కట్టుదిట్టమైన భద్రత నడుమ గుజరాత్లో శనివారం ఉదయం తొలిదశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. దక్షిణ గుజరాత్, సౌరాష్ట్రల్లోని 89 నియోజకవర్గాల్లో మొదటి దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 2.12 కోట్ల మంది ఓటర్లు శనివారం తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 977 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.