మజీద్ స్థలం పురాతనమైనదని అన్నారు. జీహెచ్ఎంసీ అక్రమంగా కూల్చివేసిందని తెలిపారు. పురాతన మజీద్కు కనీసం గౌరవం ఇవ్వలేదని పేర్కొన్నారు. దీనికి కారణమైన అధికారులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. నష్టపరిహారం ఎవరికి చెల్లించారని నిలదీశారు. ఏ ప్రాతిపదికగా చెల్లించారని, వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్న మజీద్కు ఇతరులకు ఎలా పరిహారం చెల్లిస్తారని ప్రశ్నించారు. దీనిపై పూర్తి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.