జన్మభూమి కమిటీల పేరుతో స్థానిక సంస్థలను సీఎం చంద్రబాబు నిర్వీర్యం చేశారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా, జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి విమర్శించారు. కడప నుంచి వైఎస్ వివేకానందరెడ్డితో పాటు అన్ని ఎమ్మెల్సీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ గెలుపు ఖాయమని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు సంచనాలు సృష్టిస్తాయని పేర్కొన్నారు.