు పరిమితమయ్యారని.. అధికారంలో ఉన్నప్పుడు నవనిర్మాణ దీక్షల పేరిట ప్రజలను నయవంచన చేశారని విమర్శించారు. సాధారణంగా ఎవరైనా దీక్ష చేస్తే షుగర్ లెవెల్స్ తగ్గుతాయని.. కానీ, బాబుకు పెరుగుతూనే ఉంటాయని ఆళ్ల నాని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తిని దీక్షకు కూర్చున్నారు.. ఆ తర్వాత అది అరిగే వరకు సీఎంను విమర్శించారని వ్యాఖ్యానించారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే.. కరోనా నియంత్రణలో ఏపీ ఆదర్శం రాష్ట్రంలో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. కరోనా నియంత్రణ చర్యల్లో ఏపీ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఐసీఎంఆర్ ప్రొటోకాల్స్ తెలియకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారు. కరోనా నివారణ చర్యలపై ప్రధాని ప్రశంసలు బాబుకు కనిపించవా? మూడో దశ కరోనాపై ఇప్పటికే సీఎం జగన్ అందరినీ సన్నద్ధం చేశారు. ఏపీలో కరోనాతో కేవలం 12,700 మాత్రమే మృతిచెందడంపై చంద్రబాబు నిరాశ చెందుతున్నట్లుగా ఉంది. ప్రజలు కష్టాల్లో ఉంటే బాబు, లోకేష్లు హైదరాబాద్లో దాక్కుని రాష్ట్రంపై రాళ్లు వేస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారు. రాధాకృష్ణ రాతలు దారుణం బాధ్యత గల పత్రికాధినేత రాధాకృష్ణ తన వార్తలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. సీఎం జగన్ను ఏదో విధంగా గద్దె దించి చంద్రబాబును సీఎం చేయాలన్న ఆలోచనతో సీఎంని చులకన చేస్తూ రాధాకృష్ణ దారుణమైన కల్పిత, నీచమైన తప్పుడు రాతలు రాస్తున్నారు. ఆయన ప్రతీరోజూ రాత్రి దెయ్యాలు, భూతాలు, రాక్షస మనస్తత్వం ఉన్న చంద్రబాబుతో చర్చిస్తారేమో.. అందుకే ఆ ప్రభావంతో జుగుప్సాకర రాతలు రాస్తున్నారు. కరోనాపై సీఎంతో జరిగే సమీక్షల్లో తనతోపాటు ఎంతోమంది అధికారులు, మంత్రులు పాల్గొంటారు. రాధాకృష్ణ రాసిన వ్యాఖ్యలను సీఎం జగన్ ఎప్పుడూ అనలేదు. ప్రజల ప్రాణాలతో బాబు చెలగాటం.. చంద్రబాబు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. శవ రాజకీయాలు చేస్తున్నారు. బాబు హయాంలో ఎవరికీ రూ.5 లక్షలకు మించి పరిహారం ఇవ్వలేదు. అదే సీఎం జగన్ ఎల్జీ పాలిమర్స్ బాధితులకు రూ. కోటి పరిహారం ఇచ్చారు. ప్రకాశం జిల్లాలో ఓ డాక్టర్ వైద్యానికి అవసరమయ్యే రూ.1.50 కోట్లను సీఎం జగన్ మంజూరు చేశారు. కరోనా బాధిత కుటుంబాలకు నష్టపరిహారం డిమాండ్ చేసే హక్కు చంద్రబాబుకు లేదు. గోదావరి పుష్కరాల్లో 29మంది చనిపోతే ఆయనేం చేశారు? కోవిడ్ ఆస్పత్రుల్లో ప్రస్తుతం 130 టన్నుల ఆక్సిజన్ మాత్రమే అవసరమవుతోంది. అలాగే, వాటిల్లో 75 శాతం బెడ్లు ఖాళీగా ఉన్నాయి. కరోనాతో చనిపోయిన వారి వివరాలను పబ్లిక్ డొమైన్లో పెట్టాం.. చంద్రబాబు వాటిని చూసుకోవచ్చు. -
చంద్రబాబు దొంగ దీక్షలను ప్రజలు నమ్మరు: ఆళ్ల నాని
-
చంద్రబాబు దొంగ దీక్షలను ప్రజలు నమ్మరు: ఆళ్ల నాని
సాక్షి, అమరావతి: చంద్రబాబు రోజురోజుకు దిగజారిపోతున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు దొంగ దీక్షలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కరోనా పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని.. చంద్రబాబు, లోకేష్ మాత్రం జూమ్లో కాలక్షేపం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. కరోనా నివారణ చర్యల్లో ఏపీ ప్రభుత్వం.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఐసీఎంఆర్ ప్రొటోకాల్స్ తెలియకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ‘సీఎం జగన్పై బురద జల్లేందుకే చంద్రబాబు కుట్రలు’ అంటూ మంత్రి ఆళ్ల నాని నిప్పులు చెరిగారు. చదవండి: ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కన్నబాబు దేశంలో ఎక్కడా లేని విధంగా.. ‘నాడు-నేడు’కు 11 వేల కోట్లు -
థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం : ఆళ్ల నాని
-
పకడ్బందీ ప్రణాళికతో కరోనాకు చెక్
సాక్షి, అమరావతి: భవిష్యత్తులో కరోనాకు చెక్ పెట్టేందుకు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తామని.. ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా అధిగమించేలా ఏర్పాట్లుచేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అధికారులను ఆదేశించారు. థర్డ్ వేవ్ వార్తలు వస్తున్న నేపథ్యంలో చిన్నారులకు మెరుగైన వైద్యం అందించేందుకు పీడియాట్రిక్ విభాగంలో మౌలిక వసతులు ఏర్పా టు.. చిన్న పిల్లల వైద్యులను నియమించుకోవాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రులను పరిశీలించి అవసరమైన ఏర్పాట్లుచేయాలన్నారు. కోవిడ్ నియంత్రణకు ఏర్పాటైన మంత్రులతో కూడిన కమిటీ ఏపీఐఐసీ భవనంలో మంగళవారం సమావేశమైంది. మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, సీదిరి అప్పలరాజు, కురసాల కన్నబాబుతో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆరోగ్య శాఖ అధి కారులు ఇందులో పాల్గొన్నారు. జనావాసాలకు దగ్గర్లో హెల్త్ హబ్లు ఏరియా ఆస్పత్రి మొదలుకుని బోధనాçస్పత్రి వరకూ చిన్నారులకు వైద్యమందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆళ్ల నాని సూచిం చారు. పేదలందరికీ ఆరోగ్యశ్రీ కిందనే వైద్యం అందేలా చూడాలని, జనావాసాలకు సమీపంలో హెల్త్ హబ్లను ఏర్పాటుచేయాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయమని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే, రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని, ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులు ఇబ్బంది పడకుండా వ్యాక్సిన్ వేసే ముందురోజే వారికి టోకెన్లు జారీచేయాలన్నారు. -
థర్డ్వేవ్ హెచ్చరికలు: ఏపీ సర్కార్ ముందస్తు ప్రణాళిక
సాక్షి, అమరావతి: థర్డ్వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసింది. పీడియాట్రిక్ అంశాల్లో వైద్య సిబ్బందికి శిక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కోవిడ్ నివారణపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అధ్యక్షతన మంగళవారం కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కురసాల కన్నబాబు, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్టారెడ్డి, డాక్టర్ సిదిరి అప్పలరాజు, పలువురు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ, చిన్నారులకు వైద్యం కోసం అదనంగా వైద్యులు, సిబ్బందిని నియమించాలని, జనావాసాలకు దగ్గరగా హెల్త్ హబ్లు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారని తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో చిన్నారులకు వైద్యం కోసం చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా హాస్పిటల్స్ను పరిశీలించాలన్నారు. చిన్నారులకు అవసరమైన చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. థర్డ్వేవ్లో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు వ్యాక్సినేషన్ ముమ్మరం చేయాలని, అర్హులైన తల్లులకు ఒక రోజు ముందుగానే టోకెన్లు పంపిణీ చేయాలని తెలిపారు. బ్లాక్ ఫంగ్ సోకిన వారికి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశించారు. ఇంజక్షన్లు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఆళ్ల నాని హెచ్చరించారు. చదవండి: ‘ఆ భూములను చంద్రబాబు పప్పుబెల్లాల్లా పంచాడు’ ‘ఇమేజ్ పెంచుకోవడానికి అడ్డదారులుండవు బాబు’ -
పోలవరం పులకింత
సాక్షి, అమరావతి, పోలవరం రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం పనుల్లో శుక్రవారం మరో కీలక ఘట్టాన్ని పూర్తి చేసింది. గోదావరి వరద ప్రవాహాన్ని అప్రోచ్ చానల్ ద్వారా స్పిల్వే మీదుగా వర్చువల్ విధానంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రి పేర్ని నానిలతో కలిసి జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్, ఆ శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు మళ్లించారు. స్పిల్ వే రివర్ స్లూయిజ్ గేట్ల ద్వారా సుమారు పది వేల క్యూసెక్కుల ప్రవాహం స్పిల్ చానల్, పైలట్ చానల్ల మీదుగా నదిలో కలిసి ధవళేశ్వరం బ్యారేజీ వైపు పరవళ్లు తొక్కుతోంది. స్పిల్ వే మీదుగా వరద మళ్లింపు దిగ్విజయంగా పూర్తి చేయడంతో ఈనెల 15 నుంచి గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేసేందుకు జలవనరుల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. రికార్డు వేగంతో స్పిల్ వే పూర్తి.. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదించిన డిజైన్ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం రామయ్యపేట వద్ద 194.6 టీఎంసీల సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టును ప్రభుత్వం నిర్మిస్తోంది. గోదావరి గర్భంలో ఇసుక తిన్నెల 2,454 మీటర్ల పొడవున నీటిని నిల్వ చేసే ప్రధాన డ్యామ్(ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్)ను నిర్మించి ప్రవాహాన్ని దిగువకు విడుదల చేయడానికి నదికి 1128.4 మీటర్ల పొడవున స్పిల్ వే నిర్మాణాన్ని చేపట్టారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ స్పిల్ వేను రికార్డు సమయంలో పూర్తి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్ గురువారం ప్రశంసించారు. ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేసే లక్ష్యంతో ఈసీఆర్ఎఫ్ నిర్మాణానికి వీలుగా గోదావరి ప్రవాహాన్ని మళ్లించేందుకు చేపట్టిన ఎగువ కాఫర్ డ్యామ్ ఖాళీలను ఇటీవల భర్తీ చేశారు. కాఫర్ డ్యామ్ రీచ్–1లో 28, రీచ్–2లో 38, రీచ్–3లో 28, రీచ్–4లో 35 మీటర్ల ఎత్తుకు కాఫర్ డ్యామ్ను పూర్తి చేశారు. ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించేందుకు నది నుంచి 2.18 కి.మీ. పొడవున అప్రోచ్ ఛానల్ను తవ్వారు. ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తు పెరగడంతో నదిలో నీటి మట్టం 23.8 మీటర్లకు చేరింది. సకాలంలో గోదావరి డెల్టాకు నీరు.. అప్రోచ్ ఛానల్ పనులు కొలిక్కి రావడంతో శుక్రవారం మంత్రులు వర్చువల్ విధానంలో పర్యవేక్షిస్తుండగా నదీ ప్రవాహాన్ని స్పిల్ వే వైపు మళ్లించారు. ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, సీఈ కె.సుధాకర్బాబు, ఎస్ఈ కె.నరసింహమూర్తి, మేఘ ఇంజనీరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్, జీఎంలు ముద్దుకృష్ణ, దేవ్మణి మిశ్రాలు గోదారమ్మకు పసుపు, కుంకుమ, పూలు, పట్టువస్త్రాలను సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. స్పిల్ వే రివర్ స్లూయిజ్ గేట్ల ద్వారా సుమారు పది వేల క్యూసెక్కులు 4.42 కి.మీ.ల పొడవున స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్ మీదుగా గోదావరిలో కలుస్తున్నాయి. ఈ ప్రవాహం ధవళేశ్వరం బ్యారేజీ వైపు పోటెత్తుతుండటంతో సకాలంలో గోదావరి డెల్టాకు నీటి విడుదలకు మార్గం సుగమమైంది. ఈనెల 15 నుంచి డెల్టాకు నీటిని విడుదల చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. గోదావరిలో నీటి మట్టం 25 మీటర్ల కంటే ఎక్కువ స్థాయికి చేరితే పోలవరం స్పిల్ వే గేట్ల ద్వారా ప్రవాహం దిగువకు చేరేలా ఇప్పటికే గేట్లను ఎత్తివేశారు. అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్తో కలసి మొత్తం 6.6 కి.మీ. పొడవున గోదావరి వరదను మళ్లించినట్లు స్పష్టమవుతోంది. దేశంలో ఇంత పొడవున వరద మళ్లించిన దాఖలాలు ఇప్పటిదాకా లేవని అధికారులు చెబుతున్నారు. రికార్డు సమయంలో స్పిల్ వే పూర్తి.. పోలవరం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే టీడీపీ సర్కార్ పాల్పడిన అక్రమాలను ప్రక్షాళన చేసి రివర్స్ టెండరింగ్ ద్వారా ఖజానాకు రూ.838 కోట్లను ఆదా చేశారు. ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయడానికి కార్యాచరణ రూపొందించి అమలును పర్యవేక్షిస్తున్నారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ, గత ఏడాది వరద ఉద్ధృతిలోనూ స్పిల్ వే పనులు కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. దీనివల్లే పోలవరం స్పిల్ వే రికార్డు సమయంలో పూర్తయింది. షెడ్యూల్ ప్రకారం ఈ సీజన్లో చేయాల్సిన పనులను పూర్తి చేసి స్పిల్ వే మీదుగా వరదను మళ్లించారు. నెలాఖరునాటికి ఎగువ కాఫర్ డ్యామ్ను 38 మీటర్లకు, జూలై ఆఖరుకు 42.5 మీటర్ల ఎత్తుకు పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. స్పిల్ వే ఇప్పటికే పూర్తవడంతో గోదావరికి ఎంత వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేయడానికి మార్గం సుగమం చేశారు. దీంతో వరదల్లోనూ ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్ల మధ్య ఈసీఆర్ఎఫ్ పనులు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. సీఎం సంకల్ప బలంతో సాకారం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్ప బలంతో ఈ మహత్తర కార్యం సాకారమైందని ఈఎన్సీ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో లోపభూయిష్టంగా చేపట్టిన పనుల వల్ల మెయిన్ డ్యామ్ ఫౌండేషన్కు కొంత నష్టం వాటిల్లిందన్నారు. ప్రస్తుతం 23 టీఎంసీల నిల్వ ఉందన్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్కు గ్రావిటీ ద్వారా నీటి విడుదలకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రాజెక్టు వద్ద నీటి విడుదల కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు బుగ్గా మురళీకృష్ణ, ప్రాజెక్టు ఈఈ మల్లికార్జునరావు, ఆదిరెడ్డి, బాలకృష్ణమూర్తి, మేఘ ఇంజనీరింగ్ సంస్థ సీజీఎం రవీంద్రరెడ్డి, ఏజీఎం రాజేష్, డీజీఎం శ్యామలరావు, మేనేజర్ మురళి తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ ప్రభుత్వంతో జూనియర్ డాక్టర్ల చర్చలు సఫలం
-
ఏపీ: ప్రభుత్వంతో జూనియర్ డాక్టర్ల చర్చలు సఫలం
సాక్షి, విజయవాడ: ప్రభుత్వంతో జూనియర్ డాక్టర్ల చర్చలు సఫలమయ్యాయి. సమ్మె విరమిస్తున్నట్టు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. జూనియర్ డాక్టర్లతో రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని, ముఖ్య కార్యదర్శి చర్చలు జరిపారు. డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు తెలిపారు. చదవండి: సీఎం జగన్ను కలిసిన ‘డీఎస్సీ-2008’ అభ్యర్థులు వైఎస్ఆర్ బీమాపై సమీక్ష: సీఎం జగన్ కీలక నిర్ణయాలు -
హెల్ప్డెస్క్ల పనితీరుపై మంత్రి ఆళ్ల నాని ఆరా
సాక్షి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలోని కోవిడ్ ఆస్పత్రుల్లో హెల్ప్డెస్క్ల పనితీరుపై డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. డీఎంహెచ్వో, డీసీహెచ్ఎస్ సూపరింటెండెంట్లతో ఆళ్ల నాని ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐసీయూ, నాన్ ఐసీయూ బెడ్స్ ఆధారంగా ఆక్సిజన్ సదుపాయం ఉండాలని మంత్రి ఆదేశించారు. ప్రత్యామ్నాయంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను వాడుకోవాలని సూచించారు. బ్లాక్ ఫంగస్ పేషెంట్లకు అవసరమైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. చదవండి: వలపు వల.. బెజవాడలో మాయలేడీ మోసాలు ప్రతి ప్రభుత్వ ఆస్పత్రికి 10 ఐసీయూ బెడ్లు -
నెల్లూరు జీజీహెచ్ ఘటనపై ప్రభుత్వం సీరియస్
-
నెల్లూరు జీజీహెచ్ ఘటనపై ప్రభుత్వం సీరియస్
సాక్షి, అమరావతి : నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ లైంగిక వేధింపుల ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. సీనియర్ వైద్యులతో త్రిసభ్య కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. సూపరింటెండెంట్ లైంగిక వేధింపుల ఆరోణలపై విచారణ జరిపి..సాయంత్రానికల్లా పూర్తి నివేదిక ఇవ్వాలని మంత్రి ఆళ్లనాని ఆదేశించారు. తప్పు చేసిన వారికి కఠిన చర్యలు:నెల్లూరు ఇంచార్జి కలెక్టర్ హరే౦దిర ప్రసాద్ నెల్లూరు : జీజీహెచ్ ఘటనపై రెండు కమిటీలు విచారణ చేపడుతున్నాయి. ఒకటి డీఎంఈ తరపున ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సాంబశివరావు నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన కమిటీ.. మరొకటి జిల్లా తరపున ఇండిపెండెంట్ కమిటీ. జిల్లా కమిటీలో జెడ్పీ సీఈవో , ఐసీడీఎస్ పీడీ, జాయింట్ కలెక్టర్ (ఆసరా)తో త్రిసభ్యులు ఉంటారు. డీఎంఈ తరపు కమిటీ ఇంటర్నల్గా ఎంక్వైరీ చేస్తే.. డిస్ట్రిక్ట్ కమిటీ బయటనుంచి ఎంక్వైరీ చేస్తుంది. ఇప్పటివరకు ఈ ఘటనపై ఎలాంటి కంప్లైంట్ లేదు. ఇది సీరియస్ ఇష్యూ కాబట్టి డీఎంఈ కమిటీ కానీ, డిస్ట్రిక్ట్ కమిటీ కానీ దీన్ని సుమోటోగా తీసుకుంటుంది. 24 గంటల్లో డిస్ట్రిక్ట్ కమిటీ ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ వస్తుంది. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత తప్పు చేసిన వారికి కఠిన చర్యలు తప్పవు. -
'కోవిడ్తో అనాథలైన పిల్లలకు ఆర్థిక సాయం అందాలి'
సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలో కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం క్యాంప్ కార్యాలయంలో సమీక్షా సమావేశం చేపట్టారు. కరోనా నివారణకు సంబంధించి ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్ అదిత్యానాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ''కోవిడ్ ఆస్పత్రుల్లో రోగులకు ఏలోటూ లేకుండా చూడాలి. ఆరోగ్యశ్రీ కింద ఎక్కువ మంది రోగులు చికిత్స పొందుతున్నారు. వారికి వైద్య సేవల్లో ఏ మాత్రం లోపం ఉండకూడదు. బ్లాక్ ఫంగస్ రోగులకు అవసరమైన ఇంజక్షన్లు..ఇతర మందులు ఎక్కడ అందుబాటులో ఉన్నా సేకరించాలి. కోవిడ్తో అనాథలైన పిల్లలకు ప్రతి నెలా ఆర్థిక సాయం అందాలి. వారికి ప్రభుత్వం ఇస్తున్న రూ.10 లక్షలను వీలైనంత వరకు ఎక్కువ ఆదాయం వచ్చే చోట డిపాజిట్ చేయాలి'' అని తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు తగ్గుతున్నాయి అనంతరం రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ కేసులు తగ్గుతున్నాయని సీఎం జగన్కు అధికారులు వివరించారు. గత నెల 16న పాజిటివిటి రేటు 25.56 శాతంగా ఉంటే.. ప్రస్తుతం 13.02 శాతానికి తగ్గిందన్నారు. ఏపీలో యాక్టివ్ కేసులు మే 17న 2.11 లక్షలు ఉంటే.. జూన్ ప్రారంభం నాటికి 1.43 లక్షలు ఉందని తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్ సమస్యలు ఎదుర్కొంటున్నవారి సంఖ్య కూడా తగ్గిందని.. ఐసీయూ బెడ్స్ మే 15న కేవలం 380 ఖాళీగా ఉంటే .. జూన్ 2 వరకు చూసుకుంటే 1,582 అందుబాటులో ఉన్నాయన్నారు. 7 వారాల డేటాను పరిశీలిస్తే అన్ని జిల్లాల్లో కరోనా కేసులు తగ్గాయన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లలోనూ రోగులు తగ్గారు.. ప్రస్తుతం 14,057 మంది రోగులు మాత్రమే ఉన్నారని తెలిపారు. ఏపీలో మొత్తం 557 కోవిడ్ ఆస్పత్రుల్లో 45,324 బెడ్లు ఉన్నాయన్నారు. వాటిలో 25,220 బెడ్లు ఆక్యుపైడ్గా ఉన్నాయని.. ఆక్యుపైడ్ బెడ్లలో 20,073 బెడ్లు ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్నారని వివరించారు. ఏపీ వ్యాప్తంగా ఇప్పటి వరకు 51,03,821 మందికి తొలి డోస్ వేశామని.. మొత్తంగా 25,47,784 మందికి రెండు డోస్లు ఇచ్చామని తెలిపారు. నెలకు సంబంధించి కేంద్రం మొత్తం 36,94,210 వాక్సిన్లు కేటాయించగా.. ఇప్పటి వరకు 5,08,710 వ్యాక్సిన్లు పంపిణీ చేశామని.. ఇంకా 20,74,730 వాక్సిన్లు సేకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. చదవండి: ఏపీలో కొత్తగా 11,421 కరోనా కేసులు -
సర్పంచులు, వార్డు సభ్యులందరికీ తక్షణమే వ్యాక్సిన్ ఇవ్వాలి
సాక్షి, అమరావతి: గ్రామాల్లో కరోనా కట్టడితో పాటు పారిశుధ్య పనుల నిర్వహణకు ఉద్దేశించిన ‘జగనన్న స్వచ్ఛ సంకల్ప’ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న గ్రామ సర్పంచులు, వార్డు సభ్యులను ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించడంతో పాటు వయసుతో నిమిత్తం లేకుండా వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కోరుతూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి లేఖ రాశారు. ఈ సీజన్లో డయేరియా కేసులు తగ్గాయి కాగా, ఏటా ఈ సీజన్లో గ్రామీణ ప్రాంతాల్లో డయేరియా కేసులు ఎక్కువగా నమోదవుతుంటాయని, కానీ సర్పంచుల ఆధ్వర్యంలో జరుగుతున్న పారిశుధ్య కార్యక్రమాల కారణంగా ఇప్పుడు గ్రామాల్లో ఇలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదని మంత్రి పెద్దిరెడ్డి మరో ప్రకటనలో పేర్కొన్నారు. 30 గ్రామ పంచాయతీల్లో కరోనా అనేది లేదని, ముందుముందు అనేక గ్రామాలు కరోనా రహిత గ్రామాలుగా మారాలని మంత్రి ఆకాంక్షించారు. -
ఏపీ: కరోనా పరిస్థితులపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ
సాక్షి, విజయవాడ: కరోనా పరిస్థితులపై కేబినెట్ సబ్కమిటీ సమావేశమైంది. డిప్యూటీ సీఎం ఆళ్లనాని అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. కరోనా కట్టడి, బ్లాక్ ఫంగస్, ఆక్సిజన్ సరఫరాపై చర్చ జరపడంతో పాటు, బ్లాక్ఫంగస్ మందులు, ఇంజక్షన్ల కొరత లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ సబ్ కమిటీ చర్చ చేపట్టింది. సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు హాజరయ్యారు. చదవండి: ఆనందయ్య మందుపై కేంద్రం అభిప్రాయం ఏంటో?: ఏపీ హైకోర్టు అర్చకులపై ఏపీ సర్కార్ వరాల జల్లు.. -
Photo Feature: ఎక్కడికక్కడ కట్టడి.. ఉక్కిరిబిక్కిరి
తెలంగాణ పోలీసులు లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నారు. డీజీపీ మహేందర్రెడ్డి లాక్డౌన్ అమలు తీరును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కరోనా కాలంలో సామాన్యులకు కష్టాలు తప్పడం లేదు. అన్ని ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లో ఉండటంతో జనం సతమతమవుతున్నారు. మరోవైపు కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఢిల్లీలో ఆందోళన కొనసాగిస్తున్నాయి. -
ఆనందయ్య మందుపై అపోహలొద్దు
-
ఆనందయ్య మందుపై అపోహలొద్దు: ఆళ్ల నాని
సాక్షి, పశ్చిమ గోదావరి: రాష్ట్రంలో బెడ్ల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జర్మన్ షెడ్ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో 30 బెడ్లను ఏర్పాటు చేసి, ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ కూడా అందుబాటులో ఉంచామని ఆళ్ల నాని పేర్కొన్నారు. ఆనందయ్య మందు.. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు.. నాలుగు రోజుల క్రితం సీఎం జగన్ అధ్యక్షతన ఆనందయ్య మందుపై చర్చించామని, ఇప్పటికే కమిటీ వేసి పూర్తి స్థాయిలో అధ్యయనం జరుగుతోందని మంత్రి తెలిపారు. పూర్తి స్థాయిలో నివేదిక వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఆనందయ్య మందుపై ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని.. ఎలాంటి అపోహలు వద్దని ప్రజలకు మంత్రి సూచించారు. టీడీపీ నేతలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని.. టీడీపీ నేతల తీరుపై ప్రజలు అసహ్యించుకుంటున్నారని మంత్రి ఆళ్ల నాని మండిపడ్డారు. చదవండి: అంతేనా లోకేష్.. టీడీపీ నేతల ప్రాణాలకు విలువే లేదా! ‘పచ్చ’పేకలో ఖాకీ: ఎస్పీ జోక్యంతో బట్టబయలు -
వ్యాక్సిన్ల కొనుగోలుకు రూ.50 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వ్యాక్సినేషన్ను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాల కొనుగోలుకు సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ కంపెనీలకు రూ.50 కోట్లకుపైగా చెల్లించాలని ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్ఐడీసీ)ను ఆదేశించినట్లు తెలిపారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ కోవిïÙల్డ్ ఒక డోస్ రూ.300, టాక్స్ 5 శాతంతో కలిపి రూ.315, కోవాగ్జిన్ ఒక డోస్ రూ.400, టాక్స్ 5 శాతంతో కలిపి రూ.415 వంతున చెల్లించనున్నట్లు వివరించారు. -
ప్రతి బోధనాస్పత్రిలో 3 కిలోలీటర్ల ఆక్సిజన్ ప్లాంట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి బోధనాస్పత్రిలో 3 కిలోలీటర్ల (3 వేల లీటర్ల) ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అధికారులను ఆదేశించారు. ఆయన మంగళవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 53 ఆస్పత్రుల్లో యుద్ధ ప్రాతిపదికన ఆక్సిజన్ పీఎస్ఏ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. తమిళనాడు, గుజరాత్, ఒడిశా మొదలైన రాష్ట్రాల నుంచి ఎప్పటికప్పుడు ఆక్సిజన్ను రాష్ట్రానికి తీసుకొచ్చి కరోనా బాధితులకు ప్రాణనష్టం లేకుండా చేస్తున్నామని చెప్పారు. కోవిడ్ బాధితులకు ఏమేరకు ఆక్సిజన్ అవసరముందో ముందస్తు అంచనాలు ఉంటే కావాల్సినంత తెప్పించుకోవచ్చన్నారు. రాష్ట్రంలో రానున్న రోజుల్లో కరోనా బాధితులకు ఆక్సిజన్ ఇబ్బంది లేకుండా 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తికి సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని తెలిపారు. కృష్ణపట్నం, శ్రీసిటీ, కడప స్టీల్ప్లాంట్, జిందాల్ స్టీల్ప్లాంట్లలో ఆక్సిజన్ స్టోరేజీలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. బ్లాక్ఫంగస్ కేసులకు కూడా ఆరోగ్యశ్రీలో ఉచితంగా వైద్యం అందించేందుకు సీఎం ఆదేశించారని చెప్పారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రోజుకు 910 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ అవసరం ఉంటుందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. సమావేశంలో కమాండ్ కంట్రోల్ చైర్మన్ డాక్టర్ జవహర్రెడ్డి, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఆక్సిజన్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలి: ఆళ్ల నాని
సాక్షి, అమరావతి: రానున్న రోజుల్లో ఆక్సిజన్ ఇబ్బంది లేకుండా కొత్తగా ప్లాంట్లు ఏర్పాటు, మరో 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. మంగళవారం ఆయన కోవిడ్ టాస్క్ఫోర్స్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆక్సిజన్ జనరేషన్, స్టోరేజ్ల పెంపుపై చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీచింగ్ ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ పీఎస్ఏ యూనిట్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బ్లాక్ ఫంగస్ కేసులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఈ సమావేశంలో ఏపీ కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ చైర్మన్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కాటంనేని భాస్కర్, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ విజయరామరాజు, స్టేట్ నోడల్ ఆఫీసర్ కృష్ణ బాబు పాల్గొన్నారు. చదవండి: అవాస్తవాలు నమ్మొద్దు: ఎ.కె.సింఘాల్ ఏపీ అసెంబ్లీ సమావేశాలు: మొహం చాటేసిన చంద్రబాబు -
ఆరోగ్య శ్రీలో బ్లాక్ ఫంగస్ చికిత్స: ఆళ్ల నాని
సాక్షి, విజయవాడ: కోవిడ్ నుంచి కోలుకున్న వారిని బ్లాక్ ఫంగస్ రూపంలో మరో సమస్య వేధిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దేశ వ్యాప్తంగా ఈ తరహా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సీఎం జగన్ ఆదేశించినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖమంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ.. ‘‘బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సీఎం జగన్ ఆదేశించారు. కోవిడ్తో తల్లిదండ్రులు చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని.. ఆ పిల్లలకు ఆర్థికసహాయంపై కార్యాచరణ రూపొందించాలని అధికారులకు తెలిపారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో పకడ్బందీగా ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నాం’’ అన్నారు. చదవండి: కరోనా వ్యాధిగ్రస్తులకు ఆరోగ్య శ్రీ పథకం సంజీవనీ -
బ్లాక్ ఫంగస్ కేసులు 9 నమోదయ్యాయి: ఆళ్ల నాని
-
విశాఖ విమ్స్ ను సందర్శించిన మంత్రి ఆళ్ల నాని
-
బురద చల్లడం చంద్రబాబుకు అలవాటే
సాక్షి, విశాఖపట్నం: కరోనా విపత్కర సమయంలో కూడా చంద్రబాబు ప్రజల కోసం ఆలోచన చేయకుండా.. ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మండిపడ్డారు. వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా బురద చల్లడం చంద్రబాబుకు అలవాటేనన్నారు. శనివారం విశాఖలోని విమ్స్లో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మేయర్ గొలగాని వెంకట హరికుమారితో కలిసి వైద్యాధికారులతో సమీçక్ష నిర్వహించారు. అనంతరం ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తూ ప్రజలకు సేవలందిస్తున్నా కూడా.. టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నిత్యం ప్రభుత్వంపై విమర్శలు చేసే చంద్రబాబు, అచ్చెన్నాయుడు, టీడీపీ నాయకులు.. కోవిడ్ రోగులకు సహాయం చేయడానికి ఎందుకు ముందుకు రావడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. చేతనైతే కరోనా బాధితులకు సహాయం చేయాలని.. లేదంటే హైదరాబాద్లోని అద్దాల మేడల్లో తలుపులేసుకుని ఉండాలని చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్కు మంత్రి ఆళ్ల నాని చురకలంటించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు సీఎం వైఎస్ జగన్ కృషి చేస్తుంటే.. దానిని కూడా అవహేళన చేస్తూ టీడీపీ నేతలు విమర్శలు చేయడం వారి వివేకానికే వదిలేస్తున్నామన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో 50 శాతం పడకలు కోవిడ్ పేషెంట్లకే.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో 50 శాతం పడకలు కోవిడ్ రోగుల వైద్యానికి కేటాయించడం తప్పనిసరి అని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. రెమ్డెసివిర్ ఇంజక్షన్లను బ్లాక్లో అమ్మేవారిపై.. రోగుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేసే ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. విశాఖలో కరోనా నియంత్రణకు వేగవంతమైన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారన్నారు. ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో మాట్లాడుతూ ఇక్కడి పరిస్థితిని తెలుసుకుంటున్నారని చెప్పారు. -
వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: ఆళ్ల నాని
సాక్షి, విశాఖపట్నం: కరోనా కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్పై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని శనివారం సమీక్ష నిర్వహించారు. కోవిడ్ ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. చికిత్స విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఆక్సిజన్ సరఫరాను వేగవంతం చేశామని ఆయన పేర్కొన్నారు. రేపటి నుంచి ఏపీకి అదనంగా 230 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రానుందని వెల్లడించారు. వ్యాక్సిన్ కేంద్రాల వద్ద రద్దీ లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆళ్లనాని తెలిపారు. చదవండి: ఆక్సిజన్ సేకరణ, పంపిణీలో ఏపీ పురోగతి ఏపీ: ఆలయాల్లో ప్రభుత్వ కోవిడ్ కేర్ సెంటర్లు -
ఆదర్శం.. ‘ప్రగతి భారత్’ కోవిడ్ కేర్ సెంటర్
సాక్షి, విశాఖపట్నం: ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖలో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన 300 పడకల కోవిడ్ కేర్ సెంటర్ రాష్ట్రానికే ఆదర్శమని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అన్నారు. షీలానగర్లోని వికాస్ కళాశాలలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ను శుక్రవారం వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, మంత్రులు.. కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ.. కోవిడ్ కేర్ సెంటర్ కార్పొరేట్ ఆస్పత్రుల స్థాయిని మించి ఉందన్నారు. ఇందులోని మల్టీటైర్ (నాలుగంచెల) ఆక్సిజన్ సరఫరా విధానం రోగులకు పూర్తి భద్రత కల్పిస్తుందని చెప్పారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా అంతరాయం కలగదన్నారు. రాష్ట్రంలో అన్ని కోవిడ్ ఆస్పత్రులు ఈ విధానాన్ని పాటిస్తే విషాద ఘటనలకు ఆస్కారం ఉండదని తెలిపారు. ఇలాంటి కోవిడ్ కేర్ సెంటర్ల సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. దీన్ని ప్రగతి భారత్ ఫౌండేషన్ ఏర్పాటు చేసినప్పటికీ దీని నిర్వహణతోపాటు మౌలిక సదుపాయాలను ప్రభుత్వానికి అందజేయాలని నిర్ణయించడం అభినందనీయమన్నారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కోవిడ్ నియంత్రణలో ఏపీ ఎంతో మెరుగ్గా ఉందని స్పష్టం చేశారు. రోగులు ఇబ్బంది పడకూడదనే.. ప్రగతి భారత్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయాలకనుగుణంగా అత్యాధునిక సదుపాయాలతో, పూర్తి సాంకేతికతతో ఈ కోవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. ఆక్సిజన్ అందక రోగులు ఇబ్బంది పడకూడదనే దీన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. ఆక్సిజన్కు అంతరాయం లేకుండా ఒక్కొక్కటి 3,750 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో రెండు ఆక్సిజన్ ట్యాంకులు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ట్యాంకుల ద్వారా సరఫరాకు అంతరాయం ఏర్పడితే ఒక్కోటి 60 లీటర్ల సామర్థ్యం కలిగిన 200 ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచామన్నారు. వీటికి అంతరాయం ఏర్పడితే ఒక్కో రోగి బెడ్ వద్ద 47 లీటర్ల సామర్థ్యం కలిగిన 150 సిలిండర్లను అందుబాటులో ఉంచినట్టు పేర్కొన్నారు. పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
కోవిడ్ కేర్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి ఆళ్ల నాని
సాక్షి, విశాఖపట్నం: షీలానగర్లో కోవిడ్ కేర్ సెంటర్ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని శుక్రవారం ప్రారంభించారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో 300 ఆక్సిజన్ బెడ్లు కలిగిన కోవిడ్ కేర్ సెంటర్ను ఎంపీ విజయసాయిరెడ్డి ఏర్పాటు చేశారు. ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్, ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా కోవిడ్ కేర్ సెంటర్: మంత్రి ఆళ్ల నాని 30 మంది వైద్యులు, 90 మంది నర్సులతో ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశారని మంత్రి ఆళ్ల నాని అన్నారు. ప్రగతి భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గొప్ప కార్యక్రమం అని అభినందించారు. ప్రస్తుత పరిస్థితిలో ఆక్సిజన్ అవసరం చాలా ఉందని.. ఆక్సిజన్ సరఫరాకి సంబంధించి పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారు. ఆస్పత్రుల్లో జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదాలు జరగవన్నారు. ప్రతి బెడ్కు ఒక్కో సిలిండర్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. కోవిడ్ కేర్ సెంటర్.. అత్యున్నత ప్రమాణాలతో వైద్య సదుపాయాలు: ఎంపీ విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, ఎంత ఖర్చైనా వెనుకాడకుండా ప్రభుత్వం వైద్యం అందిస్తోందని.. అత్యున్నత ప్రమాణాలతో వైద్య సదుపాయాలు కల్పిస్తోందన్నారు. ఆక్సిజన్ వైఫల్యం వల్ల కోవిడ్ బాధితులు ఇబ్బంది పడకూడదన్నదే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రగతి భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోవిడ్ బాధితులకు పౌష్టికాహారం అందిస్తామని తెలిపారు. కోవిడ్ కేర్ సెంటర్లో పెషెంట్ల అటెండెన్స్ డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేశామన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లో అన్ని రక్షణ చర్యలు ఏర్పాటు చేశామని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. చదవండి: ఆటలే అస్త్రాలు: కరోనాతో ‘ఆడుకుంటున్నారు..’ YS Jagan: సీఎం జగన్ లేఖతోనే కదలిక -
వ్యాక్సిన్ కోసం ఎంత ఖర్చుకైనా సిద్ధమే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారని, ఉచితంగా వ్యాక్సిన్ వేయడానికి ఎన్ని కోట్లయినా వెచ్చించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. వ్యాక్సిన్పై ప్రతిపక్షాలు అవాస్తవాలు చెబుతూ, ప్రజల్లో భయాందోళనలను రేకెత్తిస్తున్నాయని, ఇది సరికాదని పేర్కొన్నారు. బుధవారం మంగళగిరిలో కోవిడ్ నియంత్రణపై మంత్రుల కమిటీ సమావేశం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకేరోజు 6 లక్షల టీకాలు వేసి వ్యాక్సినేషన్లో దేశానికే ఏపీ ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ఇది వ్యాక్సినేషన్పై సీఎం జగన్మోహన్రెడ్డి సన్నద్ధతకు నిదర్శనమన్నారు. వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాల్లో రద్దీ నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, రెండో డోస్ తీసుకునేవారికి వలంటీర్లు, ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారమిచ్చి రద్దీని నివారించామని చెప్పారు. ఆక్సిజన్ వృధా అరికట్టడానికి చర్యలు రాష్ట్రంలో ఆక్సిజన్ నిల్వల సామర్థ్యాన్ని 517 మెట్రిక్ టన్నుల నుంచి 600 మెట్రిక్ టన్నులకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆక్సిజన్ వృధాను అరికట్టడానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రుయా ఆస్పత్రి ఘటన దురదృష్టకరమని, ఇటువంటివి పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్కు 910 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ పంపాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎం జగన్మోహన్రెడ్డి లేఖ రాశారని చెప్పారు. రాష్ట్రంలో ఆక్సిజన్ నిల్వ సామర్థ్యం మరింత పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. రెమ్డెసివిర్ ఇంజక్షన్లు బ్లాక్మార్కెట్కు తరలకుండా అడ్డుకున్నామని, ఈ ఇంజక్షన్ల వినియోగంలో అక్రమాల నివారణకు టాస్్కఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేశామని చెప్పారు. రెమ్డెసివిర్ ఇంజక్షన్ల కొరత లేకుండా చూస్తున్నామన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లలో బెడ్ల సంఖ్య పెంచుతున్నామని, ఆ కేంద్రాల్లో కరోనా బాధితులకు పౌష్టికాహారం, అవసరమైన మందులు పంపిణీ చేయడంతోపాటు పారిశుధ్యంపైనా ప్రత్యేక దృష్టి సారించామని వివరించారు. హోం ఐసోలేషన్లో ఉన్న రోగులకు అవసరమైన కిట్లు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏపీ అంబులెన్సులను ఆపడం లేదు మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ ఏపీ నుంచి వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లే అంబులెన్సులను ఆపకుండా తెలంగాణ ప్రభుత్వంతో చర్చించినట్లు చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ సరిహద్దుల వద్ద ఏపీ అంబులెన్స్లను అడ్డుకోవడం లేదన్నారు. కరోనా నివారణకు ఒళ్లంతా ఆవు పేడ పూసుకోవాలని, ముక్కులో ఉల్లిరసం వేసుకోవాలని.. సూచిస్తూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. శాస్త్రీయమైన, నిపుణులు సూచించే పరిష్కారమార్గాలనే పాటించాలని సూచించారు. కరోనా లక్షణాలు గుర్తించిన వెంటనే వైద్యసేవలు పొందాలని కోరారు. -
వ్యాక్సినేషన్ ప్రక్రియ రాష్ట్ర పరిధిలోని కాదని బాబుకు తెలియదా?
-
తిరుపతి రుయా ఘటన బాధాకరం: మంత్రి ఆళ్ల నాని
సాక్షి, విజయవాడ: మంత్రి ఆళ్లనాని అధ్యక్షతన మంగళగిరి ఏపీఐఐసీ భవనంలో జరిగిన ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం మంత్రి ఆళ్లనాని మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆక్సిజన్, బెడ్స్, రెమిడెసివర్ అంశాలపై చర్చించాం. రుయా లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. ఆక్సిజన్ సరఫరాపై సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఆక్సిజన్ పైప్లైన్లను పరిశీలించాలని కలెక్టర్లను ఆదేశించాం. జిల్లాల్లో ఆక్సిజన్ బెడ్ల సంఖ్య పెంచాం. ఆక్సిజన్ వృథా కాకుండా ప్రతి జిల్లాలో మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేస్తాం. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా ఆక్సిజన్ మేనేజ్మెంట్ ఉండాలి. ఆక్సిజన్ కోటా పెంచాలని కేంద్రాన్ని కోరాం. రాష్ట్రంలో ఆక్సిజన్ అవసరాలపై ఇప్పటికే ప్రధానికి సీఎం లేఖ రాశారు. 910 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరముంటుందని విజ్ఞప్తి చేశారు. వ్యాక్సినేషన్పై గ్లోబల్ టెండర్లకు వెళ్తాం. వ్యాక్సినేషన్పై విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయి. ఏపీలో ఒకే రోజు 6 లక్షల డోసులు వేశాం. 6 కోట్ల మందికి వ్యాక్సిన్లు ఇవ్వాలని కేంద్రానికి లేఖలు కూడా రాశాం. ప్రజలందరికీ వ్యాక్సిన్ వేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలిపాం. వ్యాక్సినేషన్ ప్రక్రియ, ఆక్సిజన్ అంశం కేంద్రం చేతిలో ఉన్న అంశాలు.. వ్యాక్సినేషన్పై కేంద్రం సుప్రీంలో అఫిడవిట్ వేసింది చంద్రబాబుకు తెలియదా?.. క్లిష్ట పరిస్థితుల్లో కూడా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. తిరుపతి రుయా ఘటన బాధాకరం. కలెక్టర్ నివేదిక వచ్చిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’’ అని అన్నారు. కాగా, ఈ భేటీలో మంత్రులు మేకతోటి సుచరిత, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాధ్, కన్నబాబు పాల్గొన్నారు. -
అందుబాటులోకి మరిన్ని కోవిడ్ కేర్ సెంటర్లు
తిరుపతి తుడా: కరోనా సెకండ్ వేవ్ను దీటుగా ఎదుర్కొంటున్నామని.. ఆస్పత్రుల్లో ఆక్సిజన్, బెడ్స్ సమస్య లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా కోవిడ్ కేర్ సెంటర్లను కూడా పెంచుతున్నట్లు వెల్లడించారు. కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్పై శనివారం చిత్తూరు జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా బాధితులకు ఆక్సిజన్, బెడ్స్ కొరత రాకుండా ప్రణాళికలు సిద్ధం చేసి.. అమలు చేస్తున్నట్లు చెప్పారు. కోవిడ్ కేర్ సెంటర్లు పెంచుతున్నామని.. తద్వారా ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గడంతో పాటు తగినన్ని బెడ్స్ అందుబాటులో ఉంటాయన్నారు. కేంద్ర ప్రభుత్వం 500 టన్నుల ఆక్సిజన్ను రాష్ట్రానికి కేటాయించిందని.. అందులో నుంచే జిల్లాల వారీగా సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. 45 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా.. ఆ మేరకు సరఫరా కావడం లేదన్నారు. ఒక్క రోజులోనే 6 లక్షల డోస్లు పూర్తి చేసిన రాష్ట్రంగా ఏపీ నిలిచిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ప్రైవేటు కోవిడ్ ఆస్పత్రుల్లో 50 శాతం బెడ్స్ను ఆరోగ్యశ్రీకి కేటాయించాల్సిందేనని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారిని కట్టడి చేయాలంటే ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని.. సెకండ్ వేవ్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కర్ఫ్యూకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి.. భౌతిక దూరం పాటించాలని సూచించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డితో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
కరోనా నివారణ చర్యలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
ఒడిశా నుంచి 120 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్
కాకినాడ సిటీ: ఒడిశాలోని అంగూల్ నుంచి రాష్ట్రానికి 120 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను విమానాల ద్వారా తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని) తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర స్థాయిలో దాదాపు 25 శాతం మేర మెడికల్ ఆక్సిజన్ వృథా అవుతున్నట్లు తెలిసిందన్నారు. దీనిని అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆక్సిజన్ పైపుల మరమ్మతులకు రూ.30 కోట్లు కేటాయించామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ డివిజన్కు ఒక కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. వీటి వల్ల కోవిడ్ ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గుతుందన్నారు. ఫీజుల విషయంలో ఉల్లంఘనకు పాల్పడిన ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఏపీ: 24 గంటల్లోనే కోవిడ్ టెస్టుల ఫలితాలు
సాక్షి, అమరావతి: కోవిడ్ నిర్ధారణ పరీక్ష ఫలితాలను 24 గంటల్లోనే వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. హోం ఐసొలేషన్లో ఉన్న బాధితులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. గురువారం ఆయన వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆక్సిజన్ అవసరమైన సమయంలో ఆటంకాలు లేకుండా నిర్వహణ కోసం రూ.30 కోట్లు విడుదల చేయనున్నామని తెలిపారు. కరోనా బాధితుల నుంచి ఆస్పత్రుల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేయకుండా కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 3 గంటల్లోనే పడక ఇచ్చేలా చర్యలు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారీగా టెస్టుల సంఖ్య పెంచామని, పది రోజుల్లోనే 30 వేల నుంచి 80 వేలకు పెంచామన్నారు. హోం ఐసొలేషన్లో ఉండే బాధితులను రోజూ ఏఎన్ఎం.. ఆశా కార్యకర్తలు పర్యవేక్షించేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించామని చెప్పారు. 104ను బలోపేతం చేసి 3 గంటల్లోనే పడక ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తక్కువ స్థాయిలో లక్షణాలున్నవారికి కోవిడ్ కేర్సెంటర్లలో సేవలు అందిస్తామని వివరించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో సాధారణ సేవలకు రోజుకు రూ.3,250, తీవ్ర అనారోగ్యంగా ఉన్న వారికి రూ.10,380 ఫీజులను ప్రభుత్వ నిర్ణయించిందని, ప్రస్తుతం తీవ్ర అనారోగ్యం ఉన్నవారికి రూ.16 వేల వరకు పెంచుతున్నామన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లను భారీగా పెంచుతున్నామని వెల్లడించారు. కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్లో వెయ్యి పడకలతో ఆస్పత్రిని ఏర్పాటు చేసేందుకు యాజమాన్యం ముందుకొచ్చిందని ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్సింఘాల్ తెలిపారు. ఈ ఆస్పత్రిలో ఆక్సిజన్ సేవలు అందుతాయని, ఆక్సిజన్ సరఫరాకు మరిన్ని ట్యాంకర్లు వినియోగిస్తున్నామన్నారు. 15 అంశాలతో ముందుకెళ్లాలి: జవహర్రెడ్డి కోవిడ్ నియంత్రణకు 15 అంశాలతో ముందుకెళ్లాలని స్టేట్ కోవిడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ చైర్మన్ కేఎస్ జవహర్రెడ్డి ఆదేశించారు. ఆయన గురువారం అధికారులతో సమావేశం నిర్వహించారు. 104 కాల్సెంటర్, టెస్టులు పెంచడం, ఫలితాలు త్వరగా వెల్లడించడం, రోజూ ఒక నిపుణుడితో అవగాహన కల్పించడం వంటి అంశాలను ఆయన అధికారులకు సూచించారు. చదవండి: జాగ్రత్తలతోనే మనుగడ: సీఎం వైఎస్ జగన్ స్పష్టీకరణ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు: తిరుపతిలో వైఎస్సార్ సీపీదే హవా -
ఏపీలో కరోనా పరిస్థితులపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
ఆందోళన వద్దు.. ప్రభుత్వం అండగా ఉంది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్యం చూసుకునే బాధ్యత ఈ ప్రభుత్వానిదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇప్పటికే 37 వేల పడకలు సిద్ధం చేశామని తెలిపారు. కరోనా కట్టడిపై మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో బుధవారం మంత్రుల కమిటీ సమావేశమైంది. అనంతరం మంత్రి అప్పలరాజుతో కలిసి ఆళ్ల నాని మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కడా రెమ్డెసివిర్ ఇంజక్షన్ల కొరత లేదని చెప్పారు. కోవిడ్ కేర్ సెంటర్లు, ఆస్పత్రుల్లో అవసరాన్ని బట్టి పడకలు పెంచుతున్నట్లు చెప్పారు. కోవిడ్ కేర్ సెంటర్లలో నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించినట్లు తెలిపారు. 104 కాల్సెంటర్ను బలోపేతం చేశామని, దీనివల్ల ప్రతి ఒక్కరికీ సమస్య పరిష్కారం కావాలనేది సీఎం జగన్ ఆశయమన్నారు. కరోనా మేనేజ్మెంట్ పకడ్బందీగా జరుగుతోందన్నారు. బాధితులను తరలించడానికి 108 వాహనాలను వాడుకుంటున్నామన్నారు. ఇప్పటి వరకు 62 లక్షల మందికి వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. వ్యాక్సినేషన్కు గ్రామ, వార్డు సచివాలయం సిబ్బంది సేవల్ని ఉపయోగించుకుంటున్నట్లు చెప్పారు. ఒకేరోజు 6 లక్షలమందికి పైగా వ్యాక్సిన్ వేసిన ఘనత మన రాష్ట్రానిదేనని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి ఓవైపు ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు దిగజారి వ్యాఖ్యలు చేస్తున్నాడని విమర్శించారు. ఆయన వ్యాఖ్యలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని, ఆయన ప్రజల గురించి ఆలోచించే వారైతే 2019 ఎన్నికల్లో అంత ఘోర పరాభవం ఎదుర్కొనేవారు కాదని మంత్రి నాని పేర్కొన్నారు. మంత్రుల కమిటీ సమావేశంలో బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, సీదిరి అప్పలరాజు, బుగ్గన రాజేంద్రనాథ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఆక్సిజన్ అందుబాటులో ఉంది.. ఆందోళన చెందొద్దు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆళ్లనాని తెలిపారు. కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. కరోనా బాధితుల కోసం 37 వేల వరకు బెడ్స్ పెంచామని చెప్పారు. అవసరానికి తగ్గట్టు ఆక్సిజన్ను అందుబాటులో ఉంచినట్లు.. ఎవరూ ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చారు. అమరావతిలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెమిడెసివిర్ ఇంజక్షన్ల కొరత లేకుండా చూస్తామని చెప్పారు. ఇప్పటివరకు 62 లక్షల మందికిపైగా వ్యాక్సినేషన్ ఇచ్చామని వెల్లడించారు. చంద్రబాబు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు. సంక్షోభ సమయంలోనూ చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: నాలుగంటే నాలుగే రోజుల లాక్డౌన్: ఎక్కడంటే.. -
కరోనాపై ఏపీ ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉంది
-
యుద్ధప్రాతిపదికన ఆక్సిజన్ పునరుద్ధరణ
సాక్షి ప్రతినిధి, విజయనగరం/విజయనగరం ఫోర్ట్: విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రిలో పైప్లైన్ లీకై కోవిడ్ రోగులకు ఆక్సిజన్ సరఫరాలో ఏర్పడిన అంతరాయాన్ని అధికారులు యుద్ధప్రాతిపదికన సరిచేశారు. 17 మంది కోవిడ్ రోగులను హుటాహుటిన ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వెంటనే చికిత్స అందేలా చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. తమకు ఆక్సిజన్ అందడం లేదని కోవిడ్ రోగులు అక్కడి సిబ్బందికి చెప్పడంతో వారు ఉన్నతాధికారులకు తెలియజేశారు. దీంతో వెంటనే జిల్లా కలెక్టర్ ఎం.హరిజవహర్లాల్, జాయింట్ కలెక్టర్ ఆర్.మహేశ్కుమార్, కోవిడ్ ప్రత్యేకాధికారి సత్యనారాయణ కేంద్రాస్పత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అప్పటికప్పుడే మరమ్మతులు ఆస్పత్రిలో 2 వేల కిలోలీటర్ల సామర్థ్యం గల ఆక్సిజన్ ట్యాంక్ ఉంది. దీని పైప్లైన్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేయించి సరఫరాను పునరుద్ధరించింది. విశాఖ నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ తెప్పించి ట్యాంక్ను నిండా నింపారు. ప్రస్తుతం ఆక్సిజన్ సరఫరా పూర్తి స్థాయిలో జరుగుతోంది. ఘటన జరిగిన సమయంలో కేంద్రాస్పత్రిలో 290 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. కాగా, కోవిడ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ లీకై ఐదుగురు మరణించారని, కాసేపటికి 11 మంది మృతి చెందారని పలు చానళ్లు అత్యుత్సాహం చూపాయి. ప్రైవేటు ఆస్పత్రికి తరలించాం విషయం తెలియగానే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని దృష్టికి తీసుకువెళ్లాం. అవసరమైతే రోగులను విశాఖ తరలించాల్సిందిగా ఆయన సూచించారు. ఐసీయూలో ఉన్న వారిని విజయనగరంలోనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించాం. –పుష్పశ్రీవాణి, ఉప ముఖ్యమంత్రి సకాలంలో చర్యలు తీసుకున్నాం తెల్లవారుజామున 3.30 గంటలకు ఆక్సిజన్ సరఫరాలో సమస్య ఏర్పడిందని ఫోన్ రాగానే ఆస్పత్రికి చేరుకున్నాం. ప్రైవేటు ఆస్పత్రుల నుంచి బల్క్గా ఆక్సిజన్ సిలిండర్లు తెప్పించి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి ఆక్సిజన్ అందించాం. ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. – ఎం.హరిజవహర్లాల్, విజయనగరం జిల్లా కలెక్టర్ -
ఆక్సిజన్ కొరతపై కేంద్రానికి లేఖ
గుంటూరు వెస్ట్: రాష్ట్రంలో 390 టన్నుల ఆక్సిజన్ అవసరముండగా ప్రస్తుతం 360 టన్నులు అందుబాటులో ఉందని, డిమాండ్కు సరిపడా ఆక్సిజన్ సరఫరా కోసం కేంద్రానికి లేఖ రాశామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి, వైద్య సదుపాయం, తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం గుంటూరు కలెక్టరేట్లో హోంమంత్రి మేకతోటి సుచరిత, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నాని విలేకరులతో మాట్లాడుతూ.. ఆసుపత్రుల్లో 30 శాతం ఆక్సిజన్ వృథా జరుగుతోందని, ఈ వృథా అరికట్టడంపై వైద్యారోగ్య శాఖ అధికారులు దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెమ్డెసివిర్ ఇంజక్షన్ల కొరత లేదన్నారు. రాష్ట్రానికి 12 వేల డోస్ల ఇంజక్షన్లు వచ్చాయన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా కొరత లేకుండా చేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 40 పడకలున్న ఆసుపత్రులకు కోవిడ్ సెంటర్లుగా అనుమతులు మంజూరు చేస్తామన్నారు. 85 శాతానికి పైగా పాజిటివ్ రోగులు హోం ఐసోలేషన్లోనే చికిత్స పొందుతున్నారన్నారు. వారికి వైద్యులు నిరంతరం ఫోన్ ద్వారా సూచనలు, సలహాలు అందిస్తున్నారని చెప్పారు. అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేటు ఆసుపత్రులపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. విజయనగరం జిల్లాలో స్వల్ప ఇబ్బందిని ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ భూతద్దంలో చూపిస్తూ కనీస సామాజిక స్పృహ లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ.. ప్రభుత్వం విధిస్తున్న కోవిడ్ నిబంధనలను అందరూ తప్పక పాటించాలని కోరారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, జిల్లా కోవిడ్ ప్రత్యేకాధికారి ఉషారాణి, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, శాసన సభ్యులు మొహమ్మద్ ముస్తఫా, మద్దాళి గిరి పాల్గొన్నారు. -
కరోనా నివారణ చర్యలపై మంత్రి ఆళ్ల నాని సమీక్ష
-
ప్రభుత్వాస్పత్రుల్లో ‘రెమిడెసివర్’ కొరత లేదు: ఆళ్ల నాని
సాక్షి, గుంటూరు: ఆక్సిజన్ వృథా కాకుండా మెడికల్ ఆఫీసర్లు దృష్టి పెట్టాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. సోమవారం ఆయన కరోనా నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వాస్పత్రుల్లో రెమిడెసివర్ ఇంజక్షన్ల కొరత లేదని స్పష్టం చేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో రెమిడెసివర్ కొరత లేకుండా చూస్తామని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. 40 బెడ్స్ ఉన్న ఆస్పత్రులను కోవిడ్ సెంటర్లుగా అనుమతిస్తామని ఆయన వెల్లడించారు. ప్రైమరీ కాంటాక్ట్ అందరికీ పరీక్షలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. కోవిడ్ టెస్టుల ఫలితాలు 24 గంటల్లో వచ్చేలా చర్యలు చేపట్టామన్నారు. 104కు కాల్ చేసిన మూడు గంటల్లో బెడ్ కేటాయించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. ఆక్సిజన్ ఆడిటింగ్ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం ఆస్పత్రుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆక్సిజన్ ఆడిటింగ్ ప్రారంభించింది. ఆస్పత్రుల వారీగా సరఫరా అయ్యే ఆక్సిజన్ లెక్కలు తీయాలని నిర్ణయించింది. రోజువారీ వినియోగం, ఆక్సిజన్ పడకలపై ప్రభుత్వం ఆరా తీసింది. ఆస్పత్రిలో ఎన్ని ట్యాంకుల ఆక్సిజన్ వాడారనే దానిపై ఆడిటింగ్కు ఆదేశాలు జారీ చేసింది. రోజువారీ అవసరాలకు 330 టన్నుల ఆక్సిజన్ కావాలని.. ప్రస్తుతం 290 టన్నుల ఆక్సిజనే అందుబాటులో ఉందని వైద్యశాఖ తెలిపింది. ఆక్సిజన్ సరఫరా మెరుగుపరిచేందుకు ప్రత్యేక అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆక్సిజన్ సిలిండర్లు, నెట్రోజన్ ట్యాంకర్లను ప్రభుత్వం మార్పులు చేస్తోంది. రాష్ట్రంలోని 42 ఆక్సిజన్ ఫిల్లింగ్ స్టేషన్ల నుంచి ఆస్పత్రులకు సరఫరా జరుగుతుంది. ఆక్సిజన్ సరఫరాకు ఇప్పటికే ప్రభుత్వం జిల్లాస్థాయిలో జేసీకి బాధ్యతలు అప్పగించింది. భువనేశ్వర్, బళ్లారి, విశాఖ నుంచి రాష్ట్రానికి ఆక్సిజన్ సరఫరా జరుగుతుంది. సాంకేతిక లోపం వల్లే..: మంత్రి బొత్స విజయనగరం: మహారాజా ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా పునరుద్ధరించామని.. సాంకేతిక లోపం వల్లే సరఫరాలో అంతరాయం ఏర్పడిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో రెండు ప్లాంట్లు నిర్వీర్యంగా ఉన్నాయని.. పునరుద్ధరించేందుకు సీఎం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఒడిశా, కర్ణాటక నుంచి ఆక్సిజన్ రప్పిస్తున్నామని మంత్రి వెల్లడించారు. అందరికీ వ్యాక్సిన్ ఇచ్చేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి బొత్స పేర్కొన్నారు. చదవండి: ఏపీ: అందుబాటులో 33 వేల బెడ్స్: కృష్ణబాబు ఆక్సిజన్ అందక ఎవరూ చనిపోలేదు: విజయనగరం కలెక్టర్ -
ఇక రాష్ట్రంలో భారీగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు
సాక్షి, అమరావతి: కరోనా కట్టడిలో భాగంగా పరీక్షల సంఖ్యను భారీగా పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షల కోసం 113 మంది సాంకేతిక సిబ్బంది నియామకానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలతోపాటు రెండు ప్రైవేటు కాలేజీల్లో ఉన్న వీఆర్డీఎల్ కేంద్రాల్లో ఎక్కువ కరోనా పరీక్షలు నిర్వహించడమే కాకుండా రిపోర్టులను వేగంగా అందించడం కోసం వీరిని ఆరు నెలల కాలానికి తీసుకోనున్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని.. ప్రతి వీఆర్డీఎల్ కేంద్రంలో కరోనా పరీక్షలు నిర్వహించడానికి ఒక రీసెర్చ్ సైంటిస్ట్, రీసెర్చ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ ఉంటారని పేర్కొంది. ఇప్పటివరకు కరోనా పరీక్షల కోసం మొత్తం 533 మంది సిబ్బందిని తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 40 వేలకు పైబడి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారని, కొత్త సిబ్బంది రాకతో ఈ సంఖ్య 60 వేలు దాటుతుందని ఆళ్ల నాని తెలిపారు. మరో మూడు రోజుల్లో ట్రూనాట్ పరీక్షలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలతోపాటు ఏలూరు ఆశ్రం మెడికల్ కాలేజీ, విజయనగరం మహారాజా మెడికల్ కాలేజీల్లో కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. -
ఏపీలో ఉచితంగా వ్యాక్సిన్
సాక్షి, అమరావతి: కరోనా కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో 18 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. మే 1 నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఖర్చుతోనే ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 18-45 ఏళ్ల మధ్య వారు సుమారు 2,04,70,364 మంది ఉన్నారు. వీరందరికి ఏపీ సర్కార్ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనుంది. ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. ‘‘కరోనా కట్టడిపై సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన విస్తృతంగా చర్చించాము. ప్రజల భాగస్వామ్యంతో పాటు వాక్సినేషన్ ముఖ్యమని సీఎం చెప్పారు. రాష్ట్రంలో వాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా అమలు చేస్తున్నాం. 18-45 వయసు ఉన్న వారికి ఉచితంగా టీకా వేస్తాం. ఇందుకు గాను 1600 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నాం. అలానే కరోనా కట్టడి కోసం రేపటి నుంచి రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుంది’’ అని మంత్రి తెలిపారు. ‘‘సీటీ స్కాన్ పేరుమీద దోపిడీ చేయడంపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. దీనికి 2,500 రూపాయల ధర నిర్ణయించాం. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల కంటే ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇప్పటికే కొన్ని ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నాం. ఇది నిరంతరం జరుగుతుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దోపిడీకి పాల్పడవద్దని వినతి. మాస్క్, భౌతిక దూరం వంటి కోవిడ్ నియమాల అమలులో ప్రజలను భాగస్వామ్యం చేయమని సీఎం జగన్ సూచించారు. కళ్యాణ మండపాలను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చాలని సీఎం ఆదేశించారు. బెడ్స్, కోవిడ్ రిక్రూట్మెంట్ కూడా పెంచుతున్నాం. జిల్లా స్థాయిలో 104 కాల్ సెంటర్లకు జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారిని నియమించాలని కోరాము’’ అని మంత్రి తెలిపారు. చదవండి: అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు -
కర్నూలులో కొత్తగా 11 ప్రైవేటు కోవిడ్ ఆస్పత్రులు..
ఆదోని : కర్నూల్ జిల్లాలో కొత్తగా 11 ప్రైవేటు కోవిడ్ ఆసుపత్రులను సిద్ధం చేశామని డిప్యూటి సీఎం, వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని తెలిపారు. కాగా, ఆదోని కస్తూరిభా గాంధీ స్కూల్లో 53 మంది విద్యార్థులకు కరోనా సోకడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, అక్కడి వైద్యారోగ్యశాఖ అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు, డీఎమ్హెచ్వో అధికారితో ఫోన్లో మాట్లాడారు. ఆదోని గాంధీస్కూల్లో కరోనా పరీక్షల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి ఉపాధ్యాయులు, విద్యార్ధులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించాలన్నారు. ఒకవేళ.. కరోనా తీవ్రత అధికంగా ఉన్నవారికి ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందించాలని ఆదేశించారు. అదేవిధంగా, కరోనాను ఎదుర్కొవడానికి ఏపీ ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. చదవండి: వ్యాక్సినే అస్త్రం.. ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి: సీఎం జగన్ -
సీఎం జగన్ లేఖకు 24గంటల్లో కేంద్రం స్పందన
గన్నవరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాసిన లేఖకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ సందర్భంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ను గన్నవరం విమానాశ్రయానికి తరలించింది. సోమవారం రాత్రికి గన్నవరం విమానాశ్రయానికి 4 లక్షల 40 వేల కోవిషీల్డ్ వ్యాక్సిన్స్ చేరుకున్నాయి. లేఖ రాసిన 24 గంటల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ పంపడంతో మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్కు ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కృతజ్ఞతలు తెలిపారు. రేపు ఉదయం హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికే రెండు లక్షల కోవాగ్జిన్ వ్యాక్సినేషన్లు రానున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కృతజ్ఞతలు చెబుతున్నట్లు మంత్రి ఆళ్ల నాని తెలిపారు. నాలుగు లక్షల నలభై వేల కోవిషిల్డ్ వ్యాక్సిన్లు అన్ని జిల్లాలకు పంపిణీ చేయనున్నట్లు మంత్రి చెప్పారు. వ్యాక్సిన్లను ప్రతి జిల్లాకు పంపించి, 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి వాక్సినేషన్ ఇవ్వనున్నట్లు వివరించారు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి వాక్సినేషన్ వేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కరోనా కట్టడికి ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు, వ్యాక్సిన్ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు వలంటీర్స్, ఆశా వర్కర్ల సేవలను వినియోగించుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో అర్హులైన వారందరికీ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుందని, కరోనా వ్యాప్తి నివారణకు టెస్టింగ్, ట్రాకింగ్, ట్రేసింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి ఆళ్ల నాని చెప్పారు. చదవండి: వామ్మో రెండు లక్షల కేసులు -
అతిసార బాధిత కుటుంబాలకు రూ. 3లక్షలు: ఆళ్ల నాని
సాక్షి, కర్నూలు: గత కొద్ది రోజులుగా జిల్లాలో అతిసార వ్యాధి బారిన పడి పలువురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అతిసారంతో మృతి చెదిన వారి కుటుంబాలకు 3 లక్షల రూపాయల పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. గోరుకల్లు వాసులను ఆదుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. ‘‘గోరుకల్లులో పైప్లైన్ను మార్చేందుకు 25 లక్షల రూపాయలు కేటాయించాం. తాగునీటిని హైదరాబాద్, విజయవాడ ల్యాబ్కు పంపి పరీక్షలు చేయిస్తాం. గోరకల్లులో 24 గంటలు పని చేసేలా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తాం. డయేరియా బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. అనారోగ్యం ఉన్నవారు ప్రభుత్వాస్పత్రికి వెళ్లాలి. అక్కడ మంచి వైద్యం అదుతుంది’’ అని ఆళ్ల నాని తెలిపారు. చదవండి: కరోనాపై ప్రత్యేక దృష్టి సారించాలి -
ఆంధ్రా విశ్వవిద్యాలయంలో కరోనా కలకలం
విశాఖ: మహమ్మారి కరోనా వైరస్ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో కలకలం రేపుతోంది. మొత్తం 65 మంది విద్యార్థులకు పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో మిగతా విద్యార్థులతో పాటు అధ్యాపకులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో కంటైన్మెంట్ జోన్లోకి ఇంజినీరింగ్ క్యాంపస్లోని 7 బ్లాక్లను చేర్చారు. క్వారంటైన్లో ఏయూ ఇంజినీరింగ్ కళాశాల వసతిగృహాలు చేశారు. విజయవాడ నుంచి వచ్చిన ఇంజినీరింగ్ విద్యార్థికి తొలి కరోనా కేసు నమోదైంది. దీంతో ఏయూలో 800 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా వారిలో 59 మందికి పాజిటివ్ తేలింది. ఈ సమాచారంతో గ్రేటర్ విశాఖ చీఫ్ మెడికల్ ఆఫీసర్ వసతిగృహాలను సందర్శించారు. కరోనా కేసులు రావడంతో ఏయూలో నేడు జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేశారు. పరీక్షల తేదీల షెడ్యూల్ను త్వరలో ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా హాస్టల్స్ వద్ద ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటుచేస్తామని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని విశాఖ ఆర్డీఓ కిశోర్ చెప్పారు. కరోనా వచ్చిన వారిలో తక్కువగానే పాజిటివ్ లక్షణాలు ఉన్నాయని, హాస్టల్స్లో ప్రత్యేక గదుల్లో ఉంచి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు ఆర్డీఓ వివరించారు. వెయ్యి మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. మరికొంతమంది రిజల్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. మంత్రి ఆళ్ల నాని ఆరా విశాఖ ఏయూలో కరోనా కేసులపై వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. వైద్యారోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. ఏయూలో 65 మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయినట్లు గుర్తించారు. దీంతో విశాఖ డీఎంహెచ్ఓ సూర్యనారాయణతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. రోజు 7,500 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 6 కోవిడ్ ఆస్పత్రులు ఏర్పాటు చేసినట్లు డీఎంహెచ్ఓ మంత్రికి వివరించారు. కోవిడ్ ఆస్పత్రులో వెయ్యి బెడ్లు సిద్ధం చేశామని, కరోనా సోకిన 15 మంది కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నిజిల్లాల వైద్యాధికారులను అప్రమత్తం చేశామని, కరోనా నివారణ చర్యలపై టెలీ కాన్ఫరెన్స్లో మంత్రి ఆళ్ల నాని సమీక్షిస్తున్నారు. -
కరోనాపై ప్రత్యేక దృష్టి సారించాలి
సాక్షి, అమరావతి: కరోనాపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆదేశించారు. మంగళవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానితో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. కరోనా గురించి ప్రజలకు మరింత తెలిసేలా విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించాలన్నారు. వ్యాక్సినేషన్ను వేగవంతం చేయడం కోసం అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అన్ని వార్డు, గ్రామ సచివాలయాల పరిధిలో 60 ఏళ్లు, 45– 59 ఏళ్ల వయసు ఉన్నవారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అన్ని జిల్లాల్లో కరోనా కట్టడికి అన్ని ప్రభుత్వ శాఖలు అధికారులతో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. కరోనా కట్టడిలో అన్ని వాణిజ్య, వ్యాపార, ప్రజా, డ్వాక్రా సంఘాలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కోరారు. జిల్లా, మండల స్థాయిల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలను చైతన్యపరచాలన్నారు. అన్ని హోటళ్లు, షాపింగ్ మాళ్లు, విద్యా సంస్థల్లో సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామ, పట్టణ, మండల స్థాయిల్లో క్యాండిల్ ర్యాలీలు నిర్వహించాలని చెప్పారు. మాస్కులు లేకుండా ఎవరూ బయట తిరగొద్దన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
వ్యాక్సినేషన్ వేగవంతంపై ఆళ్ల నాని, బుగ్గన సమీక్ష
-
‘కరోనా సోకిన 163 మంది విద్యార్థులకు ప్రత్యేక వైద్యం’
సాక్షి,విజయవాడ : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి తిరుమల జూనియర్ కాలేజీలో భారీగా వెలుగు చూసిన కరోనా కేసులపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. తిరుమల జూనియర్ కాలేజీలోని 163 మంది ఇంటర్ విద్యార్థులకు ఇటీవలె కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. వీరిని రాజమండ్రి తిరుమల జూనియర్ కాలేజీ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రూమ్స్లో వైద్య సదుపాయం కల్పించామని మంత్రి తెలిపారు. కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, డీఎంహెచ్వో డాక్టర్ గౌరిశ్వరావుతో మంత్రి ఆళ్లనాని ఫోన్లో మాట్లాడారు. వెంటనే కరోనా నివారణకు ముందోస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. తిరుమల జూనియర్ కాలేజీలో పూర్తి స్థాయిలో సూపర్ శానిటేషన్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి ఆళ్లనాని ఆదేశించారు. కాలేజీలో ఇంటర్ విద్యను అభ్యసిస్తున్న ఇతర విద్యార్థులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హాస్టల్ కి తరలించి RTPCR పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 'కాకినాడ, ముమ్ముడివరం, రామచంద్రపురం, రాజమండ్రి, ప్రాంతాల్లో 41పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో 50మీటర్లు దూరంలో కంటోన్మెంట్ జోన్స్ ఏర్పాటు చేశాం. కరోనా సోకిన బాధితులకు 24గంటల పాటు ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 35కంటోన్మెంట్ జోన్స్ ఏర్పాటు చేశాం. తిరుమల జూనియర్ కాలేజీ లో 400మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించడం కోసం వైద్య ఆరోగ్య శాఖ అన్ని చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కరోనా ప్రభావం లేకుండా అన్ని ముందోస్తు చర్యలు తీసుకుంటున్నాం. అన్ని విద్యా సంస్థల్లో కూడా కరోనా పరీక్షలు నిర్వహించడానికి చర్యలు చేపట్టాం. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు స్వచ్చందంగా ముందుకు రావాలి' అని ఆళ్లనాని తెలిపారు. చదవండి : పెరుగుతున్న కరోనా కేసులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలి -
కరోనా ఎఫెక్ట్: అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.. ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ వేగవంతంపై మంత్రులు ఆళ్ల నాని, బుగ్గన మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. ‘‘కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని జిల్లాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలి.. వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా వార్డు, గ్రామ సచివాలయాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ సాగుతోంది. 1930 ప్రభుత్వాస్పత్రులు, 634 ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. అత్యవసర వైద్యం కోసం 108, 104 వాహనాలు అందుబాటులో ఉంచాం. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలి’’ అని తెలిపారు. రాజమండ్రిలో కోవిడ్ కలకలంపై స్పందించిన ఆళ్ల నాని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి తిరుమల జూనియర్ కాలేజీలో భారీగా కరోనా కేసులు నమోదయిన సంగతి తెలిసిందే. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. ‘‘ఇంటర్ చదువుతున్న 163 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కరోనా సోకిన 163 మంది విద్యార్థులను రాజమండ్రి తిరుమల జూనియర్ కాలేజీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదుల్లో ఉంచి వైద్య సదుపాయం కల్పించాము. కరోనా నివారణకు తీసుకోవలసిన చర్యలపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, డీఎమ్హోచ్ఓ డాక్టర్ గౌరిశ్వరావుతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నాము. కరోనా నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా డీఎమ్హెచ్ఓ డాక్టర్ గౌరిశ్వరరావును ఆదేశించాము. అంతేకాక తిరుమల జూనియర్ కాలేజీలో పూర్తి స్థాయిలో సూపర్ శానిటేషన్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించాం. కాలేజీలో ఇంటర్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హాస్టల్కి తరలించి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నాం’’ అని ఆళ్ల నాని తెలిపారు ‘‘కాకినాడ, ముమ్ముడివరం, రామచంద్రపురం, రాజమండ్రి, ప్రాంతాల్లో 41 కోవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో 50 మీటర్లు దూరంలో కంటోన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశాం. కరోనా సోకిన బాధితులను 24 గంటల పాటు ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 35 కంటోన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశాము. తిరుమల జూనియర్ కాలేజీ లో 400 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించడం కోసం వైద్య ఆరోగ్య శాఖ అన్ని చర్యలు చేపట్టింది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కరోనా ప్రభావం లేకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో కూడా కరోనా పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టాం. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు స్వచ్చందంగా ముందుకు రావాలి’’ అని మంత్రి ఆళ్ల నాని కోరారు. -
వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. కోవిడ్ నిబంధనలు పాటించాలని, కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షల సంఖ్యను పెంచాలని సూచించారు. టీకా ప్రక్రియను వేగవంతం చేయడానికి గ్రామ సచివాలయాలను యూనిట్గా తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ, గ్రామ సచివాలయాల పరిధిలో ఉన్నవారికి సత్వరమే వ్యాక్సినేషన్ను పూర్తి చేయాలన్నారు. 45 ఏళ్లు దాటిన వారికి వెంటనే టీకా 45 ఏళ్ల వయసు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి వెంటనే టీకా వేయడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. పూర్తి స్థాయిలో నూటికి నూరు శాతం ఆరీ్టపీసీఆర్ టెస్టులు చేసేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఈ నెల 18 వరకు 13,80,537 మంది వ్యాక్సిన్ తీసుకున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్య పోస్టుల భర్తీపై దృష్టి సారించాలని సూచించారు. అన్ని నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం మెరుగ్గా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్షలో.. ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్కుమార్ సింఘాల్, ప్రిన్సిపల్ సెక్రటరీ (కోవిడ్ వ్యాక్సినేషన్) ముద్దాడ రవిచంద్ర, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్ట్ సీఈవో డాక్టర్ మల్లికార్జున, ప్రజారోగ్య శాఖ సంచాలకురాలు డాక్టర్ గీతా ప్రసాదిని, ఏపీవీవీపీ కమిషనర్ డాక్టర్ రామకృష్ణారావు, డీఎంఈ డా.రాఘవేంద్రరావు పాల్గొన్నారు. -
ఏపీ: కరోనా కేసులపై మంత్రి ఆళ్ల నాని ఆరా..
సాక్షి, అమరావతి: జిల్లాల్లో కరోనా కేసులపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల అధికారులతో మంత్రి మాట్లాడారు. కరోనా బాధితులకు వైద్య సదుపాయాలు కల్పించాలని మంత్రి ఆదేశించారు. తెనాలిలో మున్సిపల్ సిబ్బందికి కరోనా నిర్ధారణ కావడంతో వారిని హోం క్వారంటైన్లో ఉంచామని ఆళ్ల నాని పేర్కొన్నారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ ఉన్న వారికి తెనాలి ప్రభుత్వాసుపత్రిలో కరోనా పరీక్షలు చేయిస్తున్నామన్నారు. పొన్నూరులోని ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులకు ర్యాండమ్గా కరోనా పరీక్షలు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు భయపడొద్దని.. ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు. కృష్ణా జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా వైద్య బృందాలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని, సర్వే బృందాలు.. ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించాలన్నారు. జగ్గయ్యపేట ప్రాంతంలో కరోనా బాధితులను హోమ్ క్వారంటైన్కు తరలించామని.. బాధితులు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారన్నారు. వారికీ అవసరం అయినవైద్యం అందిస్తున్నాం. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో 40మంది కరోనా బాధితులకు ప్రత్యేకంగా వైద్య సదుపాయం కల్పించామని పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న క్రమంలో అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టామని మంత్రి వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా కొనసీమ ప్రాంతంలోని మలికిపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో 12 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని, వారిని హోం క్వారంటైన్కు తరలించామని పేర్కొన్నారు. కొంతమంది ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినప్పటికీ, వారికి ఎలాంటి కరోనా లక్షణాలు లేవన్నారు. కరోనా సోకిన బాధితులకు వైద్య సిబ్బంది పర్యవేక్షణలో వైద్య సదుపాయం కల్పించామని మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. చదవండి: ఎన్ని పెళ్లిళ్లయినా చేసుకోవచ్చు.. కానీ ఏం చంద్రబాబు ఇప్పుడేమంటారు..? -
ఘోర రోడ్డు ప్రమాదం; మంత్రి ఆళ్ల నాని దిగ్ర్బాంతి
సాక్షి, కృష్ణా: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు మృత్యువాత పడగా.. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. నూజివీడు మండలం గొల్లపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను నూజివీడు మండలం లయన్ తండాకు చెందిన కూలీలుగా గుర్తించారు. కాగా రోడ్డు ప్రమాదంపై వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో కూలీలు మృతి చెందడం తనను ఎంతో బాధించిందన్నారు. పొట్ట చేతబట్టి బతుకు దెరువు కోసం వెళ్తున్న కూలీలు ఇలా మృత్యువాత పడడం అత్యంత బాధాకరమని తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్ధిస్తూ.. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 8మంది క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. -
‘అభివృద్ధి కోసం వైఎస్ఆర్సీపీని గెలిపించండి’
సాక్షి, పశ్చిమగోదావరి : ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఏలూరు 2వ డివిజన్లో డిప్యూటీ సీఎం, వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత రెండేళ్లలో ఏలూరును ఎంతో అభివృద్ధి చేశామని వెల్లడించారు. ఏలూరులో మెడికల్ కాలేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని పేర్కొన్నారు. ఏలూరు కార్పొరేషన్ను గెలుచుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కానుకగా ఇస్తామన్నారు. విశాఖపట్నం: విశాఖలోని 90వ వార్డులో వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విశాఖ అభివృద్ధి కోసం వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సీఎం వైఎస్ జగన్ది సంక్షేమ ప్రభుత్వమని, విశాఖకు త్వరలో పరిపాలన రాజధాని రాబోతోందన్నారు. భరత్నగర్లో ఇల్లు లేని 30 కుటుంబాలకు ఇళ్లు కట్టించి ఇస్తామని భరోసానిచ్చారు. చదవండి: 'చంద్రబాబుకు విశాఖలో అడుగుపెట్టే హక్కే లేదు' మళ్లీ చెంప చెళ్లుమనిపించిన బాలయ్య -
అరకు ప్రమాదం: కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ
సాక్షి, విశాఖటప్నం: అరకు ప్రమాద ఘటనపై కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి ఆళ్ల నాని శనివారం తెలిపారు. ఆయన మీడియా మాట్లాడుతూ.. ఈ ప్రమాద ఘటన బాధాకరం అన్నారు. తెలంగాణ నుంచి 27 మంది అరకు ప్రాంతానికి వచ్చారని, ప్రమాదంలో నలుగురు మృతి చెందారని తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని వెల్లడించారు. ప్రత్యేక అంబులెన్స్లో స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అంతకు ముందు అరకు ఘాట్రోడ్ ప్రమాద ఘటనలో గాయపడి కేజీహెచ్ ఆస్పత్రిలో చేరిన బాధితులను మంత్రులు ఆళ్ల నాని, అవంతి శ్రీనివాస్ పరామర్శించారు. వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అరకు ఘాట్రోడ్ ప్రమాద ఘటనలో గాయపడిన 23 మంది బాధితులు కేజీహెచ్లో చికిత్స పొందుతురన్నారని డీఎంహెచ్వో తెలిపింది. అందులో చంద్రకళ అనే మహిళ పరిస్థితి విషమంగా ఉంది పేర్కొంది. నాలుగు మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తి చేసినట్లు తెలిపింది. చదవండి: లోయలో పడ్డ బస్సు: నలుగురు మృతి -
ఏడుగురు విద్యార్థినులకు స్వల్ప అస్వస్థత
తిరుపతి తుడా: కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న ఏడుగురు నర్సింగ్ విద్యార్థినులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తిరుపతి రుయా ఆస్పత్రిలోని వ్యాక్సినేషన్ సెంటర్లో శుక్రవారం జనరల్ నర్సింగ్ కాలేజికి చెందిన 38 మందికి వ్యాక్సిన్ వేశారు. వారిలో ఏడుగురు విద్యార్థినులు స్వల్ప అస్వస్థతకు గురవడంతో రుయాలోని అత్యవసర విభాగానికి తరలించారు. వైద్యులు వారికి షుగర్, బీపీ, ఈసీజీ పరీక్షలు చేశారు. అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని ప్రకటించారు. అస్వస్థతకు గురైన లక్ష్మి, స్వాతి, ప్రసన్న, రూప, దుర్గ, ధనలక్ష్మి, సహనలను మరో 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు రుయా సూపరింటెండెంట్ డాక్టర్ భారతి మీడియాకు తెలిపారు. మంత్రి ఆళ్ల నాని ఆరా... నర్సింగ్ విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. చిత్తూరు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ పెంచలయ్య, రుయా సూపరింటెండెంట్ డాక్టర్ భారతితో శుక్రవారం సాయంత్రం ఫోన్లో మాట్లాడిన ఆయన.. అస్వస్థత పాలైన నర్సింగ్ విద్యార్థినులకు ప్రత్యేక వార్డు కేటాయించి వైద్య సదుపాయం కల్పించాలని ఆదేశించారు. -
సీఎం జగన్ ఆదేశాలు: వైద్యురాలికి చికిత్స
సాక్షి, విజయవాడ: తీవ్ర అనారోగ్యానికి గురై చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒంగోలు రిమ్స్ డెంటల్ డాక్టర్ ధనలక్ష్మి ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఆమెను మెరుగైన వైద్యం కోసం మద్రాస్ అపోలో ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. (చదవండి: టీడీపీ కిడ్నాప్ డ్రామా బట్టబయలు..) కొద్దిరోజుల్లోనే డాక్టర్ ధనలక్ష్మి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని మంత్రి ఆళ్ల నాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని తెలిపారు. ఆమె ఆరోగ్య పర్యవేక్షణకు ఒంగోలు నుండి ప్రత్యేకంగా మత్తు వైద్యులు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రదీప్ను అందుబాటులో ఉంచారు. (చదవండి: పంచాయతీ ఎన్నికలు: పురోహితులకు డిమాండ్) స్పెషల్ కేసుగా తీసుకొని డాక్టర్ ధనలక్ష్మికి అత్యవసర వైద్యం అందించి ప్రాణాపాయం నుండి కాపాడడానికి అన్ని చర్యలు చేపట్టినట్టు మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. ప్రకాశం జిల్లా పామూరు మండలం భట్ల గూడూరు గ్రామానికి చెందిన డాక్టర్ ధనలక్ష్మి.. కోవిడ్ సమయంలో ఆరు నెలలు కాలానికి వైద్య సేవలు అందించడానికి తాత్కాలిక పద్ధతిలో ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ డెంటల్ డాక్టర్గా ఉద్యోగ బాధ్యతలను ఆమె నిర్వహిస్తున్నారు. -
అంతుచిక్కని వ్యాధిపై లోతైన పరిశోధన
సాక్షి, అమరావతి: ‘2020 డిసెంబర్లో జరిగిన ఏలూరు ఘటనపై విభన్న కోణాల్లో పరిశోధన జరిగింది. వివిధ జాతీయ సంస్థలు మూర్ఛకు కారణాలను అన్వేషించి, నివేదికలిచ్చాయి. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. మూర్ఛ లక్షణాలతో సొమ్మసిల్లి పడిపోవడం అనేది బాక్టీరియా లేదా వైరస్వల్ల కాదని తేలింది. నీటి నమూనాలను పరీక్షించగా, క్రిమిసంహారక మందుల అవశేషాలు కలిశాయని స్పష్టమైంది. ఇందులో ఆర్గానో ఫాస్ఫరస్ పెస్టిసైడ్ మూలాలున్నాయని జాతీయ పోషకాహార సంస్థ చెప్పింది. ఢిల్లీలోని ఎయిమ్స్ లాంటి సంస్థ ఆర్గానో ఫాస్ఫరస్ వల్ల మూర్ఛ రావచ్చని.. కానీ, తాము సేకరించిన నమూనాల్లో దాని మూలాల్లేవని చెప్పింది. అందుకే అన్ని సంస్థల అభిప్రాయాలను క్రోడీకరించాక ఆర్నెల్లపాటు లోతైన పరిశోధన చేయాలని నిర్ణయించాం. ఇందుకోసం మూడు జాతీయ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం’.. అని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. ఏలూరు ఘటనపై మంత్రి సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఏలూరులో 600 మందికి పైగా అంతుచిక్కని వ్యాధితో బాధితులు నమోదైతే ఒక్క ప్రాణనష్టం కూడా లేకుండా చేశామన్నారు. ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తదితరులు కూడా పాల్గొన్నారు. నేటి నుంచి రెండో విడత కోవిడ్ వ్యాక్సిన్ రాష్ట్రంలో రెండో విడత కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను బుధవారం నుంచి ప్రారంభించనున్నట్లు మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఇటీవల వ్యాక్సిన్ తీసుకున్నాక చనిపోయిన ఆశా వర్కర్ కుటుంబానికి మంగళవారం రూ.50 లక్షలు అందించామన్నారు. ఒంగోలు ప్రభుత్వాసుపత్రి వైద్యురాలు డా.ధనలక్ష్మికి మెరుగైన వైద్యం అందించేందుకు చెన్నె అపోలో ఆసుపత్రికి తరలించామని, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. -
'అందుకే ఎక్కువగా ఫోకస్ చెయ్యలేకపోతున్నాం'
విజయవాడ : కరోనా వ్యాక్సిన్ని సమర్థవంతంగా అందిస్తున్నాం అని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అన్నారు. ఇప్పటికే 3,88,327 మందికి గాను 1,89,890 మందికి వ్యాక్సిన్ వేశామని, 48.90 శాతం మందికి మొదటి దశలో వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 74 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. వాక్సినేషన్ రియాక్షన్ వచ్చిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. ఒంగోలులో వ్యాక్సిన్ తీసుకున్న డెంటర్ డాక్టర్ ధనలక్ష్మి అస్వస్థతకు గురైతే వైద్యం అందించేందుకు ప్రభుత్వమే ఆమెను చెన్నైకి తరలించినట్లు తెలిపారు. 2,102 సెషన్ సైట్స్ సిద్ధంగా ఉంచామని, మరో 3,181 సెషన్ సైట్స్ ఏర్పాటు చేస్తామన్నారు. హెల్త్ వర్కర్స్, డాక్టర్లలో కొంత అనుమానాలు ఉన్నందున వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదదని, ఎన్నికల నిర్వహణ వలన ఎక్కువగా ఫోకస్ చెయ్యలేకపోతున్నామని ఆయన పేర్కొన్నారు. -
బాలింత మృతి.. ఆళ్ల నాని సీరియస్
సాక్షి, పశ్చిమగోదావరి: వైద్యం వికటించి బాలింత మృతి చెందిన ఘటనపై మృతి ఘటనపై డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర వివరాలను డీఎంహెచ్వోను అడిగి తెలుసుకున్నారు. వివరాల ప్రకారం..వేలేరుపాడులోని రామవరానికి చెందిన నాగమణి అనే నిండు గర్భిణి ప్రసవం కోసం స్థానిక వేలేరు పాడులోని శ్రీనివాస నర్సింగ్ హోంలో మంగళవారం రాత్రి చేరింది. ప్రసవం కష్టం కావడంతో ఆమెకు సిజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డను సురక్షితంగా బయటకు తీశారు. ఆ తరువాత నాగమణి ఫిట్స్తో మృతి చెందింది. ఈ ఘటనపపై సీరియస్ అయిన ఆళ్ల నాని ..ఎలాంటి అర్హతలు లేకుండా కాన్పు చేసిన ఆర్ఎంపీ వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనుమతులు లేకుండా ఆస్పత్రులు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని, ఆర్ఎంపీలు పరిధి దాటి వైద్యం అందిస్తే చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. బాలింత మృతిపై సీనియర్ గైనకాలజిస్టు విచారణాధికారిగా నియమించారు. -
ఆశా వర్కర్ మృతి: 50 లక్షల సాయం
సాక్షి, గుంటూరు : ఆశా వర్కర్ విజయలక్ష్మి కరోనా వ్యాక్సిన్ వల్లే చనిపోయిందని ఇంకా నిర్ధారణ కాలేదని ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. తాడేపల్లి మండలం పెనుమాకలో ఆశా వర్కర్ బొక్కా విజయ లక్ష్మి కుటుంబ సభ్యులను మంత్రి ఆళ్ల నాని, హోం మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాటంనేని భాస్కర్, జిల్లా అధికారులు సోమవారం పరామర్శించారు. కాగా గుంటూరులోని తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన ఆశా వర్కర్ బొక్కా విజయలక్క్క్ష్మీ ఆదివారం మరణించిన విషయం తెలిసిందే. ఈమె ఈనెల 19న కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. చదవండి: వ్యాక్సిన్: బ్రెయిన్ డెడ్ అయిన ఆశా వర్కర్ మృతి ఈ సందర్భంగా మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. విజయలక్ష్మి చనిపోవడం దురదృష్టకరమన్నారు. అయితే పోస్టుమార్టం రిపోర్టు వస్తే గాని ఆమె మరణానికి సంబంధించిన కారణాలు తెలుస్తాయన్నారు. పోస్టుమార్టం రిపోర్టు త్వరగా వచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. విజయలక్ష్మి మరణానికి కారణాలు ఏమైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించారని తెలిపారు. విజయలక్ష్మి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పమని తమను పంపినట్లు పేర్కొన్నారు. విజయలక్ష్మి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలన్నీ కుటుంబ సభ్యులకు వివరించామని తెలిపారు. కుటుంబ సభ్యులు ఒక ఉద్యోగం అడిగారని, అలాగే ఇళ్ల స్థలం, ఇన్సూరెన్స్ కింద వచ్చే యాభై లక్షలు అడిగారని తెలిపారు. విజయలక్ష్మి మరణానికి 50 లక్షల ఇన్సూరెన్స్ వర్తించదన్నారు. కరోనా విధులు అందించేటప్పుడు మాత్రమే ఇన్సూరెన్స్ వర్తిస్తుందని, వ్యాక్సినేషన్కు వర్తించదని తెలిపారు. అయితే సీఎం వైఎస్ జగన్ మానవత్వంతో ఇన్సూరెన్స్తో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తరపున యాభై లక్షల రూపాయలు ఇస్తామన్నారని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఇప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సిన్ వేయించుకోవడానికి 3 లక్షల 88 వేల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, ఇప్పటివరకు లక్షా యాభై వేల మంది కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారని తెలిపారు. ఇప్పటివరకు 39 మందికి మాత్రమే తల తిరగటం, జలుబు, జ్వరం లాంటి లక్షణాలు కనిపించాయని, రిజిస్ట్రేషన్ చేయించుకున్న అంతమాత్రాన వ్యాక్సిన్ వేయించుకోవాలనే అవసరం లేదని స్పష్టం చేశారు. ఏమైనా అనారోగ్య కారణాలు ఉంటే డాక్టర్ను సంప్రదించి డాక్టర్ సలహాలు తీసుకుని వ్యాక్సిన్ వేయించుకోవచ్చని సూచించారు. ఆశా వర్కర్ విజయలక్ష్మి మరణించడం బాధకరమని హోంమంత్రి మేకతోటి సుకరిత ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సమాచారం తెలియగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంటనే స్పందించారని, విజయలక్ష్మి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారన్నారు. విజయలక్ష్మి కుటుంబానికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. -
వారివి పసలేని విమర్శలు: ఆళ్ల నాని
సాక్షి, ఏలూరు: అంతు చిక్కని వింత వ్యాధి పట్ల ప్రత్యేకంగా దృష్టి సారించి చర్యలు చేపట్టడంతో ప్రజలు సురక్షితంగా ఉన్నారని ఈ వ్యాధి ప్రభావం పూర్తి స్థాయిలో అదుపులో ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ,వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. శనివారం ఏలూరులోని తన క్యాంప్ కార్యాలయంలో ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యేలు కొట్టారు అబ్బయ్య చౌదరి, పుప్పాల వాసు బాబులతో వింత వ్యాధి నివారణపై అనుసరించవలసిన విధానం పై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత వారం రోజులుగా భీమడోలు మండలం పూళ్ళ, దెందులూరు మండలం కోమిరేపల్లి గ్రామంలో వింత వ్యాధితో అనారోగ్యానికి గురైన ప్రజలకు అండగా నిలబడి పూర్తి స్థాయిలో వైద్య సదుపాయాలు కల్పించి స్వయంగా ఆ గ్రామాలకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితుల పై ప్రత్యేకంగా వైద్య బృందాలు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు మంత్రి ఆళ్ల నాని చెప్పారు. చదవండి: 8 గంటల్లో ఆరోగ్యశ్రీ కార్డు వింత వ్యాధికి గురై డిశార్జ్ అయిన రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సదుపాయం, వారు తీసుకుంటున్న ఆహార పానీయాలపై కూడా వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని ఇంటింటికి సర్వే కొనసాగుతుందని ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని.. ప్రజలు ఎవరు ఎక్కడా కూడా భయపడాల్సిన పరిస్థితి లేదని ఎక్కడైనా వింత వ్యాధి లక్షణాలు ఉంటే వారికి పూర్తిగా వైద్య ఆరోగ్య శాఖ వైద్య సదుపాయం కల్పించడానికి అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ వ్యాధి సోకడానికి గల కారణాలపై పూర్తిస్థాయిలో శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపించామని జాతీయ రహదారి వెంబడి హైవే పై ఉన్న గ్రామాలలో ఈ వింత వ్యాధి కనిపించడం పట్ల కూడా ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించామని, కెనాల్ ద్వారా నీటి సరఫరాలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో అని కూడా రూరల్ వాటర్ స్కీం అధికారులు పరిశీలిస్తున్నట్లు మంత్రి ఆళ్ల నాని చెప్పారు. చదవండి: ఓ రాజకీయ నేతలా నిమ్మగడ్డ.. ప్రజలు వింత వ్యాధితో అనారోగ్యానికి గురై ఇబ్బందుల్లో ఉంటే కొంతమంది రాజకీయ స్వార్థంతో పసలేని విమర్శలు ప్రభుత్వంపై చేస్తున్నారని ఇలాంటి పరిస్థితుల్లో విమర్శలు కంటే రాజకీయ కోణం కంటే ప్రజల ఆరోగ్యాన్ని లక్ష్యంగా పెట్టుకొని ప్రజలకు అండగా ఉంటే బాగుంటుందని రాజకీయ విమర్శలకు ఇది సమయం కాదని అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని అవగాహన లేని రాజకీయ ప్రకటనలు చేసే వారు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని ఆళ్ల నాని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేసి వైద్య సదుపాయం కల్పించాలని అనారోగ్య బారిన పడిన ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రుల కంటే ప్రభుత్వ ఆసుపత్రిలో వైపే మొగ్గు చూపుతున్నారని దీన్నిబట్టి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్య సదుపాయాలు ఎంత సక్రమంగా అందుతున్నాయో అర్థమవుతుందని ప్రతిదానిని రాజకీయ కోణంలో చూస్తూ విమర్శలు చేయడం రాజకీయ అజ్ఞానం అవుతుంది తప్ప ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో కూడా ప్రత్యేక దృష్టి పెట్టామని అన్ని గ్రామ పంచాయతీలు ఏలూరు కార్పొరేషన్లో పారిశుధ్యం పై ఎప్పటికప్పుడు దృష్టిపెట్టి వీధుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడానికి మురుగు కాలువలలో ఉన్న పూడికను తొలగించడానికి అధికారులను అప్రమత్తం చేశామని మంత్రి ఆళ్ల నాని చెప్పారు. -
కొమిరేపల్లిలో వింతవ్యాధి
సాక్షి ప్రతినిధి ఏలూరు/దెందులూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో అంతుచిక్కని వ్యాధి దెందులూరు మండలం కొమిరేపల్లి గ్రామానికీ విస్తరించింది. గ్రామంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి 25 మంది ఫిట్స్తో పడిపోయారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గ్రామాన్ని సందర్శించి, గ్రామంలో ఇంటింటి సర్వే చేయించారు. బాధితులకు అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అక్కడి పరిస్థితులపై సీఎం వైఎస్ జగన్కు వివరించారు. దీంతో ఆయన వెంటనే ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ను పంపించగా.. వారు బాధితులను కలిసి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందించాలని.. అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బందికి సూచించారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయించి, బాధితులను వెంటనే ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రత్యేక వైద్య బృందాలను పిలిపించారు. దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్లా, డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ సునంద, డైరెక్టర్ ఆఫ్ స్టేట్ హెల్త్ డాక్టర్ గీతా ప్రసాదిని తదితరులు ఇక్కడి పరిస్థితులను ఉన్నతాధికారులకు వివరించారు. ఇదిలావుండగా.. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రభుత్వాస్పత్రికి చేరుకుని ప్రభుత్వంపై ఆరోపణలు చేయగా, గత ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసిన ఘంటశాల వెంకటలక్ష్మి వైద్య శిబిరం వద్ద హడావిడి చేశారు. స్థానికులతో గొడవకు దిగిన జనసేన నేతలు ఒక దశలో జిల్లా ఎస్పీని సైతం తోసేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో వెంకటలక్ష్మి కింద పడిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధితులను తీసుకెళ్లే అంబులెన్స్కు అడ్డంగా కూర్చున్నారు. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ : సీఎస్ ప్రజల ఆరోగ్యంపట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ అన్నారు. కొమిరేపల్లిలో బాధితులు, వారి కుటుంబ సభ్యులను కలిసి ఏవిధంగా అనారోగ్యం పాలైందీ అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్లో ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇది కుట్రే : ఆళ్ల నాని జిల్లాలో వరుస ఘటనల వెనుక ప్రజలు అనుకుంటున్నట్లుగానే తానూ రాజకీయ కుట్ర కోణం ఉన్నట్లు భావించాల్సి వస్తోందని మంత్రి ఆళ్ల నాని అన్నారు. వ్యాధి నుంచి కోలుకున్న బాధితుల ఇళ్లకు వెళ్లి పరామర్శించిన ఆయన వారికి భరోసా ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలో వింత వ్యాధి పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందన్నారు. శాంపిల్స్ను పరీక్షల కోసం పంపామని, రిపోర్టులు వచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, బాధితులను తరలిస్తుండగా జనసేన నేతలు అంబులెన్స్ను అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు. ఇదంతా చూస్తుంటే జిల్లాలో ప్రజలకు ఏదో రాజకీయ కుట్ర జరుగుతుందనే అనుమానాలు వస్తున్నాయన్నారు. -
పశ్చిమ గోదావరిలో వింతవ్యాధి కలకలం
భీమడోలు: వింత వ్యాధి లక్షణాలతో అనారోగ్యం బారిన పడుతున్న కేసులు పెరుగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం పూళ్ల గ్రామంలో వింత వ్యాధి కలకలం రేపుతోంది. బాధితుల సంఖ్య 20కి చేరింది. వింత వ్యాధి బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఇద్దరు బాధితులను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఉన్నట్టుండి కళ్లు తిరిగి కింద పడిపోతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అలా పడిపోయిన వారిలో కొందరికి ఫిట్స్ లక్షణాలు ఉన్నాయి. వైద్య అధికారులు అప్రమత్తమై వెంటనే గ్రామంలో 5 వైద్య బృందాలు ఏర్పాటుచేశారు. ఇంటింటికి వెళ్లి అధికారులు సర్వే చేస్తున్నారు. ఆశ వర్కర్లు గ్రామంలోని 6 నీళ్ల ట్యాంక్లో వాటర్ శాంపిల్స్ తీసుకుని ల్యాబ్కు పరీక్షల కోసం పంపించారు. వింత వ్యాధి బాధితులను ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, కలెక్టర్ రేవు ముత్యాలరాజు, డీఎంహెచ్ఓ డాక్టర్ సునంద పరామర్శించారు. పూళ్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పరామర్శించనున్నారు. గతంలో ఏలూరులో ఇలాంటి కేసులు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బాధితులంతా ప్రత్యేక చికిత్స పొందుతున్నారు. వారంతా ఆరోగ్యంగా ఉన్నారని వైద్య అధికారులు చెబుతున్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. -
'పూళ్ల'లో అంతుచిక్కని వ్యాధి లక్షణాలు
భీమడోలు: నెల రోజుల క్రితం ఏలూరు నగరాన్ని వణికించిన అంతుచిక్కని వ్యాధి లక్షణాలు రెండు రోజులుగా పశ్చిమ గోదావరి జిల్లా పూళ్ల గ్రామంలోనూ వెలుగు చూస్తున్నాయి. ఫిట్స్ వచ్చి పడిపోవడం, కళ్లు తిరిగి స్పృహ కోల్పోవడం, నోటి వెంట నురగలు రావడం, వాంతులు, మూతి వంకర్లు తిరగడం వంటి లక్షణాలతో మొత్తం 15 మంది ఆస్పత్రి పాలయ్యారు. వీరంతా పూళ్ల పంచాయతీ పరిధిలోని పూళ్ల తూర్పు, పడమర హరిజనపేట, రెడ్డినాయుడుపేట, జంగం వీధికి చెందినవారు. ఈ నెల 15న ఒకరు ఇలాంటి లక్షణాలతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరగా.. 16న మరో ఇద్దరు, ఆది, సోమవారాల్లో మరో 12 మంది ఇదే లక్షణాలతో పూళ్లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి చికిత్స పొందారు. బాధితుల్లో ఎక్కువ మంది చేపల పట్టుబడి, ప్యాకింగ్, వ్యవసాయ పనులు చేసుకునే వారే. బాధితులకు పీహెచ్సీ వైద్యులు బి.లీలాప్రసాద్, ఇ.కల్యాణి చికిత్స అందించడంతో కోలుకుని ఇళ్లకు వెళ్లారు. సోమవారం రాత్రి తొమ్మిదేళ్ల బాలుడు ఇవే లక్షణాలతో పీహెచ్సీకి రాగా.. అతడికి రక్తహీనత ఉండటంతో అంబులెన్స్లో ఏలూరులోని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. కేసుల విషయాన్ని విషయాన్ని డీఎంహెచ్వో కె.సునంద దృష్టికి తీసుకెళ్లగా ఆమె గ్రామంలో పర్యటించి బాధితులను పరామర్శించి లక్షణాలపై ఆరా తీశారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన వ్యక్తితోపాటు పీహెచ్సీలో చికిత్స పొంది కోలుకున్న 14 మంది బాధితుల రక్త నమూనాలను సేకరించారు. బా«ధితులు నివాసం ఉంటున్న కాలనీల్లో తాగునీటి శాంపిల్స్ను సేకరించి పరీక్షలకు పంపించారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీఎంహెచ్వో సునంద భరోసా ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి ఆరా పూళ్ల గ్రామంలో అంతు చిక్కని వ్యాధి లక్షణాలు వెలుగు చూసిన ఘటనలపై ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. అస్వస్థతకు గురైన వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే గ్రామానికి వైద్య బృందాలను పంపుతున్నట్టు ప్రకటించారు. అస్వస్థతకు గురైన వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఇలా జరిగి ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. గ్రామంలో వెలుగు చూసిన లక్షణాలు, ఇందుకు గల కారణాలపై పూర్తి విచారణ జరపాలని మంత్రి ఆదేశించారు. -
ప్రతి జిల్లాలో 30 వ్యాక్సినేషన్ కేంద్రాలు
ఏలూరు టౌన్: ఈనెల 16 నుంచి రాష్ట్రంలో కోవిడ్–19 వ్యాక్సినేషన్కు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ.. ప్రతీ జిల్లాలో 30 వ్యాక్సినేషన్ కేంద్రాలు ఉంటాయనీ, వాటిలో ప్రతి నియోజకవర్గంలో ఒక కేంద్రం ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సిన్ భద్రపరిచేందుకు 17 కోల్డ్ స్టోరేజీ సెంటర్లు సిద్ధం చేశామని, ఇక్కడ 24 గంటలూ విద్యుత్ ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. వ్యాక్సినేషన్ కోసం 17 వేల మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. తొలి దశ వ్యాక్సినేషన్లో ఫ్రంట్లైన్ వారియర్స్కు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. జిల్లా కేంద్రాల్లో నిల్వ చేస్తోన్న వ్యాక్సిన్ను ఆయా కేంద్రాలకు ఉదయాన్నే ప్రత్యేక వాహనాల్లో తరలించే ఏర్పాట్లు చేశామని చెప్పారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, మండల స్థాయిలో తహసిల్దార్, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారని తెలిపారు. ప్రతీ రోజూ టాస్క్ఫోర్స్ కమిటీకి వ్యాక్సినేషన్ నివేదిక అందేలా చర్యలు చేపట్టామన్నారు. -
ఏపీలో కొత్త స్ట్రెయిన్ ఆనవాళ్లు లేవు
సాక్షి, అమరావతి: కరోనా సెకండ్ వేవ్ హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. బ్రిటన్లో కరోనా కొత్త రకం వైరస్ విజృంభణ నేపథ్యంలో విమాన ప్రయాణికుల రాకపోకలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే ఆర్టీపీఆర్ పరీక్షలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. (చదవండి: నెలరోజుల్లో బ్రిటన్ టూ తెలంగాణ 3వేల మంది..) ప్రజలు భయాందోళన చెందొద్దు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గురువారం మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ ఆనవాళ్లు లభ్యం కాలేదని చెప్పారు. యూకే నుంచి రాజమండ్రి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్ వచ్చిందని, ఆమె కుమారుడికి పరీక్షలు జరపగా నెగెటివ్ వచ్చినట్లు తెలిపారు. ఆమె ఫస్ట్ క్లాస్ బోగీలో వచ్చినందున మిగిలిన వారితో కాంటాక్టయ్యే సందర్భాలు తక్కువేనని స్పష్టం చేశారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. మహిళ నమూనాలు సేకరించి పుణె ల్యాబ్కు పంపామని, ఫలితాలు రావాల్సి ఉందని తెలిపారు. కరోనా కొత్త స్ట్రెయిన్ విషయంలో ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నందున ప్రజలెవరూ భయాందోళనకు గురి కావొద్దని సూచించారు. పొరుగు రాష్ట్రాల్లోని ఎయిర్పోర్టుల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. (చదవండి: కర్ఫ్యూతో మళ్లీ రోడ్డున పడతాం!) -
ఏలూరు బాధితులకు అండగా ప్రభుత్వం
ఏలూరు టౌన్: ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో అనారోగ్యం బారిన పడిన బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచింది. వైద్య చికిత్సల అనంతరం కోలుకుని ఇళ్లకు చేరిన బాధితులను ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆదివారం పరామర్శించారు. శనివారం తంగెళ్లమూడిలోని శివగోపాలపురం, యాదవనగర్ ప్రాంతాల్లో పర్యటించి బాధితులను ఇళ్లవద్దే పరామర్శించిన మంత్రి.. ఆదివారం ఏలూరు వన్టౌన్ ప్రాంతంలో పర్యటించి బాధితుల ఆరోగ్యస్థితి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు మంత్రి స్వయంగా నిత్యావసర సరుకులు అందజేశారు. కాగా, ఏలూరులో మొత్తం 650 బాధిత కుటుంబాలకు వలంటీర్లు, సచివాలయ సిబ్బంది ద్వారా ప్రభుత్వం నిత్యావసర సరుకులు అందజేసినట్లు అధికారులు వెల్లడించారు. -
విషజ్వరాలపై మంత్రి ఆళ్ల నాని ఆరా
సాక్షి, విస్సన్నపేట: కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలంలో ప్రబలిన విష జ్వరాలపై డిప్యూటీ సీఎం, వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. మండలంలోని కొండ పర్వం గ్రామంలో కలుషిత నీరు కారణంగా ప్రబలిన విషజ్వరాలపై మంత్రి.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల నుండి ఫోన్లో వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొండపర్వం గ్రామంలో పర్యటించి వెంటనే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు (చదవండి: ఏలూరులో సాధారణ పరిస్థితి) అంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజలు భయపడొద్దని, విష జర్వాల నివారణకు అన్నిచర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తక్షణమే పారిశుధ్య పనులు చేపట్టి డ్రైనేజీ పనులు చేపట్టాలని కృష్ణా జిల్లా పంచాయతీ అధికారికి సూచించారు. కొండపర్వంలో ప్రత్యేకంగా వైద్య బృందాలతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి మందులు అందుబాటులో ఉంచామని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. (చదవండి: వీరవాసరం ఏఎస్ఐపై హత్యాయత్నం) -
ఏలూరులో సాధారణ పరిస్థితి నెలకొంది
సాక్షి, పశ్చిమ గోదావరి : ఏలూరులో సాధారణ పరిస్థితి నెలకొందని, అంతుచిక్కని వ్యాధి కారణంగా అనారోగ్యం పాలై ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులంతా డిశ్చార్జ్ అయ్యారని మంత్రి ఆళ్లనాని తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామన్నారు. మెడికల్ టీమ్లు బాధితుల ఇంటికెళ్లి ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకుంటున్నాయని, బాధితులకు ఆహారం, మందులు అందిస్తున్నామని వెల్లడించారు. 650 కుటుంబాలకు నిత్యావసరాలు అందిస్తున్నామని చెప్పారు. 5 కేజీల బియ్యం, కందిపప్పు, ఆయిల్, కూరగాయలు ఇస్తున్నామన్నారు. ( రేషన్ బియ్యం డోర్ డెలివరీకి ఏర్పాట్లు వేగవంతం) మూడు రోజుల్లో తుది నివేదిక వస్తుందని, తుది నివేదిక బట్టి అస్వస్థతకు కారణాలు తెలుస్తాయని అన్నారు.అంతకుక్రితం, ఏలూరు టూటౌన్, తంగెళ్లమూడి ప్రాంతాల్లో బాధితుల ఇళ్ల వద్దకు నేరుగా వెళ్లిన మంత్రి ఆళ్లనాని వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న శానిటేషన్ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. -
ఏలూరులో కేసులు తగ్గాయ్
ఏలూరు టౌన్: గత వారం రోజులుగా ఏలూరులో నెలకొన్న ఆందోళనకరమైన పరిస్థితి నుంచి ప్రజలు బయటకు వస్తున్నారని.. కేసులు కూడా బాగా తగ్గాయని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. బాధితులంతా కోలుకుంటున్నారని తెలిపారు. శనివారం బాధితులను పరామర్శించిన అనంతరం ఆళ్ల నాని మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు ఏలూరులో పరిస్థితిని తెలుసుకుంటూ.. తగిన ఆదేశాలిస్తున్నారని చెప్పారు. బాధితులు పూర్తిగా కోలుకునే వరకు మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామన్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్య సిబ్బంది రోజూ పరిశీలించి.. నివేదికలు పంపిస్తున్నారని వివరించారు. బాధితుల ఇంటికే వైద్య సిబ్బంది వెళ్లేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఏలూరులో శానిటేషన్, తాగునీటిపై ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడించారు. తాగునీటిని మరింతగా పరీక్షించేందుకు కూడా తగిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో జేసీ హిమాన్షు శుక్లా, డీఎంహెచ్వో డాక్టర్ సునంద, ఏలూరు ఆర్డీవో రచన, నగర కమిషనర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
బాధితులను పరామర్శించిన ఆళ్ల నాని
సాక్షి, పశ్చిమగోదావరి: ఏలూరులో అస్వస్థతకు గురై.. చికిత్స అనంతరం కొలుకున్న బాధితులను డిప్యూటీ సీఎం, వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని శనివారం పరామర్శించారు. ఏలూరు టూటౌన్, తంగెళ్లమూడి ప్రాంతాల్లో బాధితుల ఇళ్ల వద్దకు నేరుగా వెళ్లి ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న శానిటేషన్ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, ప్రజలు భయాందోళన చెందనవసరం లేదని తెలిపారు. ఈ ఘటనకు కారణాలతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని విధాల చర్యలు తీసుకుంటామని మంత్రి ఆళ్లనాని పేర్కొన్నారు. (చదవండి: ఏదీ తేలిగ్గా తీసుకోవద్దు) ప్రభుత్వాసుపత్రిలో శనివారం ఉదయం నుండి రెండు అస్వస్థత కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 614 కేసులు నమోదయ్యాయి. 576 మంది ఆరోగ్యం నిలకడగా ఉండటంతో డిశ్చార్జ్ చేశారు. 35 మందిని మెరుగైన వైద్య చికిత్స కోసం విజయవాడ, గుంటూరు ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలో రెండు యాక్టివ్ కేసులు ఉన్నాయి. (చదవండి: టీడీపీ సెల్ఫ్గోల్: చీప్ ట్రిక్స్తో పోరాటం) -
ఏలూరు: ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి ఆళ్లనాని పర్యటన
-
ఏలూరులో పరిస్థితులపై సీఎం జగన్ ఆరా
సాక్షి, పశ్చిమ గోదావరి: ఏలూరు అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ సమావేశంలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు, జాయింట్ కలెక్టర్ హిమాన్షూ శుక్లా, ఆర్డీవో పనబాక రచన, డీఎంహెచ్వో డాక్టర్ సునంద పాల్గొన్నారు. అలాగే నేషనల్ సెంటర్ ఫర్ డిసిస్ కంట్రోల్ (ఎన్సీడీసీ) టీం సభ్యులు, పలు ప్రాంతాల నుంచి వైద్యనిపుణులు, సైంటిస్టులు వీడియో కాన్ఫరెన్స్కు హాజరు అయ్యారు. ఈ మేరకు ఏలూరులోని ప్రస్తుత పరిస్థితులపై సీఎం జగన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. చదవండి: ఏలూరు బాధితులకు సీఎం జగన్ బాసట ఇప్పటికే సాంపిల్స్ సేకరించిన ఎన్ఐఎన్ సైంటిస్టుల బృందంతో సీఎం జగన్ మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై త్వరగా నివేధిక ఇవ్వాలని కోరారు. శుక్రవారానికి ప్రాధమిక నివేదిక ఇస్తామని ఎన్ఐఎన్ సైంటిస్టులు తెలిపారు. ఈ రోజు ఏలూరులో పర్యటిస్తున్న కేంద్ర వైద్య నిపుణులతో సీఎం జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా టువంటి సాంపిల్స్ సేకరించారు, ప్రాధమికంగా ఇప్పటికే వచ్చి ఎయిమ్స్ నివేదిక గురించి చర్చించారు. ఇప్పటి వరకు అస్వస్థతతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి 585 మంది చేరగా.. 503 మంది ఆరోగ్యం నిలకడగా ఉండటంతో వైద్యులు డిశ్చార్జి చేశారు. ఇంకా 82 మందికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 32 మందిని మెరుగైన వైద్య చికిత్స కోసం విజయవాడ,గుంటూరు తరలించారు. కాగా ఏలూరులో అంతుచిక్కని అనారోగ్యం బారిన పడిన బాధితులకు అత్యున్నత వైద్య చికిత్స అందిస్తూనే కారణాలను గుర్తించేందుకు వివిధ రకాల నమూనాల విశ్లేషణ కొనసాగుతోంది. ఇక ఆస్పత్రులకు వస్తున్న బాధితుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. కోలుకుని ఇంటికి తిరిగి వెళ్లిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అదే విధంగా ఏలూరులో వింత వ్యాధికి గురై అస్వస్థతతో బాధపడుతున్న బాధితులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాసటగా నిలిచారు. అత్యుత్తమ వైద్య సదుపాయాలతోపాటు ఆరోగ్యశ్రీలో 3 రకాల చికిత్సలకు ప్యాకేజీ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. చదవండి: ఏలూరు: అస్వస్థత కేసులు తగ్గుముఖం మరోవైపు ఏలూరు టూటౌన్లో మంత్రి ఆళ్లనాని పర్యటిస్తున్నారు. అస్వస్థత ప్రభావిత ప్రాంతాల్లో శానిటేషన్ పనులను పరిశీలించారు. స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు. గుంటూరు, రాజమండ్రి నుంచి స్పెషలిస్టులను రప్పించామని తెలిపారు. ప్రస్తుతం 72 మంది చికిత్స పొందుతున్నారన్నారు. ఇతర ప్రాంతాల నుంచి నిపుణులను తీసుకువచ్చామని, వారి పర్యవేక్షణలో చికిత్స జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి నేరుగా వచ్చి తమకు దిశానిర్దేశం ఇచ్చారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు రాజకీయ బురద జల్లేందుకు యత్నిస్తున్నారని మండిప్డారు. చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు పనికిమాలిన లేఖ రాశారు ‘ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు వైఖరి అత్యంత దురదృష్టకరం. నీచ రాజకీయాలకు పాల్పడుతూ ఇంకా నీచమైన విమర్శలకు దిగుతున్నారు. కరోనా సమయంలో హైదరబాద్లో గోళ్లు గిలుకుంటు కుర్చుని ముఖ్యమంత్రి ఏమి చేస్తున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి ఏమి చేస్తున్నారు అని మాట్లాడటం ప్రజలకు సేవలకందించే కార్యక్రమాలు అడుకునేవిధంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులో ప్రజలకు సేవలందించే పనిలో నిమగ్నమై ఉంటే బ్లీచింగ్ పౌడర్ లో జగన్ మోహన్ రెడ్డి బందువు అవినీతి జరిగిందంటూ నీచమైన రాజకీయంగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు.ఈ ఘటనపై సలహాలు ఇవ్వలసింది పోయి ప్రజల ఆరోగ్యం పట్ల అత్యంత నిర్లక్ష్యం గా రాజకీయాలు చేస్తున్నారు. ఏలూరు వింత వ్యాధికి కారణలు ఏమిటనేదానిపై కేంద్ర బృందాలు నిమగ్నమయ్యాయి. ఇప్పటికే సాంపిల్స్ సేకరించారు. వాటిపైన అధ్యయనం చేసి నివేదికలు ఇవ్వనున్నారు. చంద్రబాబు నాయుడికి ఎన్నిసార్లు చెప్పిన చేవిటి వాడి ముందు శంకం ఊదినట్లే. ఇంకా ఆయన వ్యాఖ్యలు మేము పట్టించుకోము. మేము ఇంత చర్యలు తీసుకుంటు శానిటేషన్ పనులు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటే ఈ రోజు చంద్రబాబు పనికిమాలిన లేఖ రాశారు. త్రాగునీరు,డ్రైనేజి వ్యవస్థ క్షేత్ర స్దాయిలో పరిశీలిస్తున్నాం. ఈ రోజు ఉదయమే చంద్రబాబు కు మేలుకువ వచ్చింది. ఆయన పుత్రరత్నం పంపించారు, ఆయన వచ్చి పైపై పరామర్శలు చేసి హైదరాబాద్ వెళ్లి కూర్చున్నారు. ఇప్పుడు నిద్రలేచి కేసులు తగ్గుముఖం పట్టడంతో కాబట్టి ఏదో విధంగా అడుకోవాలని నీచ రాజకీయాలకు అంతులేదు. చంద్రబాబు విమర్శలపై ప్రజలు మండిపడుతున్నారు. ఏలూరులో కేసులు తగ్గుముఖం పడుతున్నాయి, ఎవరూ ఆందోళన చెందనవసరం లేదు.’ అని స్పష్టం చేశారు. -
ఏలూరు బాధితులకు సీఎం జగన్ బాసట
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరులో వింత వ్యాధికి గురై అస్వస్థతతో బాధపడుతున్న బాధితులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాసటగా నిలిచారు. మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఏలూరులో బాధితులను స్వయంగా పరామర్శించిన ఆయన వారికి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించారు. మూర్ఛ వ్యాధితో బాధపడే రోగులకు అత్యుత్తమ వైద్య సదుపాయాలతోపాటు ఆరోగ్యశ్రీలో 3 రకాల చికిత్సలకు ప్యాకేజీ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసినట్లు ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మంగళవారం మీడియాకు తెలిపారు. ► ఇంతకు ముందు సాధారణ మూర్ఛ వ్యాధిగ్రస్తుడు మూడు రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందితే ప్రభుత్వం సహాయం అందించేది. ప్రస్తుతం ఐదు రోజులపాటు వైద్యం పొందినప్పటికీ ఆ సాయం వర్తింపజేస్తారు. ► మూర్ఛ వ్యాధిగ్రస్తులకు ప్రస్తుతం ఉన్న ప్యాకేజీ రూ.10,000 నుంచి రూ.15,688 వరకు పెంచారు. 8 రకాల రక్త పరీక్షలను కూడా ఈ ప్యాకేజీలో కలిపారు. చిన్న పిల్లలకు ప్రస్తుతం ఉన్న ప్యాకేజీ రూ.10,262 నుంచి రూ.12,732కు పెంచారు. 6 రకాల రక్త పరీక్షలను అందులో చేర్చారు. ► ఐదు రోజులకు మించి అదనంగా చికిత్స పొందే మూర్ఛ వ్యాధిగ్రస్తులకు రోజుకు రూ.900, ఐసీయూలో చికిత్స పొందుతున్న వారికి రూ.2,000 ప్యాకేజీని కొత్తగా చేర్చారు. నూతన విధానం మేరకు రక్త పరీక్షలకు 23.73 శాతం రేటు పెంచడం వల్ల అన్ని నెట్వర్క్ (ప్రభుత్వ, ప్రైవేట్) ఆస్పత్రులకు ప్రయోజనం చేకూరుతుంది. -
అప్రమత్తంగా ఉండండి
సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షి, అమరావతి: ఏలూరు నగరంలో అస్వస్థతకు గురైన బాధితులకు సత్వరమే మెరుగైన వైద్య చికిత్స అందించటం, ఆస్పత్రిలో సౌకర్యాలు, వైద్యుల నిరంతర పర్యవేక్షణ ఉండేలా పటిష్ట చర్యలు చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి, పరీక్షల నివేదికలపై మంగళవారం ఆయన ఆరా తీ«శారు. ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానితో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు చెందిన వైద్య బృందాలు నిర్వహించిన పరీక్షల వివరాలను అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఏలూరు నగరంలో ఎయిమ్స్ వైద్య నిపుణుల బృందం నిర్వహించిన పరీక్షల్లో సీసం, నికెల్ వంటి మూలకాలు ఉన్నట్లు గుర్తించారని, మరిన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారని, పరీక్ష రిపోర్టులు రావాల్సి ఉందని సీఎంకు వివరించారు. అధిక సంఖ్యలో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్న ప్రాంతాల్లో తాగునీరు, పాలు తదితర పరీక్షలకు సంబంధించి తుది ఫలితాల నివేదికను తనకు అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రాథమిక పరీక్షల్లో వెల్లడైన అంశాల మేరకు సీసం, నికెల్ లాంటి మూలకాలు ఆ ప్రాంతంలోని ప్రజల శరీరాల్లోకి ఏ విధంగా చేరాయో.. వాటికి కారణాలు ఏమిటో? పూర్తి స్థాయిలో పరిశోధన చేసి నివేదిక ఇవ్వాలన్నారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అనారోగ్యానికి సంబంధించిన కారణాలు తెలుసుకునేందుకు నిశితంగా పరిశీలన చేయాలని, అధ్యయనం చేయటం ద్వారా అస్వస్థతకు దారితీసిన కారణాలు గుర్తించవచ్చన్నారు. ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో బాధితులకు అందిస్తున్న వైద్య చికిత్సలు, సేవలపై ఆరా తీశారు. బాధితులకు మెరుగైన సదుపాయాలు కల్పించి వైద్య సేవలు కొనసాగించాలని, ఎక్కడా ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు ప్రణాళికతో పని చేయాలని సూచించారు. బుధవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏలూరు నగరంలోని పరిస్థితిని సమీక్షిస్తానని, అప్పటికి పూర్తి స్థాయి నివేదికలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఏలూరులో పరిస్థితిపై గవర్నర్ ఆరా ఏలూరులో అంతుచిక్కని రీతిలో ప్రజలు అస్వస్థతకు గురవుతున్న విషయమై రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో మాట్లాడారు. మంగళవారం ఆయన వైఎస్ జగన్కు ఫోన్ చేసి ఏలూరు ఘటన, తదనంతర పరిస్థితిపై ఆరా తీశారు. ఆస్పత్రిలో చేరిన వారందికీ పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తున్నామని, అత్యవసర వైద్యం అవసరమైన వారిని తక్షణం విజయవాడ తరలిస్తున్నామని సీఎం చెప్పారు. వ్యాధి మూలాలను తెలుసుకునేందుకు జాతీయ స్థాయి వైద్య పరిశోధనా సంస్థల సహకారం తీసుకుంటున్నామని కూడా వివరించారు. ఎయిమ్స్, ఐఐసీటీ, సీసీఎంబీ, ఎన్ఐఎన్ వంటి ప్రముఖ సంస్థలు బాధితుల రక్త నమూనాలతోపాటు ఇతర నమూనాలు సేకరించి పరిశీలిస్తున్నాయని సీఎం గవర్నర్కు తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని గవర్నర్ సూచించారు. -
332 మంది డిశ్చార్జ్
సాక్షి ప్రతినిధి, ఏలూరు/ఏలూరు టౌన్/లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఏలూరులో అంతుచిక్కని వ్యాధి బారిన పడిన వారి సంఖ్య సోమవారం రాత్రి 10 గంటల సమయానికి 475కు చేరింది. వారిలో 332 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగా.. 125 మంది ఏలూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 18 మందిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. మొత్తం బాధితుల్లో 253 మంది పురుషులు కాగా.. 222 మంది మహిళలు ఉన్నారు. పెస్టిసైడ్, ఇ–కోలి పరీక్షల రిజల్ట్స్ రావాల్సి ఉంది. అధికార యంత్రాంగం మొత్తం ఏలూరులోనే మోహరించి వ్యాధి ఏమిటనేది తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ప్రతినిధి బృందం సైతం చేరుకుంది. ఈ బృందం మూడు రోజుల పాటు నగరంలో పర్యటించి వ్యాధిపై అధ్యయనం చేయనుంది. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్తోపాటు వైద్య శాఖ ఉన్నతాధికారులు, వైద్య నిపుణులు ఏలూరులోనే ఉంటూ పర్యవేక్షిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్, కలెక్టర్ ఆర్.ముత్యాలరాజుతో కలిసి తాజా పరిస్థితిపై ప్రభుత్వాస్పత్రిలో సోమవారం రాత్రి సమీక్షించారు. ప్రభుత్వాస్పత్రిలో 9 వార్డుల్లో 250 బెడ్లు సిద్ధంగా ఉన్నాయని, మరో 50 బెడ్లు సైతం అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. చికిత్స పొందుతున్న బాలుడిని పలకరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంతటా అప్రమత్తం ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్య సేవలందిస్తూ భరోసా కల్పించేందుకు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. నగరంలోని 62 వార్డు సచివాలయాలతోపాటు మొత్తం 84 చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఏలూరు నుంచి విజయవాడ, గుంటూరు జీజీహెచ్లకు తరలించే రిఫరల్ కేసులను పర్యవేక్షించేందుకు ఒక నోడల్ అధికారిని నియమించారు. మంగళవారం నుంచి 32 డివిజన్లలో సూపర్ శానిటైజేషన్ చేసేలా చర్యలు తీసుకున్నారు. తాగునీటి పైపులు ఏమైనా లీకేజీలుంటే అరికట్టడం, డ్రైనేజీ వ్యవస్థలో లోపాలను సరిచేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో అంబులెన్సులు ఉండేలా ఏర్పాట్లు చేశారు. విజయవాడలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.శివశంకరరావు తెలిపారు. -
వైద్యులు అందుబాటులో ఉండాలి: ఆళ్ల నాని
సాక్షి, పశ్చిమగోదావరి: ఏలూరు ఘటనపై ప్రభుత్వాసుపత్రిలో డిప్యూటీ సీఎం, వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే అబ్బాయ చౌదరి, కలెక్టర్, వైద్యాధికారులు హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ ఈ తరహా కేసులను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు కృషిచేయాలని సూచించారు. తొమ్మిది వార్డులకు ప్రత్యేక డాక్టర్ను నియమించడంతో పాటు.. ప్రతి 9 బెడ్లకు ఒక డాక్టర్ అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు. (చదవండి: సర్కారు బాసట.. కోలుకుంటున్నారు) 84 వైద్య శిబిరాలు ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారం పాటు ఏలూరు పరిసర ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో శానిటేషన్ చేయాలన్నారు. విజయవాడ, గుంటూరు ప్రభుత్వాస్పత్రుల్లో నోడల్ ఆఫీసర్స్ నియమించడంతో పాటు, మందులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని అధికారులను ఆళ్ల నాని ఆదేశించారు. ‘‘చికిత్సపొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి. అన్ని గ్రామ సచివాలయాల్లో వైద్య శిబిరాలు కొనసాగించాలి. అన్నివిధాలా సిద్ధంగా ఉండాలని వైద్యులకు మంత్రి ఆళ్ల నాని సూచించారు. (చదవండి: మనం కట్టేవి ఇళ్లు కావు.. ఊళ్లు: సీఎం జగన్) -
సర్కారు బాసట.. కోలుకుంటున్నారు
సాక్షి ప్రతినిధి, ఏలూరు/ సాక్షి, అమరావతి: ఉన్నట్టుండి అస్వస్థతకు గురై ఇబ్బంది పడుతున్న ఏలూరు ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోంది. బాధితులందరికీ సత్వరమే మెరుగైన వైద్యం అందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. శనివారం సాయంత్రం నుంచి ఏలూరులో ఫిట్స్ వ్యాధి లక్షణాలతో ప్రజలు ఆసుపత్రుల్లో చేరటం ఆందోళన కలిగించిన విషయం తెలిసిందే. ఆకస్మికంగా కింద పడిపోవటం, కొందరికి నోటి వెంట నురగలు రావటం, వాంతులు చేసుకోవటం, స్పృహ కోల్పోవటం వంటి లక్షణాలతో అనారోగ్యానికి గురికావటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. శనివారం ఉదయం నుంచి ప్రారంభమైన ఈ వ్యాధి ప్రభావం ఆదివారం నెమ్మదించింది. సాయంత్రానికి బాధితుల సంఖ్య 286కు చేరింది. సీఎం ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు జిల్లా అధికార యంత్రాంగాన్ని మోహరించారు. బాధితులకు సత్వరమే వైద్య సేవలు అందించేలా పటిష్ట చర్యలు చేపట్టారు. 117 మంది డిశ్చార్జ్.. ఒకరు మృతి – తొలుత ఏలూరు దక్షిణపు వీధి, పడమర వీధిలో ప్రారంభమైన ఈ వ్యాధి లక్షణాలు ఆదివారం ఉదయానికి నగరంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలకు విస్తరించాయి. ఆదివారం సాయంత్రం వరకు ఆస్పత్రుల్లో చేరిన 286 మంది బాధితుల్లో 117 మంది కోలుకుని ఇంటికి చేరుకున్నారు. మిగతా వారు కోలుకుంటున్నారు. కాగా, విద్యానగర్కు చెందిన శ్రీధర్ (45) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. బాత్రూమ్కు వెళ్లి తల తిరిగి కింద పడిపోయాడు. చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. – పలువురు బాధితులు కొద్ది సేపటికే కోలుకుని సాధారణ స్థితికి రావటంతో వైద్యులు, అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. శనివారంతో పోలిస్తే, ఆదివారం ఆస్పత్రికి వచ్చిన బాధితులు అందులో పాతిక వంతు కూడా లేకపోవడం ఊరట కలిగించింది. మీడియాతో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, ఎమ్మెల్యే వాసు, కలెక్టర్ ముత్యాల రాజు తదితరులు అధికార యంత్రాంగం, వైద్య నిపుణుల పర్యవేక్షణ – ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో పూర్తిగా బాధితుల కోసమే వార్డులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే 300 బెడ్స్ను సిద్ధంగా ఉంచిన అధికారులు, అవసరమైతే ఆశ్రం ఆస్పత్రి, ఇతర ప్రైవేట్ ఆస్పత్రులను స్వాధీనం చేసుకుని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. – ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానితో పాటు జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఏలూరు ఆర్డీవో పనబాక రచన, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సునంద, డీసీహెచ్ఎస్ డాక్టర్ ఏవీఆర్ మోహన్, రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ మామిళ్లపల్లి జయప్రకాష్, ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిరిశాల వరప్రసాద్ జిల్లా ఆసుపత్రిలో మకాం వేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సర్వే చేస్తూ ఇల్లిల్లూ ఆరా – అంతుచిక్కని వ్యాధి నిర్ధారణ, వైద్య చికిత్సల నిమిత్తం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. నగరంలోని దక్షిణపు వీధి, పడమర వీధి ప్రాంతాలతో పాటు ప్రభావిత ప్రాంతాలలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. – బాధితులు ఉంటున్న ప్రాంతాల్లో అశా వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలతో ఇంటింటా ఆరోగ్య స్థితిపై సర్వే చేపట్టారు. ఎవరైనా అనారోగ్యంతో బాధ పడుతుంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లేలా సూచనలు చేస్తున్నారు. – ఏలూరు నగరంతో పాటు తంగెళ్లమూడి, ఖండికగూడెం ప్రాంతాల్లో తాగునీటి ట్యాంకులు, డ్రైయినేజీలను శుభ్రం చేయటం, బ్లీచింగ్ చల్లటం వంటి కార్యక్రమాలు చేపట్టారు. – విజయవాడ నుంచి ప్రత్యేక వైద్య బృందాలు ఏలూరు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. వారు కూడా మంచినీటి శాంపిల్స్ టెస్టింగ్ నిర్వహించారు. నీటి శాంపిల్స్ అన్నీ బాగుండటం, బాధితులకు చేసిన సీటీ స్కాన్, రక్త పరీక్షలు కూడా నార్మల్ అని రావడంతో అసలు ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతోందనే దానిపై స్పష్టత రాలేదు. దీంతో సోమవారం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ బృందాన్ని రప్పిస్తున్నారు. ఫలానా కారణమంటూ ఏదీ లేదు.. ఐపీఎం (ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రీవెంటివ్ మెడిసిన్) అధికారుల బృందం ఏలూరుకు చేరుకుంది. ఇప్పటి వరకు చేసిన టెస్టుల ఫలితాలన్నీ నార్మల్గా ఉన్నాయి. దీంతో కల్చర్ టెస్టు కోసం రక్త నమూనాలను విజయవాడలోని వీఆర్డీఎల్ ల్యాబొరేటరీకి పంపించారు. పాలలో హెవీ మెటల్స్, పెస్టిసైడ్స్ ఏమైనా ఉన్నాయా అన్నది పరిశీలిస్తున్నారు. ఏలూరు బాధితుల నుంచి రక్త నమూనాలు, అక్కడి నీటి నమూనాలు సేకరించి పరిశీలించామని, ఫలానా కారణమంటూ ఏమీ తేలలేదని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం ఏలూరు వచ్చిన ఆయన కలెక్టర్ ముత్యాలరాజును కలిశారు. బాధితుల ఆరోగ్యస్థితిపై ఆరా తీశారు. ఈకోలీ పరీక్ష ఫలితం రావాల్సి ఉందన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ వారు సోమవారం ఏలూరు నగరానికి వస్తున్నారని, తాగునీటిపై వారు మరిన్ని పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. కాగా, ఇది ప్రమాదకరం కాదని ప్రాథమికంగా అంచనా వేశామని, అందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నామని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ గీతాప్రసాదిని విజయవాడలో పేర్కొన్నారు. పరిస్థితిపై సీఎం జగన్ ఆరా.. నేడు ఏలూరుకు ఏలూరులో ప్రజలు ఆకస్మికంగా అనారోగ్యం బారినపడుతున్న పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానితో ఫోన్లో సమీక్షించారు. సకాలంలో స్పందించి బాధితులకు బాసటగా నిలిచి మెరుగైన వైద్య సేవలు అందించాలంటూ ఆదేశించారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకుండా మెరుగైన సౌకర్యాలు, వైద్య సేవలు అందించాలని చెప్పారు. వ్యాధి లక్షణాలు పూర్తి స్థాయిలో అ«ధ్యయనం చేసేందుకు ఏలూరుకు ప్రత్యేకంగా వైద్య బృందాలను పంపుతున్నామన్నారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందవద్దని, ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని స్పష్టం చేశారు. కాగా, ఏలూరులో అస్వస్థతకు గురైన వారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం పరామర్శించనున్నారు. ఉదయం 9:30 గంటలకు తాడేపల్లి నుంచి బయలు దేరి 10:20 గంటలకు ఏలూరు చేరుకుంటారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. తర్వాత స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం అవుతారు. ఐదుగురికి గుంటూరు జీజీహెచ్లో చికిత్స గుంటూరు ఈస్ట్: పరిస్థితి తీవ్రంగా ఉన్న ఏలూరు ఆర్ఆర్పేటకు చెందిన కె.కుసుమకుమారి, పి.శంభులింగాచారి, పి.రమణమ్మ, దక్షిణపేటకు చెందిన పి.చలపతిరావు, ఎం.ఆండాళ్లకు మెరుగైన చికిత్స నిమిత్తం ఆదివారం గుంటూరు జీజీహెచ్కు తీసుకొచ్చారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి, ఆర్ఎఓఓ డాక్టర్ సతీష్కుమార్ పర్యవేక్షణలో వారికి చికిత్స చేస్తున్నారు. వీరికి ఎంఆర్ఐ స్కానింగ్తోపాటు ఇతర పరీక్షలు చేశారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రకటించారు. విజయవాడలో నలుగురికి చికిత్స లబ్బీపేట (విజయవాడ తూర్పు) : ఏలూరుకు చెందిన సురేష్ (24), నాలుగు నెలల గర్భిణీ కె.అనురాధ(27), బి సింహాచలం(80), ప్రభ (6) విజయవాడ ప్రభుత్వాస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ నలుగురిని న్యూరాలజిస్టులు, జనరల్ మెడిసిన్, అనస్థీషియా నిపుణులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ప్రభ ఆరోగ్యం కుదుటపడిందని, ఆదివారం సాయంత్రం పాలు కూడా తీసుకున్నట్లు వైద్యులు తెలిపారు. సురేష్, అనురాధలు కొద్దిగా మగతలో ఉన్నట్లు తెలిపారు. గైనకాలజిస్టులు అనురాధకు స్కాన్ చేసి, పరిశీలించారు. 80 ఏళ్ల సిహాచలంకు బీపీ ఉందని, సీటీ స్కాన్లో బ్రెయిన్లో క్లాట్స్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అవి ఇప్పుడు వచ్చినవి కావని, పాతవేనని చెపుతున్నారు. ఈమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అయితే వారికి ఫిట్స్ ఎందుకు వచ్చాయనేది ఇప్పుడే చెప్పలేమని వైద్యులు పేర్కొంటున్నారు. -
ఏలూరు ఘటన: క్రమంగా తగ్గుతున్న కేసులు..
సాక్షి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అస్వస్థతకు గురైన బాధితుల సంఖ్య ఇప్పటివరకు 270కి చేరింది. అస్వస్థతకు గురైన బాధితులు ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఇప్పటివరకు 117 మందిని డిశ్చార్జ్ చేశామని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం పదిమందిని అధికారులు విజయవాడ తరలించారు. బాధితులకు వైద్యసిబ్బంది అలుపెరగకుండా సేవలు అందిస్తున్నారు. (చదవండి: భయపడవద్దు.. అండగా ఉంటాం: ఆళ్ల నాని) లక్షణాలు కనిపించిన ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. వైద్య బృందం.. ఇంటింటికి ఆరోగ్య సర్వే చేపట్టింది. టెస్టుల కోసం శాంపిల్స్ను అధికారులు వైరాలజీ ల్యాబ్కు పంపించారు. ఫిట్స్ లక్షణాలతో చేరిన బాధితులకు ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో అదనపు బెడ్లు ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం ఆళ్లనాని ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మంత్రి ఆళ్లనాని పర్యవేక్షణలో కలెక్టర్, అధికారులు చర్యలు చేపట్టారు. కంట్రోల్ రూమ్ ద్వారా కలెక్టర్.. అధికారులకు దిశానిర్దేశం చేశారు. (చదవండి: ఏలూరు ఘటనపై సీఎం జగన్ ఆరా) డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సమీక్ష.. ఉదయం నుంచి క్రమంగా కేసులు తగ్గాయని మంత్రి ఆళ్లనాని తెలిపారు. ఆదివారం సాయంత్రం కలెక్టర్, డీఎంహెచ్వో, వైద్యులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువగా కేసులు నమోదైన ప్రాంతాల్లో 108 వాహనాలు సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సీఎం కార్యాలయం నుంచి గంట గంటకు ఇక్కడి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారని మంత్రి తెలిపారు. ‘‘నీరు, ఫుడ్ పాయిజన్ లాంటివి ఏమీ జరగలేదు. విజయవాడ ఎయిమ్స్ నుంచి ప్రత్యేక వైద్య బృందం వచ్చింది. నిపుణుల బృందాలు కూడా ఏలూరు రానున్నాయి. ఎక్కువగా కేసులు నమోదైన ప్రాంతాల్లో వాలంటీర్లు సర్వే చేపట్టారు. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని రేపు(సోమవారం) సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శిస్తారు. అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సీఎం సమీక్షిస్తారని మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. -
కేసులు వస్తున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం: ఆళ్లనాని
-
భయపడవద్దు.. అండగా ఉంటాం: ఆళ్ల నాని
సాక్షి, ఏలూరు : అస్వస్థతకు గురై ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఆళ్ల నాని ఆదివారం ఉదయం మరోసారి పరామర్శించారు. వార్డులో ఉన్న ప్రతి పేషెంట్ దగ్గరికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులతో పాటు, అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు 227 కేసులు నమోదయ్యాయి.ఇంకా మూర్ఛ, వాంతులు వంటి బాధితులు పెరుగుతున్నారు. ప్రభుత్వాస్పత్రిలోనే కాకుండా ప్రయివేట్ ఆసుపత్రుల్లో వీరు చేరారు. ఇప్పటివరకూ70 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. బాధితుల్లో 105 మంది పురుషులు, 76 మంది స్త్రీలు, 46 మంది చిన్నారులు ఉన్నారు. (ఏలూరు ఘటనపై సీఎం జగన్ ఆరా) కేసుల వస్తున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ప్రభావిత ప్రాంతాల్లో మెడికల్ క్యాంప్లు ఏర్పాటు చేశాం. ఇంటింటి సర్వే చేసి ఆరోగ్య పరిస్థితి సమీక్షిస్తున్నాం. మెరుగైన వైద్యం కోసం కొందరిని విజయవాడ తరలించాం. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నాం. ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ఫోన్ చేశారు. ఘటనపై సీఎం జగన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిస్థితి చక్కబడే వరకు అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. బాధితులకు బాసటగా ఉంటాం. ఎటువంటి ఆందోళన చెందవద్దు. ప్రాణాంతకమైన వ్యాధి కాదు, ఎవరు భయపడవద్దు. ప్రత్యేక వైద్య బృందాలను ఏలూరు పంపించి వ్యాధి లక్షణాలపై పరీక్షలు చేస్తామని ముఖ్యమంత్రి ఆదేశించారు. (ఏలూరులో కలకలం.. పలువురికి అస్వస్థత) ఎవరికీ ప్రాణపాయం లేదని వైద్యులు చెబుతున్నారు. చికిత్స అనంతరం సాధారణ స్థితికి వస్తున్నారు. నీటి నమూనా సేకరించిన రాష్ట్ర స్థాయి ల్యాబ్కు పంపాం. నీటిలో కాలుష్యం లేదని నివేదికలో తేలింది. బాధితుల రక్త నమునాలు సేకరించి ల్యాబ్కు పంపాం. ఎలాంటి వైరస్ కారణాలు లేవని తేలింది. మరికొన్ని రిపోర్టులు రావాల్సి ఉంది. వచ్చాక కారణాలు తెలుస్తాయి. ఈ పరిస్థితికి కారణాలను ఆన్వేషిస్తున్నాం. స్వయంగా ముఖ్యమంత్రి పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు’ అని తెలిపారు. అంతకు ముందు ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అంతుచిక్కని వ్యాధిపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, గవర్నమెంట్ హాస్పిటల్ సూపరెండెంటెంట్, డీఎంహెచ్వో, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. -
ఎలాంటి భయాందోళన చెందొద్దు: సీఎం జగన్
-
ఏలూరు ఘటనపై సీఎం జగన్ ఆరా
సాక్షి, ఏలూరు: ఏలూరు ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో ఆరా తీశారు. డిప్యూటీ సీఎం, వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని ప్రస్తుత పరిస్థితులను, బాధితుల వివరాలను సీఎం జగన్కు వివరించారు. ఈ సందర్భంగా సకాలంలో స్పందించి, బాధితులకు బాసటగా నిలిచి.. వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ముందస్తు చర్యలు చేపట్టిన మంత్రి నానిని సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకంగా అభినందించారు. ఏలూరు గవర్నమెంట్ ఆస్పత్రిలో వైద్యబృందం, జిల్లా యంత్రాంగం, అధికారుల పనితీరును సీఎం జగన్ అభినందించారు. రాత్రంతా మేల్కొని గవర్నమెంట్ ఆస్పత్రిలో బాధితులపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న మంత్రి ఆళ్ల నాని పనితీరుపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. చదవండి: (ఏలూరు ఘటన: 20 మంది డిశ్చార్జ్) కాగా, ఏలూరులో వివిధ లక్షణాలతో అనారోగ్యానికి గురై ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన బాధితులకు అన్నివిధాలుగా అండగా ఉంటాం. వ్యాధి లక్షణాలను పూర్తిస్థాయిలో తెలుసుకునేందుకు విజయవాడ నుంచి ప్రత్యేకంగా ఏలూరుకు వైద్యబృందాలను పంపిస్తున్నాం. ఎలాంటి భయాందోళన చెందొద్దు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా నిపుణులయిన వైద్య పరీక్షలు చేయిద్దాం. అవసరమయితే మెరుగైన వైద్యసదుపాయం కల్పించడం కోసం అన్ని విధాలుగా అండగా ఉంటాం. ప్రత్యేక వైద్యబృందాలు ఈ ఉదయం ఏలూరుకు వస్తున్నాయి. అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలన చేస్తారు. ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటునందిస్తుందని సీఎం వైఎస్ జగన్ మంత్రి ఆళ్లనానికి భరోసా ఇచ్చారు. చదవండి: (ఏలూరులో కలకలం.. పలువురికి అస్వస్థత) -
ఏలూరు ఘటన: 20 మంది డిశ్చార్జ్
సాక్షి, ఏలూరు: నగరంలోని వన్టౌన్ ఏరియాలో అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన బాధితులు డిశ్చార్జ్ అవుతున్నారు. శనివారం అర్ధరాత్రి డాక్టర్ల బృందం పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించిన అనంతరం.. 20 మంది బాధితులు పూర్తి ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించే విషయంలో డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్ల ప్రత్యేక పర్యవేక్షణలో ఏలూరు కార్పొరేషన్ అధికారులతో సమావేశం నిర్వహించి పరిస్థితిని మోనిటరింగ్ చేయడానికి మంత్రి ఆదేశాలు ఇచ్చారు. చదవండి: (ఏలూరులో కలకలం.. పలువురికి అస్వస్థత) ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఇంచార్జి డీసీహెచ్ఎస్ డాక్టర్ ఏవీఆర్ పర్యవేక్షణలో వైద్యుల బృందం ప్రత్యేకంగా వైద్యసేవలు అందిస్తోంది. ఈ మేరకు వైద్యుల బృందం మీడియాతో మాట్లాడుతూ.. ఏలూరు నగరంలో ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దు. అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం. మంత్రి ఆళ్ల నాని ఆదేశాల మేరకు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ మామిళ్ళపల్లి జై ప్రకాష్ ప్రభుత్వ ఆస్పత్రిలో మకాం వేసి బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు సమన్వయం చేస్తున్నారు. ఏలూరులో అనారోగ్యానికి గురైన ప్రాంతాలలో ప్రత్యేకంగా మెడికల్ టీమ్లు, ఇంటింటి సర్వే చేపట్టామని తెలిపారు. కాగా, మంత్రి ఆదేశాల మేరకు ఏలూరు ఆర్డీవో పనబాక రచన, ఎమ్మార్వో సోమశేఖర్ ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించారు. -
ఏలూరులో పలువురికి అస్వస్థత
సాక్షి ప్రతినిధి, ఏలూరు/లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఏలూరు నగరంలో పలువురు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. ఒక్కసారిగా ఫిట్స్ రావడం, కిందపడిపోయి నోటి వెంట నురగలు కక్కడం వంటి లక్షణాలతో శనివారం అనేకమంది ఆస్పత్రుల పాలయ్యారు. మొదట దక్షిణపు వీధి, పడమర వీధిలో ప్రారంభమైన కేసులు ఆ తరువాత తూర్పు వీధి, కొత్తపేట, మాదేపల్లి రోడ్డులోని ప్రేమాలయం ప్రాంతం, కొబ్బరి తోట, అశోక్నగర్, గన్ బజార్, తంగెళ్లమూడి, మరడాని రంగారావు కాలనీ, వంగాయగూడెం, శనివారపు పేట వరకూ విస్తరించాయి. శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి 11.30 గంటలకు సుమారు 95 మందికి పైగా ఇలాంటి లక్షణాలతో ప్రభుత్వాస్పత్రిలో చేరారు. వీరిలో ఆరేళ్ల చిన్నారి ప్రభ పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 95 మందిని ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స అందిస్తుండగా.. ఇప్పటివరకు 30 మంది వైద్య సేవల అనంతరం కోలుకోవడంతోడిశ్చార్జ్ చేశారు. మరికొందరు తమకూ సమస్య వచ్చిందనే అనుమానంతో ఆందోళనకు గురై ఆస్పత్రికి వచ్చారు. బాధితులను ఆస్పత్రికి తరలించడం కోసం 10 అంబులెన్స్లను సిద్ధం చేశారు. విషయం తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అధికారులను అప్రమత్తం చేశారు. ఆ వెంటనే విజయవాడ నుంచి ఏలూరు ప్రభుత్వాస్పత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం బాధిత ప్రాంతాలలో పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పారు. వైద్యులు నిత్యం పర్యవేక్షించాలని, బాధితులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విజయవాడలోని ప్రభుత్వాస్పత్రిలో బాధితుల కోసం ప్రత్యేకంగా వార్డును కేటాయించి చికిత్సకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నిపుణులతో కూడిన వైద్య బృందాన్ని అనుక్షణం అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. జేసీ హిమాన్షు శుక్లా, డీఎంహెచ్వో డాక్టర్ సునంద, వైద్యులు శ్రీనివాస్, విజయభాస్కర్తో మంత్రి సమీక్షించారు. అంతు చిక్కని వైనం ప్రజలు కళ్లు తిరిగి పడిపోవడం, ఫిట్స్ బారిన పడటానికి కారణం ఏమిటనేది ఇంకా తెలియరాలేదని వైద్యులు చెబుతున్నారు. సీటీ స్కాన్లో అందరికీ నార్మల్ రిపోర్టులు వస్తున్నాయని తెలిపారు, పూర్తిస్థాయి పరీక్షల అనంతరమే కారణం ఏమిటనేది నిర్ధారించగలమని పేర్కొంటున్నారు. ఇదిలావుండగా.. నగర వాసులకు అంతుచిక్కని వ్యాధి సోకుతోందనీ, తాగునీటి కాలుష్యమే ఇందుకు కారణమంటూ వార్తలు వ్యాప్తి చెందటంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. విజయవాడలో స్పెషల్ ఐసీయూ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఆదేశాలతో విజయవాడ జీజీహెచ్ వైద్యులు అప్రమత్తమయ్యారు. ఏలూరు నుంచి ఏ సమయంలో కేసులు వచ్చినా తక్షణమే మెరుగైన వైద్యం అందించేందుకు అప్పటికప్పుడు 30 పడకలతో ప్రత్యేక ఐసీయూను సిద్ధం చేశారు. వెంటిలేటర్లు, పల్స్ ఆక్సీమీటర్లు వంటివి కూడా అందుబాటులో ఉంచారు. 20 మంది నిపుణులతో కూడిన వైద్య బృందాన్ని 24 గంటలూ అందుబాటులో ఉండేలా నియమించారు. వారిలో జనరల్ మెడిసిన్, పల్మనాలజీ, క్రిటికల్ కేర్, పీడియాట్రిక్, న్యూరాలజీ నిపుణులు ఉన్నారు. బాధితులకు పరీక్షలు చేసేందుకు సీటీ స్కాన్, ఎంఆర్ఐ సిబ్బంది, రేడియాలజిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్లను అందుబాటులో ఉంచారు. స్థిరంగా బాలిక ఆరోగ్యం ఏలూరు నుంచి తీసుకొచ్చిన ఆరేళ్ల చిన్నారి ప్రభను విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలోని పీడియాట్రిక్ ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బాలిక ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు. ఆమెకు ఎందుకు అలా జరిగిందో తేలాల్సి ఉందని సూపరింటెండెంట్ శివశంకరరావు పేర్కొన్నారు. -
ఏలూరులో కలకలం.. పలువురికి అస్వస్థత
సాక్షి, ఏలూరు టౌన్ : ఏలూరు నగరం విచిత్రమైన వ్యాధితో శనివారం వణికిపోయింది. వన్టౌన్లోని దక్షిణపు వీధి, పడమరవీధి, టూటౌన్ ప్రాంతంలోని గన్బజార్, కొత్తపేట, అశోక్నగర్, రూరల్ ప్రాంతంలోని శనివారపుపేట ఏరియా ప్రజలు ఈ వ్యాధి బారిన పడుతూ ఉండడంతో నగరంలో జనం హడలెత్తిపోయారు. పలువురు ఫిట్స్ మాదిరి నోటి వెంట నురగతో పడిపోవడంతో కుటుంబీకులు వారిని హాస్పిటల్కు తరలించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త తరహాగా వ్యాధి ఉండటంతో వైద్యులకు జబ్బు ఏమిటో అర్థంకాలేదు. వ్యాధితో పడిపోయిన వారు 10 నుంచి 20 నిమిషాల అనంతరం తిరిగి మామూలు స్థితికి చేరుతున్నారు. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పదుల సంఖ్యలో జనం కళ్లు తిరుగుతూ పడిపోగా.. రాత్రికి ఈ సంఖ్య 95 వరకు చేరింది. అంతుచిక్కని ఈ వ్యాధితో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎవరికీ ప్రాణాపాయం లేకున్నా ఆకస్మికంగా పడిపోవటంతో ప్రజలు భయపడుతున్నారు. వ్యాధి ఏమిటో? ఏలూరు నగరంలో వారం రోజుల నుంచి దక్షిణపు వీధిలో ఫిట్స్లా వస్తూ 30 మంది వరకూ అనారోగ్యం బారిన పడినట్లు తెలుస్తోంది. శనివారం ఒక్కరోజే నగరంలోని పడమరవీధి, కొత్తపేట, గన్బజార్, అశోక్నగర్, శనివారపుపేట ప్రాంతాలకు చెందిన 95 మంది ఇలా ఫిట్స్లా వచ్చి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వైద్యులు స్కానింగ్ తీసినా ఏ విధమైన ఆరోగ్య సమస్యలు లేవని నిర్ధారణ కావటం సందేహాలకు తావిస్తోంది. ఇలా మూర్చపోయి పడిపోతున్న వ్యక్తులు కొంత సేపటికి తేరుకుని మామూలు స్థితికి వస్తున్నారు. ఇదంతా వైద్యులకే అంతుచిక్కటం లేదు. బాధితులకు పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు చేయటం, రక్తనమూనాలు సేకరించి పరీక్షలు చేస్తేగాని వ్యాధి ఏమిటనేది చెప్పలేమని వైద్యులు అంటున్నారు. బాధితుల్లో చిన్నారులే అధికం శనివారం ఏలూరులో మూర్చపోతూ అనారోగ్యం బారిన పడిన వారిలో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. కలుషితమైన వాతావరణం, గాలిలో మార్పులు, పరిసరాల పరిశుభ్రత వంటివి కూడా ప్రభావితం చేస్తాయని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. దక్షిణపు వీధిలో మెడికల్ క్యాంపు ఏలూరు దక్షిణపు వీధిలో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారనే సమాచారంతో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సునంద ఆ«ధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది దక్షిణపు వీధిలో ఇంటింటికీ వెళ్లి సర్వే చేశారు. వెంటనే సాయంత్రానికి మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఎవరైనా అనారోగ్యం బారిన పడితే సత్వరమే వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టారు. పది 108 వాహనాలను అందుబాటులో ఉంచారు. వైద్యులు నిత్యం హాస్పిటల్లో ఉండాలని డిప్యూటీ సీఎం నాని ఆదేశాలు జారీ చేశారు. భయపడాల్సిందేమి లేదు: నాని రోగులకు యుద్ధప్రాతిపదికన వైద్యం అందుతోందని ఎవరికీ ఎటువంటి ప్రమాదం లేదని మంత్రి ఆళ్ల నాని అన్నారు. ఒక ఆరేళ్ల చిన్నారిని మాత్రం మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించామన్నారు. ఆసుపత్రిలో వైద్యులు అన్నివేళలా అందుబాటులో ఉంటారని చెప్పారు. అందరూ క్షేమమే : జేసీ అందరూ క్షేమంగానే ఉన్నారు. ఎవరూ భయపడాల్సిన పనిలేదని జేసీ హిమాన్షు శుక్లా చెప్పారు. ప్రభుత్వాసుపత్రిలో బాధితులను ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. బాధితుల వెన్నుపూస నుంచి శాంపిల్స్ తీసి పరీక్షలకు విజయవాడ పంపించినట్లు చెప్పారు. -
ఆ ఘటనపై డిప్యూటీ సీఎం సీరియస్
సాక్షి, విజయవాడ: నగరంలోని డోర్నకల్ రోడ్డులో ఉన్న ఫ్యామిలీ హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యంపై ఏపీ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో వైద్యం అందకపోవడంతో.. పుట్టిన బిడ్డ ప్రాణాలు కోల్పోయిన ఘటనపై మంత్రి వెంటనే స్పందించారు. సత్వరమే ఆసుపత్రికి వెళ్లి ఘటనపై విచారించి తక్షణమే నివేదిక ఇవ్వాలని కృష్ణా జిల్లా డిఎంఅండ్హెచ్వో డాక్టర్ సుహాసినిని మంత్రి ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలన్నారు. (చదవండి: ‘ఆయనొక గాలి నేతగా మిగిలిపోయారు’) ప్రైవేటు ఆసుపత్రుల్లో డెలివరీలపై ప్రతి రోజు సమగ్ర సమాచారాన్ని ఇవ్వాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి ఆళ్ల నాని ఆదేశాలు జారీ చేశారు. బిడ్డను కోల్పోయిన నిండు గర్భిణీ కుటుంబ సభ్యుల నుండి వివరాలు తెలుసుకుని పూర్తి సమాచారాన్ని అందించాలని అధికారులను మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో రోగులకు, గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఆసుపత్రి యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలన్నారు. రోగులకు వైద్యం అందించే విషయంలో హాస్పిటల్ యాజమాన్యం పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. (చదవండి: జేసీ పవన్ రెడ్డి వర్సెస్ ప్రభాకర్ చౌదరి) -
సరైన సమయంలో ‘స్థానిక’ ఎన్నికలు
సాక్షి, అమరావతి: ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా రాష్ట్రంలో ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే పరిస్థితులు లేవని డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. సరైన సమయంలో ఎన్నికలు నిర్వహిస్తామని తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రవేశపెట్టిన తీర్మానానికి శాసనసభ మూజువాణి ఓటుతో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అలాగే ఇటువంటి పరిస్థితులు తలెత్తినప్పడు వ్యవహరించాల్సిన తీరుపై స్పష్టమైన నిబంధనలు ఉండేలా ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్–1994లో మార్పులు చేయాలని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ప్రజల ధన, మాన, ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. రాష్ట్రంలో ఇంకా కరోనా ఉన్నందున స్థానిక సంస్థల ఎన్నికలను ఇప్పుడే నిర్వహించడం ప్రజల ప్రాణాలకు అత్యంత ప్రమాదకరమని చెప్పారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉందని నిపుణులు, మీడియా ప్రతినిధులు సైతం చెబుతున్నారని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు కూడా సెకండ్ వేవ్ను అడ్డుకోవడానికి రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యల వివరాలను అడుగుతోందన్నారు. ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, అసోం రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ సంకేతాలు వస్తున్నాయని తెలిపారు. ఈ తరుణంలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘంతోపాటు మరికొందరు చేస్తున్న వాదనలు సరికాదన్నారు. ఎన్నికలు నిర్వహిస్తే కరోనా వ్యాప్తి చెందుతుంది.. ఇప్పటికే కరోనా వల్ల రాష్ట్రంలో 7,014 మంది మరణించారని ఆళ్ల నాని గుర్తు చేశారు. కరోనా నియంత్రణలో ప్రాణాలు విడిచిన ఫ్రంట్లైన్ వారియర్స్ త్యాగాలను వృథా కానీయరాదన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపట్టిందని, ఈ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే కరోనా వ్యాప్తి చెందుతుందని చెప్పారు. పరిస్థితిని పట్టించుకోకుండా ఎన్నికల సంఘం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ అందుబాటులోకి రాకుండా ఎన్నికలు నిర్వహిస్తే ప్రజల ఆరోగ్యం, భద్రత ప్రమాదంలో పడతాయని శాసనసభ భావిస్తోందన్నారు. తీర్మానంపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. సీఎం జగన్ నాయకత్వంలో అధికారులందరూ కరోనాపై పోరాడుతున్నారని, ఏ పాలకుడికైనా ప్రజల ధన, మాన, ప్రాణాలే ముఖ్యమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను సరైన సమయంలో నిర్వహిస్తామని.. దీనికోసం పంచాయతీరాజ్ యాక్ట్లో నిబంధనలను మారుస్తున్నామని తెలిపారు. -
స్థానిక ఎన్నికలపై ఏపీ అసెంబ్లీ తీర్మాణం..
సాక్షి, అమరావతి : ఫిబ్రవరిలో స్థానిక సంస్థలు ఎన్నికల నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీర్మానం చేసింది. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తీర్మాణాన్ని ప్రవేశ పెట్టగా.. ఏపీ అసెంబ్లీ ఆమెదించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మాణం తీసుకుంది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులు లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. కరోనా సెకండ్ వేవ్ పొంచి ఉన్న తరుణంలో ప్రజల భద్రతే ముఖ్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఈసీ నిర్ణయం తీసుకుందన్నారు. పరిస్థితులు అనుకూలంగా మారినప్పుడే ఎన్నికలు నిర్వహించడం సాధ్యమవుతుందన్నారు. ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా నేటితో ఆంధ్రప్రదేశ్ అయిదు రోజుల అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. 39 గంటల 4నిమిషాలు పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. ఈ మేరకు 18 బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. 2 బిల్లులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. 19 బిల్లులకు సభలో ఆమోదం లభించింది. 2 తీర్మానాలను సభలో ప్రవేశపెట్టగా.. 7 అంశాలపై సభలో స్వల్ప చర్చ సాగింది. -
వ్యాక్సిన్ ఎప్పుడొచ్చినా పంపిణీకి సిద్ధం: ఆళ్లనాని
-
కోవిడ్ నివారణకు త్రిముఖ వ్యూహం ఫలించింది
సాక్షి, అమరావతి: కోవిడ్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన త్రిముఖ వ్యూహం ఫలించిందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు త్రిముఖ వ్యూహమైన ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్తో కరోనాను ఎదుర్కొన్నామన్నారు. శాసన మండలిలో కోవిడ్పై జరిగిన చర్చ సందర్భంగా బుధవారం మంత్రి సమాధానమిచ్చారు. దేశంలోనే కోవిడ్ను ఎదుర్కోవడంలో రాష్ట్రం అత్యంత పటిష్టమైన చర్యలు తీసుకుందని చెప్పారు. ‘‘కోవిడ్ సమయంలో సీఎం నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ ప్రభుత్వ యంత్రాంగానికి మార్గదర్శకాలిచ్చారు. సమష్టి కృషితో కోవిడ్ నియంత్రణకు చర్యలు తీసుకోవడంతో ప్రధాని, జాతీయ మీడియా, ఇతర రాష్ట్రాల సీఎంలు మన రాష్ట్రాన్ని ప్రశంసించారు. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచాం. మిలియన్ జనాభాకు దేశంలోనే అత్యధిక పరీక్షలు చేసిన రాష్ట్రంగా ఉన్నాం. పాజిటివ్ కేసులను గుర్తించి చికిత్స అందిస్తేనే రాష్ట్రంలో వైరస్ను నియంత్రించగలమనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్లింది. రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ రేటు ఆగస్టు నెలలో 17.2 శాతం ఉంటే నవంబర్లో 8.63 శాతానికి తగ్గింది. ఇక దేశంలో రికవరీ రేటు 93.68 శాతంగా ఉంటే రాష్ట్రంలో 97.86 శాతంగా ఉంది. మరణాల రేటు దేశంలో 1.46 శాతంగా ఉంటే రాష్ట్రంలో 0.81 శాతంగా ఉంది’’ అని మంత్రి తెలిపారు. ఒక్క ల్యాబ్ లేని పరిస్థితి నుంచి.. మొదట్లో ఒక టెస్ట్ చేయాలంటే శాంపిల్ తీసి పరీక్షకోసం ఇతర రాష్ట్రాలకు పంపాల్సి వచ్చేదని, రాష్ట్రంలో ఒక్క ల్యాబ్ లేని పరిస్థితి నుంచి 8 నెలల్లోనే 150 ల్యాబ్లను అందుబాటులోకి తెచ్చామని మంత్రి చెప్పారు. పీహెచ్సీ నుంచి టీచింగ్ ఆసుపత్రి వరకు మొత్తం 1,519 శాంపిల్ కలెక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. డాక్టర్లు, వైద్యసిబ్బంది కొరత లేకుండా 22 వేల మందికి పైగా తాత్కాలిక నియామకాలు చేశామని, వీరి జీతాలకోసం రూ.232 కోట్లు విడుదల చేశామని చెప్పారు. పెండింగ్లో ఉన్న మరో రూ.200 కోట్లు త్వరలో విడుదల చేస్తామన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చిన మొట్టమొదటి రాష్ట్రం మనదని పేర్కొన్నారు. కరోనా బారిన పడి చికిత్స పొందిన ఎంప్లాయీస్ హెల్త్ స్కీం(ఈహెచ్ఎస్) పరిధిలోని ఉద్యోగులు, పెన్షనర్లకు రీయింబర్స్ చేస్తామని తెలిపారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో మెడికల్ కాలేజీతోపాటు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, రూ.16 వేల కోట్లతో ప్రతి ఆసుపత్రినీ ఆధునీకరిస్తామని చెప్పారు. -
కోవిడ్పై త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్లాం
సాక్షి, అమరావతి : నిర్ధారణ పరీక్షలు చేస్తేనే కరోనా వైరస్ను కట్టడి చేయగలమని భావించామని, టెస్టులు నిర్వహించటంలో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందని మంత్రి ఆళ్ల నాని అన్నారు. కోవిడ్పై త్రిముఖ వ్యూహంతో ముందుకు వెళ్లామని చెప్పారు. కరోనా ప్రారంభంలో రాష్ట్రంలో ఒక్క ల్యాబ్ కూడా లేదని, 8 నెలల్లోనే 150 నిర్ధారణ ల్యాబ్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. కరోనా వ్యాప్తి.. ప్రభుత్వం తీసుకున్న చర్యలపై శాసనమండలిలో బుధవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘‘ రాష్ట్రంలో 6 దశల్లో ప్రతి ఇంటిని ఆరుసార్లు సర్వే చేశాం. హోం ఐసోలేషన్లో ఉన్న 5 లక్షల 50 వేల మందికి హోం కిట్లను అందచేశాం. కరోనా నేపథ్యంలో వైద్యం కోసం 22 వేల మందిని తాత్కాలికంగా నియమించాం. వారిలో ఇప్పటివరకు ఏ ఒక్కరిని కూడా తొలగించలేదు. ( లాభాల్లో బోనస్ మహిళలకే: సీఎం జగన్) తాత్కాలిక సిబ్బందికి వేతనాలు చెల్లించేందుకు 232 కోట్ల రూపాయలు విడుదల చేశాం. త్వరలో మరో 200 కోట్ల రూపాయలు విడుదల చేస్తాం. కోవిడ్ ట్రీట్మెంట్కు అధిక ఫీజులు వసూలు చేసిన ప్రైవేట్ హాస్పిటల్స్పై చర్యలు తీసుకున్నాం. దేశంలోనే కోవిడ్ ట్రీట్మెంట్ను ఆరోగ్యశ్రీలోకి తెచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఆగస్టు నెలలో కరోనా పాజిటివ్ రేటు 17.2 ఉంటే ప్రస్తుతం 8.63 రేటుకు తగ్గించాం. రికవరీ రేటు దేశవ్యాప్తంగా 93.68 ఉంటే మన రాష్ట్రంలో 97.86గా ఉంది. దేశవ్యాప్తంగా మరణాల రేటు 1.46 ఉంటే మన రాష్ట్రంలో 0.81గా ఉంద’’ని తెలిపారు. -
నివర్ తుపాను: అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, పశ్చిమగోదావరి: నివర్ తుపాను ప్రభావంతో జిల్లా యంత్రాంగాన్ని డిప్యూటీ సీఎం, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అప్రమత్తం చేశారు. గురువారం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని, జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా వైద్య బృందాలు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. కాజ్ల వద్ద పోలీస్ పికెటింగ్లు ఏర్పాటు చేయాలన్నారు. పునరావాస చర్యలు, భోజన సదుపాయం, వైద్య సహాయం విషయంలో అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో అవసరమైన ప్రాంతంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. (చదవండి: ఆ విషయాన్ని ప్రజలు గమనించాలి: సజ్జల) అధికారులు అందుబాటులో ఉండాలి: మంత్రి అనిల్ నెల్లూరు: ఇరిగేషన్ శాఖ అధికారులతో మంత్రి అనిల్కుమార్ యాదవ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను ప్రభావంతో చెరువులు గండి పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అధికారులందరూ అందుబాటులో ఉండాలని మంత్రి అనిల్ ఆదేశించారు. (చదవండి: శ్రీవారి మెట్టు మార్గం మూసివేత) ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: మంత్రి పెద్దిరెడ్డి చిత్తూరు: జిల్లా అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను సహాయక చర్యలపై సమీక్ష జరిపారు. నివర్ తుపాను కారణంగా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చెరువులు, జలాశయాల్లో నీటినిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ముంపు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, వైద్యంతోపాటు అన్ని వసతులు కల్పించాలని, అన్ని మండల కేంద్రాల్లోనూ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని మంత్రి పెద్దిరెడ్డి ఆదేశించారు. -
జగన్ పాలనలో సర్కారు వైద్యానికి మంచి రోజులు
నరసాపురం: వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక పాలనలో పారదర్శకత వచ్చిందని డిప్యూటీ సీఎం, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం సామాజిక ఆసుపత్రిని రూ.11.64 కోట్లతో 100 పడకల ఆసుపత్రిగా విస్తరించే అభివృద్ధి పనులకు మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖను భ్రష్టు పట్టించిందని, ఆరోగ్యశ్రీని మూలన పెట్టిందని, శిథిలావస్థకు చేరిన సీహెచ్సీ, పీహెచ్సీ భవనాలకు కనీసం మరమ్మతులు కూడా చేయలేదని విమర్శించారు. కానీ తమ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్ కళాశాలల నిర్మాణం చేపడుతోందని, మరో 11 మెడికల్ కళాశాలలను ఆధునికీకరించబోతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో వివిధ ఆసుపత్రుల్లో, పీహెచ్సీల్లో ఖాళీగా ఉన్న 9,700 పోస్టులు భర్తీకి సంబంధించి నియామక ప్రక్రియ దాదాపుగా పూర్తయ్యిందని, త్వరలో మరో 1,900 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, సబ్కలెక్టర్ విశ్వనాథన్ పాల్గొన్నారు. -
కరోనా నివారణలో ఏపీ ముందంజలో ఉంది
సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలోని చింతలపూడి నియోజకవర్గంలో డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ కోసం రు.10.20 కోట్లతో భవనాల నిర్మాణాలు చేపట్టామని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పశ్చిమగోదావరి జిల్లాలో 12 వైద్యవిధాన పరిషత్ హాస్పిటల్స్ అభివృద్ధికి రూ.94.88 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని హాస్పిటల్స్ లో మౌలిక సదుపాయాలతో పాటు నాణ్యమైన మందులను ప్రజలకు అందుబాటులో ఉంచామని తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్ నివారణకు అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రం ముందంజలో ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ వైద్య పరీక్షలు రేటును అన్ని ప్రైవేట్ క్యాన్సర్ ఆస్పత్రుల్లో రూ.1600 నుంచి రూ. 800లకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లాలో వైద్యం నిమిత్తం 1563 బెడ్స్, ఆక్సిజన్ పైప్లైన్స్ కోసం రూ. 3.10 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజి చొప్పున 16 మెడికల్ కాలేజీలు రూ. 7500 కోట్లతో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించారని మంత్రి పేర్కొన్నారు. -
బిల్లు రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ.. రాష్ట్రమంతా
సాక్షి, అమరావతి: ఆస్పత్రిలో వెయ్యి రూపాయల బిల్లు దాటితే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య చికిత్స మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఇప్పటికే రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో ఈ పథకం అమలవుతోంది. మిగిలిన శ్రీకాకుళం, తూర్పు గోదావరి, కృష్ణా, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఈ పథకాన్ని మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ళ నాని సోమవారం రాత్రి తెలిపారు. ఇప్పటివరకు 2,200 వ్యాధులకు వర్తిస్తున్న ఆరోగ్యశ్రీ పథకంలోకి మరో 234 వ్యాధులను చేర్చారు. దీంతో మొత్తం 2,434 వ్యాధులు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తాయి. ఆస్పత్రి బిల్లు వెయ్యి రూపాయలు దాటితే బిల్లు మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది. -
‘బీసీ ప్రజలకు చరిత్రలో లిఖించే రోజు’
సాక్షి, పశ్చిమగోదావరి : దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించే విధంగా బీసి కులాలను గుర్తించి 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. ఏలూరు వేదికగా జరిగిన బీసి గర్జనలో బీసీలకు ఇచ్చిన హమీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేశారన్నారు. ఏలూరులో మంగళవారం బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరక్టర్లకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎంపీ భరత్ మాట్లాడుతూ.. ప్రతి బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు నిర్ణయాలు తీసుకున్నారన్నారు. బీసీలు ముఖ్యమంత్రికి ఎల్లవేళలా రుణపడి ఉంటారన్నారు. చదవండి: బీసీల దమ్ము ఎంతో చూపిస్తాం.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ వర్గాల ప్రజలకు ఈ రోజు చరిత్రలో లిఖించే రోజు అని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. గత ప్రభుత్వం తెలుగుదేశం హయంలో చంద్రబాబు నాయుడు బీసీలను కేవలం ఓట్ల బ్యాంకుగా మాత్రమే చూశారని విమర్శించారు. బీసీలకు మాయ మాటలు చెప్పి వారిని అణగదొక్కారన్నారు. బీసీకు రాజ్యాధికారం ఇవ్వాలని ముఖ్యమంత్రి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారన్న మంత్రి రాష్ట్రంలోని వెనుకబడిన బడుగు బలహీన వర్గాలను గుర్తించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. చదవండి: బీసీలంతా వైఎస్ జగన్కు రుణపడ్డాం మహిళ పక్షపాతిగా సీఎం వైఎస్ జగన్ ఎన్నో సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారని స్త్రీ, శిశుసంక్షేమశాఖ మంత్రి తానేటి వనితా అన్నారు. ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో బీసీలు తమ పార్టీకి వెనుముక అంటూ వైఎస్ జగన్ చెప్పారని గుర్తు చేశారు. ప్రతి బిడ్డను చదివించేందుకు అమ్మవడి అనే పథకాన్ని తీసుకువచ్చారని, దిశ అనే చట్టం మహిళలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాలలోను తీసుకురాలేదని పేర్కొన్నారు. పోలవరం, రాజధాని అంశంలో ప్రజలకు ఆలోచనల దిశగా ముఖ్యమంత్రి వెళ్తున్నారని, ఎన్నో లక్షల మందికి ఉపయోగపడే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితే భవిష్యత్తు పొతుందని టీడీపీ అడ్డుకుంటుంని మండిపడ్డారు. చదవండి: బీసీ కార్పొరేషన్లతో సామాజిక విప్లవం ఈ సమావేశంలో మంత్రులు ఆళ్లనాని, తానేటి వనితా, ఎమ్మెల్యేలు కొఠారు అబ్బాయ చౌదరి, జీఎస్ నాయుడు, ఏలీజా, కారుమూరి నాగేశ్వరరావు, పుప్పాల వాసుబాబు, తల్లారి వెంకట్రావు, ముదునూరి ప్రసాదరాజు, ఎంపీ మార్గాని భరత్, డీసీఎమ్ఎస్ చైర్మన్ యడ్ల తాతాజీ, డీసీబీసీ చైర్మన్ కవూరు శ్రీనివాస్, జిల్లాకు చెందిన కార్పొరేషన్ చైర్మన్లు గుబ్బల తమ్మయ్య, ఇళ్ల భాస్కరరావు,పేండ్ర వీరన్న,అనంతలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
ఏపీకి పూర్వ వైభవం: ఆళ్ల నాని
సాక్షి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్లో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని జాతీయ జెండా ఆవిష్కరించి.. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పొట్టి శ్రీ రాములు చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ వేడుకల్లో మంత్రి తానేటి వనిత, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బాయి చౌదరి, కలెక్టర్ రేవు ముత్యాలు రాజు, ఎస్పీ నారాయణ నాయక్, జాయింట్ కలెక్టర్లు వెంకట రమణా రెడ్డి, తేజ్ భరత్, ఆర్డీవో పనబాక రచన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు ఆళ్ల నాని, తానేటి వనితా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్కు పూర్వ వైభవం తీసుకువచ్చారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా నవంబర్ 1న ఏపీ అవతరణ దినోత్సవం జరపాలని నిర్ణయించారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. -
నవంబర్ 4న ఏలూరుకు సీఎం వైఎస్ జగన్
సాక్షి, పశ్చిమగోదావరి : నవంబర్ 4వ తేదిన ఏలూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. ఆ రోజు తంగెళ్లమూడి వద్ద రిటైనింగ్ వాల్ శంకుస్థాపన చేసిన అనంతరం మాజీ మేయర్ నూర్ జహన్ పెద్దబాబు కుమార్తె వివాహానికి హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని ఏర్పాట్లను పరిశీలించారు. ఆయనతోపాటు జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు, జిల్లా ఎస్పీ నారాయణ నాయక్, ఎమ్మెల్యే అబ్బాయ చౌదరి.కూడా ఉన్నారు. చదవండి: పోలవరంపై ప్రధానికి సీఎం జగన్ లేఖ ఆ సందర్భంగా ఉపముఖ్యమంత్రి ఆళ్లనాని మాట్లాడుతూ.. ఏలూరు నగరానికి వరద ముంపు తప్పించేందుకు నాడు దివంగత నేత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిధులను కేటాయించారని పేర్కొన్నారు. వైఎస్ హయాంలో నలబై శాతం రిటైనింగ్ వాల్ నిర్మించినట్లు తెలిపారు. వైఎస్ మరణానంతరం ఏ ముఖ్యమంత్రి కూడా చొరవ చూపలేదని, నేడు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సహాకారంతో మిగిలిన పనులకు శ్రీకారం చుట్టినల్లు తెలిపారు. రూ. 78 కోట్ల నిధులతో నిర్మించే రిటైనింగ్ వాల్కు ఈ నెల నాలుగవ తేదిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. -
పెద్దవాగులో పెను విషాదం
సాక్షి ప్రతినిధి, ఏలూరు/వేలేరుపాడు: పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో బుధవారం విషాదం జరిగింది. వనభోజనోత్సవానికి వెళ్లిన ఆరుగురు స్నేహితులను పెద్దవాగు మింగేసింది. ఒకరినొకరు చేతులుపట్టుకుని సరదాగా వాగులోకి దిగిన ఐదుగురు మునిగిపోయారు. వారిని రక్షించేందుకు ప్రయత్నించిన మరో స్నేహితుడు కూడా వారితోపాటే నీటమునిగాడు. అప్పటివరకు సరదాగా గడిపిన వారు క్షణాల్లో జలసమాధి అయ్యారు. భూదేవిపేట గ్రామానికి చెందిన వీరు వసంతవాడ ప్రాంతంలో పెద్దవాగులో ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలకు మూడులక్షల రూపాయల వంతున ఆర్థికసాయం అందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఆనవాయితీగా.. ఏటా దసరా పండుగ పూర్తయ్యాక భూదేవిపేట గ్రామస్తులు వసంతవాడ వాగు ప్రాంతంలో వనమహోత్సవం జరుపుకొంటారు. ఈ ఏడాది కూడా గ్రామస్తులు ఉత్సాహంగా వనభోజనానికి వెళ్లారు. స్నేహితులైన కెల్లా భువనసాయి (18), గంగాధరపు వెంకట్రావు (16), గొట్టిపర్తి మనోజ్ (16), కర్నాటి రంజిత్ (15), కూరవరపు రాధాకృష్ణ (15) పెద్దవాగులో ఆడుకునేందుకు వెళ్లారు. వీరెవరికీ ఈత రాకపోవడంతో ఒకరినొకరు చేయిచేయి పట్టుకుని వాగులోకి దిగి సరదాగా కొంతసేపు ఆడుకున్నారు. వాగులోతు తెలియని వీరు ముందుకెళ్లి మునిగిపోయారు. ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వీరిని రక్షించేందుకు వాగులోకి దిగిన శ్రీరాముల శివాజీ (17) కూడా మునిగిపోయాడు. వీరు నీళ్లల్లో మునిగిపోవడాన్ని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే స్థానికులకు సమాచారం అందించి వారిని కాపాడేందుకు వాగులోకి దిగారు. సమాచారం అందుకున్న డీఎస్పీ ఎం.వెంకటేశ్వర్లు, కుక్కునూరు సీఐ బాలసురేశ్, ఎస్ఐ సుధీర్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. స్థానికులు, పోలీసులు గాలించి నీళ్లల్లోనుంచి మృతదేహాలను వెలికితీశారు. భూదేవిపేట కన్నీరుమున్నీరైంది. మృతుల్లో శ్రీరాములు కార్పెంటర్గా పనిచేస్తున్నాడు. అతడే కుటుంబానికి జీవనాధారం. మనోజ్, రంజిత్ పదోతరగతి, రాధాకృష్ణ, వెంకట్రావు ఇంటర్మీడియెట్, భువనసాయి ఏజీబీఎస్సీ చదువుతున్నారు. మృతదేహాలకు వాగువద్దే పోస్ట్మార్టం నిర్వహించారు. సమాచారం తెలిసిన వెంటనే అధికారులను అప్రమత్తం చేసిన పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు బాధిత కుటుంబాలను పరామర్శించి, అంత్యక్రియల నిమిత్తం కుటుంబానికి రూ.5 వేల వంతున ఆర్థికసాయం అందించారు. ఎస్పీ నారాయణనాయక్ కూడా ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. తక్షణం స్పందించిన సీఎం వసంతవాడ వాగు ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. వాగులో మునిగి ఆరుగురు మృతిచెందిన విషయం తెలిసిన వెంటనే పోలవరం ఎమ్మెల్యే బాలరాజుతో మాట్లాడిన ఆళ్ల నాని ఆ కుటుంబాల పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆరు కుటుంబాలకు మూడు లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా అందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. బాధితులకు గురువారం మూడులక్షల రూపాయల చెక్కులను ఇస్తామని, ఆ కుటుంబాలకు అండగా ఉంటామని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని చెప్పారు. -
ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రలు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 670 ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రలను వెంటనే నియమించాలని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సోమవారం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు రూ.1.34 కోట్లు విడుదల చేస్తూ మార్గదర్శకాలను జారీ చేశారు. అవి.. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో హెల్ప్ డెసు్కలు సత్వరమే ఏర్పాటు చేయాలి. ► మొత్తం ఎంపేనల్డ్ ఆస్పత్రుల్లో హెల్ప్ డెస్కులను ఏర్పాటు చేసి రోగులకు వైద్య సహాయం అందించడమే ఆరోగ్య మిత్రల లక్ష్యం. వైద్యం కోసం వచ్చే రోగులకు అవసరం మేరకు అంబులెన్స్ సౌకర్యం కల్పించడం కూడా వీరి బాధ్యతే. ► రోగులను అవసరమైతే వేరే హాస్పిటల్కు పంపించే బాధ్యత కూడా ఆరోగ్యమిత్రలే తీసుకోవాలి. ► ప్రతి ఆస్పత్రిలో రోజంతా వీరు సేవలు అందించాలి. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ జీవో జారీ చేయాలి. ► ప్రతి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రిలో హెల్ప్ డెస్క్ ఏర్పాటుకు రూ.20 వేలు మంజూరు. ► అన్ని జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో జిల్లాల జాయింట్ కలెక్టర్లు, జిల్లా పర్చేజ్ కమిటీల ద్వారా టెండర్లను పిలిచి హెల్ప్ డెసు్కలు ఏర్పాటు చేయాలి. ► ప్రతి హెల్ప్ డెస్క్ వెనుక ఆరోగ్యశ్రీ పోస్టర్ పూర్తి వివరాలతో ఉండాలి. ► రోగులు, ఆస్పత్రుల నుంచి ఆరోగ్య మిత్రలు లంచాలు ఆశించకుండా ఉండాలని సీఎం స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ► ప్రతి ఆరోగ్య మిత్ర రోజూ ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు, వైద్యులు, మందుల అందుబాటు, వైద్య సేవలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి నాలుగు అంశాలతో నివేదిక ఇవ్వాలి. ► ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రిలో ఆరోగ్య మిత్రలు, హెల్ప్ డెసు్కల ద్వారా సేవలు అందేలా జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు పర్యవేక్షించాలి. -
‘ఆరోగ్యశ్రీ’లో డిశ్చార్జి వరకు మనదే బాధ్యత
సాక్షి, అమరావతి: ‘ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేయించుకునే ఏ లబ్ధిదారుడైనా ఆస్పత్రిలో చేరినప్పటినుంచి డిశ్చార్జి అయ్యేవరకు అతనికి సేవలందించే విషయంలో పూర్తిబాధ్యత మనదే. ఎక్కడైనా ఫిర్యాదు వచ్చిందంటే ఆ ఫిర్యాదు అక్కడికక్కడే పరిష్కారం కావాలి’ అని వైద్య ఆరోగ్యశాఖమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) చెప్పారు. ఆయన సోమవారం సచివాలయంలో ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షతో పాటు జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఏమన్నారంటే.. ► ప్రజలకు నెట్వర్క్ ఆస్పత్రుల్లో సరైన వైద్యసేవలు అందుతున్నాయా, లేదా అని ప్రతిరోజూ నిఘా ఉండాలి. ► ముఖ్యమంత్రి ఆదేశించినట్టు ఏ ఆస్పత్రుల్లోనైనా నాణ్యత లేకపోతే వాటిని జాబితానుంచి తొలగించాలి. ► ఏ గ్రామ సచివాలయం వద్దకు వెళ్లినా బాధితులకు ఆరోగ్యశ్రీ సేవల సమాచారం అందించాలి. జాబితాలోని ఆస్పత్రులపై ప్రత్యేక నివేదిక ఉండాలి. ఆరోగ్యమిత్రలను తక్షణమే నియమించాలి. ప్రతి ఆస్పత్రిలో హెల్ప్ డెస్క్ ఉండాలి. ఐవీఆర్ఎస్ను మరింత అభివృద్ధి చేయాలి. ► ఇప్పటివరకు ఆరోగ్య ఆసరాకు రూ.145 కోట్లు వ్యయం అయింది. 2.50 లక్షల మంది లబ్ధిపొందారు. ► వైకల్యం సర్టిఫికెట్ల కోసం వచ్చేవారికి అదేరోజు ఇవ్వాలి. వారిని ఆస్పత్రుల చుట్టూ తిప్పుకోకూడదు. కరోనా రెండోదశను కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ► వర్షాల నేపథ్యంలో అంటువ్యాధులు, మలేరియా, డెంగీ వంటి దోమకాటు వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. -
లోతట్టు ప్రాంతాలు జలమయం
సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షి/అమరావతి బ్యూరో/అమలాపురం/జగ్గంపేట/కర్నూలు (అగ్రికల్చర్): తెలంగాణ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో పశ్చిమగోదావరి జిల్లాలోని తమ్మిలేరు ఉగ్రరూపం దాల్చింది. ఏలూరులో ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని వెంటనే స్పందించి రెండుచోట్ల భారీ గండ్లు పెట్టించడంతో ఏలూరు ముంపు నుంచి తప్పించుకుంది. నగరంలో ఆరు చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. తమ్మిలేరు కాల్వపై నిర్మించిన వంతెనకు కృష్ణా జిల్లా వైపు గండిపడే ప్రమాదం ఉండటంతో రెండు జిల్లాల మధ్య రాకపోకలు నిలిపివేశారు. తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంలో ఎర్రకాల్వకు, దెందులూరు మండలం సత్యనారాయణపురంలో గండేరువాగుకు రెండు గండ్లు పడ్డాయి. దీంతో జోగన్నపాలెం, దోసపాడు, దెందులూరు దళితవాడల్లో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయంలోకి వరద నీరు ప్రవేశించింది. భీమవరం మండలం తోకతిప్పలో వర్షానికి రేకుల షెడ్డు కూలి వృద్ధురాలు మృతి చెందింది. కామవరపుకోట మండలం అడమిల్లిలో చేపలు పట్టడానికి వెళ్లి బాలస్వామి మరణించాడు. ‘తూర్పు’లో ముంపులోనే పలు ప్రాంతాలు తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం, పెద్దాపురం, ప్రత్తిపాడు, కాకినాడ రూరల్, కాకికాడ నియోజకవర్గాలు ముంపు బారిన పడ్డాయి. గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి మండలాల్లో లోతట్టు కాలనీలు నీటమునిగాయి. ఏలేరు రిజర్వాయర్ ముంపు నీరు కాకినాడ శివారులో ట్రెజరీ కాలనీ, టీచర్స్ కాలనీ, రమణయ్యపేట జనచైతన్య కాలనీలను ముంచేసింది. అధికారులు పడవలపై వెళ్లి బాధితులకు ఆహారం, నీరు, మందులు అందజేశారు. జగ్గంపేట మండలం రామవరంలో వరద ఉధృతికి ఇల్లు కూలిపోయింది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం ఎనిమిది గంటల వరకు జిల్లాలో సగటున 10.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మెట్టలో తాండవ, పంపా రిజర్వాయర్ల గేట్లు మూసివేశారు. కరపలో ముంపుబారిన పడిన వరి చేలను వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పరిశీలించి రైతులకు భరోసా ఇచ్చారు. భారీ వర్షాలకు విజయవాడలో రాణీగారితోట, కృష్ణలంక, రామలింగేశ్వర్నగర్, రణవీర్నగర్, బాలాజీ నగర్, యనమలకుదురు తదితర ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. కర్నూలు జిల్లాలో 44 మండలాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. నీట మునిగిన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎఫ్సీఐ కాలనీ తూర్పు గోదావరి జిల్లాలో పది మందిని కాపాడిన హోంగార్డ్ ప్రాణాలకు తెగించి వరదలో చిక్కుకున్న పదిమంది కార్మికులను కాపాడిన ఓ హోంగార్డ్ సాహసం అందరి ప్రశంసలు పొందింది. తూర్పుగోదావరి జిల్లా రామవరంలో బుధవారం పోలవరం ఎడమ కాలువ, పుష్కర కాలువలకు గండ్లు పడి వరదనీరు భారీగా గ్రామాన్ని ముంచెత్తింది. దీంతో బయటకు వచ్చే దారిలేక రామవరం వద్ద సిరామిక్ ఫ్యాక్టరీలో 10 మంది కార్మికులు చిక్కుకుపోయారు. వీరిలో పురుషులతోపాటు మహిళలు కూడా ఉన్నారు. వీరిని రక్షించేందుకు హైవే మొబైల్ డ్రైవర్గా పనిచేస్తున్న హోంగార్డ్ అర్జున్ నడుము లోతు నీళ్లల్లోనే వెళ్లి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాడు. అతడి సాహసాన్ని హోం మంత్రి సుచరితతోపాటు పలువురు అభినందించారు. కోస్తా, సీమకు మోస్తరు వర్షసూచన సాక్షి, విశాఖపట్నం: వచ్చే రెండు రోజులు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య అరేబియా సముద్రం వరకు ఉత్తర కోస్తా, తెలంగాణలపై అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఉపరితల ఆవర్తనం మీదుగా 3.1 కి.మీ నుంచి 5.8 కి.మీ ఎత్తు మధ్య ఉపరితల ద్రోణి ఉంది. కాగా, గత 24 గంటల్లో కోస్తాలో విస్తారంగా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. -
లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయాలి: మంత్రి ఆదేశం
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: అల్పపీడనం ప్రభావంతో ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలన్నారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ అధికారులతో ఫోన్ లో మాట్లాడి వరద పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులను, ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని వెల్లడించారు. ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. వర్షాల తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలలో జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. జిల్లా రెవిన్యూ శాఖ పోలీస్ యంత్రాంగం సమన్వయంతో ఇతర శాఖలను అప్రమత్తం చేయాలని సూచించారు. భారీ వర్షాలు కారణంగా అంటూ వ్యాధులు ప్రబలకుండా ముందుగానే అన్ని ప్రాంతాల్లో మెడికల్ టీమ్స్ ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. అవసరం ఉన్న ప్రాంతంలో మెడికల్ క్యాంపు లు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్న దృష్ట్యా ప్రజలు అనవసరంగా బైటికి రావద్దని సూచించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ లోతట్టు ప్రాంతంలో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అదేవిధంగా తమ్మిలేరుకు వరద ఉధృతి పెరిగింది. అక్కడ 5000 క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఏలూరు తమ్మిలేరుకు ఇరు వైపుల ఉన్న ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏలూరులోని లోతట్టు ప్రాంతంలో జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టండి అని ఆయన అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం 6:30 నుంచి 7: 30 మధ్య కాకినాడకు అతి సమీపంలో వాయుగుండం తీరం దాటిందని విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు తెలిపారు. ఈ కారణంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చదవండి: భారీ వర్షాలు : ఉద్యోగులకు సెలవులు రద్దు -
స్విమ్స్ ఘటన: మంత్రి ఆళ్లనాని సీరియస్
-
రాధిక కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం
సాక్షి, అమరావతి: తిరుపతి స్విమ్స్ శ్రీ పద్మావతి కోవిడ్ హాస్పిటల్ ప్రమాదంలో మృతి చెదిన కుటుంబాన్ని, గాయపడిన కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. అదే విధంగా ప్రమాదంలో మృతి చెందిన రాధిక కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.10లక్షలు ఆర్ధిక సహాయం ప్రకటించారు. గాయపడిన రాజా, నాగరత్నమ్మలకు ఒక్కొక్కరికి రూ. 2లక్షలు ఆర్ధిక సహాయం అందిస్తామని తెలిపారు. ఈ ప్రమాదంలో ఒక ఉద్యోగి మృతి చెందడం బాధాకరమని అన్నారు. ఈ సంఘటన జరిగిన తీరుపై తక్షణమే స్పందించిన మంత్రి.. తిరుపతి స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ నుంచి ప్రమాద వివరాలను ఫోన్లో అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై సీరియస్ అయిన మంత్రి గాయపడిన కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ వెంగమ్మను ఆదేశించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన ప్రిన్సిపాల్ సెక్రటరీ డాక్టర్ జవహర్ రెడ్డితో ఫోన్ మాట్లాడి పూర్తి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై వెనువెంటనే విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఏపీ హెచ్ఎంఐడీసీ ఎండీ చంద్ర శేఖర్రెడ్డిని ఆదేశించారు. తిరుపతి స్విమ్స్ మొదటి అంతస్తులో కోవిడ్ బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్విమ్స్ డైరెక్టర్లకు సూచించారు. స్విమ్స్లో కొత్తగా నిర్మిస్తున్న ఈ భవనం మొదటి బ్లాక్లోకి వస్తున్న సమయంలో కరోనా పేషెంట్లకు గాయాలు అయ్యాయని చెప్పారు. ఆకస్మికంగా పెచ్చులు ఊడి పడటంతో ప్రమాదం జరిగిందని, పూర్తిస్థాయి విచారణకు ఆదేశించామని తెలిపారు. ఈ ప్రమాద ఘటనలో ఎవరైనా బాద్యులు అని తేలితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ ఆస్పత్రుల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆళ్ల నాని చెప్పారు. -
మంత్రి చొరవతో గర్భిణికి తప్పిన ప్రమాదం
సాక్షి, విజయనగరం : ఏపీ డిప్యూటీ సీఎం, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చొరవతో ఆదివారం గర్భిణీ స్త్రీ మహిళకు ప్రమాదం తప్పింది. విజయనగరం జిల్లా ధారపత్తి పంచాయతీ పొర్లు గ్రామంలో గర్భిణీ చంద్రమ్మ ప్రయాణ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న ఘటనపై ఆళ్ల నాని తక్షణమే స్పందించారు. డోలి మోతలో తీసుకు వెళుతున్న చంద్రమ్మను ఆసుపత్రికి తీసుకు వెళ్లేందుకు 108 వాహనం ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు గర్భిణీ స్త్రీ చంద్రమ్మకు మెరుగైన వైద్యం అందించడానికి డైరెక్టర్ అఫ్ మెడికల్ అండ్ హెల్త్ డాక్టర్ అరుణ కుమారి అన్ని ఏర్పాట్లు చేశారు.చంద్రమ్మను 108అంబులెన్సులో విజయనగరంలో ఘోష ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించడంతో ఆమెకు ప్రమాదం తప్పింది. (చదవండి : గంట్యాడ ఘటనపై మంత్రి ఆళ్ల నాని ఆరా) ఆ తర్వాత జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్తో ఫోన్లో మాట్లాడిన ఆళ్ల నాని శృంగవరపు మండలం పొర్లు గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనులకు ఇబ్బంది లేకుండా మెరుగైన వైద్య సదుపాయం కోసం గిరిజన వైద్య వసతి గృహాలు ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.గర్భిణీ స్త్రీలకు వసతి గృహాల్లో వెంటనే వైద్యం అందడానికి అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు కార్పొరేట్ వైద్యం అందడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మల్టీ స్పెషలిటీ హాస్పిటల్స్ నిర్మాణానికి చర్యలు చేపట్టారన్నారు. కాగా చంద్రమ్మ విషయంలో సత్వరమే స్పందించి చర్యలు చేపట్టిన డీఎమ్ఈ డాక్టర్ అరుణ కుమారి, డీఎమ్హెచ్ఓ డాక్టర్ రమణ కుమారిని మంత్రి అభినందించారు. -
గంట్యాడ ఘటనపై మంత్రి ఆళ్ల నాని ఆరా
సాక్షి, విజయనగరం : గంట్యాడలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 20 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా రావడం పట్ల డిప్యూటీ సీఎం , వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని శనివారం స్పందించారు. ఈ విషయమై మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటికే ఈ అంశంపై విజయనగరం జిల్లా కలెక్టర్ హరి జవహర్లాల్ తో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. కరోనా సోకిన 20 మంది విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశించినట్లు తెలిపారు. జిల్లా పరిషత్ హైస్కూల్లో మొత్తం 108 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. 20 మందికి కరోనా సోకినట్లు తెలిపారు. అయితే కరోనా సోకిన విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా కరోనా పరీక్షలు చేయాలని డీఎమ్హెచ్వోను కూడా సూచించినట్లు తెలిపారు. (చదవండి : ఏపీలో 60 లక్షలు దాటిన కరోనా పరీక్షలు) ఒకవేళ కరోనా సోకిన విద్యార్థులకు ఎలాంటి లక్షణాలు లేకపోతే హోంక్వారంటైన్లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. హోమ్ క్వారంటైన్లో ఉండే విద్యార్థులకు ప్రతి రోజు వైద్య బృందం వారి ఆరోగ్యం పై ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు మేరకు హోమ్ క్వారంటైన్ లో ఉన్న కోవిడ్ విద్యార్థులకు ప్రత్యేక మెడికల్ కిట్స్ అందచేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆయన ఆదేశించారు.కరోనా సోకకుండా అన్ని పాఠశాలల్లో మాస్కులు, శానిటైజర్స్ వినియోగించే విధంగా అవగాహన కల్పించాలని కోరుతూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. -
ఈసీ గంగిరెడ్డి మృతికి ఆళ్ల నాని సంతాపం
సాక్షి, పశ్చిమగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మామ, ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి మృతి పట్ల డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎలాంటి ఫీజు తీసుకోకుండా ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించి పేదల డాక్టర్గా మంచి గుర్తింపు పొందారని తెలిపారు. కడప జిల్లాలో వైఎస్సార్సీపీ బలోపేతానికి ఆయన అవిశ్రాంతంగా కృషి చేసి ఆ ప్రాంతంలో పార్టీకి పెద్దదిక్కుగా నిలిచారన్నారు. గంగిరెడ్డి మరణం తీరని లోటన్నారు. కరోనా కష్టకాలంలో కూడా వైద్య సేవలు అందించి మానవత్వాన్ని చాటుకున్నారని తెలిపారు. నిత్యం అందుబాటులో ఉండి పేదలకు అండగా ఉండేవారని మంత్రి ఆళ్ల నాని అన్నారు. పేదల వైద్యుడిగా గుర్తింపు పొందిన డాక్టర్ ఈసీ గంగిరెడ్డి మరణం చాలా బాధాకరమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గంగిరెడ్డి రాయలసీమ పేద ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. గంగిరెడ్డి మరణం తీరని లోటు: ఎమ్మెల్యే తోపుదుర్తి పులివెందుల పేదల డాక్టర్ ఈసీ గంగిరెడ్డి మరణం పట్ల అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంతాపం తెలిపారు. పులివెందుల వచ్చిన ఆయన ఈసీ గంగిరెడ్డి మరణం తీరని లోటని స్పష్టం చేశారు. ఓవైపు పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూనే రైతుల సమస్యలపై ఈసీ గంగిరెడ్డి పోరాటాలు చేశారని చెప్పారు. (సీఎం జగన్ మామ ఈసీ గంగిరెడ్డి మృతి) -
చంద్రబాబుకు కనిపించని అభివృద్ధి, సంక్షేమం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న కోవిడ్ నియంత్రణ.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలందరూ స్వాగతిస్తుంటే చంద్రబాబుకు అవి కనిపించడంలేదని.. పైగా వాటిని వ్యతిరేకిస్తూ అసత్య ప్రచారాలకు దిగుతున్నారని ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని మండిపడ్డారు. అలాంటి చంద్రబాబు అడుగులకు ఆ రెండు పత్రికలు మడుగులొత్తుతున్నాయని.. ఇది దారుణమని ఆయనన్నారు. రోజుకు 70వేల టెస్టులు చేస్తున్నది బాబుకు తెలియదా.. వాస్తవాలను ప్రభుత్వం ప్రకటనల రూపంలో ఇచ్చినా వేయడం లేదంటే అవి ఎంతగా దిగజారాయో.. వాటి నైజం ఏమిటో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. నాని బుధవారం మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ► రాష్ట్రంలో రోజుకో కుట్రకు తెరలేపుతూ చంద్రబాబు ప్రకటనలు చేయడం.. వాటిని ఈ పత్రికలు పతాక శీర్షికల్లో రాయడం సరైనది కాదు. ► చంద్రబాబు కోవిడ్ సమయంలో ఏ ఒక్క ఆస్పత్రినైనా సందర్శించారా? హైదరాబాద్ నుంచి జూమ్లో విమర్శలు చేయడమేమిటి? ► ప్రజలకు మనోధైర్యం కల్పించే పని ఒక్కటైనా చేశారా? ► ఒక్క ల్యాబొరేటరీ లేని పరిస్థితి నుంచి 14 ఆర్టీపీసీఆర్ ల్యాబ్లు తెచ్చినది బాబుకు తెలీదా.. స్వయంగా ప్రధానే ఏపీ చేస్తున్న పనులను ప్రశంసించారు. ► ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకున్నారు. ► ఆరోగ్యశ్రీ కింద బాబు పెట్టిన రూ.1,500 కోట్ల బకాయిలను చెల్లించాం. ► ఆరోగ్యశ్రీలో జబ్బుల సంఖ్యను పెంచాం.. కొత్తగా 16 వైద్య కళాశాలలను తెస్తున్నాం.. ఏజెన్సీల్లో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు వస్తున్నాయి. చంద్రబాబు అభద్రతా భావానికి లోనవుతున్నారు.