గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీయే అధికార పీఠం దక్కించుకుంటుందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. గుజరాత్లో హోరాహోరీ పోరు సాగినా బీజేపీ తిరిగి అధికారపగ్గాలు చేపడుతుందని స్పష్టం చేశాయి. మధ్యాహ్నం 2 గంటల వరకూ జరిగిన పోలింగ్ సరళి ప్రకారం ఈ ఎగ్జిట్ పోల్స్ను వెల్లడించినట్టు సీ ఓటర్ తెలిపింది.